Followers

Tuesday 25 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పదవ అధ్యాయం



శ్రీనారద ఉవాచ
భక్తియోగస్య తత్సర్వమన్తరాయతయార్భకః
మన్యమానో హృషీకేశం స్మయమాన ఉవాచ హ

శ్రీప్రహ్రాద ఉవాచ
మా మాం ప్రలోభయోత్పత్త్యా సక్తంకామేషు తైర్వరైః
తత్సఙ్గభీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వాముపాశ్రితః

నాలోపల ఇలాంటి లోభాన్ని కలిగించకు. కోరికల యందు నా మనసు ఉండేట్లు చేయకు.కేవలం నీ శరీరం నుండి విడువడి నిన్ను చేరాలనే కోరిక తప్ప వేరే కోరిక లేదు. నాకు అక్కరలేదు. 

భృత్యలక్షణజిజ్ఞాసుర్భక్తం కామేష్వచోదయత్
భవాన్సంసారబీజేషు హృదయగ్రన్థిషు ప్రభో

నేను నీ నిజమైన భృత్యున్నో కానో కనుక్కునేందుకు కోరుకోమంటున్నావు. నిజమైన భృత్యుడైతే ఒకటిస్తే సేవచేస్తా అనడు. ఒక ఫలమును ఆశించి సేవ చేయడు. ఫల సంబంధముతో కాదు మన సంబంధం. నీవారమైన మేము నీకే చెంది నీకొరకే పని చేయవలసిన మేము ఒక కోరిక కోరి నీకు పని చేయడం భృత్యుని లక్షణం కాదు.

నాన్యథా తేऽఖిలగురో ఘటేత కరుణాత్మనః
యస్త ఆశిష ఆశాస్తే న స భృత్యః స వై వణిక్

సహజ సంబంధం ఉన్న చోట ప్రతిఫలాపేక్ష ఉండదు. నీవు నీకిష్టం వచ్చినట్లు మమ్ము ఉపయోగించుకో. నీకు ఉపయోగపడకపోతే మేము బాధపడాలి.ఎవరైతే ఏమి కావాలో కోరి పని చేస్తాడు వాడు నిజమైన భక్తుడు కాడు. 

ఆశాసానో న వై భృత్యః స్వామిన్యాశిష ఆత్మనః
న స్వామీ భృత్యతః స్వామ్యమిచ్ఛన్యో రాతి చాశిషః

మనది రాజూ సేవకుడి వంటి సంబంధం కాదు. 

అహం త్వకామస్త్వద్భక్తస్త్వం చ స్వామ్యనపాశ్రయః
నాన్యథేహావయోరర్థో రాజసేవకయోరివ

యది దాస్యసి మే కామాన్వరాంస్త్వం వరదర్షభ
కామానాం హృద్యసంరోహం భవతస్తు వృణే వరమ్

లేదూ, వరం ఇస్తానూ అంటావా, నా లోపల ఇక కోరికా పుట్టకుండా ఉండే వరాన్నివ్వు. పుట్టుక అనేది రాగానే కోరిక దానితోటే వస్తుంది.

ఇన్ద్రియాణి మనః ప్రాణ ఆత్మా ధర్మో ధృతిర్మతిః
హ్రీః శ్రీస్తేజః స్మృతిః సత్యం యస్య నశ్యన్తి జన్మనా

దానితో ఇవన్నీ నశించి పోతాయి. ఏనాడైతే కోరికలు పోతాయో ఆనాడు భగవంతునితో సమానుడవుతాడు

విముఞ్చతి యదా కామాన్మానవో మనసి స్థితాన్
తర్హ్యేవ పుణ్డరీకాక్ష భగవత్త్వాయ కల్పతే

ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే
హరయేऽద్భుతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే

శ్రీభగవానువాచ
నైకాన్తినో మే మయి జాత్విహాశిష ఆశాసతేऽముత్ర చ యే భవద్విధాః
తథాపి మన్వన్తరమేతదత్ర దైత్యేశ్వరాణామనుభుఙ్క్ష్వ భోగాన్

నీవంటి వారు నాయందే మనసు లగ్నం చేసిన వారు ఎక్కడా ఎప్పుడూ ఏమీ కోరరు. నీవు దైత్యులకు రాజువై కొంతకాలం పాతాళలోకం పాలించు. 

కథా మదీయా జుషమాణః ప్రియాస్త్వమావేశ్య మామాత్మని సన్తమేకమ్
సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం యజస్వ యోగేన చ కర్మ హిన్వన్

నా కథలు వింటూ అందరికీ చెబుతూ యజ్ఞ్య రూపున్నైన నన్ను యజ్ఞ్యముతో ఆరాధించు యోగముతో లోపల నన్ను దర్శిస్తూ ఉండు. పుణ్య కర్మను భోగాలతో పాప కర్మను కుశలముగా (నైపుణ్యముతో) తొలగించుకో. కష్టములకూ సుఖములకూ సముడవై ఉండుట నైపుణ్యం. అలా ఉండుట నేర్పు గలవారికే సాధ్యం. నీవు అలాగే ఉండు

భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా
కీర్తిం విశుద్ధాం సురలోకగీతాం వితాయ మామేష్యసి ముక్తబన్ధః

య ఏతత్కీర్తయేన్మహ్యం త్వయా గీతమిదం నరః
త్వాం చ మాం చ స్మరన్కాలే కర్మబన్ధాత్ప్రముచ్యతే

నీవు చేసిన స్తోత్రాన్ని ఎవరైనా రోజూ చేసి, నిన్నూ నన్నూ భావిస్తూ ధ్యానిస్తూ ఈ స్తోత్రం చదివితే వాడికి కర్మ బంధములు అంటవు. ఇంకా ఏదైనా వరం కోరుకో

శ్రీప్రహ్రాద ఉవాచ
వరం వరయ ఏతత్తే వరదేశాన్మహేశ్వర
యదనిన్దత్పితా మే త్వామవిద్వాంస్తేజ ఐశ్వరమ్

మా తండ్రి నీ గొప్ప తనం తెలియక నిన్ను దూషించాడు. నీ భక్తుడనైన నన్ను దూషించాడు. అలా చాలా పాపం మూట గట్టుకున్నాడు

విద్ధామర్షాశయః సాక్షాత్సర్వలోకగురుం ప్రభుమ్
భ్రాతృహేతి మృషాదృష్టిస్త్వద్భక్తే మయి చాఘవాన్

తస్మాత్పితా మే పూయేత దురన్తాద్దుస్తరాదఘాత్
పూతస్తేऽపాఙ్గసందృష్టస్తదా కృపణవత్సల

శ్రీభగవానువాచ
త్రిఃసప్తభిః పితా పూతః పితృభిః సహ తేऽనఘ
యత్సాధోऽస్య కులే జాతో భవాన్వై కులపావనః

నీవంటి మహా భక్తుడు పుట్టుట వలన ముందు పదీ ఇవతల పది తరాలు తరించాయి. 

యత్ర యత్ర చ మద్భక్తాః ప్రశాన్తాః సమదర్శినః
సాధవః సముదాచారాస్తే పూయన్తేऽపి కీకటాః

నీ తండ్రిని గురించి నీకు విచారం అవసరం లేదు. నా చేతుల్లో అతను చనిపోయాడు కాన నీవు ఆయన విషయమై నీవు బాధపడవలదు.

సర్వాత్మనా న హింసన్తి భూతగ్రామేషు కిఞ్చన
ఉచ్చావచేషు దైత్యేన్ద్ర మద్భావవిగతస్పృహాః

భవన్తి పురుషా లోకే మద్భక్తాస్త్వామనువ్రతాః
భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్

కురు త్వం ప్రేతకృత్యాని పితుః పూతస్య సర్వశః
మదఙ్గస్పర్శనేనాఙ్గ లోకాన్యాస్యతి సుప్రజాః

పిత్ర్యం చ స్థానమాతిష్ఠ యథోక్తం బ్రహ్మవాదిభిః
మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః

శ్రీనారద ఉవాచ
ప్రహ్రాదోऽపి తథా చక్రే పితుర్యత్సామ్పరాయికమ్
యథాహ భగవాన్రాజన్నభిషిక్తో ద్విజాతిభిః

ప్రహ్లాదుడు కూడా తండ్రి యొక్క అంత్య క్రియలను పూర్తి చేసి 

ప్రసాదసుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిమ్
స్తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వృతః

ప్రహ్లాదుడు సమీపించి స్తోత్రం చేసిన తరువాత పరమాత్మ ప్రశాంతుడయ్యాడని తెలుసుకుని బ్రహ్మగారు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు

శ్రీబ్రహ్మోవాచ
దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ
దిష్ట్యా తే నిహతః పాపో లోకసన్తాపనోऽసురః

అఖిల జగత్తుకూ ముందు ఉన్న వాడా, అన్ని జగత్తులకూ అధ్యక్షుడా. సకల లోకాలనీ బాధించే రాక్షసుడు నీ చేత వధించబడ్డాడు

యోऽసౌ లబ్ధవరో మత్తో న వధ్యో మమ సృష్టిభిః
తపోయోగబలోన్నద్ధః సమస్తనిగమానహన్

నా సృష్టితో మరణించను అని వరం పొందాడు ఈ రాక్షసుడు. తపస్సుతో యోగ బలముతో నా వరముతో ధార్మిక కట్టు బాట్లను అతిక్రమించాడు. అదృష్టం బాగుండి ఇతని కొడుకు పరమ బాగవతుడయ్యాడు

దిష్ట్యా తత్తనయః సాధుర్మహాభాగవతోऽర్భకః
త్వయా విమోచితో మృత్యోర్దిష్ట్యా త్వాం సమితోऽధునా

నీ నుండి ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. ఇపుడు నిన్ను చేరుకున్నాడు.

ఏతద్వపుస్తే భగవన్ధ్యాయతః పరమాత్మనః
సర్వతో గోప్తృ సన్త్రాసాన్మృత్యోరపి జిఘాంసతః

నీ ఈకారాన్ని ధ్యానిస్తే తలిస్తే ఎంతటి క్లిష్టమైన, పరిష్కారం దొరకని ఆపద వస్తే, నీవు వచ్చి కాపాడతావు. ప్రయతాత్మనః - ఆయన యందే మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తే అన్ని రకముల భయముల నుండి కాపాడతాడు. చంపడానికి మృత్యువు వచ్చినా స్వామిని ఈ ఆకారముతో ధ్యానం చేస్తే ఆ మృత్యువు పారిపోతుంది. స్వామి మృత్యువుకే మృత్యువు. 

శ్రీభగవానువాచ
మైవం విభోऽసురాణాం తే ప్రదేయః పద్మసమ్భవ
వరః క్రూరనిసర్గాణామహీనామమృతం యథా

రాక్షసులకు ఇక ముందు ఇలాంటి వరములు ఇవ్వకు. కౄర స్వభావం కలవారికి వరమివ్వడమంటే పాములకు అమృతం పోయడమే. 

శ్రీనారద ఉవాచ
ఇత్యుక్త్వా భగవాన్రాజంస్తతశ్చాన్తర్దధే హరిః
అదృశ్యః సర్వభూతానాం పూజితః పరమేష్ఠినా

ఇలా చెప్పి బ్రహ్మ చేత స్తుతించబడి ఏ ప్రాణికీ కనపడక అంతర్ధానమయ్యాడు. 

తతః సమ్పూజ్య శిరసా వవన్దే పరమేష్ఠినమ్
భవం ప్రజాపతీన్దేవాన్ప్రహ్రాదో భగవత్కలాః

స్వామి అంతర్ధానమవ్వడముతో ప్రహ్లాదుడు మొదలు పరమాత్మ అంశలైన బ్రహ్మకూ శంకరునికీ ప్రజాపతులకీ ఇతర దేవతలకూ నమస్కరించి పూజించాడు. 

తతః కావ్యాదిభిః సార్ధం మునిభిః కమలాసనః
దైత్యానాం దానవానాం చ ప్రహ్రాదమకరోత్పతిమ్

అప్పుడు బ్రహ్మ శుక్రాచార్యులు మొదలైన వారితో మునులతో కలిసి దైత్య దానవులకు ప్రహ్లాదున్ని అధిపతిని చేసాడు. 

ప్రతినన్ద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః
స్వధామాని యయూ రాజన్బ్రహ్మాద్యాః ప్రతిపూజితాః

దేవతలు ప్రహ్లాదున్ని అభినందించి ఉత్తమ ఆశీర్వాదాలు ఇచ్చి ప్రహ్లాదునితో పూజలందుకుని తమ తమ లోకాలకి వెళ్ళారు

ఏవం చ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ దితేః
హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ

హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు పరమాత్మ ద్వారపాలకులే. వారు పరమాతమ్ను హృదయములో ఉంచుకున్నారు. హృదయములో స్వామిని ఉంచుకుని పైకి వైరాన్ని చూపారు. 

పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతుః
కుమ్భకర్ణదశగ్రీవౌ హతౌ తౌ రామవిక్రమైః

వీరిద్దరే రావణ కుంభకర్ణులుగా పుట్టగా రామచంద్రుడు వారిని వధించాడు

శయానౌ యుధి నిర్భిన్న హృదయౌ రామశాయకైః
తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తనజన్మని

రాముని బాణముతో కొట్టబడి యుద్ధరంగములో శరీరాన్ని వదిలిపెట్టినవారు ఆయనను తలచుకుంటూ వెళ్ళారు

తావిహాథ పునర్జాతౌ శిశుపాలకరూషజౌ
హరౌ వైరానుబన్ధేన పశ్యతస్తే సమీయతుః

వారే ఈ జన్మలో శిశుపాల దంతవక్తృలు. పరమాత్మ యందు వైరాన్ని పెంచుకుని ఆయనలోనే చేరారు. 

ఏనః పూర్వకృతం యత్తద్రాజానః కృష్ణవైరిణః
జహుస్తేऽన్తే తదాత్మానః కీటః పేశస్కృతో యథా

వీరే కాదు ఎంత మంది రాజులు కృష్ణ పరమాత్మ యందు వైరముతో ప్రవర్తించి అతని చేతిలో మరణించారో వారందరూ ఆయననే చేరారు. పరమాత్మను ఎలా సేవించినా వచ్చేది మోక్షమే. తుమ్మెద పురుగును ఒక రంధ్రములో పెట్టి దాని చుట్టు తిరగడముతో ఆ పురుగు కూడా ఈ ఆకారాన్నే పొందుతుంది. పరమాత్మ యందు వైరముతో నిరనతరం పరమాత్మను ధ్యానించడముతో వీరందరూ పరమాత్మనే పొందుతారు

యథా యథా భగవతో భక్త్యా పరమయాభిదా
నృపాశ్చైద్యాదయః సాత్మ్యం హరేస్తచ్చిన్తయా యయుః

పరమాత్మ యందు ఉన్న భక్తితో గానీ ద్వేష భావముతో కానీ శిశుపాలాది రాజులు పరమాత్మ యందు తాదాత్మ్యాన్ని పొందారు. ధ్యానిస్తూ ద్వేషిస్తూ దూషిస్తూ పరమాత్మనే తలచారు. 

ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్
దమఘోషసుతాదీనాం హరేః సాత్మ్యమపి ద్విషామ్

నీవు నన్ను ఏమి అడిగావో అది చెప్పాను. శిశుపాలుడు మోక్షం పొందడానికి కారణం వివరించాను. 

ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః
అవతారకథా పుణ్యా వధో యత్రాదిదైత్యయోః

ఇది బ్రాహ్మణుల మీద అత్యంత ప్రీతి కలిగిన కృష్ణ పరమాత్మ యొక్క కథ. పరమ పావన కథ. ఆది దైత్యుల వధను చెప్పాను. ప్రహ్లాద కధను చెప్పాను.

ప్రహ్రాదస్యానుచరితం మహాభాగవతస్య చ
భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యాథార్థ్యం చాస్య వై హరేః

ప్రహ్లాదునికి భక్తి జ్ఞ్యానం వైరాగ్యం ఉంది. అలా ఉన్న వారు పరమాత్మను చేరతారు

సర్గస్థిత్యప్యయేశస్య గుణకర్మానువర్ణనమ్
పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్

సృష్టి స్థితి లయములకు అధినాయకుడైన పరమాత్మ కథలను వర్ణించాను. హెచ్చు తగ్గులకు ష్తానం లేని. న్యూనత్వం, కాల ప్రభావం పరమాత్మకు ఉండవు. మనుషులకు ఉంటాయి

ధర్మో భాగవతానాం చ భగవాన్యేన గమ్యతే
ఆఖ్యానేऽస్మిన్సమామ్నాతమాధ్యాత్మికమశేషతః

పరమాత్మను పొందే భాగవత ధర్మాన్ని వివరించాను నీకు. ఆధ్యాత్మకమైన్న ఆఖ్యానాన్ని నీకు వర్ణించాను

య ఏతత్పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితమ్
కీర్తయేచ్ఛ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే

పరమాత్మ పరాక్రమముతో వ్యాపించిన ఈ కథను శ్రద్ధా భక్తులతో ఎవరు గానం చేస్తారో వింటారో వారు సంసార పాశము నుండి విడుదల అవుతారు

ఏతద్య ఆదిపురుషస్య మృగేన్ద్రలీలాం
దైత్యేన్ద్రయూథపవధం ప్రయతః పఠేత
దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం
శ్రుత్వానుభావమకుతోభయమేతి లోకమ్

ఈయన ఆది పురుషుడు. ఇది మృగేంద్ర లీల. దైత్యేంద్ర వధ లీలను, ప్రహ్లాద వైభావాన్ని ఎవరు శ్రద్ధతో చదువుతారో వింటారో, వారు ఎక్కడా ఏ ఆపద లేని లోకానికి వెళతారు. 

యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునానా మునయోऽభియన్తి
యేషాం గృహానావసతీతి సాక్షాద్గూఢం పరం బ్రహ్మ మనుష్యలిఙ్గమ్

ఇప్పుడు ఈ మానవ లోకములో మహా అదృష్టవంతులు మీరే. మీ ఇంటిలోకి మునులందరూ వస్తున్నారు. ఎవరు వస్తే, ఎవరిని ఒక్క సారి చూస్తే చూసిన వారి పాపములు పోతాయో వారు మీ ఇంటికి వస్తున్నారు. వారు శ్రీకృష్ణున్ని చూడడానికి వస్తున్నాడు. అతి రహస్యముగా మానవ దేహములో ఉన్న సాక్షత్ పరబ్రహ్మ కృష్ణుడి రూపములో ఉన్నాడు.

స వా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్యనిర్వాణసుఖానుభూతిః
ప్రియః సుహృద్వః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ

ఈయనే! ఇక్కడ కూర్చున్న ఈయనే. మహానుభావుల చేత అణ్వేషించబడే మోక్షం, దాని వలన వచ్చే సుఖం, ఆ సుఖానుభూతి, ఈయనే.  నీకు పరమ మిత్రుడు, బావ, నీవు చెప్పినట్లు వినే వాడు, గురువు, ఆత్మ, పూజించదగినవాడు. 

న యస్య సాక్షాద్భవపద్మజాదిభీ రూపం ధియా వస్తుతయోపవర్ణితమ్
మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష స సాత్వతాం పతిః

ఈ మహానుభావుని యదార్థ రూపం ఇలా ఉంటుంది అని బ్రహ్మ రుద్రాదులు కూడా చెప్పలేరు. భగవంతుని ఆరాధించడానికి ఉత్తమమైన తపస్సు మౌనం. తరువాత భక్తి, ఉపశమం (ఇంద్రియ నిగ్రహం). వీటిచే పూజించబడి పరమాత్మ మన విషయములో ప్రసన్నమవుగాక.

స ఏష భగవాన్రాజన్వ్యతనోద్విహతం యశః
పురా రుద్రస్య దేవస్య మయేనానన్తమాయినా

ఒక సారి ఈయనే శంకరుని కీర్తిని పెంచాడు. అనత మాయుడైన మయునిచే ఇబ్బంది కలిగితే స్వామి యొక్క కృప వలన త్రిపురాసురుడు వధించబడ్డాడు

రాజోవాచ
కస్మిన్కర్మణి దేవస్య మయోऽహన్జగదీశితుః
యథా చోపచితా కీర్తిః కృష్ణేనానేన కథ్యతామ్

మయుడు శంకరుని కీర్తిని అడ్డగించాడా. దాన్ని పరమాత్మ పెంచాడా? ఆ కథ నాకు చెప్పండి

శ్రీనారద ఉవాచ
నిర్జితా అసురా దేవైర్యుధ్యనేనోపబృంహితైః
మాయినాం పరమాచార్యం మయం శరణమాయయుః

విష్ణు కటాక్షముతో దేవతలు రాక్షసులను ఓడించారు. ఆ రాక్షసులు మహా మాయావి అయిన మాయాసురున్ని శరణు వేడారు

స నిర్మాయ పురస్తిస్రో హైమీరౌప్యాయసీర్విభుః
దుర్లక్ష్యాపాయసంయోగా దుర్వితర్క్యపరిచ్ఛదాః

ఆ మయుడు బంగారమూ వెండి ఇనుము నగరాలను ఏర్పాటు చేసాడు. ఆ నగరాలు ఎవరికీ కనపడవు. ఎవరు అపాయం కలిగించినా కలగదు. దాని పైన కప్పు ఏమున్నదో ఎవరికీ తెలియదు. ఆ నగర కప్పును చూచే మోహం చెందుతారు అందరూ. 

తాభిస్తేऽసురసేనాన్యో లోకాంస్త్రీన్సేశ్వరాన్నృప
స్మరన్తో నాశయాం చక్రుః పూర్వవైరమలక్షితాః

ఎవరికీ కనపడరు కాబట్టి వాటిలో ఉండి అన్ని లోకాలను తిరుగుతూ అందరినీ బాధపెట్టడం మొదలు పెట్టారు, పా వైరాన్ని స్మరించుకుని. 

తతస్తే సేశ్వరా లోకా ఉపాసాద్యేశ్వరం నతాః
త్రాహి నస్తావకాన్దేవ వినష్టాంస్త్రిపురాలయైః

ఈ త్రిపురాలయముల నుంచి కాపాడమని అందరూ శంకరున్ని శరణు వేడారు. 

అథానుగృహ్య భగవాన్మా భైష్టేతి సురాన్విభుః
శరం ధనుషి సన్ధాయ పురేష్వస్త్రం వ్యముఞ్చత

ఈశ్వరుడు అభయమిచ్చి ధనస్సు ఎక్కుపెట్టి ఆ నగరముల పైకి ప్రయోగించాడు. సూర్య మండలం నుంచి బయలు దేరిన కిరణాల లాగ 

తతోऽగ్నివర్ణా ఇషవ ఉత్పేతుః సూర్యమణ్డలాత్
యథా మయూఖసన్దోహా నాదృశ్యన్త పురో యతః

ఆ బాణములు తగలగానే ఆ రాక్షసులందరూ చనిపోయారు. 

తైః స్పృష్టా వ్యసవః సర్వే నిపేతుః స్మ పురౌకసః
తానానీయ మహాయోగీ మయః కూపరసేऽక్షిపత్

మయుడు ఆ రాక్షసులను అమృతములో ముంచి తీసాడు. మళ్ళీ వారందరూ బలం పెరిగి లేచారు. 

సిద్ధామృతరసస్పృష్టా వజ్రసారా మహౌజసః
ఉత్తస్థుర్మేఘదలనా వైద్యుతా ఇవ వహ్నయః

మేఘములను చీల్చుకుని వచ్చే మెరుపు తీగలలా తయారయ్యారు. 

విలోక్య భగ్నసఙ్కల్పం విమనస్కం వృషధ్వజమ్
తదాయం భగవాన్విష్ణుస్తత్రోపాయమకల్పయత్

అది చూసి శంకరుడు ఆశ్చర్యపోయాడు. శంకరుడు విష్ణువును తలచుకుని ఒక ఉపాయాన్ని ఆలోచించి 

వత్సశ్చాసీత్తదా బ్రహ్మా స్వయం విష్ణురయం హి గౌః
ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ

బ్రహ్మను ఒక దూడగా చేసి తాను ఆవు అయ్యి ఆ మయుని లోకానికి వెళ్ళి అక్కడున్న అమృతాన్ని అందరూ చూస్తుండగా తాగేశారు

తేऽసురా హ్యపి పశ్యన్తో న న్యషేధన్విమోహితాః
తద్విజ్ఞాయ మహాయోగీ రసపాలానిదం జగౌ

స్మయన్విశోకః శోకార్తాన్స్మరన్దైవగతిం చ తామ్
దేవోऽసురో నరోऽన్యో వా నేశ్వరోऽస్తీహ కశ్చన

అది తెలుసుకుని మయుడు ఇదంతా పరమాత్మ మాయ అని తెలుసుకున్నారు. దేవ రాక్షస మానవులు విధికి శాసకులు కారు. అందరూ విధి చెప్పినట్లు విన వలసిన వారే

ఆత్మనోऽన్యస్య వా దిష్టం దైవేనాపోహితుం ద్వయోః
అథాసౌ శక్తిభిః స్వాభిః శమ్భోః ప్రాధానికం వ్యధాత్

మనం చేసినదాన్ని దైవం తొలగిస్తాడు కానీ దైవం చేసిన దాన్ని మనమ తెలుసుకోలేము, తొలగించలేము.

ధర్మజ్ఞానవిరక్త్యృద్ధి తపోవిద్యాక్రియాదిభిః
రథం సూతం ధ్వజం వాహాన్ధనుర్వర్మశరాది యత్

పరమాత్మ తన తేజస్సును శంకరునిలో ఉంచాడు. ఆధ్యాత్మికములైన తన శక్తులను శంకరునిలో ఉంచాడు. రథం సారధి ధనువు అశ్వమూ ఉంచాడు
ధర్మ - రథం
జ్ఞ్యానం - సారధి
విరక్తి - ద్వజం 
ఋద్ధి - వాహనం
తపస్సు - ధనువు
విద్య - కవచం
క్రియ - శరం. 
ఇది మన కథ, మనకు కూడా మూడు పురములు ఉంటాయి. సాత్విక రాజసిక తామసిక పురాలు. మోహింపచేసే పైపొర ఉంటుంది. అదే చర్మం. అది (లోపల ఉన్నది) ఎవరికీ కనపడదు. దీన్ని శంకరుడు ఆత్మ జ్ఞ్యానమనే బాణముతో పోగొడతాడు. మయుడనే అజ్ఞ్యానం వ్యామోహం మనను కర్మలో వాసనలో పడేస్తాడు. అప్పుడు పరమాత్మ దాన్ని తాగేస్తాడు. అంటే పూర్వ జన్మ వాసనను తాగేస్తాడు. అప్పుడు పై రథమును సిద్ధం చేసుకుంటాడు

సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే
శరం ధనుషి సన్ధాయ ముహూర్తేऽభిజితీశ్వరః

అభిజిత్ ముహూర్తములో శంకరుడు 

దదాహ తేన దుర్భేద్యా హరోऽథ త్రిపురో నృప
దివి దున్దుభయో నేదుర్విమానశతసఙ్కులాః

దుర్భేద్యమైన బాణముతో (నారాయణాస్త్రముతో) కాల్చి వేసాడు. వెంటనే దుందుభులు మోగాయి. ఆకాశములో దేవతలు దుందుబులు మోగించి జయ జయ ధ్వానాలు చేసారు

దేవర్షిపితృసిద్ధేశా జయేతి కుసుమోత్కరైః
అవాకిరన్జగుర్హృష్టా ననృతుశ్చాప్సరోగణాః

గంధర్వులు గానం చేసారు, నాట్యం చేసారు

ఏవం దగ్ధ్వా పురస్తిస్రో భగవాన్పురహా నృప
బ్రహ్మాదిభిః స్తూయమానః స్వం ధామ ప్రత్యపద్యత

అప్పటినుంచి స్వామికి త్రిపురారీ పురారి అన్న పేరు వచ్చింది. బ్రహ్మాదులు శంకరున్ని స్తోత్రం చేయగా ఆయన తన లోకానికి వెళ్ళారు

ఏవం విధాన్యస్య హరేః స్వమాయయా విడమ్బమానస్య నృలోకమాత్మనః
వీర్యాణి గీతాన్యృషిభిర్జగద్గురోర్లోకం పునానాన్యపరం వదామి కిమ్

ఇటువంటి పరమాత్మ గాధలు అనేకం. తన మాయతో అందరినీ తన వశం చేసుకుని, తనను ఆశ్రయించిన వారికి విజయం ప్రసాదించే స్వామి. తననాశ్రయించిన వారికి సంసారాన్ని తొలగించి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి స్వామి మానవ దేహం ధరించి నాటకం ఆడుతున్నాడు. ఈయన ఆరుగుణములు గల భగవానుడు, జగత్తునకు గురువు. ఆయన కీర్తిని గానం చేస్తున్నాము. అలా మన చేత గానం చేయబడిన ఈయన గాధలు లోకాలను పావనం చేస్తాయి.

Popular Posts