Followers

Sunday 23 March 2014

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీఋషిరువాచ
ఏవం జిహాసుర్నృప దేహమాజౌ మృత్యుం వరం విజయాన్మన్యమానః
శూలం ప్రగృహ్యాభ్యపతత్సురేన్ద్రం యథా మహాపురుషం కైటభోऽప్సు

ఇలా యుద్ధములో గెలుపు కంటే మృత్యువే గొప్ప అనుకున్నాడు. ఇవన్నీ చెప్పిన వృత్తాసురుడు ఇంద్రుని మీదకు శూలము పట్టుకుని కైటభుడు నీటిలో ఉన్న పరమాత్మ మీదకి పరిగెత్తుకు వెళ్ళినట్లుగా వెళ్ళాడు. 

తతో యుగాన్తాగ్నికఠోరజిహ్వమావిధ్య శూలం తరసాసురేన్ద్రః
క్షిప్త్వా మహేన్ద్రాయ వినద్య వీరో హతోऽసి పాపేతి రుషా జగాద

ప్రళయకాలాగ్నిలాగ  భయంకరమైన శూలాన్ని ఇంద్రుని మీద వేసి "నీవు చచ్చావు" అని పెద్దగా గర్జించాడు. 

ఖ ఆపతత్తద్విచలద్గ్రహోల్కవన్నిరీక్ష్య దుష్ప్రేక్ష్యమజాతవిక్లవః
వజ్రేణ వజ్రీ శతపర్వణాచ్ఛినద్భుజం చ తస్యోరగరాజభోగమ్

ఆ శులాన్ని వజ్రాయుధముతో ఖండించి శూలము విసిరిన వృత్తాసురుడి ఒక బాహువుని ఖండించాడు

ఛిన్నైకబాహుః పరిఘేణ వృత్రః సంరబ్ధ ఆసాద్య గృహీతవజ్రమ్
హనౌ తతాడేన్ద్రమథామరేభం వజ్రం చ హస్తాన్న్యపతన్మఘోనః

ఒక చేయి పోయిన రెండవ చేతితో ఒక పరిఘను తీసుకుని దవడ మీదా ఏనుగు మీదా కొట్టాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు వజ్రాయుధాన్ని జరవిడిచాడు. 

వృత్రస్య కర్మాతిమహాద్భుతం తత్సురాసురాశ్చారణసిద్ధసఙ్ఘాః
అపూజయంస్తత్పురుహూతసఙ్కటం నిరీక్ష్య హా హేతి విచుక్రుశుర్భృశమ్

ఆయుధము లేని ఇంద్రున్ని వృత్తాసురుడు కొట్టలేదు. ఇంద్రుని స్థితి చూసి అందరూ హాహాకారాలు చేసారు. 

ఇన్ద్రో న వజ్రం జగృహే విలజ్జితశ్చ్యుతం స్వహస్తాదరిసన్నిధౌ పునః
తమాహ వృత్రో హర ఆత్తవజ్రో జహి స్వశత్రుం న విషాదకాలః

ధర్మం తెలిసిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని తిరిగి తీసుకోలేదు. "ఆయుధము తీసుకుని చంపు" అని వృత్తాసురుడు చెప్పాడు.

యుయుత్సతాం కుత్రచిదాతతాయినాం జయః సదైకత్ర న వై పరాత్మనామ్
వినైకముత్పత్తిలయస్థితీశ్వరం సర్వజ్ఞమాద్యం పురుషం సనాతనమ్

నీవు ఎన్నో యుద్ధాలు చూసి ఉంటావు. ఏ యుద్ధములోనైనా ఎప్పుడూ ఒక్కరే గెలుస్తారా. ఇలా ఆయుధం కిందపడిందని బెంబేలుపడకు. యుద్ధం చేసే వారెవరూ యుద్ధములో ఒకరికే జయం కలుగుతుందని నమ్మరు. ఎప్పటికీ గెలిచే వాడు ఒకడే ఉన్నాడు. ఆయన సృష్టి రక్షణ ప్రళయం చేస్తాడు. ఈ మూటికీ ప్రభువైన అన్నిటికీ ఆది ఐన పరమాత్మ సనాతన పురుషుడు తప్ప ప్రపంచములో ఏ ఒక్కడూ ఎప్పుడూ గెలవడు. 

లోకాః సపాలా యస్యేమే శ్వసన్తి వివశా వశే
ద్విజా ఇవ శిచా బద్ధాః స కాల ఇహ కారణమ్

సకల చరా చర లోకములూ లోకపాలకులూ అతని వశములోనే బ్రతుకుతున్నారు. పక్షులను వల వేసి పట్టుకుంటాము. గింజలు ఏరుకుని తినదామనుకున్న పక్షులు సరిగ్గా అప్పుడే వల పడినా అది తెలుసుకోలేక, "మాకు ఆహారం దొరికింది" అనుకుంటాయి.బలికోరుతున్నవాడికీ బలి ఇస్తున్నవాడికీ కూడా చక్కగా ఆహరం పెట్టి బట్టలు తొడుగుతారు. బలికి సిద్ధం చేసేవాడికి ఆహారం సమృద్ధిగా పెట్టినట్లు మృత్యువు సిద్ధమైనప్పుడు మనకు పరమాత్మ సంపదలూ భార్యలూ ఐశ్వర్యాలూ ఇస్తాడు. కాలమే వీటన్నిటికీ కారణం. 

ఓజః సహో బలం ప్రాణమమృతం మృత్యుమేవ చ
తమజ్ఞాయ జనో హేతుమాత్మానం మన్యతే జడమ్

ప్రవృత్తి సామర్ధ్యం(సహః), ఎదుటి వారిని ఓడించే సామర్ధ్యం (ఓజ), ధారణ సామర్ధ్యం, ప్రాణం, అమృతం, మృత్యువు, ఇవన్నీ మన ఇష్టం కాదు. అవి అన్నీ పరమాత్మ ఇష్టం. అది తెలియక జడులు మాత్రమే "ఇవన్నీ నావు" అంటారు. 

యథా దారుమయీ నారీ యథా పత్రమయో మృగః
ఏవం భూతాని మఘవన్నీశతన్త్రాణి విద్ధి భోః

ఒక చెక్కబొమ్మ నడిపేవాడు నడిపితే నడిచినట్లుగా సకల భూతములూ పరమాత్మ ఆధీనములో ఉంటాయని తెలుసుకో

పురుషః ప్రకృతిర్వ్యక్తమాత్మా భూతేన్ద్రియాశయాః
శక్నువన్త్యస్య సర్గాదౌ న వినా యదనుగ్రహాత్

సకల ఇంద్రియాలూ మనసూ భూతములూ అన్నీ ఎవరి సంకల్పము వలన కలుగుతున్నాయో అతనే కారణం అని తెలుసుకో. 

అవిద్వానేవమాత్మానం మన్యతేऽనీశమీశ్వరమ్
భూతైః సృజతి భూతాని గ్రసతే తాని తైః స్వయమ్

జ్ఞ్యానం లేని వాడు అంతా తానని భ్రమిస్తాడు. జ్ఞ్యానం ఉన్న వాడు తనదంటూ ఏదీ లేదని తెలుసుకుంటాడు. ప్రాణులతో ప్రాణులనీ భూతములతో భూతములనీ సృష్టిస్తాడు. వేటితో సృష్టిస్తాడో వాటితో సంహరిస్తాడు. 

ఆయుః శ్రీః కీర్తిరైశ్వర్యమాశిషః పురుషస్య యాః
భవన్త్యేవ హి తత్కాలే యథానిచ్ఛోర్విపర్యయాః

మనం కోరినా కోరకున్నా ఆయువూ సంపదా కీతీ ఐశ్వర్యమూ బలమూ బ్రతుకూ మరణమూ పరమాత్మ అనుకుంటే వస్తాయి. మనం వేటిని కోరమో అవే ఎక్కువ వచ్చి కోరనివి ఎక్కువ వస్తాయి. రాకపోకలు మన ఇష్టం కాదు, పరమాత్మ ఇష్టం. ఇంద్రియములూ బుద్ధీ పరమాత్మ వశములో ఉంటాయి.

తస్మాదకీర్తియశసోర్జయాపజయయోరపి
సమః స్యాత్సుఖదుఃఖాభ్యాం మృత్యుజీవితయోస్తథా

గెలుపూ ఓటములనూ కీర్తి అపకీర్తులనూ జనన మరణములను సుఖ దుఃఖములనూ ఒకే తీరుగా చూస్తాడు జ్ఞ్యాని. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చేది పరమాత్మే. పరమాత్మ మనకు ఇచ్చే ప్రతీదీ మన మంచికే. 

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః
తత్ర సాక్షిణమాత్మానం యో వేద స న బధ్యతే

సత్వం రజస్సూ తమస్సూ అని మూడు గుణాలూ ప్రకృతివి, ఆత్మవి కావు. ప్రకృతిలో ఆత్మ సాక్షిగా ఉంటాడు. చూస్తున్నట్లూ అనుభవిస్తున్నట్లూ అనుకుంటాడు. అలా అనుకోవడం మానేస్తే, ఆత్మ కేవలం సాక్షీ అని తెలుసుకుంటారో అలాంటి వారు సంసారములో బంధించబడరు. 

పశ్య మాం నిర్జితం శత్రు వృక్ణాయుధభుజం మృధే
ఘటమానం యథాశక్తి తవ ప్రాణజిహీర్షయా

నన్ను చూసి నేర్చుకో. నాకు చేయిపోయింది. నీకు కేవలం ఆయుధమే పోయింది. కింద పడ్డ ఆయుధం తీసుకోవడానికి చేయి ఉంది నీకు. నాకు చేయి లేకపోయినా నేను ఆనందముగా మాట్లాడుతున్నాను. ఒక చేయి పోయినా ఇంకో చేయితో నిన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాను. అదే పని నీవూ చేయి.

ప్రాణగ్లహోऽయం సమర ఇష్వక్షో వాహనాసనః
అత్ర న జ్ఞాయతేऽముష్య జయోऽముష్య పరాజయః

యుద్ధమంటే జ్యూతం, ప్రాణమే పందెం, పాచికలు ఆయుహ్దాలు, ఆసనాలు వాహనాలు. జ్యూతములో ఒకడు గెలుస్తాడు ఒకడు ఓడుతాడని ఎవరికైనా తెలుస్తుందా

శ్రీశుక ఉవాచ
ఇన్ద్రో వృత్రవచః శ్రుత్వా గతాలీకమపూజయత్
గృహీతవజ్రః ప్రహసంస్తమాహ గతవిస్మయః

ఇన్ద్ర ఉవాచ
అహో దానవ సిద్ధోऽసి యస్య తే మతిరీదృశీ
భక్తః సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరమ్

ఇది విన్న ఇంద్రుడు, నీవు నాకు శత్రువువై ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నీవు సిద్ధుడవు, నీవు నిజమైన పరమాత్మ భక్తుడవు. సకల జగత్తుకూ నీవు మిత్రుడవు.

భవానతార్షీన్మాయాం వై వైష్ణవీం జనమోహినీమ్
యద్విహాయాసురం భావం మహాపురుషతాం గతః

సకల జగత్తునూ మోహింపచేసే పరమాత్మ మాయను గెలిచావు నీవు. రాక్షస భావాన్ని వదిలిపెట్టి పరమభాగవత భావాన్ని నీవు పొందావు. 

ఖల్విదం మహదాశ్చర్యం యద్రజఃప్రకృతేస్తవ
వాసుదేవే భగవతి సత్త్వాత్మని దృఢా మతిః

రజో గుణములో పుట్టిన నీవు సత్వగుణముతో పరమాత్మ యందు ఇంత భక్తి కలిగి ఉన్నావంటే నీ స్వభావానికీ జన్మకీ సంబంధం లేదు.

యస్య భక్తిర్భగవతి హరౌ నిఃశ్రేయసేశ్వరే
విక్రీడతోऽమృతామ్భోధౌ కిం క్షుద్రైః ఖాతకోదకైః

పరమాత్మ మీద భక్తి ఉన్నవాడికి తక్కిన సాంసారిక సుఖాలు ఎందుకు. పరమాత్మ భక్తి అనే అమృత సరస్సులో మునిగిన వాడు ఊట బావిలో నీరు తీసుకుంటాడా. నీకు ఈ గెలుపూ రాజ్యం క్షుద్రములు. 

శ్రీశుక ఉవాచ
ఇతి బ్రువాణావన్యోన్యం ధర్మజిజ్ఞాసయా నృప
యుయుధాతే మహావీర్యావిన్ద్రవృత్రౌ యుధామ్పతీ

ప్రపంచములో ఇలాంటి యుద్ధము ఎక్కడా జరుగలేదు. ఇద్దరూ తత్వం తెలిసిన వారే. ఇద్దరూ పరమాత్మ చేతిలో కీలుబొమ్మలే, అస్వతంత్ర్యులే. 

ఆవిధ్య పరిఘం వృత్రః కార్ష్ణాయసమరిన్దమః
ఇన్ద్రాయ ప్రాహిణోద్ఘోరం వామహస్తేన మారిష

ఇలా ఇద్దరూ పరస్పర యుద్ధం చేసారు. ఎడమ చేత్తో వృత్తాస్రుడు ముద్గలాన్ని ప్రయోగించహాడు. 

స తు వృత్రస్య పరిఘం కరం చ కరభోపమమ్
చిచ్ఛేద యుగపద్దేవో వజ్రేణ శతపర్వణా

వజ్రాయుధముతో ఆ పరిఘనూ ఇంకో బాహువునూ ఖండించాడు. రెండు చేతులూ తెగి, వజ్రాయుధము చేత రెక్కలు తెగిన పరవతములా భాసించాడు వృత్తాసురుడు

దోర్భ్యాముత్కృత్తమూలాభ్యాం బభౌ రక్తస్రవోऽసురః
ఛిన్నపక్షో యథా గోత్రః ఖాద్భ్రష్టో వజ్రిణా హతః

మహాప్రాణో మహావీర్యో మహాసర్ప ఇవ ద్విపమ్
కృత్వాధరాం హనుం భూమౌ దైత్యో దివ్యుత్తరాం హనుమ్

నభోగమ్భీరవక్త్రేణ లేలిహోల్బణజిహ్వయా
దంష్ట్రాభిః కాలకల్పాభిర్గ్రసన్నివ జగత్త్రయమ్

అతిమాత్రమహాకాయ ఆక్షిపంస్తరసా గిరీన్
గిరిరాట్పాదచారీవ పద్భ్యాం నిర్జరయన్మహీమ్

జగ్రాస స సమాసాద్య వజ్రిణం సహవాహనమ్
వృత్రగ్రస్తం తమాలోక్య సప్రజాపతయః సురాః
హా కష్టమితి నిర్విణ్ణాశ్చుక్రుశుః సమహర్షయః

రెండు పాదాలతో పర్వతాలనూ భూమినీ దేవతలనూ అల్లకల్లోలం చేస్తూ నోరు బాగా తెరిచి వాహనముతో కూడి ఉన్న ఇంద్రున్ని మింగేసాడు. పెద్ద కొండచిలువ ఏనుగును మింగినట్లుగా మింగేసారు. ఎంత కష్టమొచ్చిందీ అని ప్రజాపతులూ దేవతలూ అందరూ హాహాకారాలు చేసారు. అమృతం నిండి ఉన్నవాడు కాబట్టీ, పరమాత్మ తేజస్సు నిండి ఉన్నవాడు కాబట్టి ఇంద్రుడు మరణించలేదు. 

నిగీర్ణోऽప్యసురేన్ద్రేణ న మమారోదరం గతః
మహాపురుషసన్నద్ధో యోగమాయాబలేన చ

నారయణ కవచ ప్రభావము వలన (మహాపురుషసన్నద్ధో ) ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి తన వజ్రాయుధముతో వృత్తాసురుని కడుపు చీల్చి బయటకు వచ్చి

భిత్త్వా వజ్రేణ తత్కుక్షిం నిష్క్రమ్య బలభిద్విభుః
ఉచ్చకర్త శిరః శత్రోర్గిరిశృఙ్గమివౌజసా

వృత్తాసురుని శిరస్సును ఖండించాడు. 

వజ్రస్తు తత్కన్ధరమాశువేగః కృన్తన్సమన్తాత్పరివర్తమానః
న్యపాతయత్తావదహర్గణేన యో జ్యోతిషామయనే వార్త్రహత్యే

వజ్రాయుధం కూడా వృత్తాసురుని శిరస్సు ఖండించడానికి కష్టపడింది. మంచి ముహూర్తం కోసం (కాల రూపములో ఉన్న పరమాత్మ చూపు కోసం) ఆగింది. వృత్తాసురుని సంహారానికి నక్షత్రములూ గ్రహములూ రాశులూ వీటి సమూహముతో ఉత్తమ ముహూర్తం వచ్చేదాక ఆగి అది వచ్చాక సంహరించాడు. వృత్తాసురుని ఆయువు తీరిన తరువాత సంహరించబడ్డాడు

తదా చ ఖే దున్దుభయో వినేదుర్గన్ధర్వసిద్ధాః సమహర్షిసఙ్ఘాః
వార్త్రఘ్నలిఙ్గైస్తమభిష్టువానా మన్త్రైర్ముదా కుసుమైరభ్యవర్షన్

ఆకాశములో దుందుభులు మోగాయి, అప్సరలు ఆడారు, ఇంద్రున్ని స్తోత్రం చేసారు, వృత్తఘ్న మంత్రముతో స్తోత్రం చేసారు, (మనం కూడా ఉదకశాంతి అని చేస్తాము శుభ ముహూర్తాలలో. ఆనాడు ఇంద్రుడు వృత్తాసురున్ని చంపినట్లుగా మనకొచ్చే విఘ్నములు కూడ తొలగించబడతాయి. )

వృత్రస్య దేహాన్నిష్క్రాన్తమాత్మజ్యోతిరరిన్దమ
పశ్యతాం సర్వదేవానామలోకం సమపద్యత


ఇలా ఇంద్రుడు వజ్రాయుధముతో ఖండించిన తరువాత అతని శరీరము నుండి సకల లోకములూ మిరుమిట్లూ గొలిపే తేజస్సు బయలు దేరి పరమపద లోకానికి వెళ్ళింది.

Popular Posts