Followers

Sunday 2 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం

                                                         


     ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
తత ఉత్పన్నవిజ్ఞానా ఆశ్వధోక్షజభాషితమ్
స్మరన్త ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్గృహాత్

ఇలా ప్రాచేతసులు మారిషను వివాహం చేసుకుని కొంతకాలం హాయిగా ఉండి దక్షున్ని పుత్రునిగా పొంది పరమాత్మ వరం ఉన్నవారు కాబట్టి సంసాఅరం మీద విరక్తి క్లైగింది. పరమాత్మ మాటలను గుర్తుచేసుకుని తమ భర్యను కొడుకుకు అప్పగించి ఇంటినుంచి అన్ని వదిలి బయట్పడ్డారు

దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధసా
ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధోऽభూద్యత్ర జాజలిః

తపస్సుచే వీరందరూ దీక్షితులై ప్రతీచి దిక్కుకు వెళ్ళారు. జాజలి ఆశ్రమానికి వెళ్ళారు.

తాన్నిర్జితప్రాణమనోవచోదృశో జితాసనాన్శాన్తసమానవిగ్రహాన్
పరేऽమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేడ్యో దదృశే స్మ నారదః

ప్రాణాయామముతో అన్ని ఇంద్రియాలనూ మనసునూ గెలిచారు, శరీరానికి కలిగే అన్నిటినీ సమానముగా చూచారు. పరిశుద్ధుడైన పరమాత్మ యందు మనసు లగ్నం చేసారు

తమాగతం త ఉత్థాయ ప్రణిపత్యాభినన్ద్య చ
పూజయిత్వా యథాదేశం సుఖాసీనమథాబ్రువన్

అక్కడికి నారడు వచ్చాడు. ఆయనకు నమస్కరించి పూజించి ఉన్నతాసనములో కూర్చోబెట్టి

ప్రచేతస ఊచుః
స్వాగతం తే సురర్షేऽద్య దిష్ట్యా నో దర్శనం గతః
తవ చఙ్క్రమణం బ్రహ్మన్నభయాయ యథా రవేః

మీకు స్వాగతం మా అదృష్టం బాగుండి మీ దర్శనం లభించింది. సూర్యుని వంటి మీ వారి సంచారం మావంటి వారి కోసమే

యదాదిష్టం భగవతా శివేనాధోక్షజేన చ
తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో

శంకరుడూ విష్ణువూ చెప్పినట్లుగా గృహస్థాశ్రమములో ఆచరించవలసిన దాన్ని ఆచరించాము

తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్త్వార్థదర్శనమ్
యేనాఞ్జసా తరిష్యామో దుస్తరం భవసాగరమ్

వారు చెప్పినట్లుగా కొంతకాలం అందులో ఉన్నాము, దాని వలన మరుగు పడిన ఆధ్యాత్మ జ్ఞ్యానన్ని మళ్ళీ వెలిగించు. అలాంటి ఆధ్యాత్మ జ్ఞ్యానముతో దాటశక్యముగా కాని సంసారాన్ని దాటుతాము

మైత్రేయ ఉవాచ
ఇతి ప్రచేతసాం పృష్టో భగవాన్నారదో మునిః
భగవత్యుత్తమశ్లోక ఆవిష్టాత్మాబ్రవీన్నృపాన్

ప్రాచేతుసులడిగిన వెంటనే నారదుడు తన మనసును పరమాత్మ యందు లగ్నం చేసి ఇలా అన్నాడు

నారద ఉవాచ
తజ్జన్మ తాని కర్మాణి తదాయుస్తన్మనో వచః
నృణాం యేన హి విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః

కిం జన్మభిస్త్రిభిర్వేహ శౌక్రసావిత్రయాజ్ఞికైః
కర్మభిర్వా త్రయీప్రోక్తైః పుంసోऽపి విబుధాయుషా

శ్రుతేన తపసా వా కిం వచోభిశ్చిత్తవృత్తిభిః
బుద్ధ్యా వా కిం నిపుణయా బలేనేన్ద్రియరాధసా

కిం వా యోగేన సాఙ్ఖ్యేన న్యాసస్వాధ్యాయయోరపి
కిం వా శ్రేయోభిరన్యైశ్చ న యత్రాత్మప్రదో హరిః

శ్రేయసామపి సర్వేషామాత్మా హ్యవధిరర్థతః
సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః

యథా తరోర్మూలనిషేచనేన తృప్యన్తి తత్స్కన్ధభుజోపశాఖాః
ప్రాణోపహారాచ్చ యథేన్ద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా

యథైవ సూర్యాత్ప్రభవన్తి వారః పునశ్చ తస్మిన్ప్రవిశన్తి కాలే
భూతాని భూమౌ స్థిరజఙ్గమాని తథా హరావేవ గుణప్రవాహః

ఏతత్పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితుర్యథా ప్రభా
యథాసవో జాగ్రతి సుప్తశక్తయో ద్రవ్యక్రియాజ్ఞానభిదాభ్రమాత్యయః

యథా నభస్యభ్రతమఃప్రకాశా భవన్తి భూపా న భవన్త్యనుక్రమాత్
ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూ రజస్తమః సత్త్వమితి ప్రవాహః

ప్రాణములు ఉంటే జ్ఞ్యానేందిర్య కర్మేంద్రియములు ఎలా ఉత్తేజితమై అన్ని పనులూ చేస్తాయో ఆకాశములో మబ్బులు ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలా సాత్విక రాజస తామసిక శక్తులు పరమాత్మ యందే ఉంటాయి.

తేనైకమాత్మానమశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశమ్
స్వతేజసా ధ్వస్తగుణప్రవాహమాత్మైకభావేన భజధ్వమద్ధా

ఆయన ఒక్కడే ఆత్మ. సకల జీవులకూ ఒక్కడే ఆత్మ అయిన వాడు. జీవునికీ ప్రకృతికీ ఆయనే ఈశుడు. తన దివ్య తేజస్సుతో సకల సత్వ రజో తమో గుణాల ప్రభావాన్ని ధ్వంసం చేసిన వాడు. అలాంటి స్వామిని సావధాన చిత్తముతో సేవించండి.

దయయా సర్వభూతేషు సన్తుష్ట్యా యేన కేన వా
సర్వేన్ద్రియోపశాన్త్యా చ తుష్యత్యాశు జనార్దనః

సర్వభూత దయతో పరమాత్మ ప్రసాదించిన దానితో తృప్తి పడాలి అన్ని ఇంద్రియాలకు శాంతి కావాలి అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు. తృప్తీ సకల ఇంద్రియ జయమూ దయా ఈ మూడూ ఉంటే పరమాత్మ తొందరగా సంతోషిస్తాడు.

అపహతసకలైషణామలాత్మన్యవిరతమేధితభావనోపహూతః
నిజజనవశగత్వమాత్మనోऽయన్న సరతి ఛిద్రవదక్షరః సతాం హి

మన హృదయములో పరమాత్మ సాక్షాత్కరాం అందులో మరే కోరికలూ లేకుంటే కలుగుతుంది. నిరంతరమూ పెరిగిన భక్తిచే పిలువబడితే ఆయన వస్తాడు. బాగా పెరిగిన భక్తి భావంతో ఆహ్వానించబడినవాడై వస్తాడు. పరమాత్మ భక్త పరాధీనుడు. ఒక సారి ఈ పరమాత్మ మన హృదయములో ప్రవేశిస్తే బయటకి వెళ్ళడు. రధ్రం ఉన్న పాత్రలోంచి నీరు బయటకు వెళ్ళినట్లు ఇతర భావనలున్న మనసునుండి స్వామి బయటకు వెళతాడు. లేకుంటే అక్కడే ఉంటాడు

న భజతి కుమనీషిణాం స ఇజ్యాం హరిరధనాత్మధనప్రియో రసజ్ఞః
శ్రుతధనకులకర్మణాం మదైర్యే విదధతి పాపమకిఞ్చనేషు సత్సు

పరమాత్మ దుష్ట బుద్ధులు కలవారు చేసే ఆరాధనలు స్వీకరించడు. ఆయన డబ్బులేని వారి మనసులో ఉన్న ధనమునకు ప్రియుడు. ఆయన రసజ్ఞ్యుడు. భక్తి రసాన్ని తెలిసిన వాడు. భక్తి లేకుండా దుష్టబుద్ధితో ఆరాధిస్తే స్వీకరించడు. శ్రుతధనకులకర్మణాం  - విద్యా ధన ఆభిజాత్య (నేను మంచి వంశములో పుట్టాను) అనే మూడు మదాలతో ఎవరితే ఇతరులకు హాని కలిగిస్తారో వారి ఆరాధనను స్వీకరించడు. పరమాత్మ కన్నా వేరే దిక్కు లేకుండా ఉండేవారికి అపకారం చేసేవారి పూజను స్వీకరించడు.

శ్రియమనుచరతీం తదర్థినశ్చ ద్విపదపతీన్విబుధాంశ్చ యత్స్వపూర్ణః
న భజతి నిజభృత్యవర్గతన్త్రః కథమముముద్విసృజేత్పుమాన్కృతజ్ఞః

తన వెంట పడ్డ లక్ష్మినే పరమాత్మ లెక్క చేయలేదు. అలాగే లక్ష్మితో అదే మాట అన్నవారిని కూడా లెక్క చేయలేదు (డబ్బు కావాలనుకున్న వారిని). దేవతలని కూడా లెక్క చేయని కొరత లేని మహానుభావుడు. ఆయన ఆత్మారాముడు. సహజముగానే అన్నీ ఉన్న వాడు. ఆయన భక్తుల వశములో ఉంటాడు. ఇలాంటి స్వామిని ప్రపంచములో ఏ కృతజ్ఞ్యుడైనా విడిచిపెడతాడా

మైత్రేయ ఉవాచ
ఇతి ప్రచేతసో రాజన్నన్యాశ్చ భగవత్కథాః
శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వాయమ్భువో మునిః

ఇలా ప్రాచేతసులకు భగవత్ తత్వాన్ని చెప్పి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు

తేऽపి తన్ముఖనిర్యాతం యశో లోకమలాపహమ్
హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయన్తస్తద్గతిం యయుః

ప్రాచేతసులు నారదుని ముఖము నుండి వెలువడిన పరమాత్మ కీర్తిని విని పరమాత్మ పాద పద్మములను ధ్యానం చేస్తూ పరమాత్మ సనందిహికి చేరారు

ఏతత్తేऽభిహితం క్షత్తర్యన్మాం త్వం పరిపృష్టవాన్
ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనమ్

నీవు నన్ను ఏమడిగావో అది చెప్పను. ప్రాచేతసులూ నారదుల సంవాదమైన పరమాత్మ నామ సంకీర్తనా రూపమైన దానిని నీకు వివరించాను

శ్రీశుక ఉవాచ
య ఏష ఉత్తానపదో మానవస్యానువర్ణితః
వంశః ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమ

ఇది ఉత్తన పాదుని వంశము. ప్రియవ్రతుడి చరిత్ర కూడా విన వలసింది

యో నారదాదాత్మవిద్యామధిగమ్య పునర్మహీమ్
భుక్త్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వరం సమగాత్పదమ్

ప్రియవ్రతుడు కూడా నారదుని వల్లనే ఆధ్యాత్మ జ్ఞ్యానన్ని పొంది రాజ్యాన్ని పొంది దాన్ని సంతానానికి పంచి పరమపదమును పొందాడు

ఇమాం తు కౌషారవిణోపవర్ణితాం క్షత్తా నిశమ్యాజితవాదసత్కథామ్
ప్రవృద్ధభావోऽశ్రుకలాకులో మునేర్దధార మూర్ధ్నా చరణం హృదా హరేః

మైత్రేయుని చేత వర్ణించబడిన నిరంతరమూ జయ జయ ధ్వానాలు వినే పరమాత్మ గాధను విదురుడు విని పరమాత్మయందు భక్తి భావం వృద్ధి పొంది పరమాత్మ గాధను విన్నందు వలన ఆనందాశ్రువులు వచ్చి ఈ కథ చెప్పిన మైత్రేయుని పాదాలను శిరస్సు మీదా, పరమాత్మ పాదాలను హృదయములోనూ పెట్టుకున్నాడు.

విదుర ఉవాచ
సోऽయమద్య మహాయోగిన్భవతా కరుణాత్మనా
దర్శితస్తమసః పారో యత్రాకిఞ్చనగో హరిః

దయ గల మీరు సంసారం యొక్క అవతల ఒడ్డును చూపెట్టారు. అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఆయన ఏమీ లేని వారికి దొరికేవాడు - యత్రాకిఞ్చనగో

శ్రీశుక ఉవాచ
ఇత్యానమ్య తమామన్త్ర్య విదురో గజసాహ్వయమ్
స్వానాం దిదృక్షుః ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయః

విదురుడు మైత్రేయునికి నమస్కరించాడు ఆయన ఆజ్య్నను పొంది బందువులను చూడటానికి హస్తినకు వెళ్ళాడు

ఏతద్యః శృణుయాద్రాజన్రాజ్ఞాం హర్యర్పితాత్మనామ్
ఆయుర్ధనం యశః స్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్

పరమాత్మ యందు మాత్రమే మనసు ఉన్న వీరి చరిత్రను ఎవరు వింటారో వారికి ఆయుష్షు ధనము కీర్తి ఐశ్వర్యమూ స్వస్తి లభిస్తాయి


                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts