Followers

Monday 28 July 2014

వరలక్ష్మి వ్రతం





వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం లో పౌర్ణిమ కు ముందు వోచే శుక్రవారం రోజు చేస్తారు. ఒక వేళ ఆ రోజు కుదరకుంటే, శ్రవణ మాసం లో ఎ శుక్రవారం ఐనా చేసుకోవొచ్చు. వరలక్ష్మి శుక్రవారం రోజు  వరలక్ష్మి అని అమ్మవారిని కొలిచి, పూజ చేసుకుంటారు.
ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

విష్ణవే నమః     మధుసూదనాయ నమః    త్రివిక్రమాయ నమః    వామనాయ నమః     శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః     పద్మనాభాయ నమః   దామోదరాయ నమః     సంకర్షణాయ నమః   వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః   అనిరుద్దాయ నమః    పురుషోత్తమాయ నమః   అధోక్షజాయ నమః    నారసింహాయ నమః
అచ్యుతాయ నమః    జనార్ధనాయ నమః    ఉపేంద్రాయ నమః      హరయే నమః     శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

శుక్లాంబరధరం విష్ణుం  శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఓం లక్ష్మినారాయణభ్యయం నమః     శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః

శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః     శ్రీ శచిపురంధరాభ్యం నమః

శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః    శ్రీ  సీతారామాభ్యం నమః

సర్వేభ్యో దేవేభ్యో నమః   మాతృభ్యో నమః,  పితృభ్యో నమః

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే ,  శుభ తిథౌ, శుక్రవాసరే,  శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం  థం,  ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సత్సంతన సౌభాగ్య శుభఫలాప్యార్ధం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి  దేవతా ముధీశ్యా వరలక్ష్మి ప్రీత్యర్ధం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ  నివేదించాలి.  కర్పూర  నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).

వరలక్ష్మి పూజ విధానము :

అనంతరం శ్రీ వరలక్ష్మి  పూజ ప్రారంభం  –  వరలక్ష్మి ధ్యానమ్

పద్మసనే పద్మకరే సర్వలోకైక పూజితే,
నారాయణప్రియే దేవి సుప్రితాభవ సర్వదా,
క్షిరోదర్నవ సంభుతే కమలే కమలాలయే
సుస్థిరా భవమే దేహి సురాసుర నమస్త్రుతే ||
శ్రీ వరలక్ష్మి  దేవతాయే నమః ||  ద్యయామి

(అక్షింతలు వేయండి)

శ్లో: సర్వమంగళ మాంగళ్యే  విష్ణువక్షస్తలాలయే ,
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతాభవ సర్వదా.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఆవాహయామి.

(నీళ్ళు చల్లండి )

శ్లో:  ఏహి దేవి గృహాణేదం రత్నసింహాసనం శుభం,
చంద్రకాంత మణిస్థంభ  సౌవర్ణం సర్వసుందరం.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

(అక్షింతలు చల్లండి )

శ్లో:  ఈశాది దేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే,
గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ.
ఓం శ్శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.

(నీళ్ళు చల్లండి )

శ్లో:  వాణీంద్రాణీ ముఖాసేవ్యే దేవదేవేశ వందితే,
గృహాణఅర్ఘ్యం మయాదత్తం విష్ణు పత్నీ నమోస్తుతే.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

(నీళ్ళు చల్లండి )

శ్లో:  శ్రీ మూర్తిశ్రితమందారే సర్వభాక్తాభి వందితే,
గృహాణ ఆచమనీయం దేవీ మయా దత్తం మహేశ్వరి.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

(నీళ్ళు చల్లండి )

శ్లో: వయోదధి ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్థానమిదం గృహాణ కమలాలాయే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పంచామృత స్థానం సమర్పయామి.

(పంచామృతం చల్లండి )

గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం
శుదోద్దక స్నాన మిదం గృహాణ విధు సోదరి
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః   శుదోద్దక స్నానం సమర్పయామి.

(నీళ్ళు చల్లండి )

సురార్చితాగ్నియుగలే పవన ప్రియే
వస్త్రయుగ్యం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః   వస్త్రయుగ్యం సమర్పయామి.

( కొత్త బట్టలు లేదా పత్తి సమర్పించండి)

కేయూర కంకణే దివ్యహర నూపుర మేఖలా
విభూషణముల్యని గృహాణ ఋషి పూజితే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః   ఆభరణాని సమర్పయామి.

(కొత్త ఆభరణాలు ఉంటె లేదా అమ్మవారికి వేయండి)

తప్తహేమకృత దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః   మాంగల్యం సమర్పయామి.

(అమ్మవారికి మాంగల్యం సమర్పించండి)

శ్లో: కర్పూరాగరు సంయుక్తం, కస్తూరి రోచనాన్వితం.
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  శ్రీ గంధం సమర్పయామి.

(అమ్మవారికి శ్రీ గంధం, కుంకుమ సమర్పించండి)

శ్లో: అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతా మబ్ది పుత్రికే.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  అక్షతాన్ సమర్పయామి.

(అమ్మవారికి అక్షింతలు, పసుపు,కుంకుమ చల్లండి)

మల్లికా జాజి కుసుమచ్యకైరపిర్వకులైస్తధ
శతపత్రాయిచ్చ కలార్వై: పూజయామి పూజితే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  పుష్పాణి సమర్పయామి.

(అమ్మవారికి పుష్పములు చల్లండి)

అధాంగ పూజ:

ఓం చంచలాయై నమః    -  పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః  -  జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై  నమః  -  ఊరూం పూజయామి
ఓం  కమలవాసిన్యై నమః  -  కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః  -  నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః  -  స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః  -  భుజాన్ పూజయామి
ఓం కంభుకంట్ట్యై నమః  – కన్ట్టం పూజయామి
ఓం సుముఖాయై నమః  -  ముఖం పూజయామి
ఓం శ్రియై నమః  -  ఓష్టౌ పూజయామి
ఓం సునాసికాయై నమః  -  నాసికాం పూజయామి
ఓం సునేత్ర్యై నమః -  నేత్రే పూజయామి
ఓం రమాయై నమః – కర్ణౌ పూజయామి
ఓం కమలాలయాయై నమః -  శిరః పూజయామి
ఓం శ్రీ వరలక్ష్మ్యే దేవ్యై నమః  -  సర్వాణ్యంగాని పూజయామి.

తరువాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర నామములు ( శ్రీ లక్ష్మి అస్తోతరములు) చదవండి ..

లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి .

శ్లో: దశాంగం గగ్గులో పేతం సుగంధం సుమనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మి గృహాణ త్వం
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  ధూపం సమర్పయామి.

(అగరు వత్తులను వెలిగించి దూపమును దేవికి చూపించవలెను. సాంబ్రాణి పొగను కూడా వేయవచ్చును )

శ్లో: ఘ్రుతావర్తి సంయుక్తం మంధకార వినాశకం
దీపం దాస్యామి తేదేవి గృహాణ ముదితా భవ.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  దీపం సమర్పయామి.

(దీపమును దేవికి చూపించ వలెను )

నైవేద్యం షడ్రసోపేతం దధి మద్వాజ్య సంయుతం,
నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే .
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి

దేవికి ప్రత్యేకించి చేసిన పిండి వంటలు  దేవికి సమర్పించి నమస్కరించ వలెను.

ఘన సార సుగందేన మిశ్రితం పుష్ప వాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం .
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  పానీయం సమర్పయామి.

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి అని భోజనం అయిన తరువాత త్రాగుటకు నీరు ఇచ్చినట్లు భావించి కుడి చేత్తో నీటిని చూపుతూ ఎడమ చేత్తో గంట వాయించ వలెను.

పూగీ ఫల సమాయుక్తం నాగ వల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం .
ఓం  శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి

( తమలపాకులు ,రెండు పోక చెక్కలు వేసి అమ్మవారికి వద్ద ఉంచాలి).

తరువాత కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవీ గృహ్యాతాం విష్ణు వల్లభే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి.

(కర్పూర హారతిని వెలిగించి హారతి పాటలు పాడ వచ్చును. )

పద్మాసనే పద్మ కరే సర్వ లోకైక పూజితే ,
నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి.

(పువ్వులు ,అక్షతలు చేతిలోనికి తీసుకుని ,లేచి నిలబడి నమస్కరించి ఈ పువ్వులు ,అక్షతలు దేవిపై వేసి కూర్చోన వలెను.)

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి
( అక్షతలు ,పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షతలు పువ్వులు దేవిపై వేయవలెను )

తోర బంధన మంత్రము :

బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రా పౌత్రాభి వృదించ సౌభాగ్యం దేహిమే రమే

ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పునః పూజాంచ కరిష్యే 

అని చెప్పుకుని, పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి ,అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .

ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి .సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోపచార పూజాం సమర్పయామి. 

అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .

ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ మాతార్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను . పిమ్మట ‘ శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి.’ 

అనుకుని దేవి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకొనవలెను.

అక్షింతలు చేతిలో వేసుకొని వరలక్ష్మీ వ్రత కధ చదవండి లేక వినండి ;

వరలక్ష్మీ వ్రత కధ


ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము" అని కధ చెప్పెను. 

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో

  లక్ష్మీo క్షీరసముద్రరాజతనయాం| శ్రీ రంగథామేశ్వరీం| 
  దాసీభూత సమస్తదేవ వనితాం| లోకైక దీపాంకురాం| 
  శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః| బ్రహ్మేంద్ర గంగాధరాం| 
  త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం||

అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెము లో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటము పై ఉంచ వలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

యస్య స్మృత్యాచ నోమోక్త్యాత పః పూజా క్రియాది షు,
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ,
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన ,
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే.
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్సర్వాత్మకః

శ్రీ వరలక్ష్మీ దేవతా స్సుప్రీతో వరదో భవతు ,శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి .

ఇతి పూజా విధానమ్ సంపూర్ణమ్


శ్రీ వరలక్ష్మీ వాయనదానము:
ఇచ్చేవారు               :     ఇందిరా ప్రతిగృహ్ణాతు
పుచ్చుకునేవారు      :     ఇందిరావై దదాతిచ
ఇద్దరు                     :     ఇందిరాతారకోభాభ్యా ఇందిరాయై నమోనమః
ఇచ్చేవారు               :      ఇస్తినమ్మవాయణం
పుచ్చుకునేవారు      :      పుచ్చుకున్తినమ్మ వాయనం
వాయనమిచ్చినవారు, పుచ్చుకున్నవారికి నమస్కరించాలి.

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయన దానం సమర్పయామి అనుకుని శనగలు (నాన బెట్టినవి ),తాంబూలం (మూడు ఆకులు ,వక్క , అరటి పండు ), రవికల (జాకెట్టు )గుడ్డ ,పువ్వులు మరియు తయారు చేసిన పిండి వంటలను ఒక పళ్ళెము లోనికి 9 రకములు రకమునకు 9 వంతున గాని (లేదా ఎవరి శక్తి అనుసారముగా వారు ) తీసుకుని మరొక పళ్ళెము తో మూసి పైన కొంగును కప్పి ముత్తైదువుకు బొట్టు పెట్టి ఆమెను వరలక్ష్మీ దేవిగా భావించి ఈ వాయనమును అందిస్తూ ఇచ్చువారు ఇస్తినమ్మ వాయనం అని, పుచ్చుకున్నవారు పుచ్చు కొంటినమ్మ వాయనం అనాలి . ఈ విధంగా మూడు సార్లును ,నా వాయనం అందుకున్నదెవరు అని ఇచ్చేవారు ,నేనమ్మా వరలక్ష్మీ దేవిని అని పుచ్చుకునేవారు అనాలి . ఈ విధంగా మూడు సార్లును ,అడిగితి వరం అని ఇచ్చువారు ,ఇస్తి వరం అని పుచ్చు కొనువారు మూడు సార్లు అనాలి .ఈ విధంగా వాయనమును దేవికి సమర్పించి నమస్కరించవలెను.

ఆ రోజు సాయంత్రము ముత్తైదువులను పిలిచి పేరంటం చేసుకొన వచ్చును. (పేరంటం అనగా పసుపు ,కుంకుమ , గంధం, ముత్తైదువులకు ఇచ్చి శనగలు (నాన బెట్టినవి ), తాంబూలం (మూడు ఆకులు ,వక్క ,అరటి పండు ), రవికల (జాకెట్టు ) గుడ్డ ,పువ్వులు ఇవ్వ వలెను.


మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు . ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడనున్నాయి. శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరిన్చుకొని ప్రతి జిల్లాలోని ఆలయాల్లో చళువ పందిళ్ళు, బారీకేడ్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు .
ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.

సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం,
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,

భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అళ్ళుల్లు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది.

పరమశివుడి వారం … సోమవారం భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ కొలువగానే కొలువుదీరే శివునికి శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటిని శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూళం, దక్షణ సమర్పించి భక్తులు శివుడికి హారతిస్తారు. బిలువ పత్రాలు, ఉమ్మెత, కలువతుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితీ.

శుభాలు కలిగే .. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. మంచి భర్త రావాలని అవివాహితులు, తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.

నాగపంచమి శ్రావణమాసం మొదలైన నాలుగవ రోజునే వచ్చే పండుగ నాగపంచమి, శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడిగెలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే … పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతానయోగ్యత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

బ్రాహ్మణులు ఈ మాసంలో పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు.

వరాలిచ్చే తల్లి … వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శనిగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.

అనురాగ బంధాల ప్రతీక… రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల అనురాగ బంధాల ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈ మాసంలోనే వస్తుంది. పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి రాఖీ పౌర్ణమి అని అంటారు. సకల వేళల తమకు రక్షణగా నిలువాలని కోరుకుంటూ స్త్రీలు తమ సోదరుల ముంజేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు. సోదరులకు తీపి తినిపించి ప్రేమతో ఇచ్చే కానుకలను అందుకుంటారు. ముకుందాష్టమి ముకుందా….ముకుందా అంటూ శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు కోలహాలాల మధ్య నిర్వహించుకుంటారు. అష్టమి తిథి రోజున వచ్చే శ్రీ కృష్ణుని పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. చిన్నారులు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. సాయంత్రం వేళలో నైవేద్య కార్యక్రమాలు పూర్తయ్యాక ఉట్టిగట్టి కోలహాలం చేస్తారు.

శ్రావణ వంటలు — ఆరోగ్యప్రదాయము :
ఆషా్ఢ మాసము వెళ్ళిపోయి శ్రావణము వచ్చిందంటే మహిళలకు సందడే సందడి . వరలక్ష్మికి తొలిపూజ చేయడం ద్వారా తకము సౌభాగ్యము , ఐశ్వర్యము కలగాలని కోరుకుంటారు . అయిటే ఇందులో అంతర్లీనము గా ఆరోగ్య రహస్యము కూడా ఇమిడి ఉంది . వర్షాకాలము ప్రారంభం లో సాదారణము గా ప్రబలే పలు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి ఈ వ్రతాల ద్వారా లభిస్తుంచి . వరలక్ష్మీ పూజలో తొమ్మిది రకాల పిందివంటలు , ఈ ఋతువులో లభించే పండ్లు , వివిధ పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదం గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు . ఇంకా కుటుంబ సభ్యులలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది . మహిళలు పేరంతం పేరుతో ఇరుగుపొరుగు వానిని ఆహ్వానించి పరస్పరము వెళ్ళి వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహభావము పెరుగుతుంది .

తొమ్మిది రకాల పిండివంటలు :
పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేసిన ఈ బూరెలు తినడం ద్వారా ప్రోటీన్లు సమంద్దిగా లభిస్తాయి .
పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు . గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు , తగినంత పంచదార , జీలకర్ర వేస్తారు .. ఇది భుజించడం ద్వారా మేధస్సు వికసిస్తుంది .
గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . గారెలంటే అందరికీ ఇస్టము . ఇందులొ ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయి .
పరమాన్నము : పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్న, పంచదార .. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది . దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది .
చెక్కెర పొంగలి : బియ్యము , పాలు , నెయ్యి . పెసరపప్పు , జీడిపప్పు , కిస్ మిస్ , మిరియాలు వేసి తయారవుతుంది గాన మెదడు , ఇతర అవయవాలు చురుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి .
పులిహోరా : బియ్యము , పసువు , జీడిపప్పు , వేరుసెనగ పప్పు , ఇంగువ వేసి తయారవుతుంది . దీనిని తినడం వల్ల శరీరము లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .
చిట్టి బూరెలు : మునపపప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చేస్తారు . ఇవి పిల్లలకు చాలా ఇస్టము . చలువ చేస్తుంది .
పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెలు లలో ప్రోటీన్లు లభిస్తాయి .
గోధుమ ప్రసాదము : గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో తయారుచేస్తారు . ఇది బలమైన ఆహారము .

Popular Posts