Followers

Sunday 2 March 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ముప్పైయొవ అధ్యాయం

విదుర ఉవాచ

యే త్వయాభిహితా బ్రహ్మన్సుతాః ప్రాచీనబర్హిషః
తే రుద్రగీతేన హరిం సిద్ధిమాపుః ప్రతోష్య కామ్

ప్రాచీన బర్హి కుమారు రుద్రగీత విని పరమాత్మను సంతోషపరచారా?

కిం బార్హస్పత్యేహ పరత్ర వాథ కైవల్యనాథప్రియపార్శ్వవర్తినః
ఆసాద్య దేవం గిరిశం యదృచ్ఛయా ప్రాపుః పరం నూనమథ ప్రచేతసః

మైత్రేయా! (బృహస్పతి శిష్యుడు) ఇక్కడ గానీ పరలోకములో గానీ కైవల్యనాధుడైన శ్రీమన్నారాయణునికి పార్శ్వదుడైన శంకరున్ని పిలవకపోయినా సాక్షాత్కరింపచేస్తుకున్నవారు ఉత్తమ లోకాన్ని పొందారా లేదా?

మైత్రేయ ఉవాచ
ప్రచేతసోऽన్తరుదధౌ పితురాదేశకారిణః
అపయజ్ఞేన తపసా పురఞ్జనమతోషయన్

ఈ ప్రాచేతసులు తండ్రి ఆజ్ఞ్యను మనసులో పెట్టుకుని సముద్రములోకి వెళ్ళి పరమాత్మను మెప్పించారు

దశవర్షసహస్రాన్తే పురుషస్తు సనాతనః
తేషామావిరభూత్కృచ్ఛ్రం శాన్తేన శమయన్రుచా

పదివేల సంవత్సరాలు తపస్సు చేసాక పరమాత్మ తన దివ్యమైన దేహ కాంతితో చీకట్లు తొలగిస్తూ పరమాత్మ ఆవిర్భవించాడు. ఇంతకాలం వారు తపస్సు చేసి పడ్డ బాధ అంతా తన దివ్యమంగళ విగ్రహముతో పోగొట్టాడు.

సుపర్ణస్కన్ధమారూఢో మేరుశృఙ్గమివామ్బుదః
పీతవాసా మణిగ్రీవః కుర్వన్వితిమిరా దిశః

గరుత్మంతుని భుజము మీద అధిరోహించి ఉన్నాడు. మేరు శిఖరము మీద మబ్బు ఉనంట్లు ఉన్నాడు. పీతాంబరధారి కౌస్తుభమణితో తన తేజస్సుతో చీకట్లు పోగొడుతూ

కాశిష్ణునా కనకవర్ణవిభూషణేన
భ్రాజత్కపోలవదనో విలసత్కిరీటః
అష్టాయుధైరనుచరైర్మునిభిః సురేన్ద్రైర్
ఆసేవితో గరుడకిన్నరగీతకీర్తిః

బంగారు రంగుతో ఉన్న పట్టు పీతాంబరముతో ప్రకాశించే చెక్కిళ్ళతో కిరీటములతో, ఎనిమిది భుజాలతో దేవతలతో కీర్తించబడినవాడై, గరుడాదులు కీర్తిస్తుండగా

పీనాయతాష్టభుజమణ్డలమధ్యలక్ష్మ్యా
స్పర్ధచ్ఛ్రియా పరివృతో వనమాలయాద్యః
బర్హిష్మతః పురుష ఆహ సుతాన్ప్రపన్నాన్
పర్జన్యనాదరుతయా సఘృణావలోకః

పొడమైన బలిసి ఉన్న ఎనిమిద్ భుజాలతో అమ్మవారితో పోటీ పడుతున్న అమ్మవారితో అలమరించబడినవాడై ప్రాచీన బర్హి పుత్రులతో ఇలా అన్నాడు. దయ ప్రసరించే చూపుతో మేఘ గంభీర నాదముతో

శ్రీభగవానువాచ
వరం వృణీధ్వం భద్రం వో యూయం మే నృపనన్దనాః
సౌహార్దేనాపృథగ్ధర్మాస్తుష్టోऽహం సౌహృదేన వః

మీకేమి కావాలో కోరుకోండి. మీకు మేలు కలుగుతుంది. మీరందరూ నాకు అత్యంత ఆప్తులు ఎందుకంటే మీరందరూ కలిసే ఉన్నారు. మీ పరస్పర సోదర ప్రేమతో నేను సంతోషించాను

యోऽనుస్మరతి సన్ధ్యాయాం యుష్మాననుదినం నరః
తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదమ్

అందుకే ప్రతీ రోజూ సాయం సంధ్యా సమయములో మిమ్ములను తలచుకున్నవారికి సోదరప్రేమ కలుగుతుంది. "వారు నా తమ్ముళ్ళు కాదు. నేనే వారు వారే నేను " అన్నంతగా ఏర్పడుతుంది. సకల ప్రాణులయందూ ప్రేమకలుగుతుంది.

యే తు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః
స్తువన్త్యహం కామవరాన్దాస్యే ప్రజ్ఞాం చ శోభనామ్

మీ కథనే కాకుండా రుద్రగీతతో ప్రాతః సాయం కాలం నన్ను ధ్యానం చేస్తే వారు కోరిన అన్ని వరాలూ ఇస్తాను. ప్రజ్ఞ్య కూడా ఇస్తాను

యద్యూయం పితురాదేశమగ్రహీష్ట ముదాన్వితాః
అథో వ ఉశతీ కీర్తిర్లోకానను భవిష్యతి

తండ్రిగారిచ్చిన ఆదేశాన్ని సంతోషముతో అనుసరించారు.పితృవాక్య పరిపాలకులుగా మీ కీర్తి వ్యాపించి ఉంటుంది

భవితా విశ్రుతః పుత్రోऽనవమో బ్రహ్మణో గుణైః
య ఏతామాత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి

మీకు గుణములతో బ్రహ్మకు తీసిపోనివాడుఒక చక్కని కుమారుడు కలుగుతాడు. తన సంతానముతో ప్రపంచాన్ని ముంచేస్తాడు

కణ్డోః ప్రమ్లోచయా లబ్ధా కన్యా కమలలోచనా
తాం చాపవిద్ధాం జగృహుర్భూరుహా నృపనన్దనాః
క్షుత్క్షామాయా ముఖే రాజా సోమః పీయూషవర్షిణీమ్
దేశినీం రోదమానాయా నిదధే స దయాన్వితః

మీకు దక్షుడు కుమారుడుగా పుట్టడానికి ఒక భార్య కలగాలి. కణ్డు మహర్షికి ఒక అప్సరస స్త్రీ తపస్సు భంగం చేయడానికి పంపగా వారికొక అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయిని చెట్లమీద పడేస్తి వెళ్ళింది. ఆ పిల్లను చెట్లు కాపాడాయి. చంద్రుడు చూపుడు వేలితో అమృతాన్ని అందించాడు.

ప్రజావిసర్గ ఆదిష్టాః పిత్రా మామనువర్తతా
తత్ర కన్యాం వరారోహాం తాముద్వహత మా చిరమ్

మీకు మీ నాన్నగారు ప్రజా సృష్టిని చేయమని చెప్పగా మీ తండ్రి ఆజ్ఞ్యను పాటిస్తూ నన్ను సేవించారు. మీ పది మందీ ఆమెను వివాహం చేసుకోండి.

అపృథగ్ధర్మశీలానాం సర్వేషాం వః సుమధ్యమా
అపృథగ్ధర్మశీలేయం భూయాత్పత్న్యర్పితాశయా

మీరు ధర్మ శీలురు. ఐకమత్యం కలిగి ఉన్నవారు. భేధభావము లేని వారు మీరు.

దివ్యవర్షసహస్రాణాం సహస్రమహతౌజసః
భౌమాన్భోక్ష్యథ భోగాన్వై దివ్యాంశ్చానుగ్రహాన్మమ

లక్ష సంవత్సరాలు మీరు ఆమెతో ఆనందం అనుభవిస్తారు. నేను అనుగ్రహిస్తున్నాను మీకు ఆ దివ్య భోగాలు

అథ మయ్యనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయాః
ఉపయాస్యథ మద్ధామ నిర్విద్య నిరయాదతః

లక్ష సంవత్సరాలు భోగం అనుభవించినా నా యందు మీకున్న భక్తి తొలగిపోదు. నా యందు మనసు ఉన్నవారు మీరు. ఈ నరకాన్ని వదిలి మీరు నన్ను చేరుతారు

గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణామ్
మద్వార్తాయాతయామానాం న బన్ధాయ గృహా మతాః

నా యందు మనసు లగ్నము చేసి నేర్పరితనముతో పని చేసే వారికి సంసారము బంధానికి కారణం కాదు. మోక్షాన్నే ఇస్తుంది. వారికి నా వార్తతోనే పొద్దంతా గడుస్తుంది. అలాంటి వారికి సంసారం బంధము కాదు

నవ్యవద్ధృదయే యజ్జ్ఞో బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః
న ముహ్యన్తి న శోచన్తి న హృష్యన్తి యతో గతాః

సంసారములో వారెంత కాలం ఉన్నారో, ఎలా ఐతే సంసారములో ఉన్న వారికి ప్రతీక్షణం కొత్తగా ఉంటుందో  నా యందు మనసు ఉంచిన వారికి నేను కూడా ప్రతీ క్షణం కొత్త రుచిని కలిగిస్తాను. హృదయములో ఎప్పుడూ వాడికి నేను కొత్తే. నా యందు భక్తిని నిత్య నూతనం చేస్తాను. అలాంటి సంసార విషయములో మోహాన్ని పొందరూ బాధపడరు సంతోషించరు. నన్ను మనసులో ఉంచుకొని సంసారములో ఉన్న వారికి ఇవేవీ ఉండవు.

మైత్రేయ ఉవాచ
ఏవం బ్రువాణం పురుషార్థభాజనం జనార్దనం ప్రాఞ్జలయః ప్రచేతసః
తద్దర్శనధ్వస్తతమోరజోమలా గిరాగృణన్గద్గదయా సుహృత్తమమ్

ఇలా జనార్ధనుడు మాట్లాడగా అలాంటి పరమాత్మ దివ్య దర్శనముతో అంతవరకూ తమో రజో గుణాల వలన వచ్చిన మురికి పోగా, బొంగురుపోయిన గొంతుతో స్తోత్రం చేసారు

ప్రచేతస ఊచుః
నమో నమః క్లేశవినాశనాయ నిరూపితోదారగుణాహ్వయాయ
మనోవచోవేగపురోజవాయ సర్వాక్షమార్గైరగతాధ్వనే నమః

అన్ని కష్టములూ తొలగించేవాడవూ, ఉదారగుణములు కలవాడవని నిరూపించబడినవాడా, మనస్సుకంటే వాక్కు కంటే ముందర వెళ్ళేవాడా, అన్ని ఇంద్రియములు వెళ్ళే దారిలో వెళితే నీవు దొరకవు. మా ఇంద్రియాలు వెళ్ళే మార్గములో వెళ్ళని నీకు నమస్కారము.

శుద్ధాయ శాన్తాయ నమః స్వనిష్ఠయా మనస్యపార్థం విలసద్ద్వయాయ
నమో జగత్స్థానలయోదయేషు గృహీతమాయాగుణవిగ్రహాయ

పరమాత్మ త్రిగుణ స్పర్శ రహితుడు కాబట్టి శుద్ధుడూ, ఎలాంటి వికారాలూ పొందని వాడు, పరమాత్మ సంకల్పముతోనే మనసులో భేధ బుద్ధి కలుగుతుంది. ప్రపంచముయొక్క సృష్టి స్థితి సంహారములయందు మీరే ప్రవేశించి చేస్తారు

నమో విశుద్ధసత్త్వాయ హరయే హరిమేధసే
వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతామ్

కల్తీ లేని సత్వము కలవాడా. సకల జీవులకూ ప్రబువు. నీవే వాసుదేవుడవు, నీవే కృష్ణుడవు. అపరిచ్చిన ఆనంద స్వరూపుడవు.

నమః కమలనాభాయ నమః కమలమాలినే
నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ

కమలనాభుడూ కమలమాలినీ కమలపాదుడవు కమలముల వంటి కన్నులవంటివాడవు. వాసువేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలకు ఇది గుర్తు

నమః కమలకిఞ్జల్క పిశఙ్గామలవాససే
సర్వభూతనివాసాయ నమోऽయుఙ్క్ష్మహి సాక్షిణే

పద్మములో ఉన్న పుప్పొడి రగ్ను ఉన్న వస్త్రం ధరించినవాడా, ప్రతీ ప్రాణిలో ఉన్న నీకు నమస్కారము. మేము చేసే ప్రతీ పనికీ సాక్షివి నీవు.

రూపం భగవతా త్వేతదశేషక్లేశసఙ్క్షయమ్
ఆవిష్కృతం నః క్లిష్టానాం కిమన్యదనుకమ్పితమ్

నీ ఈ రూపం అన్ని కష్టాలనూ నశింపచేసేది. పాపులమైన మాకు ఇంత చక్కని రూపం చూపావు. ఇంకా మేమడగాల్సినదేముంది.

ఏతావత్త్వం హి విభుభిర్భావ్యం దీనేషు వత్సలైః
యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యాభద్రరన్ధన

దయ గలవారూ ప్రభువులూ తమ సేవకులకు చేయదగినది ఇదే. అభద్రరన్ధన - అమంగళ నాశకా, సమయం రాగానే నీవు మమ్ము గుర్తు చేసుకుంటే చాలు. అందుకు మేము పరమాత్మ భక్తులు గుర్తు చేసుకుంటే చాలు. అది నీ దర్శనముతోనే సంభవిస్తుంది

యేనోపశాన్తిర్భూతానాం క్షుల్లకానామపీహతామ్
అన్తర్హితోऽన్తర్హృదయే కస్మాన్నో వేద నాశిషః

లోకములో క్షుద్రమైన కోరికలను అనుభవించేవారికి కూడా శాంతి కలుగుతున్నదని అనిపిస్తున్నది. నిన్ను కోరేవారికి వేరే కోరికలు కలగకూడదు. అలాంటి వారికి కూడా తృప్తి కలుగుతోందంటే వారి హృదయములో నీవే ఉన్నావు. ఎక్కడ కోరిక కలుగుతుందో అక్కడే నీవున్నావు. మరి నాకేమి కావాలో నిన్ను అడగలాసిన అవసరమేముంది.

అసావేవ వరోऽస్మాకమీప్సితో జగతః పతే
ప్రసన్నో భగవాన్యేషామపవర్గః గురుర్గతిః

మోక్షాన్నిచ్చే పరమాత్మ ప్రసన్నమైతే మోక్షాన్నే కోరతాము

వరం వృణీమహేऽథాపి నాథ త్వత్పరతః పరాత్
న హ్యన్తస్త్వద్విభూతీనాం సోऽనన్త ఇతి గీయసే

ఐనా సరే మీ ఆజ్ఞ్య కాబట్టి వరము కోరుతాము. నీవు అనంతుడవు. అనంత విభూతులు కలవాడవు.

పారిజాతేऽఞ్జసా లబ్ధే సారఙ్గోऽన్యన్న సేవతే
త్వదఙ్ఘ్రిమూలమాసాద్య సాక్షాత్కిం కిం వృణీమహి

పారిజాతము సులభముగా దొరికితే ఆ తుమ్మెదకు వేరే పూవెందుకు. నీవు కనిపించే వరకే వేరే కోరికలుంటాయి. నీవు కనబడ్డాక ఇంకేమి కోరుకుంటాము.

యావత్తే మాయయా స్పృష్టా భ్రమామ ఇహ కర్మభిః
తావద్భవత్ప్రసఙ్గానాం సఙ్గః స్యాన్నో భవే భవే

ఐనా కోరాలి కాబట్టి కోరుతాము. మేము ఎంత కాలం ఈ సంసారములో పరిభ్రమిస్తామో అన్ని జన్మలలో నిన్ను వదలకుండా ఉండేట్లు చూడు. లేదా నిన్ను తలచే వారితో కలిసి ఉండేట్లు చేయి.

తులయామ లవేనాపి న స్వర్గం నాపునర్భవమ్
భగవత్సఙ్గిసఙ్గస్య మర్త్యానాం కిముతాశిషః

పరమాత్మ సంగమును కలిగి ఉన్న భక్తులతో క్షణ కాలం కలిసి ఉండటం మోక్షమునకూ స్వర్గమునకూ సమానం కాదు. అలాంటప్పుడు సంసారములో ఉన్నవి సాటి అవుతాయా?

యత్రేడ్యన్తే కథా మృష్టాస్తృష్ణాయాః ప్రశమో యతః
నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన

పరమాత్మ  భక్తులున్న చోట కథలు మాటి మాటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆశ చావాలి అంటే భక్తులతో కలిసి ఉండాలి. అక్కడ వైరమూ ఆందోళనా ఉండదు.

యత్ర నారాయణః సాక్షాద్భగవాన్న్యాసినాం గతిః
సంస్తూయతే సత్కథాసు ముక్తసఙ్గైః పునః పునః

మహానుభావులందరూ కలిసి ఉంటే వారు చెప్పుకునే కథలలో శ్రీమన్నారాయణుడే గానం చేయబడుతూ ఉంటాడు

తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేచ్ఛయా
భీతస్య కిం న రోచేత తావకానాం సమాగమః

అలాంటి మహానుభావులు పుణ్యం క్షేత్రాలను పావనం చేద్దామని అడుగులు వేస్తూ తిరుగుతూ ఉన్నవారి కలయిక, సంసారమంటే భయపడే వారికి ఎందుకు రుచించదు?

వయం తు సాక్షాద్భగవన్భవస్య ప్రియస్య సఖ్యుః క్షణసఙ్గమేన
సుదుశ్చికిత్స్యస్య భవస్య మృత్యోర్భిషక్తమం త్వాద్య గతిం గతాః స్మ

మేము మీ ప్రియ మిత్రుడైన శంకరుని క్షణ కాల కలయికతో చాలా కష్టపడికూడా చికిత్స చేయడం కష్టమైన (సుదుశ్చికిత్స్యస్య ) సంసారమునకు వైద్యుడవైన నిన్ను చూడగలిగాము

యన్నః స్వధీతం గురవః ప్రసాదితా విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్త్యా
ఆర్యా నతాః సుహృదో భ్రాతరశ్చ సర్వాణి భూతాన్యనసూయయైవ

మేము చాలా పుణ్యం చేసుకుని ఉన్నాము. మీ దర్శనమవుతుందని నమ్మకం కలిగింది, ఎందుకంటే శంకరుని దర్శనమయ్యింది కనుకనే. మేము గురువలను ప్రసన్నం చేసుకుని ఉంటాము. బ్రాహ్మణులూ వృద్ధులూ సజ్జనుల అనువృత్తితో పెద్దలకు నమసరించాము సకల ప్రాణులనూ అసూయ లేకుండా చూసాము. కాబట్టే మొదట వారి దర్శనం తరువాత మీ దర్శనం అయ్యింది

యన్నః సుతప్తం తప ఏతదీశ నిరన్ధసాం కాలమదభ్రమప్సు
సర్వం తదేతత్పురుషస్య భూమ్నో వృణీమహే తే పరితోషణాయ

మేము చక్కని తపస్సు చేసి ఉంటాము. ఇంతకాలం ఎలాంటి ఇబ్బందీ లేకుండా నీటిలో ఉండగలిగాము, ఇదంతా మహానుభావుడవైన మీ ప్రీతి కొరకు చేసాము

మనుః స్వయమ్భూర్భగవాన్భవశ్చ యేऽన్యే తపోజ్ఞానవిశుద్ధసత్త్వాః
అదృష్టపారా అపి యన్మహిమ్నః స్తువన్త్యథో త్వాత్మసమం గృణీమః

బ్రహ్మా శంకరుడూ మనువూ తపస్సుతో జ్ఞ్యానముతో పరిశుద్ధమైన ఇతరులందరకూ కూడా నీవెంత గొప్పవాడవనే అంతము తెలియకుండా ఉండేవారు. అయినా నీ మహిమను స్తోత్రం చేస్తూనే ఉన్నారు. నీ స్తోత్రాన్ని చేస్తూనే ఉన్నారు. మేము కూడా అలాగే చేస్తాము.

నమః సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ
వాసుదేవాయ సత్త్వాయ తుభ్యం భగవతే నమః

నీకు అందరూ ఒకటే, గుణ త్రయ దోష రహితుడవు. పరమ పురుషుడవు. నీకు నమస్కారము

మైత్రేయ ఉవాచ
ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరిః ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సలః
అనిచ్ఛతాం యానమతృప్తచక్షుషాం యయౌ స్వధామానపవర్గవీర్యః

ఇలా ప్రాచేతసులచే స్తోత్రం చేయబడిన శరణ వత్సలుడైన హరి "మీరు చెప్పిన దంతా నిజమే" అని వెళ్ళడానికి సిద్ధపడుతుంటే ఆయన సౌందర్యాన్ని చూసి తృప్తి కలగక ఆయన వెళ్ళడం ఇష్టపడలేదు. అపవర్గ వీర్యుడైన స్వామి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు

అథ నిర్యాయ సలిలాత్ప్రచేతస ఉదన్వతః
వీక్ష్యాకుప్యన్ద్రుమైశ్ఛన్నాం గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితైః

స్వామినుండి వరములు పొంది స్వామి వెళ్ళిన తరువాత సముద్రము నుండి బయటకు వచ్చి చూస్తే భూమి అంతా చెట్లతో నిండి ఉన్నాయి. దీన్ని చూచి కోపించారు

తతోऽగ్నిమారుతౌ రాజన్నముఞ్చన్ముఖతో రుషా
మహీం నిర్వీరుధం కర్తుం సంవర్తక ఇవాత్యయే

కోపించిన వారు ముఖము నుంచి అగ్నినీ వాయువునీ వదిలిపెట్టారు. ప్రళయకాలాగ్ని లాగ అగ్ని బయలు దేరి చెట్లను దహిస్తోంది

భస్మసాత్క్రియమాణాంస్తాన్ద్రుమాన్వీక్ష్య పితామహః
ఆగతః శమయామాస పుత్రాన్బర్హిష్మతో నయైః

అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ప్రాచేతసులను శాంతింపచేసాడు

తత్రావశిష్టా యే వృక్షా భీతా దుహితరం తదా
ఉజ్జహ్రుస్తే ప్రచేతోభ్య ఉపదిష్టాః స్వయమ్భువా

బ్రహ్మ చెప్పగా కాలిపోగా మిగిలిన చెట్లు తమ కూతురిని ప్రాచేతసులకు ఇచ్చారు

తే చ బ్రహ్మణ ఆదేశాన్మారిషాముపయేమిరే
యస్యాం మహదవజ్ఞానాదజన్యజనయోనిజః

మారిషను బ్రహ్మ ఆజ్ఞ్యతో వివాహం చేసుకున్నారు. ఇది వరకు పుట్టిన దక్షుడు మళ్ళీ పుట్టాడు

చాక్షుషే త్వన్తరే ప్రాప్తే ప్రాక్సర్గే కాలవిద్రుతే
యః ససర్జ ప్రజా ఇష్టాః స దక్షో దైవచోదితః

ఇంతకు ముందు ఉన్న చాక్షుష మన్వంతరములో చాలా మందిని సృష్టించిన దక్షుడు పరమాత్మచే ప్రేరేపించబడి పుట్టబోతూ ఇంతవరకూ ఉన్న తేజోవంతుల తేజస్సును తీసుకుని ప్రాచేతసులకూ మారిషకూ పుట్టాడు

యో జాయమానః సర్వేషాం తేజస్తేజస్వినాం రుచా
స్వయోపాదత్త దాక్ష్యాచ్చ కర్మణాం దక్షమబ్రువన్

చేయవలసిన పనులను దక్షతతో చేసేవాడు కాబట్టి దక్షుడయ్యాడు.

తం ప్రజాసర్గరక్షాయామనాదిరభిషిచ్య చ
యుయోజ యుయుజేऽన్యాంశ్చ స వై సర్వప్రజాపతీన్

ప్రజాపతులకు దక్షుడు నాయకుడయ్యాడు.

Popular Posts