Followers

Thursday 29 May 2014

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం నాలుగవ అధ్యాయం

                  

   ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
కాలస్తే పరమాణ్వాదిర్ద్విపరార్ధావధిర్నృప
కథితో యుగమానం చ శృణు కల్పలయావపి

పరమాణువు నుంచీ ద్విపరార్థం వరకూ కాలాన్ని చెప్పుకున్నాము

చతుర్యుగసహస్రం తు బ్రహ్మణో దినముచ్యతే
స కల్పో యత్ర మనవశ్చతుర్దశ విశామ్పతే

నాలుగు యుగములు వేయి సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట. దీన్ని కల్పమూ అంటారు
ఈ కల్పములో పధ్నాలుగు మంది మనువులు ఉంటారు. తరువాత ప్రళయం వస్తుంది. ఇది బ్రహ్మ యొక్క రాత్రి

తదన్తే ప్రలయస్తావాన్బ్రాహ్మీ రాత్రిరుదాహృతా
త్రయో లోకా ఇమే తత్ర కల్పన్తే ప్రలయాయ హి

ఈ బ్రహ్మ యొక్క రాత్రిలో మూడులోకాలు పోతాయి. భూః భువ@ సువః.

ఏష నైమిత్తికః ప్రోక్తః ప్రలయో యత్ర విశ్వసృక్
శేతేऽనన్తాసనో విశ్వమాత్మసాత్కృత్య చాత్మభూః

దీన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. పరమాత్మ అనంతాసనుడై ఆదిశేషుని మీద పడుకుని ప్రపంచాన్ని తనలో చేర్చుకుని ఆత్మ భూః గా ఉంటాడు

ద్విపరార్ధే త్వతిక్రాన్తే బ్రహ్మణః పరమేష్ఠినః
తదా ప్రకృతయః సప్త కల్పన్తే ప్రలయాయ వై

ఇదే బ్రహ్మకు ద్విపరార్థకాలం ఐతే అది మహా ప్రళయం. దాన్ని మహా కల్పం అంటారు
అపుడు భూమీ జలం అగ్ని వాయువు ఆకాశం మహత్ అహంకారం అనే ఏడు ప్రకృతులూ ప్రళయాన్ని పొందుతాయి

ఏష ప్రాకృతికో రాజన్ప్రలయో యత్ర లీయతే
అణ్డకోషస్తు సఙ్ఘాతో విఘాట ఉపసాదితే

దీన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు
అండ కోశం అంతా కలసి

పర్జన్యః శతవర్షాణి భూమౌ రాజన్న వర్షతి
తదా నిరన్నే హ్యన్యోన్యం భక్ష్యమాణాః క్షుధార్దితాః
క్షయం యాస్యన్తి శనకైః కాలేనోపద్రుతాః ప్రజాః

మహాప్రళయ కాలములో నూరు సంవత్సరాలు వర్షము లేకుండా ఉంటుంది
ప్రజలు ఆకలికి తాళలేక ఒకరినొకరు తింటారు
అందరూ మెల్లగా నశిస్తారు

సాముద్రం దైహికం భౌమం రసం సాంవర్తకో రవిః
రశ్మిభిః పిబతే ఘోరైః సర్వం నైవ విముఞ్చతి

ఎక్కడ తడి అనేది ఉందో దాన్ని మొత్తం సూర్యుడు లాగుతాడు. సముద్రములో, దేహములో భూమిలో నదులలో రసములో ఉన్న నీటిని ప్రళయకాల సూర్యుడు ఈనాలిగింటిలో ఉండే నీటిని తన ఘోర కిరణాలతో తీసుకుంటాడు. ఏ ఒక్క నీటి బిందువునీ విడిచిపెట్టడు

తతః సంవర్తకో వహ్నిః సఙ్కర్షణముఖోత్థితః
దహత్యనిలవేగోత్థః శూన్యాన్భూవివరానథ

ప్రళయ కాలాగ్ని సంకర్షణుని వేయి ముఖముల నుండి లేచి వాయు వేగముతో లేచి మొత్తం శూన్యముగా ఉన్న అతల సుతలాది వివరాలను కాల్చిపారేస్తాయి

ఉపర్యధః సమన్తాచ్చ శిఖాభిర్వహ్నిసూర్యయోః
దహ్యమానం విభాత్యణ్డం దగ్ధగోమయపిణ్డవత్

ఆ జ్వాలలు పైకీ కిందకీ చుట్టూ నిండుతాయి
తన శిఖలూ సూయుని శిఖలూ అగ్ని శిఖలతో కాల్చబడిన ప్రపంచము బాగా కాలిన పిడకలా అవుతుంది.

తతః ప్రచణ్డపవనో వర్షాణామధికం శతమ్
పరః సాంవర్తకో వాతి ధూమ్రం ఖం రజసావృతమ్

అలా కాలిన  బూడిద ఐన తరువాత భయంకరమైన వాయువులతో కూడిన వర్షం, రజస్సుతో నిండి నూరు సంవత్సరాలు పడుతుంది

తతో మేఘకులాన్యఙ్గ చిత్ర వర్ణాన్యనేకశః
శతం వర్షాణి వర్షన్తి నదన్తి రభసస్వనైః

నూరు సంవత్సరాలు వర్షిస్తాయి
భయంకర ధ్వనితో గర్ఝిస్తాయి.

తత ఏకోదకం విశ్వం
బ్రహ్మాణ్డవివరాన్తరమ్

సూర్యభగవానుడు తీసుకున్న మొత్తం జలాలని విడిచిపెడతాడు
చివరకు ఉదకం ఒక్కటే మిగులుతుంది. ప్రపంచం మొత్తములో జలం మాత్రమే ఉంటుంది. బ్రహ్మానడ వివరములో కూడాజలమే ఉంటుంది.

తదా భూమేర్గన్ధగుణం గ్రసన్త్యాప ఉదప్లవే
గ్రస్తగన్ధా తు పృథివీ ప్రలయత్వాయ కల్పతే

భూమి గంధాన్ని జలము తీసుకుంటుంది. గంధము పోయిన భూమి లయమైపోతుంది

అపాం రసమథో తేజస్తా లీయన్తేऽథ నీరసాః
గ్రసతే తేజసో రూపం వాయుస్తద్రహితం తదా

జలం యొక్క రసాన్ని తేజస్సు తీసుకుంటుంది. రసం పోయిన జలము లయమైపోతుంది
తేజో రూపాన్ని వాయువు. వాయువు రూపాన్ని ఆకాశమూ తీసుకుంటాయి

లీయతే చానిలే తేజో వాయోః ఖం గ్రసతే గుణమ్
స వై విశతి ఖం రాజంస్తతశ్చ నభసో గుణమ్

ఆకాశ గుణాన్ని తామస అహంకారం తీసుకోగా, ఆకాశం కూడా లయమవుతుంది

శబ్దం గ్రసతి భూతాదిర్నభస్తమను లీయతే
తైజసశ్చేన్ద్రియాణ్యఙ్గ దేవాన్వైకారికో గుణైః

జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియాలు దేవతలలో కలుస్తాయి

మహాన్గ్రసత్యహఙ్కారం గుణాః సత్త్వాదయశ్చ తమ్
గ్రసతేऽవ్యాకృతం రాజన్గుణాన్కాలేన చోదితమ్

అహంకారాన్ని మహత్ తత్వమూ. దాన్ని సత్వాది గుణాలు తీసుకుంటాయి

న తస్య కాలావయవైః పరిణామాదయో గుణాః
అనాద్యనన్తమవ్యక్తం నిత్యం కారణమవ్యయమ్

ఇలాంటి మహత్ తత్వాన్ని అవ్యాహృతమైన కాలము చేత ప్రేరేపించబడిన ప్రకృతి తీసుకుంటుంది
ఇదంతా కలసి పరమాత్మలోకి వెళ్ళిపోతాయి

న యత్ర వాచో న మనో న సత్త్వం తమో రజో వా మహదాదయోऽమీ
న ప్రాణబుద్ధీన్ద్రియదేవతా వా న సన్నివేశః ఖలు లోకకల్పః

అక్కడ వాక్కూ సత్వమూ మనసూ రజస్తమో గుణాలూ, మహదాదులూ ప్రాణ బుద్ధి ఇంద్రియ దేవతలూ సన్నివేశమూ ఏవీ కనపడవు

న స్వప్నజాగ్రన్న చ తత్సుషుప్తం న ఖం జలం భూరనిలోऽగ్నిరర్కః
సంసుప్తవచ్ఛూన్యవదప్రతర్క్యం తన్మూలభూతం పదమామనన్తి

జాగ్రత్ స్వప్న సుషుప్తులూ నిద్రా ఆకాశం జలం భూమీ వాయువూ అగ్నీ సూర్యుడూ నిద్రపోయినట్లుగా లేనట్లుగా, ఊహించడానికి వీలు లేనట్లుగా, పరమాత్మ పదమును చేరుకుంటాయి

లయః ప్రాకృతికో హ్యేష పురుషావ్యక్తయోర్యదా
శక్తయః సమ్ప్రలీయన్తే వివశాః కాలవిద్రుతాః

ఇది ప్రాకృతిక ప్రళయం.
అన్ని శక్తులూ కాలముచే ప్రేరేపించబడి ఒకదానిలో ఒకటి లీనమైపోతాయి

బుద్ధీన్ద్రియార్థరూపేణ జ్ఞానం భాతి తదాశ్రయమ్
దృశ్యత్వావ్యతిరేకాభ్యామాద్యన్తవదవస్తు యత్

అవి అన్నీ జ్ఞ్యానములో చేరతాయి. కనపడుతున్నట్టుగా, కనపడనివి కనపడినట్టుగా, కనపడినవి కనపడంట్లుగా వ్యతిరేకముగా చూస్తాము.

దీపశ్చక్షుశ్చ రూపం చ జ్యోతిషో న పృథగ్భవేత్
ఏవం ధీః ఖాని మాత్రాశ్చ న స్యురన్యతమాదృతాత్

దీపమూ చక్షూ రూపము, జ్యోతి యొక్క వికారం.
జ్యోతి లేకుండా విడిగా ఉండలేవు. బుద్ధీ ఇంద్రియములూ మాత్రలూ, ఇవన్నీ కూడా ఒకటిలేకుండా ఇంకొకటి ఉండలేవు. బుద్ధి లేనిదే మనస్సు,మనసు లేనిదే ఇంద్రియాలూ, ఇంద్రియం లేనిదే అహంకారమూ, ఇలా ప్రతీదీ రెండవదాని తత్వాన్ని ఆశ్రయించే ఉంటాయి

బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి చోచ్యతే
మాయామాత్రమిదం రాజన్నానాత్వం ప్రత్యగాత్మని

నిదురపోవుటా మేలుకొని ఉండుటా కలలు గనుటా, బుద్ధివి.
ఎలాగైతే మనం దీపమూ కన్నూ రూపమూ తేజస్సువి అని చెబుతున్నామో
నిద్రా మెలకువా కలలూ బుద్ధివి.
ఇది గమనిస్తే ప్రపంచం మొత్తం మాయా జనితం అనీ, ఆత్మలో ఉండి నానారూపాలుగా భాసిస్తుంది అని అర్థమవుతుంది.

యథా జలధరా వ్యోమ్ని భవన్తి న భవన్తి చ
బ్రహ్మణీదం తథా విశ్వమవయవ్యుదయాప్యయాత్

ఆకాశములో మేఘాలు కనపడతాయీ కనపడవు. ఉంటాయీ పోతాయి. అవి ఎంత భ్రమలో ఇవీ అంతే భ్రమ. ఆకాశములో మేఘాలు ఉండీ ఉండనట్లుగా పరపంచం అంతా పరమాత్మలో ఉంటుందీ ఉండదు.
సృష్టీ స్థితీ నాశం అనే మూడు గుణాలతో ప్రపంచం ఉంటుంది. అన్ని అవయవిలకూ సత్యమే అవయవము.

సత్యం హ్యవయవః ప్రోక్తః సర్వావయవినామిహ
వినార్థేన ప్రతీయేరన్పటస్యేవాఙ్గ తన్తవః

కనుక పరమాత్మలేకుండా ప్రపంచం ఉండదు.

యత్సామాన్యవిశేషాభ్యాముపలభ్యేత స భ్రమః
అన్యోన్యాపాశ్రయాత్సర్వమాద్యన్తవదవస్తు యత్

ప్రపంచాన్ని చూసి నిత్యం అని సామాన్య విశేషభావాలతో దేన్నైతే తలుస్తున్నారో అది అంతా భ్రమా
పుట్టుకా నాశమూ ఉన్నవన్నీ వస్తువులు కావు. ఎప్పటికీ ఉండేది మాత్రమే వస్తువు. ఎప్పటికీ ఉండేది పరమాత్మే. ఏది వస్తువో అదే వాస్తవం. పరమాత్మ ఒక్కడే వాస్తవం. పరమాత్మ ఒక్కడే సత్యం.

వికారః ఖ్యాయమానోऽపి ప్రత్యగాత్మానమన్తరా
న నిరూప్యోऽస్త్యణురపి స్యాచ్చేచ్చిత్సమ ఆత్మవత్

మనం ఎన్ని భేధాలనూ వికారాలనూ చెప్పుకుంటున్నా ప్రత్యగాత్మ లేకుండా మనసూ బుద్ధీ గుణాలూ బుద్ధీ భాసించవు.

న హి సత్యస్య నానాత్వమవిద్వాన్యది మన్యతే
నానాత్వం ఛిద్రయోర్యద్వజ్జ్యోతిషోర్వాతయోరివ

సత్యం ఎపుడైనా నానా విధాలుగా ఉంటుందా. సత్యము ఏకం. సత్యములో భేధాలు ఉండవు.
గాలి యొక్క విభాగం అగ్ని యొక్క విభాగము చేయగలమా. ఎన్నీ దీపాలు ఉంటే అన్ని అగ్నులూ అని అనగలమా. ఎన్ని శరీరాలు ఉంటే అన్ని వస్తువులు అని అనగలమా.

యథా హిరణ్యం బహుధా సమీయతే నృభిః క్రియాభిర్వ్యవహారవర్త్మసు
ఏవం వచోభిర్భగవానధోక్షజో వ్యాఖ్యాయతే లౌకికవైదికైర్జనైః

బంగారం ఒక్కటే దాన్ని మానవులు ఉంగరమనీ గాజులనీ కడియాలనీ హారాలనీ అంటున్నా ఉన్న బంగారమొకటే. అలాగ మనం లోకములో గానీ, వేదములో గానీ ఎన్ని పేర్లైతే చెప్పుకుంటున్నామో అది అంతా పరమాత్మే. ఎన్ని పేర్లు పెట్టినా బంగారం ఒకటే ఐనట్లు, ఎన్ని రకాలుగా ప్రపంచాన్ని వర్ణించినా అది అంతా పరమాత్మే.

యథా ఘనోऽర్కప్రభవోऽర్కదర్శితో
హ్యర్కాంశభూతస్య చ చక్షుషస్తమః
ఏవం త్వహం బ్రహ్మగుణస్తదీక్షితో
బ్రహ్మాంశకస్యాత్మన ఆత్మబన్ధనః

శరీరమూ, ఆత్మ, ఆత్మలో పరమాత్మ అంటున్నాము. పరమాత్మే అన్నీ చూపుతున్నాడని అంటున్నాము. ఏ పరమాత్మ దీన్ని సృష్టిస్తున్నాడని అంటున్నామో ఆ పరమాత్మనే మనం గుర్తించట్లేదు.
మేఘము సూర్యునితో సృష్టించబడింది. మేఘం ఉన్నదని మేఘాన్ని చూపేదీ సూర్యుడే. కన్ను కూడా సూర్యుడే. సూర్యుడి వలన పుట్టి సూర్యుడి వలన చూపబడే మేఘము, సూర్యుని వలన చూపబడే కన్నుకి చీకటిని కలిగిస్తుంది. అదే కన్ను సూర్యుడు లేకుంటే మేఘాన్ని చూడలేదు. అదే మేఘం సూర్యుడు లేకుంటే లేదు.సూర్యుని వలన పుట్టిన మేఘం సూర్యున్ని కప్పినట్లు కనపడినట్లుగా భగవంతుని వలన పుట్టిన జగత్తు, భగవంతున్నే కప్పినట్లుగా కనపడుతుంది.
జగతూ ఆత్మ సృష్టీ బుద్ధీ మనసూ పరమాత్మ వలననే సృష్టించబడ్డాయి. ఆ బుద్ధీ మనసే పరమాత్మను చూడలేకుండా చేస్తున్నాయి.

నేను బ్రహ్మ యొక్క అవయవాన్ని
బ్రహ్మ చేతే చూడబడుతూ ఉన్నాను
ఆయన సృష్టే ఆత్మను బంధిస్తూ ఉన్నది, ఆంతను చూపెడుతూ ఉన్నది

ఘనో యదార్కప్రభవో విదీర్యతే చక్షుః స్వరూపం రవిమీక్షతే తదా
యదా హ్యహఙ్కార ఉపాధిరాత్మనో జిజ్ఞాసయా నశ్యతి తర్హ్యనుస్మరేత్

ఎపుడైతే ఈ మేఘాన్ని చీల్చి వేస్తే సూర్యుడు కనపడతాడు. సూర్యుని వలన పుట్టిన మేఘాన్ని చీల్చివేస్తే సూర్యుడు కనపడతాడు
ఆత్మకు ఉపాధిగా ఉండే అహంకారం జిజ్ఞ్యాసతో నశిస్తే మబ్బు తొలగితే సూర్యుడు కనపడినట్లుగా భగవానుడు కనపడతాడు

యదైవమేతేన వివేకహేతినా మాయామయాహఙ్కరణాత్మబన్ధనమ్
ఛిత్త్వాచ్యుతాత్మానుభవోऽవతిష్ఠతే తమాహురాత్యన్తికమఙ్గ సమ్ప్లవమ్

వివేకం అనే ఆయుధముతో ఇలాంటి అల్పబంధనాన్ని పరమాత్మ స్వరూపుడై పరమాత్మను మనసులో ఉంచుకుని, పరమాత్మలోనే లీనమవుతే అది ఆత్యంతిక ప్రళయం.

నిత్యదా సర్వభూతానాం బ్రహ్మాదీనాం పరన్తప
ఉత్పత్తిప్రలయావేకే సూక్ష్మజ్ఞాః సమ్ప్రచక్షతే

ఇది గాక నిత్య ప్రళయం, నిత్య సృష్టీ ఉంటుంది. సూక్షం తెలిసినవారు మాత్రమే దీన్ని గుర్తుపడతారు. ప్రాణి పెరగడం అంటే నిరంతరం ఆ శరీరములో పాత కణాలు నశిస్తూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి.
జగత్తులో జరిగే ప్రతీ మార్పూ సృష్టి లయాలకు సంకేతం. నదీ ప్రావహములో పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. మన శరీరం కూడా నిత్యం పరిణామం చెందుతూ ఉంటుంది

కాలస్రోతోజవేనాశు హ్రియమాణస్య నిత్యదా
పరిణామినాం అవస్థాస్తా జన్మప్రలయహేతవః

కాల వేగముతో రోజు రోజుకూ ఇదంతా హరించబడేది
ఇదంతా పరిణామం యొక్క వ్యవస్థ

అనాద్యన్తవతానేన కాలేనేశ్వరమూర్తినా
అవస్థా నైవ దృశ్యన్తే వియతి జ్యోతిషాం ఇవ

ఆది లేకుండా అంతం లేకుండా ఉండే ఈశ్వర రూపమే కాలము.
రోజులు గడుస్తున్నా నెలలు గడుస్తున్నా యుగాలు గడుస్తున్నా అది మనకు కనపడదు.ఉత్పత్తీ వినాశాన్ని మనం గమనించలేము.

నిత్యో నైమిత్తికశ్చైవ తథా ప్రాకృతికో లయః
ఆత్యన్తికశ్చ కథితః కాలస్య గతిరీదృశీ

ఇలా ప్రళయం నాలుగు రకాలు
నిత్య(మనలో వచ్చే ప్రతీ మార్పు), నైమిత్తిక (బ్రహ్మకు ఒకపూట) ప్రాకృతిక (మహా ప్రళయం), ఆత్యంతికం(మోక్షం)

ఏతాః కురుశ్రేష్ఠ జగద్విధాతుర్నారాయణస్యాఖిలసత్త్వధామ్నః
లీలాకథాస్తే కథితాః సమాసతః కార్త్స్న్యేన నాజోऽప్యభిధాతుమీశః

పరమాత్మ యొక్క ఈ లీలా కథలన్నీ నీకు సంగ్రహముగా వివరించాను.
సంపూర్ణముగా చెప్పాలంటే బ్రహంకు కూడా సాధ్యం కాదు. క్లుప్తముగా చెప్పాను

సంసారసిన్ధుమతిదుస్తరముత్తితీర్షోర్
నాన్యః ప్లవో భగవతః పురుషోత్తమస్య
లీలాకథారసనిషేవణమన్తరేణ
పుంసో భవేద్వివిధదుఃఖదవార్దితస్య

ఎంత ప్రయత్నించినా దాట శక్యం కాని సంసారాన్ని దాటాలి అనుకునేవారికి
పురుషోత్తముడైన పరమాత్మ లీలా కథా రసమును సేవించడం తప్ప వేరే పడవ లేదు
సముద్రములో ఉన్నాము గానీ, చుట్టూ అగ్నితో బాధించబడుతూ ఉన్నాము. ఇది దాటడానికే పరమాత్మ కథ వినడం మాత్రమే మార్గము

పురాణసంహితామేతామృషిర్నారాయణోऽవ్యయః
నారదాయ పురా ప్రాహ కృష్ణద్వైపాయనాయ సః

ఈ పురాణ సంహితను నారాయణుడు,పరమాత్మ నారదునికి,నారదుడు వ్యాసునికీ, వ్యాసుడు నాకూ చెప్పాడు

స వై మహ్యం మహారాజ భగవాన్బాదరాయణః
ఇమాం భాగవతీం ప్రీతః సంహితాం వేదసమ్మితామ్

ఈ భాగవతం వేదం లాంటిది

ఇమాం వక్ష్యత్యసౌ సూత ఋషిభ్యో నైమిషాలయే
దీర్ఘసత్రే కురుశ్రేష్ఠ సమ్పృష్టః శౌనకాదిభిః

ఈ భాగవతాన్ని సూతుడు నైమిశారణ్యములో దీర్ఘ సత్రములో శౌనకాది ఋషులు అడిగితే చెబుతాడు


                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts