Followers

Sunday 8 February 2015

శ్రీ ఆంజనేయ మాహాత్మ్యం –3 ( మైందుడు కధ )

          పూర్వం సుందరి అనే ఒక పట్టణం వుండేది .అది పేరు కు తగ్గట్టు ,సర్వాంగ సుందరం గా వర్ధిల్లింది .అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు . వేద    ,శాస్త్రాలన్నీ బాగా చదువు కొన్న వాడు .అతనికి ”హనుమత్  మంత్రం ”అంటే మహా ప్రీతి    అన్నింటి  సారం అందులోనే వుంది అని తెలుసు కొన్నాడు .నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ ,నిష్టగా జీవించే వాడు .మనసు లో ఏ విధమైన కోరికలు అతనికి లేవు .నిష్కాముడు గా జీవించటం నేర్చు కొన్నాడు .
              మైందుడు కి కాశీ వెళ్లి శ్రీ విశ్వ నాదున్ని దర్శించాలనీ ,గంగా స్నాం తో పులకించాలని అని పించింది .చాలా ప్రయాస  పడి నడిచి వారణాసి చేరాడు .గంగా నదికి దక్షిణ తీరం చేరాడు .ఆ నదీ మహా  తల్లికి భక్తీ తో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తోంది .దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు .కొంత సేపటికి నదిలో కి ఒక పడవ వచ్చింది .దానిని ఎక్కాడు . పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది .తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడి నట్లు గుర్తించారు .నీరు ,దాని ద్వారా  పడవ లోకి చేరు తోంది .పడవ బరువెక్కి ,మునిగి పోవటానికి సిద్ధం గా వుంది .భయం వేసిన మైందుడు ,తల మీద వస్త్రాన్ని కప్పు కోని ,భక్తీ తో” ”హనుమత్  మంత్రం ”  పటిస్తూ  ఉన్నాడు  .హనుమ దీనిని గమనించి ,తన భక్తుని కాపాడాలనే సంకల్పం తో ఒక ”వానర ”రూపం ధరించి ,ఆ పడవను నెత్తిన పెట్టు కోని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్లి ,అక్కడ మనుష్యులంతా చూస్తుండగా అదృశ్యము  అయ్యెను   .దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యం తో నిండి పోయి  .భక్తీ తో ,ఆ  వానరము  కి నమస్కరించారు .పడవ లో నిశ్చల జపం లో వున్న  మైందుడు కి ఇదేమీ తెలీదు .తెల్ల వారి లేచి చూసే సరికి గంగ ఒడ్డున పడవ వుండటం చూసి ఆశ్చర్య పడ్డాడు .పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డు కు చేరిందో తెలియలేదు  .అప్పుడు ఒడ్డున వున్న ఒక మనిషి  ఓకే మహా వానరం ఈ పడవను తలమీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్లి పోయిందని చెప్పాడు .
         మైందుడు కి ఆశ్చర్యం వేసి ”మీరు పుణ్యాత్ములు ,వానర రూపం లో హనుమను దర్శించారు .జపం చేస్తూ నేను ఏదీ గమనించ లేక పోయాను .నేను అదృష్ట హీనున్ని .హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా .గంగ పాలు చేస్తాను ”అని చెప్పి గంగా నదిలోకి దూక టానికి సిద్ధ మైనాడు .అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి ,వాత్సల్యం తో నిజ రూపం తో  మైందుడు కి దర్శనం ఇచ్చాడు .హర్ష పులకితుడై మైందుడు హనుమ ను స్తుతించాడు 
  ”ఉస్త్రా రూఢ ,సువర్చలా సహచర ,సుగ్రీవ మిత్రాంజ నా   సూనో ,వాయుకుమార ,కేసరి తనూ ,జా అక్షాది దైత్య కాన్తకా 
  సీతా శోక హరా ,అగ్ని నందనా ,సుమిత్రా సంభావ ,ప్రాణదా –శ్రీ భీమాగ్రాజ ,శంభు పుత్ర ,హనుమాన్ ,పంచాష్య తుభ్యం నమః ”అని చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమ ;;భక్తా ! మైందా !నువ్వు ఈ లోకం లో భోగాలన్నీ అనుభవించు .నీ దగ్గరే నేను ఉంటాను .జీవితాంతం లో నన్ను పొందు తావు ”అని వరం ఇచ్చి అదృశ్యం అయాడు .అలాగే మైందుడు భక్తీ తో జీవించి ,సుఖాలు పొంది ,చివరికి హనుమంమంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు .

Popular Posts