Followers

Thursday 26 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –7 ( దూర్వాస మహర్షి కధ -1 )


దూర్వాస మహర్షి అంటే కోపానికి ప్రతి రూపం అని అందరికి తెలుసు ఆయనను గురించిన కధలు  చాలా  వున్నాయి అవి అందరికి తెలియవు .కొన్ని కధలను తెలుసు కొందాం
దూర్వాసుడు అతి పురాతన మహర్షి .మహా సిద్ధుడు .మహాయోగి .కనుక తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి వుందాయనకు .మార్కండేయుని వంటి చిరంజీవి .మహా మంత్ర శాస్త్రాలన్నీ ఆపోసన పట్టిన మహాత్ముడు .పుణ్య వంతుడు ,ప్రజ్ఞా శీలి,.. ఆయన జన్మ గురించి రెండు రకాల కధలున్నాయి .పూర్వం త్రిపురాసుర సంహారం చేసి శివుడు చంకలో ఒక బాణం పెట్టు కోని వస్తున్నాడు.దారిలో ఇద్దరు దేవ పురుషులు కని పించారు .వారికి శివుడి చంక  లో వున్న బాణం శిశు రూపం లో వున్న  శివుని లాగా కన్పించిందట .వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరని అడిగారు .అప్పుడు శివుడు ఆతడు తన కుమారుడని ,పేరు దూర్వాసుడు అని చెప్పాడు .వెంటనే ఆ బాణం శివానుగ్రహం తో శిశువు గా మారి ,క్రమ క్రమం గా పెరిగి మహా మేధావి, జ్ఞాని అయిన దుర్వాస మహర్షి గా వృద్ధి చెందాడు .ఇది దూర్వాసుని గురించిన మొదటి కధ .
రెండవ కధ – అత్రి మహర్షి కి అనసూయా దేవి అనే మహా పతి వ్రత భార్య గా వుంది .అనసూయ దేవ హోతీ ,కర్దము ల కుమార్తె .అత్రి అనసూయలు చక్కని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసు కొంటు వున్నారు .ఒక సారి త్రిమూర్తులైన బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ ,అత్రి మహర్షి ఆశ్రమం మీదగా ప్రయాణిస్తుంటే ఆ వాహనాలు కదల కుండా ఆగి పోయాయి .కారణం వారికేవారికి తెలియ లేదు .అప్పుడు గరుత్మంతుడు విష్ణు మూర్తి తో ”స్వామీ !కింద అత్రి మహా ముని ఆశ్రమం వుంది .దాని మీద నుంచి ,దానిని ,అతిక్రస్మించి ఎవరు పొరాదు .పోవటం సాధ్యం కూడా కాదు ”అని విన్న వించాడు .సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్ళారు .అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది .అత్రి మహర్షి ,,అంతటి మహిమావితుడా ?అయితె పరీక్షించాలి అను కొన్నారు .వాహనాలను చాలా దూరం లో ఆపేసి మ్ బ్రాహ్మణ వేషాలు వేసుకొని అత్రి మహర్షి ఆశ్రమం చేరారు త్రిమూర్తులు .ఆకలి గా వుందని ,తమకు భోజనం పెట్ట మని మహర్షిని వేడు కొన్నారు .
మహా సాధ్వి అనసూయా దేవి ,భ్హర్త అను మతి తో వారికి పీటలు వేసి ,విస్తళ్ళు పరిచి వడ్డించ టానికి సిద్ధ పడింది .అప్పుడు ఆ బ్రాహ్మణ వేషం లోని త్రిమూర్తులు ”అమ్మా !మాకు ఒక నియమం వుంది .మాకు వడ్డించే వారు దిస మొల తో వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాం ”అన్నారు .వీరి ని గుర్తించిన సాధ్వి ,వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది .వారు పసి పాపలు గా మారి పోయారు .అప్పుడు వారికి వారు కోరి నట్లే వడ్డించి ,మళ్ళీ నీళ్ళు చల్లింది .మళ్ళీ యధా రూపం పొందారు వారు .వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసి పాపలు గా మార్చి ఉయ్యాల లో ఊపుతూ ,పెంచసాగింది .అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాక పోయే సరికి ఏదో కీడు శంకించి ,చివరికి వారు అత్రి ముని ఆశ్రమం లో అనసూయమ్మ ఒడిలో పెరుగు తున్నారని తెలుసు కోని వెంటనే అక్కడికి చేరారు .తమ పాతివ్రత్యం అనసూయా దేవి పాతివ్రత్యం ముందు ఎందుకూ పనికి రాకుండా పోయిందని గ్రహించి ,నిజ రూపాలైన లక్ష్మీ సరస్వతి ,పార్వతి రూపాలతో అక్కడికి చేరారు .తమ నాదులను తమకు ఇవ్వ వలసినది గా అనసూయా దేవిని ప్రార్ధించారు .జగన్మాతలు తమ ఆశ్రమం కు వచ్చిన కారణం తెలుసు కొన్న అనసూయ దేవి వారి అతిధి మర్యాదలు చేసి సభక్తి గా పూజించించింది .వారి కోరికను మన్నించి ,ఆ పసి బాలురను మళ్ళీ త్రిమూర్తులను గా మార్చి వేసింది మంత్ర జలం ప్రభావం తో .అప్పుడు బ్రహ్మ విష్ణు ,మహేశ్వరులు నిజ రూపం పొంది ,అనసూయా దేవి పాతి వ్రత్యానికి అబ్బుర పడి ,నమస్సు లర్పించి ,తాము పరీక్షించా టానికి వచ్చినందుకు సిగ్గు పడు తున్నామని తెలిపి ఆమె కు వరాలు ఇవ్వాలని అనుకొంటున్నామని కోరుకో మని విన్న వించారు .అనసూయ తమకు తల్లి అయి, ఇప్పటి దాకా లాలించి పాలించి నందుకు గర్వ పడు తున్నామని సవినయం గా తెలిపారు .ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులు గా జన్మించి ,ఆస లైన పుత్ర ప్రేమ ను కల్గించ మని కోరింది .వారు మువ్వురు తధాస్తు అన్నారు .త్రిమూర్తులు ,జగన్మాటలు అత్రి ,అనసూయాదేవి ల అనుగ్రహం పొంది వారి ఆశీస్సులు గ్రహించి వారి వారి పట్ట నాలకు వారి వారి వాహనాల పై వెళ్ళారు .కొంత కాలమ్ తర్వాత బ్రహ్మ అంశ తో అనసూయ గర్భం లో చంద్రుడు జన్మించాడు .విష్ణువు అంశ తో దత్తాత్రేయ మహర్షి ,శివాంశ తో దూర్వాస మహర్షి ఆమె కు జన్మించారు .ఇలా దూర్వాస మహర్షి మహా తపస్సంపన్ను లైన అత్రి ,అనసూయ దంపతుల కు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు అని రెండో కధ వివ రిస్తోది .మిగిలిన కధలు తరువాత తెలుసు కొందాం .


Popular Posts