Followers

Monday 24 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం రెండవ అధ్యాయం


శ్రీనారద ఉవాచ
భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా
హిరణ్యకశిపూ రాజన్పర్యతప్యద్రుషా శుచా

శ్రీమహావిష్ణువు వరాహ రూపం ధరించి హిరణ్యాక్షున్ని సంహరిస్తే హిరణ్య కశ్యపుడు కోపముతో దు@ఖముతో తపించిపోయాడు.

ఆహ చేదం రుషా పూర్ణః సన్దష్టదశనచ్ఛదః
కోపోజ్జ్వలద్భ్యాం చక్షుర్భ్యాం నిరీక్షన్ధూమ్రమమ్బరమ్

కరాలదంష్ట్రోగ్రదృష్ట్యా దుష్ప్రేక్ష్యభ్రుకుటీముఖః
శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్

పళ్ళు కొరుకుతూ కళ్ళు తిప్పుతో క్రోధముతో శోకముతో నీరు కారుతూ ఉంటే కనుబొమ్మలు తిప్పుతూ శులాన్ని ఎత్తుకొని అక్కడ ఉన్న దైత్యులని ఉద్దేశ్యించి


భో భో దానవదైతేయా ద్విమూర్ధంస్త్ర్యక్ష శమ్బర
శతబాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల

విప్రచిత్తే మమ వచః పులోమన్శకునాదయః
శృణుతానన్తరం సర్వే క్రియతామాశు మా చిరమ్

సపత్నైర్ఘాతితః క్షుద్రైర్భ్రాతా మే దయితః సుహృత్
పార్ష్ణిగ్రాహేణ హరిణా సమేనాప్యుపధావనైః

మీరందరూ నేను చెప్పినది జాగ్రత్తగా వినండి, చెప్పినట్లు చేయండి. ణా సోదరుడు కపటులైన శత్రువుచేత చంపబడ్డాడు.

తస్య త్యక్తస్వభావస్య ఘృణేర్మాయావనౌకసః
భజన్తం భజమానస్య బాలస్యేవాస్థిరాత్మనః

నిరంతరం వారి పక్షం వహించి వారిని సేవించే విష్ణువు చేత చంపబడ్డాడు. వనములో ఉండేవాడు. (వనం అంటే నీరు అనీ, అడవి అనీ వస్తుంది అర్థం). మాయా రూపములో ఉండే వన వరాహముగా ఉండి క్షుద్రుడై, పిల్లవాని స్వభావము కలవాడై, పిలిచిన వారి వెంట పోయే రకం కలవాడు, చంచల బుద్ధి కలవాడు అయిన విష్ణువు.

మచ్ఛూలభిన్నగ్రీవస్య భూరిణా రుధిరేణ వై
అసృక్ప్రియం తర్పయిష్యే భ్రాతరం మే గతవ్యథః

నా త్రిశూలముతో ఆయన శిరస్సు ఖండించి రక్తమంటే ప్రీతి కలిగిన నా తమ్మునికి ఇస్తాను

తస్మిన్కూటేऽహితే నష్టే కృత్తమూలే వనస్పతౌ
విటపా ఇవ శుష్యన్తి విష్ణుప్రాణా దివౌకసః

తరువాత వేరు పోయిన చెట్ల లాగ దేవతలందరూ నశిస్తారు

తావద్యాత భువం యూయం బ్రహ్మక్షత్రసమేధితామ్
సూదయధ్వం తపోయజ్ఞ స్వాధ్యాయవ్రతదానినః

మీరు బయలు దేరి భూమండలానికి వెళ్ళండి. అక్కడ అంతా ధ్వంసం చేయండి. అక్కడ అందరూ బ్రాహ్మణులూ క్షత్రియులూ ఉంటారు. వారి వలన పాడైన భూమిని బాగు చేయండి. తపస్సూ స్వాధ్యాయం యజ్ఞ్యం చేసే వారు కనపడితే చంపేయ్యండి, ఎందుకంటే విష్ణువు అవి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు

విష్ణుర్ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాన్
దేవర్షిపితృభూతానాం ధర్మస్య చ పరాయణమ్

బ్రాహ్మణులు చేసే పనులలోనే విష్ణువు ఉంటాడు. ధర్మం యజ్ఞానికీ విష్ణువు బ్రాహ్మణులకీ మూలం. ఏఎ రెంటినీ నాశనం చేయండి

యత్ర యత్ర ద్విజా గావో వేదా వర్ణాశ్రమక్రియాః
తం తం జనపదం యాత సన్దీపయత వృశ్చత

గోవులూ బ్రాహ్మణులూ వేదములూ వర్ణాశ్రమాలు ఉన్న పల్లెలకి వెళ్ళి తగలపెట్టండి నరికేయ్యండి.

ఇతి తే భర్తృనిర్దేశమాదాయ శిరసాదృతాః
తథా ప్రజానాం కదనం విదధుః కదనప్రియాః

అది విన్న యుద్ధ ప్రియులైన రాక్షసులు బయలు దేరారు. Yఉద్ధం చేస్తున్నారు.పురములూ గ్రామములూ ఆశ్రములూ మండలాలూ నగరములూ పట్టణాలూ అన్ని తగలపెట్టారు. గడ్డపారలతో పారలతో వంతెనలనూ ప్రాకారాలనూ దేవాలయాలనూ మహావృక్షాలనూ పెకిలించి వేశారు.దివిటీలతో ఇళ్ళు తగలపెట్టారు. ఇలా హిరణ్యకశిపుని అనుచరులతో లోకమంతా పీడించబడితే దేవతలంతా స్వర్గాన్ని వీడి కిందకు వచ్చారు

పురగ్రామవ్రజోద్యాన క్షేత్రారామాశ్రమాకరాన్
ఖేటఖర్వటఘోషాంశ్చ దదహుః పత్తనాని చ

కేచిత్ఖనిత్రైర్బిభిదుః సేతుప్రాకారగోపురాన్
ఆజీవ్యాంశ్చిచ్ఛిదుర్వృక్షాన్కేచిత్పరశుపాణయః
ప్రాదహన్శరణాన్యేకే ప్రజానాం జ్వలితోల్ముకైః

ఏవం విప్రకృతే లోకే దైత్యేన్ద్రానుచరైర్ముహుః
దివం దేవాః పరిత్యజ్య భువి చేరురలక్షితాః

హిరణ్యకశిపుర్భ్రాతుః సమ్పరేతస్య దుఃఖితః
కృత్వా కటోదకాదీని భ్రాతృపుత్రానసాన్త్వయత్

శకునిం శమ్బరం ధృష్టిం భూతసన్తాపనం వృకమ్
కాలనాభం మహానాభం హరిశ్మశ్రుమథోత్కచమ్

తన్మాతరం రుషాభానుం దితిం చ జననీం గిరా
శ్లక్ష్ణయా దేశకాలజ్ఞ ఇదమాహ జనేశ్వర

ఇలా ధ్వంసం చేసిన తరువాత తమ్మునికి అంత్య క్రియలు జరిపాడు, తర్పణాలు ఇచ్చాడు. శకుని మొదైలైన పిల్లలూ, వారి తల్లి వృషాభాను, తమ తల్లి అయిన దితినీ జాలితో ప్రేమతో వినయముతో కరుణతో ఇలా మాట్లాడాడు

శ్రీహిరణ్యకశిపురువాచ
అమ్బామ్బ హే వధూః పుత్రా వీరం మార్హథ శోచితుమ్
రిపోరభిముఖే శ్లాఘ్యః శూరాణాం వధ ఈప్సితః

అమ్మా, కోడలా (హిరణ్యాక్షుని భార్య తనకు కోడలితో సమానం), పుత్రులారా, శత్రువుకు అభిముఖముగా యుద్ధం చేసి మరణించుట మెచ్చుకోదగ్గ విషయం

భూతానామిహ సంవాసః ప్రపాయామివ సువ్రతే
దైవేనైకత్ర నీతానామున్నీతానాం స్వకర్మభిః

చలివేంద్రములో ఒక కుండ పెట్టుకుని కూర్చుంటారు. దప్పి ఐన వారు వరుసలో నిలుచుని మాట్లాడుకుంటారు. ఆ వరుసలో ఉన్నంతసేపూ కాసేపు మాట్లాడుకొంటారు. తరువాత ఎవరి దారిన వారు పోతారు. జీవితములో కూడా అంతే. పరమాత్మ ఈ జీవులను తాము తాము ఆచరించిన కర్మలకు అనుగుణముగా కలుపుతాడు. ఆ పని ఉన్నంతవరకూ వారు కలిసి ఉంటారు. ఈ వియోగ సమ్యోగాలకు మనం విచారించరాదు.

నిత్య ఆత్మావ్యయః శుద్ధః సర్వగః సర్వవిత్పరః
ధత్తేऽసావాత్మనో లిఙ్గం మాయయా విసృజన్గుణాన్

ఆత్మ నిత్యం, తరగనిది, ప్రకృతి దోషాలు లేకుండా అన్ని తెలిసినది ఆత్మ ఈ. ఆత్మే మాయ చేత ప్రకృతి గుణములకు ఆసక్తుడై మాయచేత శరీరాన్ని ధరిస్తుంది

యథామ్భసా ప్రచలతా తరవోऽపి చలా ఇవ
చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే చలతీవ భూః

బాగా వేగముగా ప్రవాహం వెళుతూ ఉంటుంది, అప్పుడు వడ్డున ఉన్న చెట్లు కూడా మనతో వస్తున్నట్లు కనపడతాయి. కళ్ళు తిరుగుతున్నప్పుడు భూమి తిరుగుతున్నట్లు కనపడుతుంది. అలాగే నిత్యమైన ఆత్మకు అనిత్యమైన శరీర సంబంధం వలన ఈ ఆత్మకూడా అలాగే పోతుంది అని భ్రమ కలిగి ఉంటాము. ఈ మూడు గుణములతో మనసు భ్రమిస్తుంది. మనసు యొక్క భ్రమను ఆత్మ కూడా పొందినట్లు అనిపిస్తుంది.

ఏవం గుణైర్భ్రామ్యమాణే మనస్యవికలః పుమాన్
యాతి తత్సామ్యతాం భద్రే హ్యలిఙ్గో లిఙ్గవానివ

ఆత్మకు ఏ లింగమూ లేదు. మనమాచరించిన కర్మది శరీరం.

ఏష ఆత్మవిపర్యాసో హ్యలిఙ్గే లిఙ్గభావనా
ఏష ప్రియాప్రియైర్యోగో వియోగః కర్మసంసృతిః

శరీరము లేని చోట శరీరమున్నట్లు ఉన్న భావనే ఆత్మకు విపరీత జ్ఞ్యానం. ప్రియ సమాగమం, అప్రియ సమాగమం, ప్రియ వియోగం, అప్రియ వియోగం, మనకు కర్మ వలన కలుగుతాయి.ఈ సమ్యోగ వియోగముల కొరకు మనం చేసే కర్మలకే సంసారమని పేరు.

సమ్భవశ్చ వినాశశ్చ శోకశ్చ వివిధః స్మృతః
అవివేకశ్చ చిన్తా చ వివేకాస్మృతిరేవ చ

పుట్టుకా మరణం బాధా దుఃఖం విలాపం ఏమీ లేకుండా ఉండేది ఈ సంసారం. అవివేకం చింతా, వివేకమును మరచిపోవడం. వివేకం గుర్తు రాకపోవడం కూడా మన పాపములో భాగమే

అత్రాప్యుదాహరన్తీమమితిహాసం పురాతనమ్
యమస్య ప్రేతబన్ధూనాం సంవాదం తం నిబోధత

చనిపోయిన బంధువులతో యమ ధర్మ రాజు మాట్లాడిన గాధను చెబుతాను. ఉశీనుడనే వాడు యుద్ధములో సంహరించబడ్డాడు

ఉశీనరేష్వభూద్రాజా సుయజ్ఞ ఇతి విశ్రుతః
సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత

శరీరమంతా చీలిపోయింది, భయానక స్థితిలో ఉంది ఆ శరీరం.

విశీర్ణరత్నకవచం విభ్రష్టాభరణస్రజమ్
శరనిర్భిన్నహృదయం శయానమసృగావిలమ్

ప్రకీర్ణకేశం ధ్వస్తాక్షం రభసా దష్టదచ్ఛదమ్
రజఃకుణ్ఠముఖామ్భోజం ఛిన్నాయుధభుజం మృధే

ఉశీనరేన్ద్రం విధినా తథా కృతం పతిం మహిష్యః ప్రసమీక్ష్య దుఃఖితాః
హతాః స్మ నాథేతి కరైరురో భృశం ఘ్నన్త్యో ముహుస్తత్పదయోరుపాపతన్

శత్రువులచే ఇలా సంహరించబడిన భర్తను చూచి అతని భార్యలు దుఃఖపడి. "చనిపోయింది మీరు కాదు మేము" అని ఏడుస్తూ కన్నీరు కార్చారు. సిగ ముడి విడి ఆభరణములు జారి విలపించారు.దయలేని బ్రహ్మ నిన్ను మా నుండి వేరు చేసారు. మాకు ఆనందం ఇచ్చిన నీవే ఇపుడు దు@ఖాన్ని పెంచుతున్నావు. అలా విలపిస్తున్నప్పుడు, అతన్ని దహనం చేయడానికి వారెవరూ ఒప్పుకోలేదు. అప్పుడు సాయంకాలం అయ్యింది, సూర్యుడు అస్తమించాడు. వారి విలాపాన్ని చూచి వారికి ఓదార్పు కలిగించాలని, పిల్లవాని రూపములో వచ్చి

రుదత్య ఉచ్చైర్దయితాఙ్ఘ్రిపఙ్కజం సిఞ్చన్త్య అస్రైః కుచకుఙ్కుమారుణైః
విస్రస్తకేశాభరణాః శుచం నృణాం సృజన్త్య ఆక్రన్దనయా విలేపిరే

అహో విధాత్రాకరుణేన నః ప్రభో భవాన్ప్రణీతో దృగగోచరాం దశామ్
ఉశీనరాణామసి వృత్తిదః పురా కృతోऽధునా యేన శుచాం వివర్ధనః

త్వయా కృతజ్ఞేన వయం మహీపతే కథం వినా స్యామ సుహృత్తమేన తే
తత్రానుయానం తవ వీర పాదయోః శుశ్రూషతీనాం దిశ యత్ర యాస్యసి

ఏవం విలపతీనాం వై పరిగృహ్య మృతం పతిమ్
అనిచ్ఛతీనాం నిర్హారమర్కోऽస్తం సన్న్యవర్తత

తత్ర హ ప్రేతబన్ధూనామాశ్రుత్య పరిదేవితమ్
ఆహ తాన్బాలకో భూత్వా యమః స్వయముపాగతః

శ్రీయమ ఉవాచ
అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోకవిధిం విమోహః
యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అపి శోచన్త్యపార్థమ్

అహో ఇలా ఏడ్చేవారందరూ పెద్దవారు, ఇలాంటి వారికి ఈ వ్యామోహం ఏమిటి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళతారు. వచ్చినపుడు లేని వికారం పోయినపుడు ఎందుకు. వీరు కూడా పోయే వారే కదా. పోయేవారు తన కన్నా ముందు పోయిన వారి గురించి విచారిస్తున్నారు.

అహో వయం ధన్యతమా యదత్ర త్యక్తాః పితృభ్యాం న విచిన్తయామః
అభక్ష్యమాణా అబలా వృకాదిభిః స రక్షితా రక్షతి యో హి గర్భే

మీ కన్నా మేమే ధన్యులము. నా చిన్నప్పుడే తల్లి తండ్రులు పోయారు. కానీ నేను మీలా ఏడవటం లేదే. మేము ఉండేది అడవౌలలో. ఐనా మమ్ములను ఏ మృగాలూ తినలేదు. బాగానే ఉన్నాము. శిశువు గర్భములో ఉన్నప్పుడు ఎవరు కాపాడతారో బయట ఉన్నప్పుడూ వారే కాపాడతారన్న సత్యం తెలుసుకున్నము

య ఇచ్ఛయేశః సృజతీదమవ్యయో య ఏవ రక్షత్యవలుమ్పతే చ యః
తస్యాబలాః క్రీడనమాహురీశితుశ్చరాచరం నిగ్రహసఙ్గ్రహే ప్రభుః

ఏ పరమాత్మ తన సంకల్పముతో సృష్టి స్థితి సంహారం చేస్తాడో అలాంటి వాడికి ఈ ప్రపంచమంతా ఒక వినోదం. అనుగ్రహిస్తాడు నిగ్రహిస్తాడు. సృష్టిస్తాడూ సంహరిస్తాడు. నడి మార్గములో దారిలో ఉన్నా పరమాత్మ కాపాడ దలచుకుంటే సురక్షితముగా ఉంటాడు. ఇంట్లో ఉండి, అతని దృష్టిలేకపోతే మరణిస్తాడు

పథి చ్యుతం తిష్ఠతి దిష్టరక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి
జీవత్యనాథోऽపి తదీక్షితో వనే గృహేऽభిగుప్తోऽస్య హతో న జీవతి

ఏ దిక్కులేని వాడైనా అడవైలో ఉన్నా పరమాత్మ అనుగ్రహం ఉంటే బతుకుతాడు. ఇంటిలోనే ఉన్నా ఆయన కటాక్షం లేకపోతే ఆ ఇల్లే కూలి మీద పడుతుంది.

భూతాని తైస్తైర్నిజయోనికర్మభిర్భవన్తి కాలే న భవన్తి సర్వశః
న తత్ర హాత్మా ప్రకృతావపి స్థితస్తస్యా గుణైరన్యతమో హి బధ్యతే

అందుకోసం ప్రాణులు వారు వారు ఆచరించిన కర్మలకనుగుణముగా కొంతకాలముంటారు పోతారు. ఆత్మ ఎప్పుడూ ప్రకృతి గుణములకు బద్ధం కాదు. ప్రకృతి సంబంధం వలన కలిగిన ఈ శరీరం నాది అనుకోవడం పురుషునికి మోహం వల్లనే కలుగుతుంది

ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథగ్భౌతికమీయతే గృహమ్
యథౌదకైః పార్థివతైజసైర్జనః కాలేన జాతో వికృతో వినశ్యతి

ఇల్లు కట్టుకోవడానికి మట్టీ నీరు గాలీ నిప్పూ వాడతాం. ఆ కలయికలో మార్పు వస్తే ఆ ఇల్లు కొంతకాలం తరువాత ఉండదు. ఇంటిలో ఎలా పంచభూతాలూ ఉంటాయో శరీరములో కూడా ఉంటాయి

యథానలో దారుషు భిన్న ఈయతే యథానిలో దేహగతః పృథక్స్థితః
యథా నభః సర్వగతం న సజ్జతే తథా పుమాన్సర్వగుణాశ్రయః పరః

కట్టెలో ఉండే నిప్పు కట్టెలో కంటే విడిగా కనపడుతుంది. శరీరములో ఉండే ప్రాణవాయువు శరీరం కన్నా విడిగా కనపడుతుంది.

సుయజ్ఞో నన్వయం శేతే మూఢా యమనుశోచథ
యః శ్రోతా యోऽనువక్తేహ స న దృశ్యేత కర్హిచిత్

అంతటా ఉన్నా ఆకాశం ఎందులో పట్టు బడనట్లు, శరీరములో ఉండే వాయువు విడిగా ఉన్నట్లు, కట్టెలో ఉన్న నిప్పు కట్టె కంటే వేరుగా ఉన్నట్లు శరీరము కన్నా ఆత్మ వేరుగా ఉంటుంది. మీరు ఏడ్చేది శరీరం కోసమా, శరీరములో ఉన్నవాడికోసమా. శరీరం కోసమైతే, శరీరం ఇక్కడే ఉంది.అందులో ఉన్న జీవుడి కోసం బాధపడుతున్నరా?ఆ జీవున్ని మీరెలాగూ చూడలేదు. ప్రాణం కోసం ఏదుతున్నారనుకుంటే ఎన్నడైనా ఆ ప్రాణం మీతో మాట్లాడిందా?

న శ్రోతా నానువక్తాయం ముఖ్యోऽప్యత్ర మహానసుః
యస్త్విహేన్ద్రియవానాత్మా స చాన్యః ప్రాణదేహయోః

భూతేన్ద్రియమనోలిఙ్గాన్దేహానుచ్చావచాన్విభుః
భజత్యుత్సృజతి హ్యన్యస్తచ్చాపి స్వేన తేజసా

యావల్లిఙ్గాన్వితో హ్యాత్మా తావత్కర్మనిబన్ధనమ్
తతో విపర్యయః క్లేశో మాయాయోగోऽనువర్తతే

వితథాభినివేశోऽయం యద్గుణేష్వర్థదృగ్వచః
యథా మనోరథః స్వప్నః సర్వమైన్ద్రియకం మృషా

అథ నిత్యమనిత్యం వా నేహ శోచన్తి తద్విదః
నాన్యథా శక్యతే కర్తుం స్వభావః శోచతామితి

లుబ్ధకో విపినే కశ్చిత్పక్షిణాం నిర్మితోऽన్తకః
వితత్య జాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్

కులిఙ్గమిథునం తత్ర విచరత్సమదృశ్యత
తయోః కులిఙ్గీ సహసా లుబ్ధకేన ప్రలోభితా

ఆసజ్జత సిచస్తన్త్ర్యాం మహిష్యః కాలయన్త్రితా
కులిఙ్గస్తాం తథాపన్నాం నిరీక్ష్య భృశదుఃఖితః
స్నేహాదకల్పః కృపణః కృపణాం పర్యదేవయత్

ఫ్రాణమూ ఇంద్రియం మనసూ శరీరం ఇవి పరమాత్మ మన కర్మకు అనుగుణముగా ఇస్తాడు.
కర్మగానుగుణముగా శరీరాన్ని పొందుతుంది కర్మానుగుణముగా శరీరాన్ని విడిచిపెడుతుంది
ఆ శరీరాన్ని చూచి నావాడు అంటే, ఆ శరీరం నాదనా, ఆ ఆత్మ నాది అనా అర్థం
గుణుమౌలతో ఏర్పడిన శరీరాన్ని చూచి ఆత్మ అనుకోవడం అసత్యపు అభినివేశనం
స్వప్నములో వస్తువులు స్వప్నం ఉన్నంతవరకూ ఉనంట్లు ఇవన్నీ దేహం ఉన్నంతవరకే ఉంటాయి.
మనం దేనికోసమైనా విచారించడం తప్పు. ఆఅత్మ ఎలాగూ నిత్యం, శరీరం ఎలాగూ అనిత్యం. దుఃఖముతో అనిత్యమైనది తిరిగి రాదు.నిత్యమైనది ఎలాగైనా ఉంటుంది.మనం మన విలాపముతో దాని స్వభావం మార్చలేము.మరి విలాపం దేనికోసం. చచ్చేవారు ఏడుపుతో బతకరు. బతికే వారు సంతోషం వలన చావరు.
ఒక అరణ్యములో ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. అక్కడున్న గింజలు చూసి ఆడపక్షి అక్కడ వాలి వలలో పడింది.అలా పట్టుబడిన పక్షికోసం మగ పక్షి విలపిస్తోంది. అలా ఉండగా వేటగాడు దాన్ని బాణముతో కొట్టాడు

అహో అకరుణో దేవః స్త్రియాకరుణయా విభుః
కృపణం మామనుశోచన్త్యా దీనయా కిం కరిష్యతి

కామం నయతు మాం దేవః కిమర్ధేనాత్మనో హి మే
దీనేన జీవతా దుఃఖమనేన విధురాయుషా

ఇలా విలపిస్తున్నప్పుడు దాన్ని కూడా కొట్టాడు

కథం త్వజాతపక్షాంస్తాన్మాతృహీనాన్బిభర్మ్యహమ్
మన్దభాగ్యాః ప్రతీక్షన్తే నీడే మే మాతరం ప్రజాః

ఏవం కులిఙ్గం విలపన్తమారాత్ప్రియావియోగాతురమశ్రుకణ్ఠమ్
స ఏవ తం శాకునికః శరేణ వివ్యాధ కాలప్రహితో విలీనః

ఏవం యూయమపశ్యన్త్య ఆత్మాపాయమబుద్ధయః
నైనం ప్రాప్స్యథ శోచన్త్యః పతిం వర్షశతైరపి

శ్రీహిరణ్యకశిపురువాచ
బాల ఏవం ప్రవదతి సర్వే విస్మితచేతసః
జ్ఞాతయో మేనిరే సర్వమనిత్యమయథోత్థితమ్

యమ ఏతదుపాఖ్యాయ తత్రైవాన్తరధీయత
జ్ఞాతయో హి సుయజ్ఞస్య చక్రుర్యత్సామ్పరాయికమ్

అతః శోచత మా యూయం పరం చాత్మానమేవ వా
క ఆత్మా కః పరో వాత్ర స్వీయః పారక్య ఏవ వా
స్వపరాభినివేశేన వినాజ్ఞానేన దేహినామ్

కాబట్టి కొన్నాళ్ళకు మీరు పోయే వారే. ఏదుస్తున్న మీకు ఇందులో ఉన్న ఆత్మ మరణించదని తెలియదా?తెలియదూ అంటే దుఃఖములో మరచిపోయి ఉంటారు.ఒక నూరేళ్ళు ఏద్చినా ఆ శరీరములోకి ఆత్మ రాదు.మరి ఎందుకు విలపిస్తున్నారు.ఇంత చిన్నవాడు ఇంత వేదాంతం మాట్లాడటం చూచి అక్కడి వారు ఆశ్చర్యపోయారు.వారంతా ఊరట చెందారు. యముడు అందరినీ ఓదార్చి వెళ్ళాడు. సుయజ్ఞ్యుని బంధువులు అతనికి అంత్యక్రియలు చేసారు. మీరు కూడా యుద్ధములో మరణించినవాడి కోసం బాధపడవద్దు. నావాడు ఎవడు, నేను ఎవడు. అలాంటి విచారముతో పని లేదు. ఎవరు ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు శరీరం. కేవలం అజ్ఞ్యానముతోనే నావారు ఇతరులూ అన్న భ్రమతో ఉంటాము. ఆపద సమానమైనా నా వాడు అనుకుంటే దుఃఖం ఎక్కువ వస్తుంది. బాధ అనేది ఆపద వలన కాదు, స్వీయ భావన వలన, మమకారం వలన. కేవలం అజ్ఞ్యానముతోటే ఈ భావం వస్తుంది.

శ్రీనారద ఉవాచ
ఇతి దైత్యపతేర్వాక్యం దితిరాకర్ణ్య సస్నుషా
పుత్రశోకం క్షణాత్త్యక్త్వా తత్త్వే చిత్తమధారయత్

హిరణ్యకశిపుని వాక్యాన్ని విని తల్లీ, హిరణ్యాక్షుని భార్యా శోకం క్షణములో విడిచిపెట్టింది పరమాత్మ తత్వములో చిత్తాన్ని నిలిపి దుఃఖాన్ని విడిచిపెట్టింది

Popular Posts