Followers

Thursday 10 April 2014

శ్రీమద్భాగవతం నవమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
అనోః సభానరశ్చక్షుః పరేష్ణుశ్చ త్రయః సుతాః
సభానరాత్కాలనరః సృఞ్జయస్తత్సుతస్తతః

అను యొక్క కుమారుడు సభానరుడు.

జనమేజయస్తస్య పుత్రో మహాశాలో మహామనాః
ఉశీనరస్తితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ

శిబిర్వరః కృమిర్దక్షశ్చత్వారోశీనరాత్మజాః
వృషాదర్భః సుధీరశ్చ మద్రః కేకయ ఆత్మవాన్

ఉసీనరునికి నలుగురు కుమారులు.

శిబేశ్చత్వార ఏవాసంస్తితిక్షోశ్చ రుషద్రథః
తతో హోమోऽథ సుతపా బలిః సుతపసోऽభవత్

శిబికి నలుగురు కుమారులు. తితిక్షునికి రుషద్రధుడు కుమారుడు

అఙ్గవఙ్గకలిఙ్గాద్యాః సుహ్మపుణ్డ్రౌడ్రసంజ్ఞితాః
జజ్ఞిరే దీర్ఘతమసో బలేః క్షేత్రే మహీక్షితః

ఈ కుమారులందరూ  బలికి అతని భార్య యందు కలిగారు

చక్రుః స్వనామ్నా విషయాన్షడిమాన్ప్రాచ్యకాంశ్చ తే
ఖలపానోऽఙ్గతో జజ్ఞే తస్మాద్దివిరథస్తతః

వీరు తమ తమ పేర్లతో రాజ్యాన్ని చేసారు.

సుతో ధర్మరథో యస్య జజ్ఞే చిత్రరథోऽప్రజాః
రోమపాద ఇతి ఖ్యాతస్తస్మై దశరథః సఖా

చిత్ర రథునికి సంతానం లేదు. తరువాతి వాడు రోమపాదుడు, అతైకి దశరథుడు మిత్రుడు.

శాన్తాం స్వకన్యాం ప్రాయచ్ఛదృష్యశృఙ్గ ఉవాహ యామ్
దేవేऽవర్షతి యం రామా ఆనిన్యుర్హరిణీసుతమ్

తన పుత్రిక ఐన శాంతను రోమపాదునికి పెంచుకోవడానికి ఇచ్చాడు. కరువు తొలగించడానికి ఋష్యశృంగుని తీసుకుని వచ్చాడు ఈ రోమపాదుడు. శాంతను ఇచ్చి వివాహం చేసాడు ఋష్యశృంగునికి.

నాట్యసఙ్గీతవాదిత్రైర్విభ్రమాలిఙ్గనార్హణైః
స తు రాజ్ఞోऽనపత్యస్య నిరూప్యేష్టిం మరుత్వతే

ప్రజామదాద్దశరథో యేన లేభేऽప్రజాః ప్రజాః
చతురఙ్గో రోమపాదాత్పృథులాక్షస్తు తత్సుతః

దశరధునికి పిల్లలు లేకపోతే ఈ ఋష్యశృంగుడే యజ్ఞ్యం చేయించాడు

బృహద్రథో బృహత్కర్మా బృహద్భానుశ్చ తత్సుతాః
ఆద్యాద్బృహన్మనాస్తస్మాజ్జయద్రథ ఉదాహృతః

విజయస్తస్య సమ్భూత్యాం తతో ధృతిరజాయత
తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరథస్తతః

యోऽసౌ గఙ్గాతటే క్రీడన్మఞ్జూషాన్తర్గతం శిశుమ్
కున్త్యాపవిద్ధం కానీనమనపత్యోऽకరోత్సుతమ్

అతిరథుడు గంగా తీరములో తిరుగుతున్నప్పుడు ఒక పెట్టె కనపడింది, ఆ శిశువుని అతిరథుడు పెంచాడు. అతనే కర్ణుడు. కన్యగా ఉండగా కన్న కొడుకైన కర్ణున్ని ఇతను పెంచాడు.

వృషసేనః సుతస్తస్య కర్ణస్య జగతీపతే
ద్రుహ్యోశ్చ తనయో బభ్రుః సేతుస్తస్యాత్మజస్తతః

ద్రుహ్యుని కుమారుడు బభ్రు.

ఆరబ్ధస్తస్య గాన్ధారస్తస్య ధర్మస్తతో ధృతః
ధృతస్య దుర్మదస్తస్మాత్ప్రచేతాః ప్రాచేతసః శతమ్

మ్లేచ్ఛాధిపతయోऽభూవన్నుదీచీం దిశమాశ్రితాః
తుర్వసోశ్చ సుతో వహ్నిర్వహ్నేర్భర్గోऽథ భానుమాన్

ప్రాచేతసులందరూ ంలేచ్చాధిపతులయ్యారు. తుర్వసుని కుమారుడు వహ్ని.

త్రిభానుస్తత్సుతోऽస్యాపి కరన్ధమ ఉదారధీః
మరుతస్తత్సుతోऽపుత్రః పుత్రం పౌరవమన్వభూత్

దుష్మన్తః స పునర్భేజే స్వవంశం రాజ్యకాముకః
యయాతేర్జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశం నరర్షభ

దుష్యంతుడు మరలా జన్మించాడు

వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణామ్
యదోర్వంశం నరః శ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే

యయాతి వంశములో మిగిలిన వాడు, పెద్దవాడు యదువు (యదువూ పూరువు దృతుడు). ఈ వంశం గురించి విన్న వారు అన్ని పాపాలూ పోగొట్టుకుంటారు.  ఈ యదువంశములోనే పరమాత్మ మానవ ఆకారములో అవతరించాడు

యత్రావతీర్ణో భగవాన్పరమాత్మా నరాకృతిః
యదోః సహస్రజిత్క్రోష్టా నలో రిపురితి శ్రుతాః

యదువుకు నలుగురు కుమారులు.

చత్వారః సూనవస్తత్ర శతజిత్ప్రథమాత్మజః
మహాహయో రేణుహయో హైహయశ్చేతి తత్సుతాః

శతజిత్తుకు వీరందరూ కుమార్లు.  ధర్మ అనేవాడు హైహయుని కుమారుడు.

ధర్మస్తు హైహయసుతో నేత్రః కున్తేః పితా తతః
సోహఞ్జిరభవత్కున్తేర్మహిష్మాన్భద్రసేనకః

కుంతి అనే రాజు పెంచుకున్న అమ్మాయి పేరు కుంతి.

దుర్మదో భద్రసేనస్య ధనకః కృతవీర్యసూః
కృతాగ్నిః కృతవర్మా చ కృతౌజా ధనకాత్మజాః

భద్రసేనుడి కుమారుడు ధనకుడు, కృతవీర్యుడు ...

అర్జునః కృతవీర్యస్య సప్తద్వీపేశ్వరోऽభవత్
దత్తాత్రేయాద్ధరేరంశాత్ప్రాప్తయోగమహాగుణః

కృతవీర్యునికి కార్తవీర్యార్జనుడు. హరి అంశ ఐన దత్తాత్రేయుని వలన యోగముని పొంది చక్రవర్తి అయ్యాడు మొత్తం భూమండలానికి

న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యన్తి పార్థివాః
యజ్ఞదానతపోయోగైః శ్రుతవీర్యదయాదిభిః

ప్రపంచములో ఉన్న ఏ రాజూ కూడా కార్తవీర్యార్జునితో సమానమైన స్థాయిని పొందలేరు, ఎందుకంటే ఇతను దత్తాత్రేయుని శిష్యుడు కాబట్టి.

పఞ్చాశీతి సహస్రాణి హ్యవ్యాహతబలః సమాః
అనష్టవిత్తస్మరణో బుభుజేऽక్షయ్యషడ్వసు

ఎనభై ఐదు వేల సంవత్సరాలు రాజ్యపాలన ఎదురు లేకుండా పాలించాడు. కార్తవీర్యార్జుని మంత్రం తలచుకుంటే పోయిన, అపహరించబడిన వస్తువూ ధనమూ దొరుకుతుంది.

తస్య పుత్రసహస్రేషు పఞ్చైవోర్వరితా మృధే
జయధ్వజః శూరసేనో వృషభో మధురూర్జితః

అతనికి వేయి మంది కుమారులు.వారు పరశురాముని చేత చంపబడ్డారు. వారిలో ఐదుగురు మాత్రం బతికారు. అందులో శూరసేనుడు ఒకడు.

జయధ్వజాత్తాలజఙ్ఘస్తస్య పుత్రశతం త్వభూత్
క్షత్రం యత్తాలజఙ్ఘాఖ్యమౌర్వతేజోపసంహృతమ్

తేషాం జ్యేష్ఠో వీతిహోత్రో వృష్ణిః పుత్రో మధోః స్మృతః
తస్య పుత్రశతం త్వాసీద్వృష్ణిజ్యేష్ఠం యతః కులమ్

మాధవా వృష్ణయో రాజన్యాదవాశ్చేతి సంజ్ఞితాః
యదుపుత్రస్య చ క్రోష్టోః పుత్రో వృజినవాంస్తతః

మధువు యొక్క కుమారుడు వృష్ణి. వీరంతా వార్ష్ణేయులు. మధు వంశం వారు మాధవులు. యాదవులకు మాధవులనీ వృష్ణి వంశం వారనీ యాదవులనీ పేరు ఉంది.

స్వాహితోऽతో విషద్గుర్వై తస్య చిత్రరథస్తతః
శశబిన్దుర్మహాయోగీ మహాభాగో మహానభూత్

చతుర్దశమహారత్నశ్చక్రవర్త్యపరాజితః
తస్య పత్నీసహస్రాణాం దశానాం సుమహాయశాః

పధ్నాలుగు మహారాజ్యములకు మహాబోజుడు మహారాజు. ఇతనికి వేలమంది భార్యలు ఉన్నారు.

దశలక్షసహస్రాణి పుత్రాణాం తాస్వజీజనత్
తేషాం తు షట్ప్రధానానాం పృథుశ్రవస ఆత్మజః

ఇతని వంశం పది లక్షలు.

ధర్మో నామోశనా తస్య హయమేధశతస్య యాట్
తత్సుతో రుచకస్తస్య పఞ్చాసన్నాత్మజాః శృణు

ఈ ఆరుగురిలో ధర్మునికి శుక్రాచార్యులు దగ్గర ఉండి అశ్వమేధాన్ని చేయించారు.

పురుజిద్రుక్మరుక్మేషు పృథుజ్యామఘసంజ్ఞితాః
జ్యామఘస్త్వప్రజోऽప్యన్యాం భార్యాం శైబ్యాపతిర్భయాత్

భార్య అంటే భయముతో జ్యామఘుడు సంతానం లేకపోయినా మరలా పెళ్ళి చేసుకోలేదు.. ఒక సారి యుద్ధానికి వెళ్ళి శత్రువులను ఓడించగా ఆ మహారాజు పుత్రిక భయపడి పరుగెడుతూ ఉంటే తనను తీసుకుని రథమునెక్కించుకుని వచ్చాడు. రాగానే తన భార్య చూచి ఎవరీమె అని అడిగింది. నీ కోడలు అని సమాధనం చెప్పాడు. సంతానం లేని వారికి కోడలేలా సాధ్యం అంటే. పుట్టబోయేవారికి ఈమె కోడలు అవుతుంది. మనం భయముతో కోపముతో ద్వేషముతో మాట్లాడే మాటలు ఆకాశములో దేవతలు వింటారు, విని తధాస్తు అంటారు. అలాగే ఈమె కుమారున్ని కన్నది. రథం మీద ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకునేప్పుడు ఆ రాజు మధ్యలో దర్భను వేసి కూర్చోపెట్టాడు. ఇలా దర్భలు వేసి కూర్చోపెట్టిన ఆమెకు పుట్టినవాడు కాబట్టి ఆ వంశం విదర్భ అయ్యింది. విదర్భ వంశములోనే బీష్మకుడూ, అతనికి రుక్మిణీ పుడతారు.

నావిన్దచ్ఛత్రుభవనాద్భోజ్యాం కన్యామహారషీత్
రథస్థాం తాం నిరీక్ష్యాహ శైబ్యా పతిమమర్షితా

కేయం కుహక మత్స్థానం రథమారోపితేతి వై
స్నుషా తవేత్యభిహితే స్మయన్తీ పతిమబ్రవీత్

అహం బన్ధ్యాసపత్నీ చ స్నుషా మే యుజ్యతే కథమ్
జనయిష్యసి యం రాజ్ఞి తస్యేయముపయుజ్యతే

అన్వమోదన్త తద్విశ్వే దేవాః పితర ఏవ చ
శైబ్యా గర్భమధాత్కాలే కుమారం సుషువే శుభమ్
స విదర్భ ఇతి ప్రోక్త ఉపయేమే స్నుషాం సతీమ్

ఈ ఝామకుడి నుంచే విదర్భ వంశం, యదు వంశ వృద్ధీ ఉంది.

Popular Posts