Followers

Sunday 23 March 2014

భూగోళము యొక్క సంక్షేప వర్ణనం


జంబూ  ద్వీపములో నవ వర్షాలు. తొమ్మిది వేల యోజనాల వెడల్పు ఒక్కొక్కటీ. మొత్తం ఈ ద్వీపములో మర్యాదా గిరులు (హద్దులు) ఉన్నాయి. గుండ్రముగా ఉన్న భూమిలో నిలువుగా ఒక గీతా అడ్డముగా ఒక గీతా గీస్తే ఆ మధ్య నుండే దానిలో ఇలావృతమనే వర్షముంది. అది నాభి యందు ఉంది, అక్కడ ఉన్న పర్వతం పేరు మేరువు. అది
బంగారములా మెరుస్తూ ఉంటుంది. అది ముప్పై రెండు వేల యోజనాలు వెడల్పు. మొదలు పదహారు వేలు భూమిలోకి పదహారు వేలు. ఇలా వృతమనేది మధ్యలో ఉంది. దానికి ఉత్తరముగా (అంటే మీదకి) మూడు ఉన్నాయి నీలా శ్వేత శృంగవాన్ అని మూడు కొండలు. అక్కడ రమ్యక హిరణ్మయ కురు అనే మూడు వర్షాలు ఇలావృత వర్షం మీద ఉన్నాయి. దానికి ఈ పక్కా ఆ పక్కా ఉప్పు సముద్రం. అది ఒక్కో దానికంటే రెండవది రెండు
వేల యోజనాల ఎక్కువ ఉంటుంది. ఇంక కిందకు వస్తే నిషధం హేమకూటం హిమాలయం అంటే మూడు పర్వతాలు. మధ్యభాగానికి దక్షిణం వైపు ఉంది. అక్కడ హరి వర్షమూ కింపురుష వర్షమూ భారత వర్షమూ ఉన్నాయి. మొదట ఇలా వృతానికి దగ్గరగా ఉన్నది హరి వర్షం, దానికింద కింపురుష, దాని కింద భారత. ఇలా వృత వర్షానికి పడమట వైపు మాల్యవత్ అనే పర్వతం తూర్పు వైపు గంధమాధనమనే పర్వతం ఉన్నాయి. అక్కడ కేతు మాల భద్రాశ్వమనే వర్షం ఉన్నాయి. ఇవి మొత్తం తొమ్మిది వర్షముల యొక్క సంస్థానం. వీటిలో మందరమూ మేరు మందరమూ సుపార్శ్వమూ కుముదమూ అని మధ్యలో ఉన్న మేరుపర్వతానికి దగ్గరలో దాని అంత ఎత్తుకాకుండా దానికి కాపలాగా అన్నట్లుగా ఈ నాలుగు పర్వతాలూ ఉన్నాయి. తామర మధ్య చుట్టూ ఉన్న రేకులలాగ. ఈ నాలుగు పర్వతాల మీదా నాలుగు చెట్లున్నాయి మామిడీ నేరేడు కదంబ మర్రి చెట్లు. ఈ పర్వతాలు కొన్ని వేల యోజనాల ఎత్తు ఉన్నాయి, ఎన్నో శాఖలు కలిగి ఉన్నాయి, విశాలమైన సరస్సులు ఉన్నాయి. ఒకటి మంచి నీళ్ళ సరస్సు ఒకటి తేనే సరస్సు ఒకటి చెరుకు సరస్సు పాల సరస్సూ ఉన్నాయి. అక్కడ దేవతల ఉద్యానాలు ఉన్నాయి - నందనం చైత్రథం వైభ్రాజకం సర్వతోభద్రమని. అక్కడి దేవతలందరూ వారి వారి భార్యలతో కలిసి వచ్చి విహరిస్తూ ఉంటారు.

ఈ మందర పర్వతం మీద కొండంత మామిడి పళ్ళు పండుతాయి. అవి రాలి కిందపడి వాటి రసం పారుతూ ఉంటుంది. అదే అరుణోదా అనే నది మందర గిరి శిఖరం నుండి ఇలావృత వర్షమునకు వస్తుంది ఆ నది. దానిని చుట్టుపక్కలా ఉండే యక్షులు అనుభ్వైస్తూ ఉంటారు. మరొక పర్వతం (దక్షిణ భాగం మీద ఉన్న కొండమీద) జంబూ అనే నేరేడు చెట్టు చాలా ఎత్తుగా ఉండి ఏనుగంత నేరేడు పళ్ళు కిందపడి వాటి రసం పారి, మేరు మందర శిఖరం కంటే ఎత్తైన దానినుండి ఇలావృతానికి దక్షిణముగా పారుతోంది. ఈ రెండు వైపులా ఉన్న మట్టి ఈ నేరేడు పళ్ళు రసములు తగలడం వలన బంగారములా మెరుస్తూ ఉంటుంది. మెరవడం చేతనూ ఆ మట్టి చేతనే బంగారం రావడం చేతనూ దానికి జాంబూనదం అని పేరు పెట్టారు. ఆ జంబూ నది ఒడ్డులో బంగారం పండుతుంది.

మహా కదంబనే మర్రి చేట్టు సుపార్శ్వమనే పర్వతం మీద ఉంది, దానిలోంచి ఐదు మంచి మధు ధారలు ప్రవహిస్తూ ఉండి ఇలా వృతాన్ని సుగంధబరితము చేస్తూ ఉంటాయి. కుముదమునండు శత్వల్మమని ఒక మర్రి చేట్టు ఉంది. దాని నుంచి కిందకి, ఇలావృతానికి ఉత్తరముగా ఒక నది పారుతూ ఉంటుంది. ఇలా మేరువూ, నాలుగు పర్వతాలూ, నాలుగు పర్వతాల మీద నాలుగు చెట్లూ, వాటి నుంచి వచ్చిన నాలుగు నదులు.
ఈ మేరువుకు తూర్పు వైపున జఠరమూ దేవకూపమనే రెండు పర్వతాలున్నాయి. అవి పద్దెనిమిద్వేల యోజనాలు దూరముగా ఉండి ఎత్తుగా ఉంటాయి, మేరువు పర్వతానికి తూర్పు వైపున పవనా పారివాత్రమని రెండు పర్వతాలున్నాయి. ఇలా చుట్టూ ఎనిమిది.
 మొదట నాలుగు కొండలూ, తరువాత ఒక్కో దానికీ రెండేసి కొండలూ. ఇది మొత్తం రేకులు గల పూవులా ఉంటుంది.
మేరు పర్వత శిఖరం మీద బ్రహంగారి పట్టణముంది. ఆ పట్టణం కొన్ని వేల యోజనాల పొడవు, సమ చతురస్రముగా ఉంటుంది. దానికి చుట్టూ లోకపాలకు ఎనమండుగురూ పట్టణాలలో ఉన్నారు. శ్రీమహావిష్ణువు వామనుడుగా వచ్చి కొలిచినప్పుడు, ఆయన ఎడమపాదం పైకి చాస్తే ఆయన బొటన వేలు పైకి వెళ్ళి ఆ మీద భాగానికి తగిలితే, అది చిట్లితే దానిలో ఉన్న జలం లోపలికి వస్తే, ఆ జలం ఆకాశం మీద నుండి కిందకి పడ్డాయి గనుక, ఆ వచ్చిన నదికి విష్ణు పది అని పేరు, ఆకాశానికి విష్ణు పాదం అని పేరు.
అక్కడే మన వంశమునకు మూల పురుషుడైన ద్రువుడు భక్తియోగముతో చాలా కాలం ఎప్పుడు  పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకే చివరలను ద్రువాలంటారు (ఉత్తరద్రువం దక్షిణ ద్రువం), మీదకు మేరువని పేరు.ద్రువుని కింద సప్తర్షులుంటారు. ఆ సప్తర్షులు ఆయనను సేవిస్తూ జటాజూటములతో మోక్షమునందు ఇచ్చ కలవారి ఉంటారు. అనేక సహస్ర కోటి విమానాలతో దేవతలు చంద్రమండలాన్ని ఆవరించి బ్రహ్మలోకములో ఉంటారు. ఆకాశములోంచి వచ్చిన ఈ నది నాలుగు రకముల నీరు నిండగా, సీతా, అలకనందా, చక్షు, భద్రా అని నాలుగు నదులుగా పారింది. సీత అనే నది బ్రహ్మలోకం నుండి కేసరాచలమ  అనే బంగారు శిఖరం నుండి, కిందకి పారుతూ గంధమాధనమనే పర్వత శిఖరం మీద పడి భద్రాశ్వమనే తూర్పు నుంచి ఉప్పు సముద్రములో కలుస్తుంది. అలాగే మాల్యవత్ అనే పర్వత శిఖరం మీద నుండి పడి, ఏమాత్రం వేగం తగ్గకుండా,
వడిగా, కేతుమాలమనే వర్షానికి, చక్షు అనే రెండవ నది పడమటి దిక్కుగా ప్రవహించి సముద్రములో కలుస్తుంది. భద్రా అనే నది మేరు శిఖరం నుండి కిందకు పడి ఉత్తర శిఖరమునుండి పడి కురుదేశమును ఆక్రమించి సముద్రములో కలుస్తుంది.
అలకనందా అనే నది, ఈ మేరువు యొక్క పైభాగం (దక్షిణం) వైపు వచ్చి బ్రహ్మ సదనం అనే బదరికాశ్రమం కొండలన్నీ దాటి హిమాలయ శిఖరం నుంచి భారత వర్షమునకు వచ్చి దక్షిణం వైపు సముద్రములో కలుస్తోంది.
ఎన్నో నదులూ నదములూ ఉన్నాయి గానీ మిగిలిన క్షేత్రములేవీ కర్మ క్షేత్రములు కావు. అక్కడ భగవంతుని ఆరాధించడానికి యజ్ఞ్యము లాంటి ఉండవు. భారత దేశం మాత్రం కర్మ క్షేత్రం. మిగిలినవి భోగ భూములు.
మనుష్యులకు వయస్సు చాలా ఎక్కువ ఉండేది. త్రేతా యుగములో సమానమైన కాలం జరుగుతూ ఉండేది. ఈ తొమ్మిది వర్షాలలో కూడా శ్రీమన్నారాయణుడు అధిదైవముగా ఉంటాడు. ఇలావృతమనే వర్షములో పరమ శివుడు దేవత. ఆయన ఒక్కడే అక్కడ మగవాడు. 
అక్కడ ఎవరు వెళ్ళిన పార్వతి శాపం వలన ఆడవారిగా మారుతారు. అక్కడ భవాని(పార్వతి) పరిపాలకురాలు. అక్కడ తామస మూర్తి అయిన సంకర్షణ మూర్తి  ఉంటాడు. తన శక్తితో దాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలావృత వర్షమువారు ఆయనను కీరిస్తారు. 
"ప్రళయమునకు అధిష్ఠాన దేవత అయిన ఆదిశేషుడు, రుద్రుడు. తనను సేవించిన వారి శరణు ఇచ్చే పాదపదములు కలవాడు, సంసారములో ఉన్న వారికి మోక్షం ఇచ్చేవాడు. సమస్తలోకముల పుట్టుకా నిలకడా అంతమూ చేసే వాడు, తనకు అవి లేని వాడు ఆయన. "భద్రాశ్వ వర్షము పడమటి వైపు ఉంది, అక్కడ హయగ్రీవ మూర్తి అధిదైవత. "ఓం నమో భగవతే ధర్మాయాత్మవిశోధనాయ నమ ఇతి" అని ధ్యానం చేస్తారు. ఏమి ఆశ్చర్య కరమైనవి ఆయన చేష్టలు. ఆయనే సృష్టిస్తాడూ దహిస్తాడు.
హరి వర్షములో నరహరి ఉంటాడు. ఇక్కడ మహాభాగవతుడైన ప్రహ్లాదుడుంటాడు. "ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్రన్ధయ రన్ధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం క్ష్రౌమ్"  ఈ మంత్రముతో ఆరాధిస్తూ ఉంటాడు. నరసింహ మూర్తిని ఉపాసన చేసే మంత్రం. లోకానికి మేలు కలుగుగాకా, నీచుల మీద మాకు కోపం రాకుండుగాక, అందరు
ఒకరికి ఒకరు మంచి కలగాలని కోరుకొను గాక, మా మనసు ఎప్పుడు భగవత్ తత్వాన్ని సేవించు గాక. ఇంద్రియములను గోచరం కానీ సర్వత్ర వ్యాపించి ఉన్న భగవంతుని యందు మా మనసు నిలుచు గాక. ఇల్లూ వాకలీ పిల్లలూ డబ్బూ ఇవే బతుకు అన్న స్థితి  రాకుండుగాక. భగవత్ భక్తుల సేవకే ఇవన్నీ ఉపయోగపడాలి. ఎవరికైతే భగవంతుని యందు ప్రీతి కలుగుతుందో అక్కడకు అందరు దేవతలూ వచ్చి అన్ని గుణాలతో వచ్చి
కూర్చుంటారు. ఆ భక్తి లేకపోతే అవేవీ రావు. మంచి గుణములు కావాలంటే "లోపలకు" వెళ్ళాలి. శరీరమున్న మనందరకూ లోపల వ్యాపించి ఆ భగవానుడు ఉన్నాడు. చేపకు నీరు ఎంత అవసరమో మనకు భగవంతుడు అంత అవసరం. ఆయనను విడిచిఎట్టేసి, ఇల్లూ, భార్యా అని అంటున్నాము. గొప్పతనం కలవారి యందు (భగవానుని యందు) మనసు లగ్నం కాలేదు. దాని వలన గొప్పతనం రాదు, ముసలితనం వస్తుంది. మనసు దాని మీద ఉంచకు. 
ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషం దుఃఖం పగా అహంకారం అన్నీ కావాలనిపించడం, భయం, యాచించడం, మనో బాధలూ, వీటన్నిటికీ ఇల్లు భార్య మీద మనసు పెట్టుకోవడం కారణం. ఇది పోవాలంటే ఆ నృసింహావతారాన్ని సేవించాలి. 
కేతుమాలములో భగవానుడు ప్రద్యుమ్నుడుగా ఉంటాడు. కాముడంటే మన్మధుడు, ఆయనే ప్రద్యుమ్నుడు. ఆ వర్షములో ఉండేవారికి ఆనందం కలిగిస్తూ ఉంటాడు. గర్భములో ఉండే పిల్లలు సంవత్స్రం ఉంటారు అక్కడ. అక్కడ భగవంతుని మాయా మయమైన రూపాన్ని లక్ష్మీ దేవి రాత్రి వేల కుమార్తెలతో పగటి వేల భర్తలఓ కలిసి సేవిస్తూ ఉంటుంది.
"ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ
సర్వగుణవిశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం
చాధిపతయే షోడశకలాయ చ్ఛన్దోమయాయాన్నమయాయామృతమయాయ
సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాన్తాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్"
ఓం అనగా నేను భగవానునికే చెందిన వాడను. ఇతరుల కొరకు కాదు. మాలో ఉండే ఇంద్రియాలను ప్రేరణ చేసేవాడివి. సర్వ గుణాలతో కూడిన సమస్త పదార్థాలతో గుర్తింపబడే రూపం కలవాడివి నీవు. అకూతి (చేసే పనులు) చిత్తీ (జ్ఞ్యానం) చేతస్సు (సంకల్పం అధ్యవసాయం) విశేషాణాం (భూమి) వీటికి నీవే ఆధారం నీవే. షోడశకలాయ - జ్ఞ్యాన కర్మ పంచభూతాలకు మనసుకూ అధిపతి. సమస్తలోకాలనూ నిలిపేవాడు. మనం తినే అన్నమే మనను తింటుంది. అన్నమయుడు, అమృతమయుడు (ఈలోకములో పరలోకములో భోగం ఇచ్చేవాడు) సహః అంటే మనసులో దార్ధ్యం. ఓజస్సు అంటే ఇంద్రియ బలం. బలమంటే శరీర బలం. కాంతాయ - చూస్తే ప్రేమించాలనిపిస్తుంది. కామాయ - ప్రీతి కలుగుతోందంటే ఆయన ఉండబట్టి కలుగుతోంది. భర్తగా ఆయనను పొందాలని, మిగతావారిని సేవించరు. లోపల ఉన్న వాడొక్కడే భర్త. ఎవ్వరి వలనా ఎప్పుడూ భయం పొందని వాడు భర్త. ఎక్కడ భయం ఉన్నా భయం లేకుండా కాపాడతాడు.  అటువంటి నీవు మాకు కూడా భక్తుల శిరసు మీద ఉంచిన హస్తముంచి కాపాడు
రమ్యక వర్షములో మత్స్య మూర్తిని ఆరాధిస్తాడు. "ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్త్వాయ ప్రాణాయౌజసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి" అని ఆరాధిస్తారు. హిరణ్మయ ద్వీపములో స్వామి తాబేలు రూపములో ఉంటాడు. అర్యముడు (పితృగణాధిపతి) సేవిస్తాడు. సంసారమును దాటించేవాడు. అనేక గుణములు గలవాడు. సముద్రములో మందర పర్వతం అడుగున ఉన్నాడు గానీ ఎవరికీ కనపడడు. మన శరీరములో శరీరం అడుగున, నాభికి అడుగున, కూర్మాకార నాడీ మండలములో భగవంతుడు ఉంటారు. అందుకే దేవాలయములో తాబేలు ఉంటుంది. ఏ రూపమూ లేని వాడు.
కురు వర్షము ఉత్తర దేశములో వరాహ స్వామి ఉంటాడు. ఆయనను భూదేవి సేవిస్తూ ఉంటుంది. "ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్త్వగుణవిశేషణాయానుపలక్షితస్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమోऽవస్థానాయ నమస్తే". ఆయన శరీరమంతా యజ్ఞ్యమే. అగ్ని కర్రలలో దాగి ఉంటుంది. అలాగే నీవు కూడా మాలో ఉన్నావు. కర్రలోంచి అగ్ని తీసినట్లుగా మనస్సనే కవ్వముతో మధిస్తే వెలిక్కి వస్తావు.  మనం చేసే సర్వ వ్యాపారాలను ఆయనకు అర్పిస్తే ఆయన వెలికి వస్తాడు. సముద్రములో మునిగి ఉన్న నన్ను విలాసముగా నీ కోర చివరపై ఉంచి వెలికి  తీసావు. 
కింపురుష వర్షములో రామచంద్రుడు అధి దైవం. లక్ష్మణాగ్రజుడైన సీతారామున్ని పాదముల దగ్గర హనుమ నిలుబడి ఉండగా కింపురుషులు సేవిస్తారు. ఉత్తమ నడువడి కలవాడు, పెద్దలు చెప్పిన ప్రకారముగా శాస్త్రము చెప్పిన ప్రకారముగా నడిచే మనస్తత్వం కలవాడు, రాజ్యాన్ని ఉపాసించిన వాడు (ఆయన రాజ్యాన్ని ఆరాధించాడు), లోకములో మంచితనానికి గీటురాయి, వేదమే శరణ్యమని నమ్మే వారికి దేవుడు, పురుషులలో మహాపురుషుడు, రాజులలో మహారాజు, ఆయన రాజాధిరాజు. కేవల సత్వ రజస్ తమో గుణాలకు అతీతమైన, ఊర్ములు లేని, క్లేశములు లేని వానినీ, అహంకారం లేని స్వామిని, మర్త్య రూపములో దిగి వచ్చిన స్వామి, జగత్ ప్రభువైన నీవు సీతమ్మ కోసం బాధపడ్డావు. నీ జన్మ నిజము కాదు. మా మాటలకందేది కాదు. ఎవరూ నిన్ను తెలుసుకోలేడు. అందరినీ నీవు వైకుంఠానికి తీసుకుని వెళ్ళావు. చిన్న గడ్డీ చీమా కూడా పరంపదానికి వెళ్ళావు.
భారత వర్షములో నర నారాయణులు ప్రధానం. అందుకే నారాయణ నారాయణ అంటూ ఉంటాము. భార్త దేశములో ఉండే దైవం నర నారాయణులు. స్వామి బదరికాశ్రమములో తపస్సు చేస్తున్నాడు. నారదుల వారు నర నారాయణున్ని సేవిస్తూ ఉంటారు. సాంఖ్య యోగముతో సేవిస్తూ ఉంటారు. ఉపశం లీలాయ - కోరికలన్నీ ఉపశమిస్తాయి. సన్యసించిన వారు అస్తమానం నారాయణా అంటూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే ఉవ్వెత్తున లేచే కోరికలు తగ్గుతాయి. దిక్కులేని వారికి దిక్కు ఆయన. డబ్బులేని వారికి డబ్బు ఆయన. అకించన విత్తం. ఉపాయం లేని వారికి నారయణ మంత్రమే ఉపాయం. సమస్తమైన నిత్య పదార్థములలోపల ఉండువాడు, వాటిని ఆధారముగా చేసుకుని ఉండేవాడు. లోపలా వెలుపలా వ్యాపించి ఉంటాడు. సన్యాసులకు గురువు ఆయన. ఆత్మారాములకు అధిపతి. ఈ లోకములో పైలోకములో వస్తువుల మీద కోరికతో ఉండి వాటి గురించి ఆలోచిస్తూ ఉండి, "ఎప్పుడు చచ్చిపోతామో" అన్న భయముతో కష్టపడుతూ ఉంటాము. అన్నిటిలో ఉన్న నారాయణున్ని తెలుసుకోకుంటే శ్రమంతా వ్యర్థం కదా. నీ అనుగ్రహం చేత ఇంతకాలం మాలో ఉన్న అహంకారం చేదించబడు గాక. 
భారత వర్షములో అనేక నదులూ పర్వతాలూ ఉన్నాయి. మలయమూ గంధమాధనం త్రికూటము మైనాకం శ్రీశైలమూ వేంకటాచలమూ గోవర్ధనమూ, మొదలైన పర్వతాలున్నాయి. ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి గోదావరీ నర్మదా కృష్ణా, త్రిసామ సరస్వతి చంద్రభాగ మొదలైన ఎన్నో నదులు ఉన్నాయి. ఈ భారత వర్షములో ఎవరు జన్మిస్తారో వారు అదృష్టవంతులు. అన్నింటిలో వ్యాపించి ఉన్నవాడు నారాయణుడని తెలుసుకున్నవారు వారిలో ఉన్న అవిద్యా గ్రంధిని చేదిస్తారు. భారత దేశములో పుట్టిన వారెంత అదృష్టవంతులు. ఎక్కడకు వెళ్ళినా భగవంతుడు జ్ఞ్యాపకం వస్తారో. శ్రమపడే క్రతువులూ నోములూ దానాలు అక్కర్లేదు. నారాయణ పాద పంకజ ధ్యానం చాలు. కల్ప కాలం బతికి ఎన్నో ఉత్తమమైన స్థానాలు పొందిన వారు కన్నా క్షణ కాలం ఆయుష్షు ఉన్నా భారత భూమిలో పుట్టాలి. ఒక్కసారి "నాదేమి కాదు తండ్రీ" అని తరించగలం. ఎక్కడ శ్రీమన్నారాయణుని కథా ప్రసంగం ఉండదో, ఎక్కడ భగవత్ భక్తులు ఉండరో, ఎక్కడ నారాయణున్ని ఆరాధించే యజ్ఞ్యములు చేయరో, అది ఆదరించే స్థలం కాదు. ఎవరైతే అన్నీ నారాయణునికి అన్నీ అర్పిస్తారో వారికి మరలా జనం ఉండదు. కోరితే ఇచ్చే వాడైన నారాయణుడు, మళ్ళీ మనం ఎవరినీ యాచించనవసరం లేకుండా చేస్తాడు. మళ్ళీ మనం యాచకులం కాకుండా చేస్తాడు. కోరికలు పుట్టే మనసులో కోరికల ఊట ఊరకుండా ఉండటానికి ఆయన తన వేలితో అడ్డు వేస్తాడు. అటువంటిది మన భారతదేశము. అందులో జన్మ కలిగి మేము స్వామిని సేవించగాక. 

ఈ జంబూ ద్వీపం ఎంత వెడల్పూ పొడువూ ఉన్నదో అంత వెడల్పూ పొడవూ గల ఉప్పు సముద్రం ఉన్నది. మేరూ పర్వతం మధ్యలో ఉంది, దాని చుట్టు జంబూ ద్వీపమనే ప్రదేశం, దాని చుట్టూ ఉప్పు సముద్రం. ఆ ఉప్పుసముద్రం ఎంత ఉన్నదో అంత పొడుగూ అంత వెడల్పూ గల ప్లక్ష్య ద్వీపం ఉంది. దీనికి అది అగడ్తలా ఉంది. సముద్రమునకు అవతల ప్లక్ష్య ద్వీపం. ప్లక్ష్య ద్వీపం బంగారు కాంతితో ఉంటుంది. అక్కడ అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రియవ్రతుని కుమారుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకు ఏడుగురు కుమారుడు. వారికి ఏడు పేర్లు కల వర్షాలని ఇచ్చేశాడు. జంబూ ద్వీపము లాగే అక్కడా పర్వతాలూ నదులూ ఉన్నాయి. అక్కడ కూడా నాలుగు వర్ణాలు ఉంటాయి. ఇక్కడ ప్లక్ష్యమనే చెట్టు ఎక్కువ.

ప్లక్ష్యం తరువాత చెరుకు సముద్రం. దాని తరువాత శాల్మల ద్వీపం. శాల్మలీ (బూరుగు) అని ఒక చెట్టు ఉంది. అక్కడా ఏడు ద్వీపాలూ, నదులూ పర్వతాలూ ఉన్నాయి. 
ఇది దాటాక్ కలూతో చేసిన సముద్ర. తరువాత నేతితో నిండిన సముద్రం. దాని తరువాత కుశ ద్వీపం. ఇక్కడ దర్బలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా ప్రియవ్రతుని ఒక కుమారుడు తన ఏడుగురు కుమారులకూ ఏడు ద్వీపాలుగా ఇచ్చాడు.
దీనికవతల క్రౌంచ ద్వీపం, దానికవతల పాల సముద్రం. అక్కడ వరుణున్ని ఆరాధిస్తారు. అక్కడ కూడా ప్రియవ్రతుని  ఒక కుమారుడు, తన ఏడుగురు కుమారులకూ ఇచ్చాడు. పాల సముద్రానికి అవతల శాఖ సముద్రం ఉంది. తరువాత పెరుగు మీద ఉండే తేట లాంటి సముద్రం. ఇక్కడ శాఖమనే కూర పెరుగుతుంది, కాబట్టి దానికి శాఖమని పేరు. 
తరువాత పెరుగు మీద నిండిన తేటతో సముద్రం. తరువాత పుష్కర సముద్రం. తరువాత మంచినీటి సముద్రం. అక్కడ మానసోత్తర పర్వతం ఉంది. దాని తరువాత ఏముందో ఎవరికీ తెలియదు. నాలుగు దిక్కులా నాలుగు పట్టణాలున్నాయి. ఇంద్రుడు వరుణునికి కుబేరునికి యమునికి. పర్వతాక్నికి చివర సూర్యుని రథం తిరుగుతూ ఉంటుంది.
మేరువూ మానస పర్వతం, రెండూ చక్రం తిరగడానికి ఇరుసులాగ పని చేస్తాయి. దాని మీద సూర్యుడు తిరుగుతాడు. సూర్యుని కదలిక మీద మనకు రాత్రీ పగలూ ఉంటుంది. ఆ వర్షములో ఉండేవారు కేవలం బ్రహ్మ రూపి అయిన స్వామిని కర్మలతో ఆరాధిస్తూ ఉంటారు. మనలోపల ఉన్న భగవంతుని పని చేసి మనం ఆయనను సేవించాలి. 
లోకాలోకమని ఒక కొండ. ఇవతలి వైపు వెలుగూ, అవతల వైపు చీకటి ఉంటుంది. దానికి అవతల హద్దు మేరువు, ఇవతల హద్దు మానసోత్తర పర్వతం. ఇక్కడునుంచి అక్కడి దాకా ఉన్నదే మనకు తెలిసిన భూమి. దీని తరువాత బంగారు రంగుతో కాంచన భూమి, దాని పైన అద్దములా ప్రకాశిస్తూ ఉండేది ఒకటి ఉంటుంది. అక్కడ పడినదేదీ కనపడదు, పడిన వస్తువు వెనక్కు రాదు. మేరువు నుంచీ మానసోత్తరం వరకూ ఉన్న భూమి కోటీ యాభై ఏడున్నర లక్షల యోజనాలు. ఎనిమిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల జాగా ఉంది. ఆపైన అద్దములా మెరిసేది కూడా అంతే వైశాల్యం గలది. ఈ మూడింటికీ అవతలకు వెళితే అక్కడ జ్యోతిర్మండలాలు ఉంటాయి. మెరిసే గ్రహాలు.

అక్కడ లోకాలను కాపాడే ఇంద్ర వరుణ యమ కుబేరులు ఉన్నారు. భగవానుడు తన యోగ మాయతో వీటిని సృష్టించి తన పరివారముతో కాపాడుతున్నాడు. ఈ విధముగా గుండ్రముగా ఉండే ఈ వలయములో తొమ్మిది వర్షములూ, వీటిలో ద్వీపములతో సముద్రాలతో కూడి ఉన్నది, మొత్తం యాభై కోట్ల యోజనాలు. దీని నంతటినీ అండమంటారు. ఇరవై ఐదు కోట్ల యోజనాలొక పక్కా, ఇరవై ఐదు కోట్ల యోజనాలొక పక్కా ఉంటాయి. దీనిని అండమంటారు. సూర్యుడు దీని మధ్యన  ఉంటాడు. ఈ చివరా ఆచివరా ఉందేవి ద్రువాలు. మేరువూ మనసోత్తరములూ. ఈ రెంటి ఇరుసు మీదా తిరుగుతూ ఉంటుంది. యాభైకోట్లలో ఈ పక్క ఇరవై ఐదూఉ ఈ పక్క ఇరవై ఐదు కోట్లు వస్తుంది. 

దీనికి పైనున్నవి స్వర్గమూ మోక్షములూ. కింద ఉండేవి పాతాళాది లోకాలు. సర్వ జీవులకూ సూర్యుడే ఆత్మ. 

Popular Posts