Followers

Sunday 6 April 2014

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఐదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
రాజన్నుదితమేతత్తే హరేః కర్మాఘనాశనమ్
గజేన్ద్రమోక్షణం పుణ్యం రైవతం త్వన్తరం శృణు

సకల పావనమైన గజేంద్ర మోక్షాన్ని చెప్పాను

పఞ్చమో రైవతో నామ మనుస్తామససోదరః
బలివిన్ధ్యాదయస్తస్య సుతా హార్జునపూర్వకాః

రైవత మన్వంతరములో గాధలను వినవలసింది. (స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత - ఐదు). రైవతుడు తామసుని సోదరుడు. అతని పుత్రులు బలి మొదలైన వారు

విభురిన్ద్రః సురగణా రాజన్భూతరయాదయః
హిరణ్యరోమా వేదశిరా ఊర్ధ్వబాహ్వాదయో ద్విజాః

విభువు అనే వాడు ఇంద్రుడు, హిరణ్యరోమాదులు సప్తఋషులు

పత్నీ వికుణ్ఠా శుభ్రస్య వైకుణ్ఠైః సురసత్తమైః
తయోః స్వకలయా జజ్ఞే వైకుణ్ఠో భగవాన్స్వయమ్

శుక్రుడు, ఆయన భార్య వైకుంఠ, పరమాత్మ వైకుంఠనాథునిగా వారికి అవతరించాడు.

వైకుణ్ఠః కల్పితో యేన లోకో లోకనమస్కృతః
రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియకామ్యయా

లక్ష్మీ దేవి ప్రార్థన ప్రకారం, మిగతా వారి ప్రార్థన ప్రకారం, బ్రహ్మానడకోశములోపల ఇంకో వైకుంఠాన్ని ఏర్పాటు చేసాడు. (మనకు ఐదు రకాల వైకుంఠాలు ఉన్నాయి. రావణాదులు వెళ్ళిన వైకుంఠము పరమపదము కాదు)

తస్యానుభావః కథితో గుణాశ్చ పరమోదయాః
భౌమాన్రేణూన్స విమమే యో విష్ణోర్వర్ణయేద్గుణాన్

ఇలాంటి పరమాత్మ యొక్క ప్రభావం ఇంతే అనుకోకు. పరమాత్మ ప్రభావాన్ని చెప్పాలంటే భూమిలో ఉన్న పరాగములు లెక్కపెట్టిన వారు చెప్పగలరు. (విమమే అనే పదం వాడడం వలన- విష్ణోర్ ను కం వీర్యాణి ప్ర వోచం యః పార్థివాని విమమే రజాంసి - ఇది వేద మంత్రం అని మనకు చెబుతున్నట్లు ఉంది).

షష్ఠశ్చ చక్షుషః పుత్రశ్చాక్షుషో నామ వై మనుః
పూరుపూరుషసుద్యుమ్న ప్రముఖాశ్చాక్షుషాత్మజాః

చాక్షుష మన్వంతరములో వీరందరూ సప్తఋషులూ, వారి కొడుకులు.

ఇన్ద్రో మన్త్రద్రుమస్తత్ర దేవా ఆప్యాదయో గణాః
మునయస్తత్ర వై రాజన్హవిష్మద్వీరకాదయః

నారాయణుడు అజితుడనే పేరుతో అవతరించాడు.

తత్రాపి దేవసమ్భూత్యాం వైరాజస్యాభవత్సుతః
అజితో నామ భగవానంశేన జగతః పతిః

క్షీర సాగరాన్ని మధించి అమృతాన్ని దేవతలు ఇచ్చాడు.

పయోధిం యేన నిర్మథ్య సురాణాం సాధితా సుధా
భ్రమమాణోऽమ్భసి ధృతః కూర్మరూపేణ మన్దరః

సముద్రాన్ని చిలికి దేవతలకు అమృతాన్ని అందించాడు. కూర్మ రూపములో మునుగుతున్న పర్వతాన్ని ధరించాడు.

శ్రీరాజోవాచ
యథా భగవతా బ్రహ్మన్మథితః క్షీరసాగరః
యదర్థం వా యతశ్చాద్రిం దధారామ్బుచరాత్మనా

పరమాత్మ పాల సముద్రమును ఎలా చిలికాడు. అలా చేస్తున్నప్పుడు మందర పర్వతమును కూర్మ రూపములో ఎందుకు ధరించాడు.

యథామృతం సురైః ప్రాప్తం కిం చాన్యదభవత్తతః
ఏతద్భగవతః కర్మ వదస్వ పరమాద్భుతమ్

ఇంకా ఎటువంటి అద్భుతాలు జరిగాయి. అవి మాకు వివరించవలసింది

త్వయా సఙ్కథ్యమానేన మహిమ్నా సాత్వతాం పతేః
నాతితృప్యతి మే చిత్తం సుచిరం తాపతాపితమ్

నీవు వర్ణిస్తున్న పరమాత్మ యొక్క మహిమతో నాకు తృప్తి కలగడం లేదు. బాగా కాగి ఉన్న భూమి ఒకటి రెండు వానలతో చల్లారదు కదా.

శ్రీసూత ఉవాచ
సమ్పృష్టో భగవానేవం ద్వైపాయనసుతో ద్విజాః
అభినన్ద్య హరేర్వీర్యమభ్యాచష్టుం ప్రచక్రమే

ఈ రీతిలో అడిగితే వ్యాసుని పుత్రుడైన శుకుడు అభినందించి పరమాత్మ పరాక్రమాన్ని చెప్పడానికి ఉపక్రమించాడు

శ్రీశుక ఉవాచ
యదా యుద్ధేऽసురైర్దేవా బధ్యమానాః శితాయుధైః
గతాసవో నిపతితా నోత్తిష్ఠేరన్స్మ భూరిశః

దేవ దానవ యుద్ధములో తీక్షణమైన ఆయుధములు గల దానవుల చేత దేవతలు పీడించబడుతున్నారు. వారి ప్రాణాలు పోతున్నాయి.

యదా దుర్వాసః శాపేన సేన్ద్రా లోకాస్త్రయో నృప
నిఃశ్రీకాశ్చాభవంస్తత్ర నేశురిజ్యాదయః క్రియాః

రాక్షసులు తమో గుణ సంపన్నులు. దేవతలు సత్వ గుణ సంపన్నులు. ఐనా దేవతలు ఓడిపోవడానికి కారణం దుర్వాసుని శాపం. ఆ శాపం వలన అన్ని లోకాలలో లక్ష్మి అంతర్థానం చెందింది. యజ్ఞ్య యాగాది క్రియలు కూడా లోపించాయి. వాక్కూ శుద్ధీ విద్యా జ్ఞ్యానం తేజస్సూ అన్నీ ఇచ్చేది అమ్మవారు.

నిశామ్యైతత్సురగణా మహేన్ద్రవరుణాదయః
నాధ్యగచ్ఛన్స్వయం మన్త్రైర్మన్త్రయన్తో వినిశ్చితమ్

ఇలా జరగడముతో దీనికి పరిష్కారం ఆలోచించారు గానీ కర్తవ్యాన్ని నిశ్చయించుకోలేకపోయారు

తతో బ్రహ్మసభాం జగ్ముర్మేరోర్మూర్ధని సర్వశః
సర్వం విజ్ఞాపయాం చక్రుః ప్రణతాః పరమేష్ఠినే

మేరు పర్వత శిఖరం మీద ఉన్న  బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు

స విలోక్యేన్ద్రవాయ్వాదీన్నిఃసత్త్వాన్విగతప్రభాన్
లోకానమఙ్గలప్రాయానసురానయథా విభుః

ఇంద్రాది వాయ్వాది దేవతలు బల హీనులూ శక్తి హీనులూ అయ్యారు. అమ్మవారు లేకపోవడముతో రాక్షసులు తప్ప మిగతా వారందరూ అమంగళురుగా అయ్యారు.

సమాహితేన మనసా సంస్మరన్పురుషం పరమ్
ఉవాచోత్ఫుల్లవదనో దేవాన్స భగవాన్పరః

బ్రహ్మగారు పరమ పురుషున్ని స్మరించాడు. పరమాత్మను ఈ మిషతో దర్శించుకోవచ్చు కాబట్టి బ్రహ్మగారి ముఖం వికసించింది. దేవతలతో ఇలా చెబుతున్నాడు

అహం భవో యూయమథోऽసురాదయో మనుష్యతిర్యగ్ద్రుమఘర్మజాతయః
యస్యావతారాంశకలావిసర్జితా వ్రజామ సర్వే శరణం తమవ్యయమ్

ఒక విషయాన్ని తెలుసుకోండి, నేను రుద్రుడూ మీరు రాక్షసులూ మానవులూ పక్షులూ చెట్లూ ఇతర ప్రాణులూ ఏ పరమాత్మ అవతారములో అంశలో అంశలమో ఆయననే శరణు వేడదాము. ఆయనకు చంపదగినవాడూ లేదు, రక్షించదగినవాడూ లేడూ

న యస్య వధ్యో న చ రక్షణీయో నోపేక్షణీయాదరణీయపక్షః
తథాపి సర్గస్థితిసంయమార్థం ధత్తే రజఃసత్త్వతమాంసి కాలే

ఉపేక్షించేవాడూ ఆశ్రయించేవాడూలేడు. కానీ ఆశ్రయించినవారి పక్షములో ఆయన ఉంటాడు. ఐనా సృష్టి స్థితి సంహారాల కోసం త్రిగుణాలని అవలంబిస్తాడు.

అయం చ తస్య స్థితిపాలనక్షణః సత్త్వం జుషాణస్య భవాయ దేహినామ్
తస్మాద్వ్రజామః శరణం జగద్గురుం స్వానాం స నో ధాస్యతి శం సురప్రియః

మనమిపుడు స్వామిని ప్రార్థిస్తున్నాము. ప్రపంచాన్ని రక్షించడానికి కావలసిన సత్వ గుణాన్ని ఆయన స్వీకరించాడు, ప్రాణుల రక్షణ స్వీకరించాడు. రక్షణ ఆయన పని. అందుచే సత్వ గుణం తీసుకున్న శ్రీ మహా విష్ణువును ప్రార్థిద్ధాము. ఆ పరమాత్మ శ్రీమన్నారాయణున్ని వేడుదాము. ఆయనే మనకు శుభం కలిగిస్తాడు. ఆయంకు దేవతలంటే ప్రీతి కలదు అన్న బిరుదు ఉంది.

శ్రీశుక ఉవాచ
ఇత్యాభాష్య సురాన్వేధాః సహ దేవైరరిన్దమ
అజితస్య పదం సాక్షాజ్జగామ తమసః పరమ్

ఈ రీతిలో మాట్లాడి బ్రహ్మ దేవతలందరితో కలసి అజితుడు అనే పేరుతో ఉన్న స్వామి అవతారం ఉన్న స్థానానికి (లోకానికి ) వెళ్ళాడు.

తత్రాదృష్టస్వరూపాయ శ్రుతపూర్వాయ వై ప్రభుః
స్తుతిమబ్రూత దైవీభిర్గీర్భిస్త్వవహితేన్ద్రియః

ఆయన లోకానికి వెళ్ళినా ఆయన కనపడడు. అంతకు ముందే విన్నట్లు వారికి ఆయన కనపడలేదు. అందుకని వేద వాక్యాలతో స్వామిని వారు సావధానముతో పరమాత్మ మీదే మనసూ ఇంద్రియాలు పెట్టి స్తోత్రం చేసారు.

ఇది ప్రసన్న  భగవత్స్తుతి 

శ్రీబ్రహ్మోవాచ
అవిక్రియం సత్యమనన్తమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యమ్
మనోऽగ్రయానం వచసానిరుక్తం నమామహే దేవవరం వరేణ్యమ్

ఎలాంటి వికారం పొందని వాడవు. త్రికాలములో బాధించబడని వాడు (సత్యం, త్రికాల అబాధితం), అంతం లేని వాడు, అన్నిటికీ మొదటివాడు, ప్రతివారి అంతఃకరణములో ఉండేవాడు ఎలాంటి విశేషణాలూ లేనివాడు, ఎవరి ఊహకూ అందని వాడు, మనసు కంటే వేగముగా వెళ్ళేవాడు, ఏ వాక్కుకూ అందని వాడు, అలాంటి సర్వ శ్రేష్టుడైన పరమాత్మకు నమస్కరిస్తున్నాను

విపశ్చితం ప్రాణమనోధియాత్మనామర్థేన్ద్రియాభాసమనిద్రమవ్రణమ్
ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం ఖం త్రియుగం వ్రజామహే

ప్రాణమూ మనసూ బుద్ధీ ఆత్మా, నాలిగింటినీ సాక్షాత్కరించుకునేవాడు, అర్థములకు ఇంద్రియములనూ సాక్షాత్కరింపచేసుకుంటాడు, సాక్షాత్కరింపచేస్తాడు, తమోగుణం లేనివాడు, ఇతరగుణముల ప్రభావం లేనివాడు, ప్రకృతి సంబంధమైన శరీరం లేనివాడు (శరీరమే ఆత్మకు గాయం, ఆ గాయం లేనివాడు పరమాత్మ, ప్రకృతి బద్ధమైన శరీరం లేనివాడు)
అజ్య్నానం జ్ఞ్యానములు (చాయా తపౌ), కోరిక కలిగేవారికే ఉంటాయి (గృధ్రపక్షౌ ). 
ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ - ఎండా నీడలు గ్రద్దకు రెక్కలు కావు. ఇక్కడ నీడ అజ్ఞ్యానం, తపౌ అంటే జ్ఞ్యానం. గృధ్రం అంటే కోరికలు.గాయమైతే గ్రద్దలు వస్తాయి. పొడుచుకుని తింటాయి. వ్రణం కనపడితే గ్రద్దలు ఎలా ఊరుకోవో, శరీరం కనపడితే మనసు ఊరుకోదు. దీని వెంటనే కోపం ఉంటుంది. 
నిరంతరం కోరికనే అంటిపెట్టుకుని ఉండే జీవునికి ఉండే అజ్ఞ్యానం జ్ఞ్యానం ఎవరికి కోరికకు పక్షముగా కాకుండా ఉంటాయో అటువంటి పరమాత్మవు నీవు. 
అలాంటి నాశరహితం, నిరాకార నిర్గుణ స్వరూపం అయిన, ధర్మార్థ కామ స్వరూపుడు, సత్వ రజస్తమో రూపుడు ఐన పరమాత్మకు నమస్కారం

అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పఞ్చదశారమాశు
త్రినాభి విద్యుచ్చలమష్టనేమి యదక్షమాహుస్తమృతం ప్రపద్యే

కాలమనే ఈ చక్రం పరమాత్మ యొక్క మాయతో నడవబడేదీ తిప్పబడేది. మనసనే చక్రం ఇది. పదిహేను ఆకులు ఉంటాయి. ఐదు జ్ఞ్యానేంద్రియములూ ఐదు కర్మేంద్రియములు పంచభూతములు. సత్వ రజసతమో గుణాలు త్రినాభులు. ఎనిమిది నేములు ఎనిమిది ప్రకృతులు. ఈ చక్రానికి మధ్యభాగం పరమాత్మ, అటువంటి నీకు నమస్కారం. 

య ఏకవర్ణం తమసః పరం తదలోకమవ్యక్తమనన్తపారమ్
ఆసాం చకారోపసుపర్ణమేనముపాసతే యోగరథేన ధీరాః

నీవు ఏకవర్ణం, ఒకే తీరుగా ఉంటావు. అజ్ఞ్యానానికి అవతల తీరములో ఉంటావు, ఎవరికీ కనపడవు ఎవరికీ తెలియబడవు, ఆది అంతములు లేనివాడవు.నిన్ను ధీరులు మాత్రమే యోగరథము మీద ఉపాసన చేస్తారు.

న యస్య కశ్చాతితితర్తి మాయాం యయా జనో ముహ్యతి వేద నార్థమ్
తం నిర్జితాత్మాత్మగుణం పరేశం నమామ భూతేషు సమం చరన్తమ్

నీ మాయను ఎవరూ దాటలేరు, దాటలేకపోవడమే కాదు దాటాలని కూడా అనుకోరు. నీ మాయతో లోకమంతా మోహం చెంది తెలియవలసిన దాన్ని తెలియజాలదు. నీవు మనసు యొక్క బుద్ధి యొక్క గుణాన్ని గెలిచినవాడివి. అన్ని భూతముల యందూ సమానముగా ఉంటావు. నీకు నమస్కారం. 

ఇమే వయం యత్ప్రియయైవ తన్వా సత్త్వేన సృష్టా బహిరన్తరావిః
గతిం న సూక్ష్మామృషయశ్చ విద్మహే కుతోऽసురాద్యా ఇతరప్రధానాః

మేమంతా నీ శరీరము చేత అంశగా సృష్టించబడ్డాము. కొందరు లోపలా కొందరు వెలుపలా. నీ యొక్క అతి సూక్ష్మ గతిని సత్వ గుణ ప్రధానముగా ఉన్న ఋషులు కూడా తెలుసుకోలేరు. ఇంక రాక్షసాదులు ఏమి తెలుసుకుంటారు. 

పాదౌ మహీయం స్వకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూతసర్గః
స వై మహాపూరుష ఆత్మతన్త్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః

భూమి నీ పాదములు, ఈ భూమిలో నాలుగు రకాల ప్రాణులు ఉంటాయి. జలము(మావి) నుంచి అండం నుంచి స్వేదం నుంచీ భూమి నుంచి పుడతాయి. ఈ భూత జాలమంతా ఏ భూమి మీద ఉంటుందో అది నీ పాదములు. నీవు ఇతరులకు అధీనుడవు కావు, ఆత్మ తంత్రుడవు. 

అమ్భస్తు యద్రేత ఉదారవీర్యం సిధ్యన్తి జీవన్త్యుత వర్ధమానాః
లోకా యతోऽథాఖిలలోకపాలాః ప్రసీదతాం నః స మహావిభూతిః

నీ యొక్క ఉదారమైన వీర్యము జలము. జలములో పెరిగే వారు పుట్టీ పెరిగి బలమును కూర్చుకుని సిద్ధిని పొందుతారు. మూడు లోకములూ మూడు లోకముల పాలకులు ఆ జలములోనే పుట్టి వృద్ధి పొంది సిద్ధి పొందుతున్నారు. అలాంటి స్వామి నాకు ప్రసన్నమవుగాక.

సోమం మనో యస్య సమామనన్తి దివౌకసాం యో బలమన్ధ ఆయుః
ఈశో నగానాం ప్రజనః ప్రజానాం ప్రసీదతాం నః స మహావిభూతిః

చంద్రుడు నీ మనసు. ఈ చంద్రుడే దేవతలకు ఆహారం (అమృతం), ప్రాణం. ఇతనే వృక్షములకు అధిపతి (మంచుతో), ప్రజలకు సృష్టిని పెంచేవాడు. పితృదేవతలకూ ప్రాణం ఇతనే (కిరణములవలన). అటువంటి మహావిభూతి కల పరమాత్మ మాకు ప్రసన్నమవుగాక. 

అగ్నిర్ముఖం యస్య తు జాతవేదా జాతః క్రియాకాణ్డనిమిత్తజన్మా
అన్తఃసముద్రేऽనుపచన్స్వధాతూన్ప్రసీదతాం నః స మహావిభూతిః

అగ్ని నీ ముఖము. అగ్నిహోత్రుడు వేదములను తెలిపేవాడు - జాతవేద. ఆ అగ్నే అన్ని క్రియలకూ ప్రతినిధి. జ్ఞ్యాన కాండ క్రియా కాండ ఉపాసనా కాండ (కాండ త్రయం) అనే మూడు కాండలలో అగ్నిహోత్రుడు క్రియా కాండకు ప్రతినిధి. జాతకర్మా నామకరణాది చౌలాది క్రియలకు అధిపతి.
ఈ అగ్నిహోత్రుడు మన శరీరములో (ఇక్కడ సముద్రం అంటే శరీరం. సాముద్రిక శాస్త్రములో ఉన్న ముద్రలతో ఉన్నది సముద్రం. శరీరానికి ముద్ర అని పేరు. సంతోషమునిచ్చేదానితో కూడుకుని ఉన్నది కాబట్టి శరీరం) ఉన్న సప్త ధాతువులను జఠరాగ్ని రూపములో ఉండి పచనం చేస్తాడు. కావలసిన శక్తిని ప్రసరింపచేస్తాడు అగ్నిహోత్రుడు. త్వక్ మాంఅస మధ్య రుధిరాది సప్త ధాతువులు సరిగా ఉండాలంటే జఠరాగని సరిగ్గా ఉండాలి. తరువాత చేయవలసిన పనికి సన్నద్ధత, కావలసినవి ఉంచుకుని అవసరం లేనివి బయటకు పంపుతావు.

యచ్చక్షురాసీత్తరణిర్దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏష ధిష్ణ్యమ్
ద్వారం చ ముక్తేరమృతం చ మృత్యుః ప్రసీదతాం నః స మహావిభూతిః

ఈ స్తోత్రములో ఉన్న క్రమం ఇది. భూమి, జలం, జలాధి దేవత చంద్రుడు, తరువాత అగ్ని, అగ్ని దేవత సూర్యుడు. 
నీవే చక్సువువి. నీ నేత్రం నుండి సూర్యుడు పుట్టాడు. నీ నేత్రము సూర్యుడు. ఈయనే దేవయానం (అర్చి మార్గము). ఈ సూర్యుడు వేదమయుడు. బ్రహ్మకు మూలస్థానం (ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి). ముక్తికి ఈయనే ద్వారం. అమృతం కూడా ఈయనే. మృత్యువు కూడా ఈయనే. 

ప్రాణాదభూద్యస్య చరాచరాణాం ప్రాణః సహో బలమోజశ్చ వాయుః
అన్వాస్మ సమ్రాజమివానుగా వయం ప్రసీదతాం నః స మహావిభూతిః

ఇపుడు వాయువు. నీ ప్రాణం నుండే సకల చరాచర ప్రాణం ఏర్పడ్డాయి. ఈ వాయువే సహః (వేగ సామర్ధ్య). బలం ఓజః (నిగ్రహించే సామర్ధ్యం). ఒక సమ్రాట్టును అనుచరులు అనుసరించినట్లుగా నిన్ను మేము అనుసరిస్తున్నాము

శ్రోత్రాద్దిశో యస్య హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరే ఖం పురుషస్య నాభ్యాః
ప్రాణేన్ద్రియాత్మాసుశరీరకేతః ప్రసీదతాం నః స మహావిభూతిః

వాయువు ఉండేది ఆకాశములో. పరమాత్మ యొక్క శ్రవణ ఇంద్రియమునుండి దిక్కులు ఏర్పడ్డాయి. హృదయం నుండి ఇంద్రియములు ఏర్పడ్డాయి. నీ నాభినుండి ఆకాశం ఉద్భవించింది. ప్రాణ ఇంద్రియ ఆత్మ అసు శరీర అనే ఐదింటికీ నీవే మూలాధారం. అలాంటి మహావిభూతి ప్రసన్నమవుగాక.

బలాన్మహేన్ద్రస్త్రిదశాః ప్రసాదాన్మన్యోర్గిరీశో ధిషణాద్విరిఞ్చః
ఖేభ్యస్తు ఛన్దాంస్యృషయో మేఢ్రతః కః ప్రసీదతాం నః స మహావిభూతిః

ఆ పరమాత్మ బలమునుండి పుట్టినవాడు ఇంద్రుడు, అనుగ్రహం నుండి పుట్టిన్వారు దేవతలు, కోపం నుండి పుట్టినవారు రుద్రుడు, బుద్ధినుండి బ్రహ్మ ఇంద్రియముల నుండి వేదములు పుట్టాయి, ఉపస్థ నుండి ఋషులు పుట్టాయి. 

శ్రీర్వక్షసః పితరశ్ఛాయయాసన్ధర్మః స్తనాదితరః పృష్ఠతోऽభూత్
ద్యౌర్యస్య శీర్ష్ణోऽప్సరసో విహారాత్ప్రసీదతాం నః స మహావిభూతిః

వక్షస్థలమునుండి అమ్మవారు, నీ చాయతో పితృ దేవతలూ ధర్మము స్తనములనుండి, ధర్మము కానిది వీపునుండి పుట్టింది. శిరస్సు నుండి ద్యౌ ఆవిర్భవించింది, విహారం నుండి అప్సరసలు ఆవిర్భవించారు. 

విప్రో ముఖాద్బ్రహ్మ చ యస్య గుహ్యం రాజన్య ఆసీద్భుజయోర్బలం చ
ఊర్వోర్విడోజోऽఙ్ఘ్రిరవేదశూద్రౌ ప్రసీదతాం నః స మహావిభూతిః

బ్రాహ్మణులు ముఖము నుండి, రాజులు భుజముల నుండి, ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు పుట్టారు. అటువంటి స్వామి ప్రసన్నమవుగాక

లోభోऽధరాత్ప్రీతిరుపర్యభూద్ద్యుతిర్నస్తః పశవ్యః స్పర్శేన కామః
భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాం నః స మహావిభూతిః

కింది పెదవి నుండి లోభం పై పెదవి నుండి ప్రీతి నాసిక నుండి ద్యుతి నాసిక నుండి పశువులు స్పర్శతో కోరిక కనుబొమ్మలనుండి యముడు రెప్పలతో కాలం పుట్టింది 

ద్రవ్యం వయః కర్మ గుణాన్విశేషం యద్యోగమాయావిహితాన్వదన్తి
యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం ప్రసీదతాం నః స మహావిభూతిః

ద్రవ్యం నీ వయః, నీ యోగ మాయచేత గుణ కర్మలు పుడతాయి. ఏది ఊహకు అందనిదో జ్ఞ్యానులను కూడా మోహింపచేస్తుందో అలాంటి స్వామి కాపాడాలి

నమోऽస్తు తస్మా ఉపశాన్తశక్తయే స్వారాజ్యలాభప్రతిపూరితాత్మనే
గుణేషు మాయారచితేషు వృత్తిభిర్న సజ్జమానాయ నభస్వదూతయే

అన్ని ఇతర శక్తులను శమింపచేసేవాడివి, స్వారాజ్యముతో ఆత్మానందం కలవాడవు. నీ మాయచేత ఏర్పరచబడిన సత్వ రజస్తమో గుణాల యందు నీవు ఆసక్తుడవు కావు. ఆకాశానికి కూడా నీవే మూలం. 

స త్వం నో దర్శయాత్మానమస్మత్కరణగోచరమ్
ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితం తే ముఖామ్బుజమ్

నీకు నమస్కారం. మా అందరిపుట్టుకకు కారణమైన నీవు మా కళ్ళకు కనపడు. నిన్ను ఆశ్రయించి చిరునవ్వుతో కూడిన నీ ముఖపద్మాన్ని కోరుతున్నాము

తైస్తైః స్వేచ్ఛాభూతై రూపైః కాలే కాలే స్వయం విభో
కర్మ దుర్విషహం యన్నో భగవాంస్తత్కరోతి హి

ఆయా సమయములో ఆయా రూపాలు స్వీకరించి ఎవరికీ అర్థం కాని రీతిలో లీలను చేస్తావు. 

క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా
దేహినాం విషయార్తానాం న తథైవార్పితం త్వయి

మేము చేసే పనులకు కష్టం ఎక్కువ ఫలం తక్కువ. అలాంటి కర్మలు చేస్తూ ఉంటాము. విఫలమవుతూ ఉణ్టాయి మేము చేసే కర్మలు. కష్టం మాత్రమే మిగులుతుంది. విషయం చేత ఆర్తులైన దేహుల కర్మలు ఇలా ఉంటాయి. నీ యందు అర్పించని పనులు ఇలాగే ఉంటాయి. 

నావమః కర్మకల్పోऽపి విఫలాయేశ్వరార్పితః
కల్పతే పురుషస్యైవ స హ్యాత్మా దయితో హితః

అదే కర్మలు నీకు అర్పిస్తే పని కాకున్నా, పని లాంటిదైనా అది తక్కువదికాదు, చిన్నది కాదు, ఫల రాహిత్యం ఉండదు. ఏ పని ఐనా నీకు అర్పిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రతీ ప్రాణికీ నీవే ఆత్మా ప్రియుడివీ హితం కలిగించేవాడివి

యథా హి స్కన్ధశాఖానాం తరోర్మూలావసేచనమ్
ఏవమారాధనం విష్ణోః సర్వేషామాత్మనశ్చ హి

చెట్టు మొత్తానికి నీరు పోయాలంటే వేరుకు మాత్రమే నీరుపోసినట్లు, నిన్ను ఒక్కడినే ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్లే. అందరూ తృప్తి పొందుతారు. 

నమస్తుభ్యమనన్తాయ దుర్వితర్క్యాత్మకర్మణే
నిర్గుణాయ గుణేశాయ సత్త్వస్థాయ చ సామ్ప్రతమ్

నీవు అనంతుడవు నీవు నమస్కారం. ఏ సమయములో నీవు ఏ పని చేస్తావో ఎవరూ ఊహించలేరు. నీవు నిర్గుణుడివి, అన్ని గుణాలకూ నీవు ఈశుడివి. ప్రస్తుతం నీవు సత్వ గుణములో ఉన్నావు. అలాంటి నీకు నమస్కారం.

ఇది పురుష సూక్తాన్న్ని చెప్పిన స్తుతి. 

                                                                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు  

Popular Posts