Followers

Saturday 8 August 2015

భక్తియోగః 1( అథ ద్వాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

 అర్జున ఉవాచ:-

ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాసతే,
యే చాప్యక్షర మవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః‌.


అర్జునుడు చెప్పెను - ఈ ప్రకారముగ ఎల్లప్పుడును మీయందే మనస్సును నెల్కొల్పినవారై ఏ భక్తులు మిమ్ముపాసించుచున్నారో, మరియు ఎవరు ఇంద్రియగోచరముగాని అక్షరపరబ్రహ్మమును ధ్యానించుచున్నారో, ఆయిరు తెగలవారిలో యోగమును బాగుగ నెరిగిన వారెవరు?.

******************************************************************************************* 1

శ్రీ భగవానువాచ:-

మయ్యావేశ్య మనో యే మాం
నిత్యయుక్తా ఉపాసతే‌,
శ్రద్ధయా పరయోపేతా
స్తే మే యుక్తతమా మతాః.


శ్రీ భగవానుడు చెప్పెను: నాయందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై (తదేకనిష్థులై) మిక్కిలి శ్రద్ధతో గూడుకొనినవారై ఎవరు నన్నుపాసించుచున్నారో వారే ఉత్తమయోగులని నా యభిప్రాయము.

******************************************************************************************* 2

యే త్వక్షరమనిర్దేశ్య
మవ్యక్తం పర్యుపాసతే,
సర్వత్రగమచింత్యం చ
కూటస్థమచలం ధ్రువమ్‌.

సంనియ మ్యేంద్రియగ్రామం
సర్వత్ర సమబుద్ధయః,
తే ప్రాప్నువంతి మామేవ
సర్వభూతహితే రతాః

ఎవరు ఇంద్రియములన్నిటిని బాగుగ నిగ్రహించి (స్వాధీన పరచుకొని) ఎల్లడల సమభావముగలవారై సమస్త ప్రాణులకును హితమొనర్చుటయం దాసక్తి గల వారై ఇట్టిదని నిర్దేశింప శక్యముకానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింపనలవికానిదియు, నిర్వికారమైనదియు, చలింపనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించియున్నదియు నగు అక్షరబ్రహ్మము నెవరు ధ్యానించుచున్నారో, వారు నన్ను పొందుచున్నారు.

*******************************************************************************************  3,4

క్లేశోధికతర స్తేషా
మవ్యక్తాసక్త చేతసామ్‌,
అవ్యక్తా హి గతిర్దుఃఖం
దేహవద్భిరవాప్యతే.


అవ్యక్త (నిర్గుణ) పరబ్రహ్మమునం దాసక్తి గల మనస్సు గలవారికి (బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగునోపాసకుల కంటె) ప్రయాస చాల అధికముగ నుండును. ఏలయనిన నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము గలవారిచేత అతికష్టముగా పొందబడుచున్నది.

******************************************************************************************* 5

యే తు సర్వాణి కర్మాణి
మయి సన్న్యస్య మత్పరాః,
అనన్యేనైవ యోగేన
మాం ధ్యాయంత ఉపాసతే.

తేషామహం సముద్ధర్తా
మృత్యుసంసారసాగరాత్‌,
భవామి న చిరాత్పార్థ
మయ్యావేశిత చేతసామ్‌

ఓ అర్జునా! ఎవరు సమస్తకర్మములను నాయందు సమర్పించి, నన్నే పరమగతిగ దలచినవారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నాయందు చిత్తమును జేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రమునుండి నేను శీఘ్రముగ బాగుగ లేవదీయుచున్నాను .

******************************************************************************************* 6,7

మయ్యేవ మన ఆధత్స్వ
మయి బుద్ధిం నివేశయ,
నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయః.


నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము. నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము. పిమ్మట నాయందే నివసింతువు. సందేహము లేదు.

*******************************************************************************************  8

అథ చిత్తం సమాధాతుం
న శక్నోషి మయి స్థిరమ్‌,
అభ్యాసయోగేన తతో
మామిచ్ఛాప్తుం ధనంజయ.


ఓ అర్జునా! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తిలేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైనను సాధింపుమని భావము).

*******************************************************************************************  9


Popular Posts