Followers

Wednesday 7 January 2015

ఆర్య సిద్ధాంతం ఒక అబద్దలా పుట్ట ....


భారతీయ భూమి కను తిరస్కరిస్తూ 150 సంవత్సరాల క్రితం అప్పటి బ్రిటిష్‌ పరిపాలకులు 'ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం' ఈ దేశం లో ప్రవేశపెట్టారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతమనేది కేవలం ఒక వాదనే తప్ప వాస్తవం ఎంతమాత్రం కాదు. తదనంతరకాలంలో లభించిన ఆధారాలను, ప్రమాణాలను బట్టి ఈ దురాక్రమణ సిద్ధాంతం తిరస్కరింపబడుతోంది. అయినా ఈనాటికీ కూడా మన పాఠ్యపుస్తకాలలో, అదే సిద్ధాంతం, తరం తర్వాత తరంగా, బోధింపబడుతూ కొనసాగుతూ వస్తూవుంది.



పురాణాలులో   ఒక  శ్లోకం తెసుకొని   దానికి  ద్వంద  అర్ధం  తీస్తూ   ఆర్య సిద్ధాంతం  అనేది  నిజము  అనే  ఓ  మేదావులరా  భారతీయ ప్రాచీన వేదశాస్త్ర గ్రంథాలలోగాని, ఇతి హాస పురాణాలలో గాని, ఈ దండయాత్ర లను గురించి ఎక్కడా ఒక్క వాక్యం కూడా చెప్పలేదు. దక్షిణ భారత దేశపు ద్రావిడ సాహిత్యం కూడా ఎక్కడా ఈ ఆర్యుల దండయాత్ర గురించిన సూచనలు కూడా లేనే లేవు.

ఋగ్వేద మంత్రాలలో దస్యులను తిరస్కరిస్తూ, నిందిస్తూ ఉన్న వాక్యాలు కన్పించడం నిజమే. కొందరు వ్యాఖ్యాతను దస్యులనగా తొలుత భారతభూమిలో నివ సించెడివారని, వారు వైదిక భిన్నమైన భాషను మాట్లాడుతుండేవారని, వారినే యుద్ధప్రియులైన ఆర్యులు తమ యుద్ధరథాలతో తరిమివేశారనీ వ్యాఖ్యానించడం జరిగింది. నేనధ్యయనం చేసినంతమేరకు ఋగ్వేదంలోని మంత్రాలలో ఆర్యులు ఎక్క డ్నుంచో క్రొత్తగా వచ్చినవారు కాదనీ, వారు ముఖ్యంగా ఇండోయూరోపియన్లుగా భారత్‌లో ప్రవేశించ లేదని స్పష్టంగా తెలుస్తోంది.  ఆర్యులు తెగకాదు ఆర్య  అంటే  గౌరవం  సూచక  పదం  ఉత్తర భారతీయులు  .  అని  కాదు . మండోదరి అనేక  సందర్బాలులో  రావణుడి ని  ఆర్య  పుత్ర అని  సంబోదించింది  రామాయణం  చదివిన వారికీ  తెలుస్తుంది 

సరే  ఈ వాదనలు   ఇవన్నీ భారతదేశంలో తమ వలస సామ్రాజ్యాలను సుస్థిరం చేసు కునేటందుకు, తమదైన మతాన్ని ఈ దేశంలో వ్యాపిం పచేసేందుకు మాత్రమే బ్రిటీష్‌ వారు మొదలుపెట్టారు. 150 సంవత్సరాలకు ముందు భారతీయులెవ్వరికీ వైదికసాహిత్యం, అది రచించబడిన సంస్కృతభాషలు, తమవి కాదని, అవి ఎక్కడ్నుంచో వచ్చాయన్న ఆలోచన ఊహామాత్రంగా కూడా తెలియదు.

ఆర్య దురాక్రమణ సిద్ధాంతాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వారు చారిత్రక విద్వాం సులుగాని, పురా తత్త్వ శాస్త్రవేత్తలు గాని కానే కారు. ఈ సిద్ధాంత ప్రారంభకుడైన మాక్స్‌ముల్లర్‌ను బ్రిటీష్‌ వారికి చెందిన ఈస్టిండియా కంపెనీ తమ వలసవాద సిద్ధాంత ప్రచారకుడుగా ఒకానొక ఉద్యోగిగా స్వీకరించింది. 

గత 30 ఏండ్ల కాలంలో ఋగ్వేద కాలపు సరస్వతీ నదీ. అది ప్రవహించిన త్రోవలు కనుగొన బడ్డాయి. పంజాబులో మొహంజోదారో హరప్పా త్రవ్వకాలు గుజరాత్‌లో లోథాల్‌, ధోలావీరా త్రవ్వకాలు, హర్యానా ప్రాంతంలో కునాల్‌ త్రవ్వకాలలో ప్రాచీన వైదిక కాలం లోని యజ్ఞవేదికలు, యాపస్థంభాలు బయటపడ్డాయి. అలాగే ఆ త్రవ్వకాలలో బయటపడిన భాష వైదిక సం స్కృత కుటుంబానికి చెందినది

Popular Posts