Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఆరవ అధ్యాయం

             ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ బ్రహ్మాత్మజైః దేవైః ప్రజేశైరావృతోऽభ్యగాత్
భవశ్చ భూతభవ్యేశో యయౌ భూతగణైర్వృతః

దేవతలందరూ కలసి పరమాత్మ కృష్ణుడు ఉన్న చోటుకు వచ్చి ఆయనను స్తోత్రం చేసారు

ఇన్ద్రో మరుద్భిర్భగవానాదిత్యా వసవోऽశ్వినౌ
ఋభవోऽఙ్గిరసో రుద్రా విశ్వే సాధ్యాశ్చ దేవతాః

గన్ధర్వాప్సరసో నాగాః సిద్ధచారణగుహ్యకాః
ఋషయః పితరశ్చైవ సవిద్యాధరకిన్నరాః

ద్వారకాముపసఞ్జగ్ముః సర్వే కృష్ణదిదృక్షవః
వపుషా యేన భగవాన్నరలోకమనోరమః
యశో వితేనే లోకేషు సర్వలోకమలాపహమ్

తస్యాం విభ్రాజమానాయాం సమృద్ధాయాం మహర్ద్ధిభిః
వ్యచక్షతావితృప్తాక్షాః కృష్ణమద్భుతదర్శనమ్

స్వర్గోద్యానోపగైర్మాల్యైశ్ఛాదయన్తో యుదూత్తమమ్
గీర్భిశ్చిత్రపదార్థాభిస్తుష్టువుర్జగదీశ్వరమ్

శ్రీదేవా ఊచుః
నతాః స్మ తే నాథ పదారవిన్దం బుద్ధీన్ద్రియప్రాణమనోవచోభిః
యచ్చిన్త్యతేऽన్తర్హృది భావయుక్తైర్ముముక్షుభిః కర్మమయోరుపాశాత్

త్వం మాయయా త్రిగుణయాత్మని దుర్విభావ్యం
వ్యక్తం సృజస్యవసి లుమ్పసి తద్గుణస్థః
నైతైర్భవానజిత కర్మభిరజ్యతే వై
యత్స్వే సుఖేऽవ్యవహితేऽభిరతోऽనవద్యః

శుద్ధిర్నృణాం న తు తథేడ్య దురాశయానాం
విద్యాశ్రుతాధ్యయనదానతపఃక్రియాభిః
సత్త్వాత్మనామృషభ తే యశసి ప్రవృద్ధ
సచ్ఛ్రద్ధయా శ్రవణసమ్భృతయా యథా స్యాత్

స్యాన్నస్తవాఙ్ఘ్రిరశుభాశయధూమకేతుః
క్షేమాయ యో మునిభిరార్ద్రహృదోహ్యమానః
యః సాత్వతైః సమవిభూతయ ఆత్మవద్భిర్
వ్యూహేऽర్చితః సవనశః స్వరతిక్రమాయ

నిరంతరం సేవించబడుతూ ఉన్న వనమాల యొక్క దివ్యమైన కాంతితో మరొక లక్ష్మిలా పోటీ బడుతూ ఉన్నట్లుగా, భావాలు సంస్కారాలకూ ధూమకేతువుగా ఉన్న నీ పాద పద్మాలను నిరంతరం ధ్యానం చేస్తాము

యస్చిన్త్యతే ప్రయతపాణిభిరధ్వరాగ్నౌ
త్రయ్యా నిరుక్తవిధినేశ హవిర్గృహీత్వా
అధ్యాత్మయోగ ఉత యోగిభిరాత్మమాయాం
జిజ్ఞాసుభిః పరమభాగవతైః పరీష్టః



పర్యుష్టయా తవ విభో వనమాలయేయం
సంస్పార్ధినీ భగవతీ ప్రతిపత్నీవచ్ఛ్రీః
యః సుప్రణీతమముయార్హణమాదదన్నో
భూయాత్సదాఙ్ఘ్రిరశుభాశయధూమకేతుః

కేతుస్త్రివిక్రమయుతస్త్రిపతత్పతాకో
యస్తే భయాభయకరోऽసురదేవచమ్వోః
స్వర్గాయ సాధుషు ఖలేష్వితరాయ భూమన్
పదః పునాతు భగవన్భజతామఘం నః

నీ పాదమే సజ్జనులను స్వర్గానికీ ఇతరులను నరకానికీ పంపుతుంది.
ఆ పాదము దేవతలకు అభయాన్నీ రాక్షసులకు భయాన్నీ ఇచ్చింది
అటువంటి పాదం మా పాపాన్ని తొలగించుగాక

నస్యోతగావ ఇవ యస్య వశే భవన్తి
బ్రహ్మాదయస్తనుభృతో మిథురర్ద్యమానాః
కాలస్య తే ప్రకృతిపూరుషయోః పరస్య
శం నస్తనోతు చరణః పురుషోత్తమస్య

ముక్కుతాడు వేసిన గోవులూ వృషభాలూ ఎలా వశములో ఉంటారో బ్రహ్మాది దేవతలు నీ ఆధీనములో ఉంటారు. నీవు కాల స్వరూపుడవు, ప్రకృతి పురుషుల కంటే అతీతుడవు. అలాంటి పరమ పురుషోత్తముడైన నీ పాదం మాకు శుభమును కలిగించుగాక

అస్యాసి హేతురుదయస్థితిసంయమానామ్
అవ్యక్తజీవమహతామపి కాలమాహుః
సోऽయం త్రిణాభిరఖిలాపచయే ప్రవృత్తః
కాలో గభీరరయ ఉత్తమపూరుషస్త్వమ్

ప్రకృతీ మహత్తూ జీవతత్వమూ, ఇలాంటి వాటికి కారణముగా ఏ కాలం చెప్పబడుతూ ఉన్నదో, అతి గంభీరమైన వేగం కల ఈ కాలం ప్రతీ దాన్నీ తగ్గించేస్తుంది. త్రినాభి ఐన కాలం నీవే.

త్వత్తః పుమాన్సమధిగమ్య యయాస్య వీర్యం
ధత్తే మహాన్తమివ గర్భమమోఘవీర్యః
సోऽయం తయానుగత ఆత్మన ఆణ్డకోశం
హైమం ససర్జ బహిరావరణైరుపేతమ్

నీ నుంచే పురుషుడు సృష్టినీ, మహత్తునూ అహంకార తత్వాలుగా నీవే కనపడి సకల జగత్సృష్టికీ కారణమవుతావు. దాన్ని  అనుసరించే బ్రహ్మాండ కోశం ఏర్పడుతుంది. పృధ్వీ అప్ తేజో వాయు ఆకాశం మహత్ అహంకారం అనే ఏడు ఆవరణలతో ఏర్పడుతుంది

తత్తస్థూషశ్చ జగతశ్చ భవానధీశో
యన్మాయయోత్థగుణవిక్రియయోపనీతాన్
అర్థాఞ్జుషన్నపి హృషీకపతే న లిప్తో
యేऽన్యే స్వతః పరిహృతాదపి బిభ్యతి స్మ

స్థావ జంగమాలకు నీవే అధిపతివి. పడుకున్న ఉన్న సకల వికారాలూ నీ మాయతో ఉద్బుధమవుతాయి. ఆయా ప్రకృతి మహదహంకార వికారాలను స్వీకరిస్తూ ఉంటావు కానీ  అవి నీక్ అంటవు
పాయసం మన నోటిలో పడితే బాగుంది, ఇంకా తాగాలి అనుకుంటాము. కానీ అదే పాయసం శరీరం మీద పడితే అది తాగాలనుకోము. పరమాత్మకు ఎంత సృష్టి చేస్తున్నా ఆయనకు ఆసక్తి ఉండదు.
సత్వ రజో తమో గుణాలు తీసుకున్నవాడూ, విడిచిపెట్టినవాడూ కూడా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం వదలాలి అనుకుంటే వదిలేవి కాదు ఆ గుణాలు. అందుకే గుణాలు వదులుకుంటున్నాను అనుకునేవాడూ భయపడుతూ ఉంటాడు, అవి ఎపుడు  వెంటపడతాయో అని. ఆ గుణాలు ఉన్నవాడికి భయం ఎలాగూ ఉంటుంది. నీకు ఆ భయం లేదు.

స్మాయావలోకలవదర్శితభావహారి
భ్రూమణ్డలప్రహితసౌరతమన్త్రశౌణ్డైః
పత్న్యస్తు షోడశసహస్రమనఙ్గబాణైర్
యస్యేన్ద్రియం విమథితుం కరణైర్న విభ్వ్యః

పదుహారువేల మంది , ఎనిమిది మంది, 114 మందీ, లక్షల గోపికలు స్త్రీ సహజమైన చాతుర్యముతో ఎన్ని విధాలుగా ప్రవర్తించినా, నీ మనసుని ఆవగించంత కూడా ఆక్రమించలేకపోయాయి
నీ మనసును చలించలేకపోయారు.
కనుబొమ్మల  యొక్క మెలికలూ భావాలూ విలాసాలూ వయ్యారాలూ వీటితో కలసి పదుహారు వేల మంది భార్యలు కూడా మన్మధ బాణాలతో సమర్ధులు కాలేకపోయారు

విభ్వ్యస్తవామృతకథోదవహాస్త్రిలోక్యాః
పాదావనేజసరితః శమలాని హన్తుమ్
ఆనుశ్రవం శ్రుతిభిరఙ్ఘ్రిజమఙ్గసఙ్గైస్
తీర్థద్వయం శుచిషదస్త ఉపస్పృశన్తి

నీ పాద ప్రక్షాళనం వలన కలిగిన జలం ప్రపంచములో కల సకల అమంగళములనూ తొలగించగలదు. అలాంటి దివ్యమైన నీ పాద పద్మ ప్రభావాన్ని తమ చెవులతో పుణ్యాత్ములు మాత్రమే వింటారు. సకల దోషాన్నీ పోగొట్టి శుభాన్ని ప్రసాదించే నీ పాద జలాన్ని పుణ్యాత్ములు మాత్రమే స్పృశించగలరు.
ఈ స్తోత్రానికి శ్రీపాద స్తుతి అన్న పేరు. ఈ పన్నెండు శ్లోకాలూ స్వామి  యొక్క పాదాన్ని మాత్రమే స్తోత్రం చేసాయి. అన్ని రకముల ప్రభావాన్నీ స్వామి పాదం ఎలా కలిగి ఉందో చెబుతుంది

శ్రీబాదరాయణిరువాచ
ఇత్యభిష్టూయ విబుధైః సేశః శతధృతిర్హరిమ్
అభ్యభాషత గోవిన్దం ప్రణమ్యామ్బరమాశ్రితః

ఇలా దేవతలందరితో కలసి బ్రహ్మ స్వామిని స్తోత్రం చేసి. దేవతలు కాబట్టి ఆకాశములో ఉండి నమస్కరించి ఇలా అన్నారు

శ్రీబ్రహ్మోవాచ
భూమేర్భారావతారాయ పురా విజ్ఞాపితః ప్రభో
త్వమస్మాభిరశేషాత్మన్తత్తథైవోపపాదితమ్

మేము పూర్వం భూ భారం తొలగించడానికి అవతరించమని నిన్ను ప్రార్థించాము. మేము కోరినట్లుగా నీవు అలాగే చేసావు.

ధర్మశ్చ స్థాపితః సత్సు సత్యసన్ధేషు వై త్వయా
కీర్తిశ్చ దిక్షు విక్షిప్తా సర్వలోకమలాపహా

సత్య సంధులైన సజ్జనులలో ధర్మాన్ని స్థాపించి అన్ని దిక్కులా, నీ కీర్తిని వ్యాపింపచేసావు. నీవు వ్యాపింపచేసిన కీర్తిన్ స్మరిస్తే సమస్త మలాలూ తొలగిపోతాయి

అవతీర్య యదోర్వంశే బిభ్రద్రూపమనుత్తమమ్
కర్మాణ్యుద్దామవృత్తాని హితాయ జగతోऽకృథాః

యదువంశములో అవతరించి సకలోత్తమమైన దివ్య రూపాన్ని ధరించి జగత్తు యొక్క హితం కొరకు ఉత్తమమైన అద్భుతమైన ఉన్నతమైన కర్మలను ఆచరించావు.

యాని తే చరితానీశ మనుష్యాః సాధవః కలౌ
శృణ్వన్తః కీర్తయన్తశ్చ తరిష్యన్త్యఞ్జసా తమః

నీవు భూలోకంలో ఆచరించిన ఈ పనులను విన్న వారు చెప్పిన వారు,తలచిన వారు, సులభముగా తరిస్తారు.

యదువంశేऽవతీర్ణస్య భవతః పురుషోత్తమ
శరచ్ఛతం వ్యతీయాయ పఞ్చవింశాధికం ప్రభో

యదువంశములో పుట్టిన నీవు 125 సంవత్సరాలు ఉన్నావు. ఇంక నీవు చేయవలసిన దేవ కార్యం ఏదీ మిగలలేదు.

నాధునా తేऽఖిలాధార దేవకార్యావశేషితమ్
కులం చ విప్రశాపేన నష్టప్రాయమభూదిదమ్

నీ యదువంశం కూడా ఇంచుమించు నశించింది. మీరు సంకల్పించుకుంటే నీ ధామాన్ని నీవు చేరవలసినది

తతః స్వధామ పరమం విశస్వ యది మన్యసే
సలోకాల్లోకపాలాన్నః పాహి వైకుణ్ఠకిఙ్కరాన్

నీ కింకరులనూ లోకములనూ లోకపాలురనూ మమ్మూ, కాపాడవలసినది

శ్రీభగవానువాచ
అవధారితమేతన్మే యదాత్థ విబుధేశ్వర
కృతం వః కార్యమఖిలం భూమేర్భారోऽవతారితః

దేవతా నాయకా నీవు చెప్పిన విషయం ఇంతకుముందే ఆలోచించాను. నీ పని మొత్తం చేసాను. భూభారాన్ని తొలగించాను. 

తదిదం యాదవకులం వీర్యశౌర్యశ్రియోద్ధతమ్
లోకం జిఘృక్షద్రుద్ధం మే వేలయేవ మహార్ణవః

బలమూ సంపదా పరాక్రమముతో  గర్వించిన యాదవ కులాన్ని, అది అలాగే ఉంటే మూడు లోకాలకూ ప్రమాదం కాబట్టి ఆ పరాక్రమాన్ని సముద్రాన్ని చెలియలి కట్ట ఆపినట్లు ఆపాను.

యద్యసంహృత్య దృప్తానాం యదూనాం విపులం కులమ్
గన్తాస్మ్యనేన లోకోऽయముద్వేలేన వినఙ్క్ష్యతి

బ్రాహ్మణ శాపం అనే పేరుతో అది మరికాస్త పెరగకుండా చేసాను. ఈ యాదవ కులాన్ని ఉపసంహరించకుండా వెళితే, హద్దు లేని ఈ యాదవ కులముతొ ప్రపంచం నశిస్తుంది.

ఇదానీం నాశ ఆరబ్ధః కులస్య ద్విజశాపజః
యాస్యామి భవనం బ్రహ్మన్నేతదన్తే తవానఘ

బ్రాహ్మణ శాపముతో యాదవ కుల నాశం ప్రారంభమయ్యింది. అది పూర్తి ఐన తరువాత నేను కూడా నా లోకానికి వెళ్ళిపోతాను

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తో లోకనాథేన స్వయమ్భూః ప్రణిపత్య తమ్
సహ దేవగణైర్దేవః స్వధామ సమపద్యత

అని చెప్పగా బ్రహ్మ ఆయనకు నమస్కరించి తమ దేవ గణముతో తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు

అథ తస్యాం మహోత్పాతాన్ద్వారవత్యాం సముత్థితాన్
విలోక్య భగవానాహ యదువృద్ధాన్సమాగతాన్

ద్వారకా నగరములో గొప్ప గొప్ప ఉత్పాతాలు ప్రారంభమయ్యాయి. అపుడు స్వామి ఇలా అన్నాడు.

శ్రీభగవానువాచ
ఏతే వై సుమహోత్పాతా వ్యుత్తిష్ఠన్తీహ సర్వతః
శాపశ్చ నః కులస్యాసీద్బ్రాహ్మణేభ్యో దురత్యయః

పెద్దలందరూ జాగ్రత్తగా ఆలోచించండి. మన ద్వారకకు మహా ఉత్పాతాలు కలుగుతూ ఉన్నాయి

న వస్తవ్యమిహాస్మాభిర్జిజీవిషుభిరార్యకాః
ప్రభాసం సుమహత్పుణ్యం యాస్యామోऽద్యైవ మా చిరమ్

మనమెవ్వరమూ దాటలేని బ్రాహ్మణ శాపం ఈ వంశానికి ఏర్పడింది. బతకాలీ అనుకుంటే మనం ఇక్కడ ఉండరాదు. ఈ రోజే ఆలస్యం చేయకుండా ప్రభాస తీర్థానికి వెళదాము.

యత్ర స్నాత్వా దక్షశాపాద్గృహీతో యక్ష్మణోదురాట్
విముక్తః కిల్బిషాత్సద్యో భేజే భూయః కలోదయమ్

ప్రభాస తీర్థములో స్నానం చేసి దక్షుని శాప కారణం చేత వచ్చిన క్షయ వ్యాధిని తొలగించుకుని చంద్రుడు తన కలలల్ను పొందాడు.

వయం చ తస్మిన్నాప్లుత్య తర్పయిత్వా పితౄన్సురాన్
భోజయిత్వోషిజో విప్రాన్నానాగుణవతాన్ధసా

మనం కూడా అక్కడ స్నానం చేసి దేవతలకూ పితృ దేవతలకూ తర్పణం ఇచ్చి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి. నానా రకాలైన ఉత్తమమైన భోజనాన్ని బ్రాహ్మణులకు భోజనముగా పెడదాము

తేషు దానాని పాత్రేషు శ్రద్ధయోప్త్వా మహాన్తి వై
వృజినాని తరిష్యామో దానైర్నౌభిరివార్ణవమ్

యోగ్యమైన వారికి శ్రద్ధగా భక్తిగా దానం ఇచ్చి,మన కష్టాలనుండీ పాపాలనుండీ బయటపడదాము. సముద్రమును పడవతో దాటినట్లుగా పాపాలను దానముతో దాటుదాము.పాపాన్ని పోగొట్టేది దానము.

శ్రీశుక ఉవాచ
ఏవం భగవతాదిష్టా యాదవాః కురునన్దన
గన్తుం కృతధియస్తీర్థం స్యన్దనాన్సమయూయుజన్

 ఇలా పరమాత్మ ఆజ్ఞ్యాపిస్తే యాదవులందరూ సరేనన్నారు

తన్నిరీక్ష్యోద్ధవో రాజన్శ్రుత్వా భగవతోదితమ్
దృష్ట్వారిష్టాని ఘోరాణి నిత్యం కృష్ణమనువ్రతః

ఇదంతా చూస్తూ ఉన్నాడు పరమభక్తుడు ఉద్ధవుడు. మహాభయంకరమైన ఉత్పాతాలను చూస్తూ ప్రతీ క్షణం కృష్ణున్ని అంటి పెట్టుకు ఉన్నాడు.

వివిక్త ఉపసఙ్గమ్య జగతామీశ్వరేశ్వరమ్
ప్రణమ్య శిరిసా పాదౌ ప్రాఞ్జలిస్తమభాషత

ఒంటిగా ఉండి ఎవరు చుట్టుపక్కల లేని సమయాన్ని చూసుకుని కృష్ణునితో చేతులు జోడించి నమస్కరించి ఇలా అంటున్నాడు

శ్రీద్ధవ ఉవాచ
దేవదేవేశ యోగేశ పుణ్యశ్రవణకీర్తన
సంహృత్యైతత్కులం నూనం లోకం సన్త్యక్ష్యతే భవాన్
విప్రశాపం సమర్థోऽపి ప్రత్యహన్న యదీశ్వరః

నేను అన్నీ చూస్తున్నాను. నీవు ఈ యాదవకులాన్ని నశింపచేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేట్లు కనపడుతున్నావు. విప్రశాపాన్ని తొలగించగలిగే శక్తి కలవాడవై కూడా తొలగించలేదు

నాహం తవాఙ్ఘ్రికమలం క్షణార్ధమపి కేశవ
త్యక్తుం సముత్సహే నాథ స్వధామ నయ మామపి

తవ విక్రీడితం కృష్ణ నృనాం పరమమఙ్గలమ్
కర్ణపీయూషమాసాద్య త్యజన్త్యన్యస్పృహాం జనాః

నేను నీ పాదపద్మాలను అరక్షణం కూడా విడిచిపెట్టలేను. నన్ను కూడా నీ వెంట నీ లోకానికి తీసుకుని వెళ్ళి. మానవులకు పరమ్మంగళాన్ని కలిగించే నీ లీల చెవులకు అమృతం వంటిది. అది విన్న మానవులు ఇతరములైన కోరికలను విడిచిపెడతారు.


శయ్యాసనాటనస్థాన స్నానక్రీడాశనాదిషు
కథం త్వాం ప్రియమాత్మానం వయం భక్తాస్త్యజేమ హి

సామాన్యులు నీ కథ వింటేనే తక్కినవన్నీ వదిలిపెడతారే. మరి మేము? నీతో కలసి పడుకున్నాము కూర్చున్నాము స్నానం చేసాము ఆడాము విహరించాము. ఇవన్నీ నీతో కలసి చేసిన మేము నిన్ను ఎలా విడిచిపెడతాము

త్వయోపభుక్తస్రగ్గన్ధ వాసోऽలఙ్కారచర్చితాః
ఉచ్ఛిష్టభోజినో దాసాస్తవ మాయాం జయేమ హి

ఇన్నాళ్ళూ నిన్ను చూడగా నాకు అర్థమైనదేమిటంటే నీవు చాలా గొప్పవాడవు, నీ మాయా చాలా గొప్పది. ఎలాంటి వారూ దాన్ని దాటలేరు. కానీ నీ మాయను దాటే ఉపాయం మాకు తెలిసింది
నీవు వాడిన పూలనూ మాలను గంధమునూ వస్త్రమునూ, నీవు విడిచిన అలంకారాన్నీ, నీవు అనుభవించి విడిచిన వాటిని అనుభవించే, నీ ఉచ్చిష్టాన్ని అనుభవించే మాకు, నీ దాసులమైన మేము నీ మాయను గెలుస్తాము. శేష మాల శేష వస్త్రం శేష భోజనం చేసిన మాకు నీ మాయ అంటదు

వాతవసనా య ఋషయః శ్రమణా ఊర్ధ్రమన్థినః
బ్రహ్మాఖ్యం ధామ తే యాన్తి శాన్తాః సన్న్యాసీనోऽమలాః

దిగంబరులూ ఋషులూ సన్యాసులూ ఊర్ధ్వ లోకాన్ని చేరగోరేవారిలా మాకు అవేవీ అవసరంలేదు. 

వయం త్విహ మహాయోగిన్భ్రమన్తః కర్మవర్త్మసు
త్వద్వార్తయా తరిష్యామస్తావకైర్దుస్తరం తమః

మా మా కర్మ మార్గాలలో మేము తిర్గుతూ నీ కథతో వారు చేరే లోకాలను చేరతాము, నీ మాయను దాటుతాము
నీ వారితోనే నీ కథలతోనే, అవి వినీ వినీ, అనీ అనీ నీ మాయను దాటుతాము. సంసారములో ఉంటాము. నీవు చెప్పినట్లు వింటాము. 

స్మరన్తః కీర్తయన్తస్తే కృతాని గదితాని చ
గత్యుత్స్మితేక్షణక్ష్వేలి యన్నృలోకవిడమ్బనమ్

నీవు ఆచరించిన దాన్ని స్మరిస్తాము, నీవు చెప్పినదాన్నే కీర్తిస్తాము. నీ గమనం చిరునవ్వూ చూపూ పరిహాసం, లీలా, ఇవన్నీ మానవులలో మానవులుగా ఉండి చేయవల్సినవన్నీ నాటకముగా చేసిన నిన్ను,  స్మరించుకుంటూ ఉంటాము.అవి ధ్యానం చేసుకుంటూ నీ మాయను గెలుస్తాము

శ్రీశుక ఉవాచ
ఏవం విజ్ఞాపితో రాజన్భగవాన్దేవకీసుతః
ఏకాన్తినం ప్రియం భృత్యముద్ధవం సమభాషత

ఇలా ఉద్ధవుడు విజ్ఞ్యాపనం చేస్తే ఆంతరంగికుడూ ప్రియభక్తుడూ ఐన ఉద్ధవునితో స్వామి కృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడు


                                             
                                               సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts