Followers

Thursday 6 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఐదవ అధ్యాయం


ఋషభ ఉవాచ
నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్కామానర్హతే విడ్భుజాం యే
తపో దివ్యం పుత్రకా యేన సత్త్వం శుద్ధ్యేద్యస్మాద్బ్రహ్మసౌఖ్యం త్వనన్తమ్

శరీరం ధరించే జీవులు సంచరించే జీవులయొక్క మానవలోకములో దేహము కష్టములనిచ్చే కోరికలను కోరతగదు. ఎందుకంటే మలమును తినే (వరాహములు) జంతువులకు కూడా ఇవే కోరికలు ఉంటాయి. పరమాత్మను సాక్షాత్కరించుకునే తపస్సు చేయండి. దాని వలన మనసు శుద్ధి అవుతుంది.

మహత్సేవాం ద్వారమాహుర్విముక్తేస్తమోద్వారం యోషితాం సఙ్గిసఙ్గమ్
మహాన్తస్తే సమచిత్తాః ప్రశాన్తా విమన్యవః సుహృదః సాధవో యే

సజ్జనులను సేవించుటే ముక్తికి మార్గము. ఆడవారియందు అధికమైన ఆసక్తి ఉన్నవారితో స్నేహం చేయడం నరకానికి ద్వారము. సమచిత్తము ఉన్నవారు సజ్జనులు. ప్రశాంతముగా ఉండేవారు. కోపము మోహమూ లేని వారు. క్షమ ఉన్నవారు, హితాన్ని ఆశించేవారు, యోగక్షేమాన్ని ఉపదేశించేవారు (సాధవః) వీరితో సంగము మోక్షాన్ని ఇస్తుంది

యే వా మయీశే కృతసౌహృదార్థా జనేషు దేహమ్భరవార్తికేషు
గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్తా యావదర్థాశ్చ లోకే

భగవంతున్నయిన నా యందు స్నేహాన్నీ మైత్రినీ భక్తినీ కలిగి ఉన్నవారు సాధువులు. శరీరమును పోషించడానికి కావలసిన విధానాన్ని ఆలోచించే జనులయందూ భార్యా పుత్రులూ ధనమూ కలిగి ఉన్న గృహస్థాశ్రమం యందు (సంసారము యందు) ప్రేమ లేని వారు మహానుభావులు. వారు బతకడానికి ఎంత కావాలో అంతే కోరుకుంటారు - యావదర్థాశ్చ లోకే

నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదిన్ద్రియప్రీతయ ఆపృణోతి
న సాధు మన్యే యత ఆత్మనోऽయమసన్నపి క్లేశద ఆస దేహః

ఇది రావడానికి శరీరమే ఆత్మ అన్న ఏమరపాటుతో (అజాగ్రత్తతో ఉండటం) చేయకూడని పనులు చేస్తాడు ఎందుకంటే ఆ పని చేయడం వలన ఇంద్రియముల యందు ప్రీతి పెరుగుతుంది. దేహాత్మ వివేకం లేని వాడు దేహం కోసమే అన్నిపనులూ చేస్తాడు. ఇంద్రియ ప్రీతి వలన శరీరము యందు ఆసక్తి పెరుగుతుంది. దాని వలన మళ్ళీ పనులు చేస్తాడు. శరీరం ఆత్మకు ఆలయం. శరీరం పడే బాధకు ఆత్మతో సంబంధము లేదు. ఆత్మకు ఏ శరీరమూ లేదు. లేని శరీరము ఆత్మ బంధానికి కారణమవుతోంది. 

పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్త్వమ్
యావత్క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం యేన శరీరబన్ధః

పరాభవమూ బాధలూ దుఃఖాలూ అజ్ఞ్యానం వలన పుట్టేవి, ఆ భావనలు ఆత్మ తత్వం తెలియనంతవరకే . ఎంత వరకూ పని చేస్తూ ఉంటామో అంతవరకూ మనసు లగ్నమవుతుది, అంతవర్కూ ఇందిర్య ప్రీతి కలుగుతూ ఉంటుంది, ఎంతవరకూ ఇంద్రియ ప్రీతి కలుగుతుందో అంతవరకూ శరీరం వస్తుంది, దాని వలన మళ్ళీ పనులు చేస్తూ ఉంటాము. శరీరం సుఖముగా ఉంచాలి అన్న భావనతోనే ఇవన్నీ పొందుతూ ఉన్నాము. ఎప్పుడు దుఃఖప్రతీకారమే (కలిగిన కష్టాలను తొలగించుకోవడమే తప్ప) సుఖ ప్రాప్తి లేదు. పనూల వలన మనస్సంబంధం, మనస్సంబంధం వలన ఆత్మకు శరీర సంబంధం ఉంటుంది.

ఏవం మనః కర్మవశం ప్రయుఙ్క్తే అవిద్యయాత్మన్యుపధీయమానే
ప్రీతిర్న యావన్మయి వాసుదేవే న ముచ్యతే దేహయోగేన తావత్

ఆచరించే కర్మల వలననే మనస్సేర్పడుతుంది. అవిద్యతో ఆత్మకు శరీర బంధమేర్పడుతుంది, అవిద్య కర్మలతో ఏర్పడుతుంది. నాయందు ప్రీతి కలిగేంతవరకూ ఈ చక్రం తొలగదు. అంతవరకూ దేహయోగముతో విడువబడడు 

యదా న పశ్యత్యయథా గుణేహాం స్వార్థే ప్రమత్తః సహసా విపశ్చిత్
గతస్మృతిర్విన్దతి తత్ర తాపానాసాద్య మైథున్యమగారమజ్ఞః

ఆత్మ తత్వజ్ఞ్యానం కలిగినవాడు రజ సత్వ తమో గుణాల వలన కలిగే కోరికలన్నీ అసత్యములని తెలుసుకోడో అంతవరకూ సంసారం మీద బంధముంటుంది. పరమాత్మ యందూ తత్వం యందూ స్మరణ ఉండక శరీరములో తాపాలను పొందుతాడు. స్త్రీ పురుష సమాగమ రూపమైన సుఖమును గోరి తాపమును పొందుతాడు 

పుంసః స్త్రియా మిథునీభావమేతం తయోర్మిథో హృదయగ్రన్థిమాహుః
అతో గృహక్షేత్రసుతాప్తవిత్తైర్జనస్య మోహోऽయమహం మమేతి

సంసారానికీ వాసనకూ స్త్రీ పురుషుల మిథునీ భావము (దంపతులుగా ఉండుట) హృదయానికి పెద్ద పీటముడి. దాని వలన ఇద్దరికీ బంధము పెరుగుతుంది. దంపతులుగా ఉన్నప్పటినుండీ ఇది మొదలవుతుంది. ఇల్లూ పొలమూ పుత్రులూ మిత్రులూ, వీరందరినీ పోషించడానికీ విత్తం కావాలి. నేనూ నావాళ్ళూ అన్న మోహం దీని వలననే పెరుగుతుంది.

యదా మనోహృదయగ్రన్థిరస్య కర్మానుబద్ధో దృఢ ఆశ్లథేత
తదా జనః సమ్పరివర్తతేऽస్మాద్ముక్తః పరం యాత్యతిహాయ హేతుమ్

కర్మలనాచరించినంత వరకూ హృదయానికి గ్రంధి ఏర్పడుతున్నది. అది ఉన్నంతవరకూ పరమాత్మ జ్ఞ్యానం కలగదు. ఆ హృదయ గ్రంధి పోవాలి. 

హంసే గురౌ మయి భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వన్ద్వతితిక్షయా చ
సర్వత్ర జన్తోర్వ్యసనావగత్యా జిజ్ఞాసయా తపసేహానివృత్త్యా

అది కలగాలంటే పరమహంఅసా గురువూ దైవమూ అయిన నాయందు భక్తితో అనుసరించి ఉండటముతోటీ సంసారము యందు ఆశ లేకుండా ఉండటముతో జంటలను జయించి, ప్రపంచములో పుట్టిన ప్రతీ ప్రాణీ కష్టాలి పడుతున్నది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆత్మ తత్వాన్నీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి తపసుతోటీ ఆశలను తొలగించే ప్రయత్నముతోటీ 

మత్కర్మభిర్మత్కథయా చ నిత్యం మద్దేవసఙ్గాద్గుణకీర్తనాన్మే
నిర్వైరసామ్యోపశమేన పుత్రా జిహాసయా దేహగేహాత్మబుద్ధేః

న సేవలు చేస్తూ నా కథలు వింటూ నావారితో కలిసి ఉండటమూ ఎవరియందూ వైరాన్ని పెట్టుకోకుండా సమానభావముతో ఉంటూ ఇంద్రియ నిగ్రహముతో (మనసూ మిగతా ఇంద్రియాలను గెలుచుట) శరీరం యందు ఇంటి యందు మనసు యందూ, శరీరమే ఆత్మ అనే బుద్ధి వదిలిపెట్టి అధ్యాత్మ యోగముతో శరీరమంటే ఆత్మ వేరనే భావనతో ధ్యానించగలగాలి

అధ్యాత్మయోగేన వివిక్తసేవయా ప్రాణేన్ద్రియాత్మాభిజయేన సధ్ర్యక్
సచ్ఛ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వదసమ్ప్రమాదేన యమేన వాచామ్

చక్కగా ప్రాణములనూ ఇంద్రియములనూ మనసునూ జయించి, బ్రహ్మచర్యముతో పొరబాటున కూడా మోహానికి గురికాకుండా మితబాషిత్వముతో భ్రమ లేకుండా వ్యామోహం లేకుండా సకల జగత్తులో నన్నే చూడగలగాలి

సర్వత్ర మద్భావవిచక్షణేన జ్ఞానేన విజ్ఞానవిరాజితేన
యోగేన ధృత్యుద్యమసత్త్వయుక్తో లిఙ్గం వ్యపోహేత్కుశలోऽహమాఖ్యమ్

విజ్ఞ్యానముతో కూడి ఉన్న జ్ఞ్యానాన్ని (విజ్ఞ్యానమంటే శరీరాన్ని పోషించుకోవడం) యోగముతో ధైర్యమూ పరిశుద్ధితో కూడి నేను నేననే సంస్కారాన్ని మెల్లిగా తొలగించుకోవాలి

కర్మాశయం హృదయగ్రన్థిబన్ధమవిద్యయాసాదితమప్రమత్తః
అనేన యోగేన యథోపదేశం సమ్యగ్వ్యపోహ్యోపరమేత యోగాత్

కర్మలకు సంస్కారం మూలం. ఇది హృదయ గ్రంధిని బంధిస్తుంది. ఈ కర్మ అవిద్య వలన వచ్చింది.అది తెలుసుకుని ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉపదేశించిన జ్ఞ్యానం ప్రకారం ఈ శరీరాత్మ భావాన్ని శరీర బంధాన్నీ వాసననూ సంస్కారాన్ని వదిలిపెట్టి ఆ యోగాన్ని కూడా వదిలిపెడతాడు. శరీరాన్ని దారిలో పెట్టుటే యోగం (యుజ్యతే ఇతి యోగః). శరీరమంటే ఏమిటో తెలిసి శరీరాన్ని దారిలో పెడితే మనసు ఆత్మ వైపు వెళుతుంది, మనసును ఆత్మవైపు పెట్టడానికే యోగం. అలా లగ్నమయ్యాక వెనక్కు తిరిగిరాదు కాబట్టి యోగముతో పని లేదు

పుత్రాంశ్చ శిష్యాంశ్చ నృపో గురుర్వా మల్లోకకామో మదనుగ్రహార్థః
ఇత్థం విమన్యురనుశిష్యాదతజ్జ్ఞాన్న యోజయేత్కర్మసు కర్మమూఢాన్
కం యోజయన్మనుజోऽర్థం లభేత నిపాతయన్నష్టదృశం హి గర్తే

తండ్రి కుమారులనూ గురువు శిష్యులనూ సరి అయిన మార్గములో పెట్టాలి. నా లోకన్ని పొందగోరినవాడు నా అనుగ్రహం కోసం ఈ విధానాన్ని రాగ ద్వేషాలు లేకుండా సహనం కోల్పోకుండా ఆ తత్వం తెలియని వారికి బోధించాలి. గురువైన వాడూ తెలిసిన వాడు కర్మలతో మూఢులైన వారికి కర్మలను బోధించకూడదు, కర్మలలో నియోగించరాదు. కళ్ళు లేని వారిని గోతిలో పడేసినందు వలన కళ్ళు ఉన్న వారికేమి లాభము. జ్ఞ్యానమున్న వాడు అజ్ఞ్యానులను సంసారములో పడవేయకూడదు. 

లోకః స్వయం శ్రేయసి నష్టదృష్టిర్యోऽర్థాన్సమీహేత నికామకామః
అన్యోన్యవైరః సుఖలేశహేతోరనన్తదుఃఖం చ న వేద మూఢః

సహజముగానే ఈ లోకమంతా శ్రేయస్సు ఎలా పొందాలో అన్న విషయం తెలియకుండానే ఉంటుంది. అలాంటి వారు అన్ని ప్రయోజనాలనూ కోరికతో పొందుతూ ఉంటాడు. కొద్ది సుఖం కలుగుతుందీ అన్న భావన కలిగితే పర్సపరం ద్వేషించుకుంటూ ఉంటారు. కోరికలు బాగా ఎక్కువవడమే దీనికి కారణం. కోరిక వలన వైరమూ వైరము వలన కష్టాలు పెరుగుతాయి. 

కస్తం స్వయం తదభిజ్ఞో విపశ్చిదవిద్యాయామన్తరే వర్తమానమ్
దృష్ట్వా పునస్తం సఘృణః కుబుద్ధిం ప్రయోజయేదుత్పథగం యథాన్ధమ్

సంసారమ్యొక్క రహస్యం తెలిసినవాడెవడైనా పక్కవారిని సంసారములో పడమని బోధిస్తారా? దారి తెలియకుండా పక్కదారి పట్టిన గుడ్డి వాడికి కనులున్నవాడు దారి చూపినట్లుగా వారు సంసారములో మిగతావారిని పడనీయరు

గురుర్న స స్యాత్స్వజనో న స స్యాత్పితా న స స్యాజ్జననీ న సా స్యాత్
దైవం న తత్స్యాన్న పతిశ్చ స స్యాన్న మోచయేద్యః సముపేతమృత్యుమ్

సంసారాన్ని ఎవరు దాటిస్తారో వారే గురువూ భర్తా తల్లీ తండ్రీ. అలా చేయలేని వాడు తండ్రీ కాడూ, తల్లీ కాదు, గురువూ కాదూ, అలా చేయలేని దేవుడు దేవుడే కాడు. 

ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్త్వం హి మే హృదయం యత్ర ధర్మః
పృష్ఠే కృతో మే యదధర్మ ఆరాదతో హి మామృషభం ప్రాహురార్యాః

అసలు నాకు ఈ శరీరముతో ఎటువంటి సంబంధమూ లేదు. ఈ శరీరాన్ని నేను తెచ్చుకున్నాను గానీ శరీరము నాకు రాలేదు. ధర్మము నా హృదయము. అధర్మము నాకు వీపు. ధర్మము ముందు ఉండి అధర్మమును తొలగించిన వాడిని కాబట్టి నేను వృషబున్ని.

తస్మాద్భవన్తో హృదయేన జాతాః సర్వే మహీయాంసమముం సనాభమ్
అక్లిష్టబుద్ధ్యా భరతం భజధ్వం శుశ్రూషణం తద్భరణం ప్రజానామ్

అందుకే నా హృదయమునుంచి పుట్టిన మీలో పెద్దవాడైన భరతుడిని సేవించండి నేను వెళ్ళిన తరువాత. మనస్సుని కష్టపెట్టుకోకుండా సేవించండి. మీరు రాజుని సేవించుటే అతని మాట వినుటే మీరు ప్రజలను పరిపాలించుట. 

భూతేషు వీరుద్భ్య ఉదుత్తమా యే సరీసృపాస్తేషు సబోధనిష్ఠాః
తతో మనుష్యాః ప్రమథాస్తతోऽపి గన్ధర్వసిద్ధా విబుధానుగా యే

చైతన్యం లేని వాటి కంటే చైతన్యం గల గడ్డి పరకలూ మొలకలూ ఉత్తములూ, వాటి కంటే ఉత్తములు ప్రాణం ఉన్నవి. ప్రాణమున్నవాటికంటే జ్ఞ్యానం ఉన్నవి ఉత్తములు, జ్ఞ్యానం కలవాటన్నిటిలో మనుష్యులు ఉత్తములు, వారిలో కూడా యోగులు ఉత్తములు. గంధర్వులు సిద్ధులూ దేవతలూ వీరి కంటే ఉత్తములు, వీరికంటే ఇంద్రాదులూ, ఇంద్రాదులు కంటే దక్షాదులూ, దక్షాదులకంటే శంకరుడు శ్రేష్టుడు, ఆయన కంటే బ్రహ్మ శ్రేష్టుడు. ఆ బ్రహ్మ నా యందు భక్తి కలవాడు. నాకు బ్రాహ్మణోత్తములు దేవతలు. బ్రాహ్మణులతో సమానమైన ప్రాణమును చూడలేము. 

దేవాసురేభ్యో మఘవత్ప్రధానా దక్షాదయో బ్రహ్మసుతాస్తు తేషామ్
భవః పరః సోऽథ విరిఞ్చవీర్యః స మత్పరోऽహం ద్విజదేవదేవః

న బ్రాహ్మణైస్తులయే భూతమన్యత్పశ్యామి విప్రాః కిమతః పరం తు
యస్మిన్నృభిః ప్రహుతం శ్రద్ధయాహమశ్నామి కామం న తథాగ్నిహోత్రే

ఇలాంటి బ్రాహ్మణులకు పెట్టిన దాన్ని వారు భుజిస్తుంటే వారి నాలుకలతో నేను తింటాను గానీ అగ్నిహోత్రములో ఉన్నదాన్ని కాదు. యజ్ఞ్య యాగాదులకంటే బ్రాహ్మణ భోజనం నాకు ప్రీతి.

ధృతా తనూరుశతీ మే పురాణీ యేనేహ సత్త్వం పరమం పవిత్రమ్
శమో దమః సత్యమనుగ్రహశ్చ తపస్తితిక్షానుభవశ్చ యత్ర

ఈ బ్రాహ్మణులలో శమమూ దమమూ సత్యం అనుగ్రహం తితీక్ష తపము ఉంటాయి. (ఇవి ఉన్న వారే బ్రాహ్మణులు) 

మత్తోऽప్యనన్తాత్పరతః పరస్మాత్స్వర్గాపవర్గాధిపతేర్న కిఞ్చిత్
యేషాం కిము స్యాదితరేణ తేషామకిఞ్చనానాం మయి భక్తిభాజామ్

అన్ని లోకాలలో ఏది కావాలన్నా ఇచ్చేది నేనే. నాకంటే పరమైనది ఇంకోటి లేదు. దేన్నీ కోరని వారు కూడా నన్ను కోరతారు 

సర్వాణి మద్ధిష్ణ్యతయా భవద్భిశ్చరాణి భూతాని సుతా ధ్రువాణి
సమ్భావితవ్యాని పదే పదే వో వివిక్తదృగ్భిస్తదు హార్హణం మే

సకల ప్రపంచమూ నా రూపముగా భావించండి. మీరు వేటి వేటిని ద్వేషిస్తున్నారో అవి అన్నీ నా గృహాలే అని భావించిన నాడు వాటిని ద్వేషిస్తారా? చరాచరాలు ధృవములూ అధృవములూ అన్నీ నా రూపము. సకల ప్రపంచమూ పరమాత్మ స్వరూపమే అని చూచుటే నా ఆరాధనే 

మనోవచోదృక్కరణేహితస్య సాక్షాత్కృతం మే పరిబర్హణం హి
వినా పుమాన్యేన మహావిమోహాత్కృతాన్తపాశాన్న విమోక్తుమీశేత్

మనస్సు వాక్కు ఇంద్రియములూ నేత్రములనూ నా అనుగ్రహముతోనే మీరు నిగ్రహించుకోగలరు. నా అనుగ్రహం లేకుండా, ప్రపంచమంతా నా రూపమనే ఈ దృష్టి లేని వాడు యమ పాశం నుండి విముక్తుడు కాలేడు. త్రికరణములచే నన్ను ఆరాధించిన వాడిని సంసారం బాధించదు

శ్రీశుక ఉవాచ
ఏవమనుశాస్యాత్మజాన్స్వయమనుశిష్టానపి లోకానుశాసనార్థం మహానుభావః పరమ
సుహృద్భగవానృషభాపదేశ ఉపశమశీలానాముపరతకర్మణాం మహామునీనాం భక్తిజ్ఞానవైరాగ్య
లక్షణం పారమహంస్యధర్మముపశిక్షమాణః స్వతనయశతజ్యేష్ఠం పరమభాగవతం భగవజ్
జనపరాయణం భరతం ధరణిపాలనాయాభిషిచ్య స్వయం భవన ఏవోర్వరితశరీరమాత్రపరిగ్రహ ఉన్మత్త
ఇవ గగనపరిధానః ప్రకీర్ణకేశ ఆత్మన్యారోపితాహవనీయో బ్రహ్మావర్తాత్ప్రవవ్రాజ

కుమారులకీ విధముగా లోకానికి బోధించడానికి పరమ సుహృత్ అయిన పరమాత్మ ఇంద్రియ నిగ్రహం ప్రధానముగా కల మహామునులకు భక్తి జ్ఞ్యాన వైరాగ్యాన్ని బోధించే సన్యాసి ధర్మం ప్రపత్తి ధర్మ పరమాత్మ ధర్మం బోధిస్తున్నవాడై కుమారులలో పెద్దవాడూ భాగవతోత్తముడైన భరతున్ని రాజ్య పాలనానికి అభిషేకం చేసి ఈ భూమి  మీదకు ఎలా వచ్చాడో అలాగే తయారయ్యాడు. దిగంబరుడై ఉన్మత్తుడిలా జుట్టు విరబోసుకుని శరీరములో అగ్నిహోత్రాన్ని ఆవేశింపచేసుకుని బ్రహ్మావర్త దేశమునకు బయలుదేరాడు

జడాన్ధమూకబధిరపిశాచోన్మాదకవదవధూతవేషోऽభిభాష్యమాణోऽపి జనానాం గృహీతమౌన
వ్రతస్తూష్ణీం బభూవ

జడుడిలా గుడ్డి మూగా పిచ్చి చెవిటి వాడిలాగ పిశాచం పట్టినవాడిలాగ ఆకారం తెచ్చుకున్నాడు. శరీరం నిండా దుమ్ము కొట్టుకుని పోగా ఎవరి మాటలనూ లెక్కచేయక మౌన వ్రతాన్ని అవలంబించాడు 

తత్ర తత్ర పురగ్రామాకరఖేటవాటఖర్వటశిబిరవ్రజఘోషసార్థగిరి
వనాశ్రమాదిష్వనుపథమవనిచరాపసదైః పరిభూయమానో మక్షికాభిరివ వనగజస్తర్జన
తాడనావమేహనష్ఠీవనగ్రావశకృద్రజఃప్రక్షేపపూతివాతదురుక్తైస్తదవిగణయన్నేవాసత్సంస్థాన
ఏతస్మిన్దేహోపలక్షణే సదపదేశ ఉభయానుభవస్వరూపేణ స్వమహిమావస్థానేనాసమారోపితాహం
మమాభిమానత్వాదవిఖణ్డితమనాః పృథివీమేకచరః పరిబభ్రామ

పురములూ గ్రామములూ ఆకరములూ (చిన్న పల్లెలు) ఖేటములు (పది ఇల్లు కల గ్రామములు) ఆవటములు (చెట్ల కింద ఇల్లూ) పర్వతాలలో అరణ్యాలలో తోటలలో ప్రజలు చేస్తున్న అవహేళనను పట్టించుకోకుండా, అడవిలో ఏనుగు వెళుతుంటే ఈగలు బాధపెట్టినట్లుగా కొందరు రాళ్ళతో కొట్టారు, కొందరు హింసించారు, దుర్భాషలాడారు దుమ్ము పోసారు మట్టి వేసారు. అవి ఏమీ పట్టీంచుకోకుండా ఇహలోకానుభవం పరలోకానుభవం శరీరానుభవం ఆత్మానుభవముతో తాను పరమాత్మ అంశ కాబట్టి తన ప్రభావాన్ని నిలుపుకుంటూ అహం మమ అన్న అహంకారము లేని వాడై ఒక్కడే ఈ పృధ్వీ మండలాన్ని సంచరిస్తూ ఉన్నాడు

అతిసుకుమారకరచరణోరఃస్థలవిపులబాహ్వంసగలవదనాద్యవయవవిన్యాసః ప్రకృతి
సున్దరస్వభావహాససుముఖో నవనలినదలాయమానశిశిరతారారుణాయతనయనరుచిరః సదృశసుభగ
కపోలకర్ణకణ్ఠనాసో విగూఢస్మితవదనమహోత్సవేన పురవనితానాం మనసి కుసుమ
శరాసనముపదధానః పరాగవలమ్బమానకుటిలజటిలకపిశకేశభూరిభారోऽవధూతమలిననిజ
శరీరేణ గ్రహగృహీత ఇవాదృశ్యత

పరమ సుందరుడు, పరమ సుకుమారమైన అవయవములు కలవాడు. సహజమైన సుందరుడు కాబట్టి ఆయన నవ్వితే అందరి మనసుకూ ఆహ్లాదం కలిగించింది. పుండరీకాక్షుడు కాబట్టి అప్పుడే వికసించిన పద్మము వలె వికసించిన చల్లటి చూపులు గలవాడు. కపోలములూ కంఠమూ నాసికా అందముగా కలవాడై ఎందుకు నవ్వుతున్నాడో ఎవరికీ అర్థం కాకుండా జనుల అజ్ఞ్యానానికి జాలిపడుతూ నవ్వాడు. పురస్త్రీల మనస్సులో మన్మధుడి బాణాలను ఎక్కుపెడుతూ, దుమ్మంతా గాలికి లేచి శరీరానికి అలముకుని గ్రహము పట్టినవాడిలా అందరికీ కనపడ్డాడు. 

యర్హి వావ స భగవాన్లోకమిమం యోగస్యాద్ధా ప్రతీపమివాచక్షాణస్తత్ప్రతిక్రియాకర్మ
బీభత్సితమితి వ్రతమాజగరమాస్థితః శయాన ఏవాశ్నాతి పిబతి ఖాదత్యవమేహతి హదతి స్మ చేష్టమాన
ఉచ్చరిత ఆదిగ్ధోద్దేశః

పరమాత్మ ఈ లోకానికి యోగము నేర్పాలనుకున్నవాడు కాబట్టి ఉన్నవారు తరించాలన్నా తెలుసుకోవాలన్నా బ్రతకాలన్నా ఏ పనులు చేయాలో వృషభుడు దానికి వ్యతిరిక్తముగా చేస్తున్నాడు. తత్వం తెలుసుకున్న వారు ఎటువంటి నియమమూ పాటించరు. ఈయన ఎటువంటి ప్రతీకారం లేకుండా (దురద పెడితే గోక్కోవడం ఆకలేస్తే అన్నం తినడం దాహం వేస్తే నీరు తాగడం ఎత్చ్..,)  ఆజగర వ్రతం (కొండచిలువ) ఆచరించాడు.  కొండచిలువ తానున్నచోటికి వస్తేనే తింటుంది. భగవంతుడు అందించిన దానితోనే తృప్తి పడడం ఆజగర వ్రతం. ఆయన పడుకునే అన్ని పనులూ (తినడం తాగడం మల మూత్ర విసర్జనా) చేస్తున్నాడు. 

తస్య హ యః పురీషసురభిసౌగన్ధ్యవాయుస్తం దేశం దశయోజనం సమన్తాత్సురభిం చకార

మహాయోగి అయిన ఆయన మలం దశయోజనాల మేర సుగంధాన్ని వెదజల్లింది. 

ఏవం గోమృగకాకచర్యయా వ్రజంస్తిష్ఠన్నాసీనః శయానః కాకమృగగోచరితః పిబతి
ఖాదత్యవమేహతి స్మ

కొన్నాళ్ళు గోవులా కొన్నాళ్ళు మృగములా కొన్నాళ్ళు కాకిలా ఉన్నాడు, నడుచుకుంటూ ఉంటూ ఒకే కూర్చుని పని చేసుకుంటూ తింటూ తాగుతూ మూత్ర విసర్జన చేస్తూ కైవల్యాధిపతి అయిన స్వామి ఆనందస్వరూపుడు , పరమాత్మలోనే తనను ఉంచి, పరమాత్మకూ తనకూ ఎలాంటి వ్యవధానం లేకుండా అన్నీ సిద్ధించినవాడై  (అష్టసిద్ధులు పొందినవాడై),

ఇతి నానాయోగచర్యాచరణో భగవాన్కైవల్యపతిరృషభోऽవిరతపరమమహానన్దానుభవ ఆత్మని
సర్వేషాం భూతానామాత్మభూతే భగవతి వాసుదేవ ఆత్మనోऽవ్యవధానానన్తరోదరభావేన సిద్ధ
సమస్తార్థపరిపూర్ణో యోగైశ్వర్యాణి వైహాయసమనోజవాన్తర్ధానపరకాయప్రవేశదూరగ్రహణాదీని
యదృచ్ఛయోపగతాని నాఞ్జసా నృప హృదయేనాభ్యనన్దత్

మనోజవం పరకాయ ప్రవేశం దూరగ్రహణం దూర శ్రవణం అన్నీ రాగా వాటిని అభినందించలేదు, ఒప్పుకోలేదు. యోగముతో కలిగిన జ్ఞ్యానాగ్నిలో అన్ని కర్మబీజములూ కాల్చివేశాడూ. ఇది విన్న పరీక్షిత్తు "కోరకుండా వచ్చినా కోరి వచ్చినా వచ్చిన ఐశ్వర్యాన్ని ఒప్పుకుంటే మళ్ళీ సంసారములో పడినట్లే. " అన్నాడు. అప్పుడు శుకుడు

Popular Posts