Followers

Sunday 27 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభైయ్యవ అధ్యాయం


           ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభైయ్యవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అస్తిః ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యౌ భరతర్షభ
మృతే భర్తరి దుఃఖార్తే ఈయతుః స్మ పితుర్గృహాన్

కంసునికి ఇద్దరు భార్యలు అస్తి ప్రాప్తి అని. వారు కంసుడు చనిపోయిన తరువాత తండ్రి ఐన జరాసంధుని వద్దకు వెళ్ళారు

పిత్రే మగధరాజాయ జరాసన్ధాయ దుఃఖితే
వేదయాం చక్రతుః సర్వమాత్మవైధవ్యకారణమ్

తన తండ్రి ఐన జరాసంధునికి తమకు వైధవ్యం ఎలా వచ్చిందో చెప్పారు. అది విన్న అతనికి కోపం పగా కలిగాయి,

స తదప్రియమాకర్ణ్య శోకామర్షయుతో నృప
అయాదవీం మహీం కర్తుం చక్రే పరమముద్యమమ్

అసలు భూమండలములో యదుకులం లేకుండా చేస్తాను అని

అక్షౌహిణీభిర్వింశత్యా తిసృభిశ్చాపి సంవృతః
యదురాజధానీం మథురాం న్యరుధత్సర్వతో దిశమ్

23 అక్షుహిణీల సైన్యం తీసుకుని మధుర పురి నాలుగు దిక్కులా వచ్చాడు

నిరీక్ష్య తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరమ్
స్వపురం తేన సంరుద్ధం స్వజనం చ భయాకులమ్

జరాసంధుని వలన అందరూ భయపడుతున్నారని గ్రహించిన కారణ మానుషుడైన భగవానుడు

చిన్తయామాస భగవాన్హరిః కారణమానుషః
తద్దేశకాలానుగుణం స్వావతారప్రయోజనమ్

ఆ ప్రదేశములో కాలములో ఏమి చేయాలో తెలిసిన కృష్ణుడు ఈ భూమికి  భారముగా ఉన్న సైన్యాన్ని వధిస్తాను

హనిష్యామి బలం హ్యేతద్భువి భారం సమాహితమ్
మాగధేన సమానీతం వశ్యానాం సర్వభూభుజామ్

అతను చక్రవర్తి కాబట్టి సామంతరాజుల నుంచి తెచ్చిన సైన్యం మొత్తం వధిస్తాను.

అక్షౌహిణీభిః సఙ్ఖ్యాతం భటాశ్వరథకుఞ్జరైః
మాగధస్తు న హన్తవ్యో భూయః కర్తా బలోద్యమమ్

రథములూ అశ్వములూ గజములూ పదాతి (చతురంగ బలమును) బలాలను చంపుతాను. వాన్ని మాత్రం చంపను. మళ్ళీ సైన్యాన్ని పూంచి వస్తాడు

ఏతదర్థోऽవతారోऽయం భూభారహరణాయ మే
సంరక్షణాయ సాధూనాం కృతోऽన్యేషాం వధాయ చ

నా అవతారం ఇందుకే కదా. భూభారాన్ని తగ్గించి సాధు జనులను రక్షించుట, సాధేతరులను శిక్షించుట.
అధర్మాన్ని నశింపచేయడానికీ ధర్మాన్ని రక్షించడానికీ నేనీ శరీరాన్ని భరిస్తూ ఉన్నాను

అన్యోऽపి ధర్మరక్షాయై దేహః సంభ్రియతే మయా
విరామాయాప్యధర్మస్య కాలే ప్రభవతః క్వచిత్



ఏవం ధ్యాయతి గోవిన్ద ఆకాశాత్సూర్యవర్చసౌ
రథావుపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ

ఇలా పరమాత్మ ఆలోచిస్తూ ఉండగా ఆకాశమునుండి రెండు రథములు ఆయుధములతో సారధులతో వచ్చాయి. అవి పురాణకాలం నుండీ ఉన్నవే

ఆయుధాని చ దివ్యాని పురాణాని యదృచ్ఛయా
దృష్ట్వా తాని హృషీకేశః సఙ్కర్షణమథాబ్రవీత్

బలరామునితో వెంటనే కృష్ణుడు "చూశారా యాదవులకు ఎంత కష్టం వచ్చిందో"

పశ్యార్య వ్యసనం ప్రాప్తం యదూనాం త్వావతాం ప్రభో
ఏష తే రథ ఆయాతో దయితాన్యాయుధాని చ

ఆ కష్టాన్ని తొలగించడానికి మీకు రథమూ ఆయుధాలూ వచ్చాయి. అది అదిరోహించి శత్రువులను సంహరించి మనవారి కష్టాలను తొలగించండి

ఏతదర్థం హి నౌ జన్మ సాధూనామీశ శర్మకృత్
త్రయోవింశత్యనీకాఖ్యం భూమేర్భారమపాకురు

సాధువులకు హితం కలిగించడమే మన కర్తవ్యం. 23 అక్షౌహిణీల సైన్యాన్నీ వధించి  భూభారం తగ్గించాలి

ఏవం సమ్మన్త్ర్య దాశార్హౌ దంశితౌ రథినౌ పురాత్
నిర్జగ్మతుః స్వాయుధాఢ్యౌ బలేనాల్పీయసా వృతౌ

వీరిద్దరూ రథములదిరోహించి పురమునుండి బయటకు వెళ్ళారు. చాలా కొద్ది సైన్యం తీసుకు వెళ్ళారు

శఙ్ఖం దధ్మౌ వినిర్గత్య హరిర్దారుకసారథిః
తతోऽభూత్పరసైన్యానాం హృది విత్రాసవేపథుః

దారుకుడు అనే సారధితో కలసి స్వామి పాంచ జన్యాన్ని ఊదాడు కృష్ణుడు. శత్రు సైన్యానికి వణుకు పుట్టింది. జరాసంధుడు అపుడు కృష్ణున్ని చూచి

తావాహ మాగధో వీక్ష్య హే కృష్ణ పురుషాధమ
న త్వయా యోద్ధుమిచ్ఛామి బాలేనైకేన లజ్జయా
గుప్తేన హి త్వయా మన్ద న యోత్స్యే యాహి బన్ధుహన్

పురుషాధమా నీవు చాలా చిన్న పిల్లవాడవు. నీతో యుద్ధం చేయాలంటే నాకే సిగ్గుగా ఉంది. బంధువులను చంపిన నీతో నేను యుద్ధం చేయను

తవ రామ యది శ్రద్ధా యుధ్యస్వ ధైర్యముద్వహ
హిత్వా వా మచ్ఛరైశ్ఛిన్నం దేహం స్వర్యాహి మాం జహి

బలరామా నీకు యుద్ధం చేయాలని ఇష్టం ఉన్నచో యుద్ధం చేసి నా ఆయుధములతో చంపబడి స్వర్గానికి వెళ్ళు, లేదంటే నన్నే చంపు.

శ్రీభగవానువాచ
న వై శూరా వికత్థన్తే దర్శయన్త్యేవ పౌరుషమ్
న గృహ్ణీమో వచో రాజన్నాతురస్య ముమూర్షతః

నిజముగా బలవంతుడు గర్వించరూ, మాటలతో సమయాన్ని వృధా చేయరు.. వారు పౌరుషాన్ని చూపుతారు. చావు కోరి బాధపడుతున్న వారి మాటలను నేను లెక్కించనులే.

శ్రీశుక ఉవాచ
జరాసుతస్తావభిసృత్య మాధవౌ మహాబలౌఘేన బలీయసావృనోత్
ససైన్యయానధ్వజవాజిసారథీ సూర్యానలౌ వాయురివాభ్రరేణుభిః

ఇలా జరాసంధుడు గొప్ప సైన్యాన్ని తీసుకుని వారిని చుట్టుముట్టాడు. సూర్యున్నీ అగ్నిహోత్రున్నీ ఎలా ఐతే దుమ్ముతో వాయువు చుట్టుముడుతుందో అలా.

సుపర్ణతాలధ్వజచిహిత్నౌ రథావ్
అలక్షయన్త్యో హరిరామయోర్మృధే
స్త్రియః పురాట్టాలకహర్మ్యగోపురం
సమాశ్రితాః సమ్ముముహుః శుచార్దితః

బలరామ కృష్ణుల రథాలను పూర్తిగా కప్పేసారు. అందరూ తమ తమ భవనాల నుండి చూస్తూ ఉన్నారు గానీ కృష్ణ బలరాములు కనపడకపోయేసరికి వారు భయపడ్డారు

హరిః పరానీకపయోముచాం ముహుః శిలీముఖాత్యుల్బణవర్షపీడితమ్
స్వసైన్యమాలోక్య సురాసురార్చితం వ్యస్ఫూర్జయచ్ఛార్ఙ్గశరాసనోత్తమమ్

పరమాత్మ బాణ వర్షముతో శత్రు సైన్యాన్ని పీడించి శాంఖం అనే ధనువుతో నారి సంధించి బాణ వర్షాన్ని కురిపించాడు. రథాలనూ ఏనుగులనూ గుర్రములనూ ఇతర బలములనూ అన్నీ వధిస్తున్నాడు

గృహ్ణన్నిశఙ్గాదథ సన్దధచ్ఛరాన్
వికృష్య ముఞ్చన్శితబాణపూగాన్
నిఘ్నన్రథాన్కుఞ్జరవాజిపత్తీన్
నిరన్తరం యద్వదలాతచక్రమ్

నిర్భిన్నకుమ్భాః కరిణో నిపేతురనేకశోऽశ్వాః శరవృక్ణకన్ధరాః
రథా హతాశ్వధ్వజసూతనాయకాః పదాయతశ్ఛిన్నభుజోరుకన్ధరాః

కుంభస్థలాలు పగిలిన ఏనుగులు కంఠాలు తెగిన గుర్రాలు కూలిపోయిన రథములూ, ఇలా నాలుగు రకములుగా ఉన్న సైన్యం కొట్టబడుతున్నది

సఞ్ఛిద్యమానద్విపదేభవాజినామఙ్గప్రసూతాః శతశోऽసృగాపగాః
భుజాహయః పూరుషశీర్షకచ్ఛపా హతద్విపద్వీపహయ గ్రహాకులాః

ఇలా ఇద్దరూ కలసి జరాసంధుని సైన్యాన్ని హరిస్తుండగా బుద్ధి మంతులకు సంతోషం కలిగింది.

కరోరుమీనా నరకేశశైవలా ధనుస్తరఙ్గాయుధగుల్మసఙ్కులాః
అచ్ఛూరికావర్తభయానకా మహా మణిప్రవేకాభరణాశ్మశర్కరాః



ప్రవర్తితా భీరుభయావహా మృధే మనస్వినాం హర్షకరీః పరస్పరమ్
వినిఘ్నతారీన్ముషలేన దుర్మదాన్సఙ్కర్షణేనాపరీమేయతేజసా

బలం తదఙ్గార్ణవదుర్గభైరవం దురన్తపారం మగధేన్ద్రపాలితమ్
క్షయం ప్రణీతం వసుదేవపుత్రయోర్విక్రీడితం తజ్జగదీశయోః పరమ్

క్షణ కాలములో వారి సైన్యాన్ని వసుదేవ పుత్రుడు క్షయింపచేసాడు. సంకల్పముతోనే అనంత కోటి బ్రహ్మాండాలని లయం చేసే పరమాత్మకు ఇది గొప్ప విషయం కాదు

స్థిత్యుద్భవాన్తం భువనత్రయస్య యః
సమీహితేऽనన్తగుణః స్వలీలయా
న తస్య చిత్రం పరపక్షనిగ్రహస్
తథాపి మర్త్యానువిధస్య వర్ణ్యతే

ఒక మానవుడిగా చేసే పనిని చూస్తే ఆశ్చర్యం గొలుపుతుంది.

జగ్రాహ విరథం రామో జరాసన్ధం మహాబలమ్
హతానీకావశిష్టాసుం సింహః సింహమివౌజసా

ఇలా జరాసంధుడు ఏ రథములో వచ్చాడో ఆ రథం కూలగొట్టాడు అశ్వాలనూ గజాలనూ చంపాడు. జరాసంధున్ని బలరాముడు గట్టిగా పట్టుకున్నాడు.

బధ్యమానం హతారాతిం పాశైర్వారుణమానుషైః
వారయామాస గోవిన్దస్తేన కార్యచికీర్షయా

వారుణ పాశములతో చంపుదామని బలరాముడు భావిస్తే గోవిందుడు ఆపాడు. వాడితో చేయవలసిన పని చాలా ఉన్నందున ఆపాడు

సా ముక్తో లోకనాథాభ్యాం వ్రీడితో వీరసమ్మతః
తపసే కృతసఙ్కల్పో వారితః పథి రాజభిః

బలరాముడు జరాసంధున్ని విడిచిపెట్టాడు.

వాక్యైః పవిత్రార్థపదైర్నయనైః ప్రాకృతైరపి
స్వకర్మబన్ధప్రాప్తోऽయం యదుభిస్తే పరాభవః

సిగ్గుపడి, జరాసంధుడు, బలరామ కృష్ణులను వధించడానికి ఘోరమైన తపస్సు చేస్తాను అనుకొని వెళ్ళాడు. సామంతరాజులు అడ్డుపడి, నీకు కావలసిన బలాన్ని మళ్ళీ మేము ఇస్తాము బలరామ కృష్ణుల మీదకు యుద్ధానికి వెళ్ళమని ప్రోత్సహించారు. ఈ మాటలతో జరాసంధుని మనసు మారి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు

హతేషు సర్వానీకేషు నృపో బార్హద్రథస్తదా
ఉపేక్షితో భగవతా మగధాన్దుర్మనా యయౌ

మనకర్మ వలన మనం ఓడాము. వారి అదృష్టం ఉండి వారు గెలిచారు అని సామంతరాజులు నచ్చజెప్పారు జరాసంధునికి. దుఃఖముతో తన దేశానికి జరాసంధుడు వెళ్ళాడు

ముకున్దోऽప్యక్షతబలో నిస్తీర్ణారిబలార్ణవః
వికీర్యమాణః కుసుమైస్త్రీదశైరనుమోదితః

కృష్ణుడు మాత్రం విహారయాత్రకు వెళ్ళి వచ్చినట్లుగా ఏ మాత్రం సైన్యం తరగకుండా ఎలా వెళ్ళాడో అలా వచ్చాడు

మాథురైరుపసఙ్గమ్య విజ్వరైర్ముదితాత్మభిః
ఉపగీయమానవిజయః సూతమాగధవన్దిభిః

సూతులు మాగధులూ వందులూ అందరూ స్వామిని మహావీరుడని స్తోత్రం చేసారు, దుందుభులు మోగాయి, దారులలో సుగంధ ద్రవ్యాలు కట్టీ జండాలు కట్టీ స్వస్తి పుణ్యాహవచనాలు చేసి, స్త్రీలు పుష్పమాలలనూ అక్షతలనూ పెరుగునూ చల్లీ, మంగళ వాద్యాలు మోగుతుండగా కృష్ణునికి స్వాగతం చెప్పారు.ఇలా సైన్యాన్ని ఓడించి వారి ధనం తీసుకు వచ్చి రాజుకు సమర్పించాడు

శఙ్ఖదున్దుభయో నేదుర్భేరీతూర్యాణ్యనేకశః
వీణావేణుమృదఙ్గాని పురం ప్రవిశతి ప్రభౌ

సిక్తమార్గాం హృష్టజనాం పతాకాభిరభ్యలఙ్కృతామ్
నిర్ఘుష్టాం బ్రహ్మఘోషేణ కౌతుకాబద్ధతోరణామ్

నిచీయమానో నారీభిర్మాల్యదధ్యక్షతాఙ్కురైః
నిరీక్ష్యమాణః సస్నేహం ప్రీత్యుత్కలితలోచనైః

ఆయోధనగతం విత్తమనన్తం వీరభూషణమ్
యదురాజాయ తత్సర్వమాహృతం ప్రాదిశత్ప్రభుః

ఏవం సప్తదశకృత్వస్తావత్యక్షౌహిణీబలః
యుయుధే మాగధో రాజా యదుభిః కృష్ణపాలితైః

ఈ రీతిలో జరాసంధుడు అంతే అక్షౌహిణీలు గల సైన్యాన్ని తీసుకుని కృష్ణుని మీదకు యుద్ధానికి వచ్చాడు.

అక్షిణ్వంస్తద్బలం సర్వం వృష్ణయః కృష్ణతేజసా
హతేషు స్వేష్వనీకేషు త్యక్తోऽగాదరిభిర్నృపః

అష్టాదశమ సఙ్గ్రామ ఆగామిని తదన్తరా
నారదప్రేషితో వీరో యవనః ప్రత్యదృశ్యత

ఇలా పదిహేడు సార్లు యుద్ధమైంది. పదిహేడుసార్లు యుద్ధములోనూ జరాసంధుని సైన్యం వధించబడింది

రురోధ మథురామేత్య తిసృభిర్మ్లేచ్ఛకోటిభిః
నృలోకే చాప్రతిద్వన్ద్వో వృష్ణీన్శ్రుత్వాత్మసమ్మితాన్

పద్దెనిమిదవ సారి యుద్ధం జరిగే ముందు నారదుడు కాలయవనుడి వద్దకు వెళ్ళాడు: జరాసంధుడు పదిహేడుసార్లు కృష్ణుని చేతిలో ఓడిపోయాడు. నీవు జరాసంధుడికి మిత్రుడవై ఉండి కూడా నీ సైన్యాన్ని పంపలేదంటే నీకు కృష్ణుడంటే భయం అని అందరూ అంటున్నారు, నిజమేనా? అని అడుగగా, కృష్ణుని గురించి నారద మహర్షి చెప్పగా సైన్యం తీసుకుని కాలయవనుడు జరాసంధుడు యుద్ధానికి రాక ముందే మొత్తం మధురా నగరాన్ని ఆక్రమించాడు. మూడు కోట్ల ంలేచ్చ సైన్యముతో ఆక్రమించాడు మధురా నగరాన్ని.
మధురా నగర వాసుల యొక్క వీరత్వాన్ని విని ఉన్నాడు అంతకు మునుపే

తం దృష్ట్వాచిన్తయత్కృష్ణః సఙ్కర్షణ సహాయవాన్
అహో యదూనాం వృజినం ప్రాప్తం హ్యుభయతో మహత్

అది చూసిన సంకర్షణుడు "ఎంత కష్టం వచ్చింది యాదవులకు. రెండు పక్కల నుండీ ఆపద వచ్చింది"

యవనోऽయం నిరున్ధేऽస్మానద్య తావన్మహాబలః
మాగధోऽప్యద్య వా శ్వో వా పరశ్వో వాగమిష్యతి

మేమిద్దరం కాలయవనుడితో పోరాడుతుండగా వాడు వస్తే నగరాన్ని వాడు ఆక్రమించి మా బంధువులను తీసుకు వెళతాడు. శత్రువులకు అందనటువంటి కొత్త దుర్గాన్ని ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేసిన తరువాత కాలయవనుడిని చంపవచ్చనుకొని, సముద్రున్ని పన్నెండు యోజనాల స్థలం అడిగి, విశ్వకర్మ చేత నగరాన్ని నిర్మించి, ఈ నగరములో ఉన్నవారిని అందరినీ ఆ నగరానికి తరలించాడు, వారికి తెలియకుండానే.

ఆవయోః యుధ్యతోరస్య యద్యాగన్తా జరాసుతః
బన్ధూన్హనిష్యత్యథ వా నేష్యతే స్వపురం బలీ

తస్మాదద్య విధాస్యామో దుర్గం ద్విపదదుర్గమమ్
తత్ర జ్ఞాతీన్సమాధాయ యవనం ఘాతయామహే

ఇతి సమ్మన్త్ర్య భగవాన్దుర్గం ద్వాదశయోజనమ్
అన్తఃసముద్రే నగరం కృత్స్నాద్భుతమచీకరత్

దృశ్యతే యత్ర హి త్వాష్ట్రం విజ్ఞానం శిల్పనైపుణమ్
రథ్యాచత్వరవీథీభిర్యథావాస్తు వినిర్మితమ్

సురద్రుమలతోద్యాన విచిత్రోపవనాన్వితమ్
హేమశృఙ్గైర్దివిస్పృగ్భిః స్ఫటికాట్టాలగోపురైః

రాజతారకుటైః కోష్ఠైర్హేమకుమ్భైరలఙ్కృతైః
రత్నకూతైర్గృహైర్హేమైర్మహామారకతస్థలైః

వాస్తోష్పతీనాం చ గృహైర్వల్లభీభిశ్చ నిర్మితమ్
చాతుర్వర్ణ్యజనాకీర్ణం యదుదేవగృహోల్లసత్

ఈ నగరానికి శోభగా ఇంద్ర లోకములో ఉండే (ఇంద్ర సభకు సుధర్మ అని పేరు) సుధర్మను తీసుకు వచ్చాడు. ఇంద్రుడు పారిజాతాన్ని పంపాడు,

సుధర్మాం పారిజాతం చ మహేన్ద్రః ప్రాహిణోద్ధరేః
యత్ర చావస్థితో మర్త్యో మర్త్యధర్మైర్న యుజ్యతే

ఆ సభలో ఉన్నంత సేపు మానవుడు మానవ ధర్మాలు (ఉచ్చ్వాస నిశ్వాసలనూ, కాలు నేలకు అంటడం) మొదలైనవి ఉండవు

శ్యామైకవర్ణాన్వరుణో హయాన్శుక్లాన్మనోజవాన్
అష్టౌ నిధిపతిః కోశాన్లోకపాలో నిజోదయాన్

వరుణుడు చక్కని చెవులున్న నల్లటి గుర్రాలను తెల్లటి గుర్రాలనీ పంపించాడు
కుబేరుడు అష్ట సిద్ధులనూ నవ నిధులనూ పంపాడు

యద్యద్భగవతా దత్తమాధిపత్యం స్వసిద్ధయే
సర్వం ప్రత్యర్పయామాసుర్హరౌ భూమిగతే నృప

వాళ్ళు వాళ్ళు వారి వారి అధికారానికి రావడానికి స్వామి వారికి ఇచ్చినదే వారు తిరిగి స్వామికి ఇచ్చారు

తత్ర యోగప్రభావేన నీత్వా సర్వజనం హరిః
ప్రజాపాలేన రామేణ కృష్ణః సమనుమన్త్రితః
నిర్జగామ పురద్వారాత్పద్మమాలీ నిరాయుధః

తన యోగ ప్రభావముతో అందరినీ తీసుకు వెళ్ళి ప్రజా పాలన చేస్తూ నగరానికి రక్షగా బలరామున్ని ఉండమని చెప్పి తానొక్కడూ నిరాయుధుడై యుద్ధానికి పద్మ మాల వేసి యవనుడి మీదకు వెళ్ళాడు

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts