Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం అయిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ద్వారి ద్యునద్యా ఋషభః కురూణాం మైత్రేయమాసీనమగాధబోధమ్
క్షత్తోపసృత్యాచ్యుతభావసిద్ధః పప్రచ్ఛ సౌశీల్యగుణాభితృప్తః

ఇలా వెళ్ళిన విదురుడు గంగా తీరములో ఇంతటి జ్ఞ్యానము అని చెప్పడానికి వీలు లేని మైత్రేయుని వద్దకు అచ్యుత భావముతో పరిశుద్దుడై సౌశీల్యమున్న (గొప్పవారు చిన్నవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా ప్రవర్తించడం) గురువుగారిని ఇలా అడిగాడు

విదుర ఉవాచ
సుఖాయ కర్మాణి కరోతి లోకో న తైః సుఖం వాన్యదుపారమం వా
విన్దేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్వదేన్నః

ఇది మనమందరమూ వేసుకోవాలసిన ప్రశ్న. ప్రపంచములో ప్రతీ ప్రాణీ ఎందుకు పని చేస్తుంది? సుఖం కోసం. కానీ వాళ్ళు చేసే పనుల వలన సుఖం కలుగుతున్నదా? పోనీ దుఖమైనా తొలగుతోందా (అన్యదుపారమం వా).
ఈ రెండూ లేకపోగా, ఆ  పనుల వలన మరికాస్త దుఃఖం కలుగుతోంది. ఇది న్యాయమేనా. దీనిలో ఏది యుక్తమో మీరు చెప్పండి. సుఃఖం కోసం పని చేస్తుండగా దుఃఖం ఎందుకు కలుగుతోంది.

జనస్య కృష్ణాద్విముఖస్య దైవాదధర్మశీలస్య సుదుఃఖితస్య
అనుగ్రహాయేహ చరన్తి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య

లోకంలో దాదాపు అందరూ పరమాత్మకు విముఖంగా ఉంటారు (పట్టించుకోరు). అటువంటి వారు అధర్మశీలురవుతారు. దాని వలన నిరంతరమూ దుఃఖాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అటువంటివారిని అనుగ్రహించడానికే పరమాత్మ  భక్తులు భూమి మీద సంచరిస్తూ ఉంటారు.

తత్సాధువర్యాదిశ వర్త్మ శం నః సంరాధితో భగవాన్యేన పుంసామ్
హృది స్థితో యచ్ఛతి భక్తిపూతే జ్ఞానం సతత్త్వాధిగమం పురాణమ్

మాకు మంగళం కలిగించే మార్గం సూచించు. దేని చేత ఆరాధించబడిన పరమాత్మ భక్తిచేత పరిశుద్దమైన మనసులో నివసిస్తాడు. శ్రవణమా మననమా కీర్తనమా తపస్సా సమాధా? ఏమి చేసిన ముందు హృదయం పరిశుద్దమవ్వాలి. ఆ మురికి కడగబడడానికి భక్తి వచ్చి చేరాలి. అలాంటి భక్తి పూత చిత్తంలో పరమాత్మ చేరడానికి కావలసిన ఆరాధనా విధానాన్ని వివరించండి. పరమాత్మ హృదయంలో చేరి పరతత్వాన్ని పరమాత్మ తత్వాన్నీ జ్ఞ్యానాన్ని మన హృదయంలోనే ఉండి కలిగిస్తాడు.

కరోతి కర్మాణి కృతావతారో యాన్యాత్మతన్త్రో భగవాంస్త్ర్యధీశః
యథా ససర్జాగ్ర ఇదం నిరీహః సంస్థాప్య వృత్తిం జగతో విధత్తే

భగవానుడు మూటికి అధిపతి: సత్వ,రజ,తమ గుణాలు ఉన్న ప్రకృతికి అధిపతి. అవతారాలు స్వీకరించి అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. మనం కూడా పనులు చేస్తాము. కానీ మన పనులు కర్మ ఆధీనం, పరమాత్మ స్వతంత్ర్యుడు. మనమింతకు ముందు ఏ కర్మ చేసామో, దాని వలన మనము ఆ రోజు ఏ ఫలితం అనుభవించాలో అలా అనుభవిస్తాము. భగవానుడు ఆత్మ తంత్రుడు.
ఇలాంటి పరమాత్మ సకల చరాచర జగత్తునూ ఏ మాత్రమూ కోరిక లేని వాడై సృష్టించాడు. మనం చేసే ప్రతీ పని వెనకా కోరిక ఉంటుంది. పరమాత్మ తనకోసం ఏమీ చేయలేదు. తాననుకుని ఏ పనీ చేయలేదు. ఆయన జగత్తునకు ప్రవృత్తిని, నడవడిని ఏర్పరుస్తాడు.

యథా పునః స్వే ఖ ఇదం నివేశ్య శేతే గుహాయాం స నివృత్తవృత్తిః
యోగేశ్వరాధీశ్వర ఏక ఏతదనుప్రవిష్టో బహుధా యథాసీత్

తాను సృష్టించిన జగత్తును తనలోనే ఉంచుకొని పడుకుంటాడు. ఇప్పుడు నివృత్త వృత్తిని అవలంబిస్తాడు. ఇలా సృష్టి స్థితి సంహారములలో పరమాత్మకు ఏ ఆశా ఉండవు. తాను సృష్టించిన ప్రకృతిలోకి ప్రవేశించి, దానిని బహురూపం చేస్తాడు. సూక్షంగా ఉన్నదానిని స్థూలంగా చేస్తాడు. కనపడని దాన్ని కనపడే దానిగా మారుస్తాడు.

క్రీడన్విధత్తే ద్విజగోసురాణాం క్షేమాయ కర్మాణ్యవతారభేదైః
మనో న తృప్యత్యపి శృణ్వతాం నః సుశ్లోకమౌలేశ్చరితామృతాని

బ్రాహ్మణులకీ గోవులకీ దేవతలకీ సుభం కలిగించడానికి స్వామి అవతరించి ఆయా కర్మలను చేస్తూ ఉంటాడు. ఎంతకాలం విన్నా పరమాత్మ కథలు వింటూ ఉంటే మనసుకు తృప్తి కలగదు.

యైస్తత్త్వభేదైరధిలోకనాథో లోకానలోకాన్సహ లోకపాలాన్
అచీక్లృపద్యత్ర హి సర్వసత్త్వ నికాయభేదోऽధికృతః ప్రతీతః

మహదహంకార, జ్ఞ్యాన కర్మేంద్రియ, పంచతన్మాత్రలు పంచ్భూతాలు, ఇలా 26 తత్వములతో, సత్వ రజ తమ గుణాలతో లోకాలను లోకపాలురను కల్పించాడు (అచీక్లృపద్). పరమాత్మ అన్ని ప్రాణుల శరీరాన్ని వేరు చేసి కడుపులో దాచుకోగలవాడు. ప్రాణులే కాకుండా వాటి కర్మలు కూడా దాచుకుంటాడు.

యేన ప్రజానాముత ఆత్మకర్మ రూపాభిధానాం చ భిదాం వ్యధత్త
నారాయణో విశ్వసృగాత్మయోనిరేతచ్చ నో వర్ణయ విప్రవర్య

నేనడిగిన ప్రశ్నకు వివర్ముగా సమాధానం చెప్పవలసింది. ప్రాణులకు ఒక కర్మ రూపమూ పేరూ ఉంటాయి, కర్మకూ పేరు ఉంటుంది, ఫలితానికీ పేరు ఉంటుంది. ఈ నామ రూప సంకల్పాలౌ సంకల్ప మాత్రంగా సృష్టిస్తున్నాడు. ఆ సృష్టి విధానాన్ని కూడా వివీరించవలసింది.

పరావరేషాం భగవన్వ్రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్ష్ణమ్
అతృప్నుమ క్షుల్లసుఖావహానాం తేషామృతే కృష్ణకథామృతౌఘాత్

వ్యాసభగవానుడు చెప్పగా విన్నాము గానీ అందులో మాకు క్షుద్ర సుఖాలు పొందడానికి ఏమి చేయాలో వాటి కోసం ప్రయత్నమే కనపడింది. ఆ కథలు విని ఇంక చాలు అనిపించింది. ఎంత విన్నా దేనితో తృప్తి కలగదో అని నీవు చెప్పు. అలా క్షుద్ర సుఖాలు కలిగించే వ్రతాలు చాలా విన్నాము. అవి మాకు వద్దు.

కస్తృప్నుయాత్తీర్థపదోऽభిధానాత్సత్రేషు వః సూరిభిరీడ్యమానాత్
యః కర్ణనాడీం పురుషస్య యాతో భవప్రదాం గేహరతిం ఛినత్తి

మహర్షులు ఏ పరమాత్మ యొక్క అమృతం వంటి కథలు చెబుతూ ఉంటారో. ఏ పరమాత్మ జీవుని యొక్క కర్ణ నాడి లోకి ప్రవేశించి, అంతవరకూ మనసుకూ, సంసారానికి ఉన్న సంబంధం పోతుంది. సంసారం మీది ప్రీతి భగవానుని కథలు వింటే పోతుంది.

మునిర్వివక్షుర్భగవద్గుణానాం సఖాపి తే భారతమాహ కృష్ణః
యస్మిన్నృణాం గ్రామ్యసుఖానువాదైర్మతిర్గృహీతా ను హరేః కథాయామ్

నీ సఖుడైన వ్యాసుడు పరమాత్మ గుణాలను చెప్పదలచుకునే భారతం చెప్పాడు. కానీ ఆ భారతం విన్న వారికి గ్రామ్య సుఖాలే అర్థమయ్యాయి

సా శ్రద్దధానస్య వివర్ధమానా విరక్తిమన్యత్ర కరోతి పుంసః
హరేః పదానుస్మృతినిర్వృతస్య సమస్తదుఃఖాప్యయమాశు ధత్తే

పరమాత్మ కథలయందు శ్రద్ధ ఉంటే తక్కిన వాటియందు విరక్తి కలుగుతుంది. అటువంటి కథలు చెప్పు.
పరమాత్మ పాదములయందు మనసు నిలిపినవారికి సకల దుఃఖములూ నశిస్తాయి.

తాఞ్ఛోచ్యశోచ్యానవిదోऽనుశోచే హరేః కథాయాం విముఖానఘేన
క్షిణోతి దేవోऽనిమిషస్తు యేషామాయుర్వృథావాదగతిస్మృతీనామ్

అజ్ఞ్యానులైన ప్రజలు, విచారించ దగిన వారి చేత కూడా విచారించదగిన వారు , అటువంటి వారి గురించి బాధపడుతున్నాను. పరమాత్మ కథలు వినడంలో వైముఖ్యం చూపుతారు. బుద్ధిమంతులు ఆరేళ్ళ వయసులోనే భాగవత ధర్మాలు ఆచరించాలి. లేని వారిని పరమాత్మ సంసారంలోకి నెట్టివేస్తాడు. అటువంటి వారు శరీరాన్ని వాక్కునూ మనసునూ అనవసరంగా ఖర్చు పెడతారు. పండితులెవ్వరూ వాదానికి వెళ్ళరు. దాని వలన కాల వ్యయం, గతి వృధా, స్మృతీ వృధా, ఆయువు కూడా వృధా,

తదస్య కౌషారవ శర్మదాతుర్హరేః కథామేవ కథాసు సారమ్
ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబన్ధో శివాయ నః కీర్తయ తీర్థకీర్తేః

మైత్రేయా (కౌషారవా), మాకు పరమాత్మ కథలయందే సుఃఖం కలుగుతుంది (శర్మ), అందుకు మాకు భాగవత కథా సారము చెప్పవలసింది, ఎలా అయితే మకరందములోని సారమును మాత్రమే తుమ్మెద గ్రోలుతుందో.

స విశ్వజన్మస్థితిసంయమార్థే కృతావతారః ప్రగృహీతశక్తిః
చకార కర్మాణ్యతిపూరుషాణి యానీశ్వరః కీర్తయ తాని మహ్యమ్

ఆ పరమాత్మ జగత్తు యొక్క సృష్టి స్థితీ ప్రళయములకోసం అవతరించాడు. అతిమానుషమైన కర్మలెన్నో చేసాడు. వాటిని మాత్రం నాకు చెప్పు.

శ్రీశుక ఉవాచ
స ఏవం భగవాన్పృష్టః క్షత్త్రా కౌషారవో మునిః
పుంసాం నిఃశ్రేయసార్థేన తమాహ బహుమానయన్

అందరికీ మోక్షం వచ్చే మార్గాన్ని చెప్పమని ఇంత బాగా విదురుడు అడిగిన తరువాత ఆయనను మెచ్చుకుంటూ మైత్రేయుడు

మైత్రేయ ఉవాచ
సాధు పృష్టం త్వయా సాధో లోకాన్సాధ్వనుగృహ్ణతా
కీర్తిం వితన్వతా లోకే ఆత్మనోऽధోక్షజాత్మనః

చాలా మంచి ప్రశ్న అడిగావు, దాని వలన లోకానికి మేలు జరుగుతుంది. పరమాత్మ యందు మనసు ఉంచినవారెంతటి ఉత్తమైన కీర్తిని పొందుతారో తెలియజేయుటకు, లోకులని అనుగ్రహించడానికి నీవు అడిగావు

నైతచ్చిత్రం త్వయి క్షత్తర్బాదరాయణవీర్యజే
గృహీతోऽనన్యభావేన యత్త్వయా హరిరీశ్వరః

వ్యాసుని వలన పుట్టిన నీలో ఇటువంటి ఉత్తమ బుద్ధి కలగడం ఆశ్చర్యం కాదు. అందువలనే నీవు పరమాత్మనే స్వీకరించి పెరిగావు చిన్నపటినుంచి

మాణ్డవ్యశాపాద్భగవాన్ప్రజాసంయమనో యమః
భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీసుతాత్

సాక్షాత్ యమధర్మరాజు అంశ నీవు, వ్యాసుని వలన నీవు పుట్టావు

భవాన్భగవతో నిత్యం సమ్మతః సానుగస్య హ
యస్య జ్ఞానోపదేశాయ మాదిశద్భగవాన్వ్రజన్

పరమాత్మకూ, ఆయన  భక్తులకీ నీవు అత్యంత సమ్మతుడవు, కాబట్టే, నీకు ఉపదేశం చేయమని నాన్ను ఆదేశించాడు.

అథ తే భగవల్లీలా యోగమాయోరుబృంహితాః
విశ్వస్థిత్యుద్భవాన్తార్థా వర్ణయామ్యనుపూర్వశః

నీకు యోగమాయచేత విస్తరించబడిన, వృద్ధిపొంది, భగవానుని లీలలన్నీ, ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారములూ వివరిస్తాను

భగవానేక ఆసేదమగ్ర ఆత్మాత్మనాం విభుః
ఆత్మేచ్ఛానుగతావాత్మా నానామత్యుపలక్షణః

ఈ సృష్టి విధానం మొత్తం భాగవతంలో ఐదు సార్లు వస్తుంది. ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ (ఆత్మా వా ఇదమేక మేవాగ్ర, ఆసీత్) అనేది ఉపనిషత్ వాక్యం. సృష్టించాలన్న సంకల్పం కలిగినపుడు పరమాత్మ మాత్రమే ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉండే వాడు, అంతటికీ వెళ్ళేవాడు, ప్రతీ వానిలోనూ ప్రవేశించి శాసించగలవాడు, అంతర్యామిగా ఉండేవాడు. ఆయన విభుడు (సర్వ వ్యాపి). ఆత్మ ఇచ్చా అనుమతౌ: తను సకల జగత్తునీ సృష్టించాలి అని సంకల్పించాడు. పరమాత్మ జరగవలసినదాన్నే సంకల్పిస్తాడు. ఆ సంకల్పం వికసించినపుడు. ఒకడుగా ఉన్న తాను పలువిధములుగా కనపడాలి.

స వా ఏష తదా ద్రష్టా నాపశ్యద్దృశ్యమేకరాట్
మేనేऽసన్తమివాత్మానం సుప్తశక్తిరసుప్తదృక్

ఈయన ఒకనిగా ప్రకాశించేవాడు. సృష్టికి ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనకన్న భిన్నమైనది ఏమీ లేదు. తానే ద్రష్ట, తానే దృశ్యం. చూడబడేది ఉంటేనే చూచే వాడిని ద్రష్ట అంటాము. చూడబడే వాడు ఉన్నాడంటే దృశ్యం ఉంది అని అర్థం. ఈ రెండూ ఉన్నాయి అంటే సృష్టి అయ్యింది అని అర్థం. ఇవి లేకపోతే స్థూల ఆకారమైన ప్రపంచం ఏర్పడలేదు అని అర్థం. పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ప్రపంచం జీవుడు కనపడవు. అవి ఆయనలోనే ఉన్నాయి. పరమాత్మ సంకలించుకున్న తరువాత ప్రపంచం జీవుడు స్థూల రూపాన్ని పొందుతాయి.
జీవుడు ప్రకృతి అంతర్లీనంగా ఉన్నాయి. వాటిలో స్వామి ఉన్నాడు. ఈ విషయం తెలిసేది ఎవరికి? పరమాత్మకి మాత్రమే.
పరమాత్మ అసుప్తదృక్ - అసంకుచితమైన (నిదురించని) జ్ఞ్యానము కలవాడు. ఒకే బుద్ధి మనకు ఒక్కోసారి ఒకలాగ పని చేస్తుంది. మన బుద్ధికి సంకోచ వికాసాలు ఉన్నాయి. అవి కూడా మన పూర్వ జన్మలో కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ప్రళయకాలంలో అన్ని శక్తులూ నిద్రపోతూ ఉంటాయి,

సా వా ఏతస్య సంద్రష్టుః శక్తిః సదసదాత్మికా
మాయా నామ మహాభాగ యయేదం నిర్మమే విభుః

అలాంటి సమయంలో తనను తానే కనపడుకుండా ఉన్నాన అని ఆయంకే అనిపించే స్థితి నుంచి తన శక్తితో స్థూల సృష్టిస్తాడు. ఆ శక్తినే మాయా అంటారు. ప్రళయకాలంలో ఈ మాయ లేనట్లుగా ఉంటుంది. (సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్).

కాలవృత్త్యా తు మాయాయాం గుణమయ్యామధోక్షజః
పురుషేణాత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్

ఈ మాయ (ప్రకృతి) గుణ మయి. సత్వ రజ తమో గుణాలతో కూడి ఉన్నది. ఇది పరమాత్మ సంకల్ప అనువృత్తితో తన శక్తిని ప్రకృతిలో నిక్షేపం చేసాడు. తన స్వరూపమే పురుషునిగా ఆవిర్భవిస్తుంది.

తతోऽభవన్మహత్తత్త్వమవ్యక్తాత్కాలచోదితాత్
విజ్ఞానాత్మాత్మదేహస్థం విశ్వం వ్యఞ్జంస్తమోనుదః

ఇలా ప్రకృతి తత్వంలో తన శక్తిని నిక్షేపం చేసి ఆ ప్రకృతిని క్షోభింప చేయడం వలన మహత్ తత్వం (కాలము చేత ప్రచోదన చేయబడి) ఆవిర్భవించింది. ఈ మహత్ తత్వం జ్ఞ్యాన స్వరూపము. అదే బుద్ధి. తెలియకుండా ఉండే జగత్తు తెలియడానికి అవకాశం ఏర్పడింది. కనపడకుండా ఉన్న జగత్తును కనిపించేలాగ చేసింది. ప్రకృతి మహత్ తత్వాన్ని ఆవిష్కరింపచేసింది. మహత్ తత్వం ఆవిర్భవించే వరకూ మనకేమీ కనపడదు. కనపడినపుడు సృష్టి జరిగింది అంటాము. కనపడనపుడు ప్రళయం అంటాము. ఈ రెండు స్థితులలోనూ మొత్తమూ పరమాత్మలోనే ఉంది. ఆయన కనపడాలి అనుకుంటే సృష్టి, దాచాలనుకుంటే ప్రళయం. చీకటిని తొలగించే పరమాత్మ (తమోనుదః) తన శరీరంలో ఉన్న ప్రపంచాన్ని వ్యక్తీకరించాడు (దీపం వెలిగిస్తే అంతకు ముందు ఉన్న వస్తువులు కనపడ్డట్టు).

సోऽప్యంశగుణకాలాత్మా భగవద్దృష్టిగోచరః
ఆత్మానం వ్యకరోదాత్మా విశ్వస్యాస్య సిసృక్షయా

పరమాత్మ సకల చరాచర సృష్టినీ కనిపించేట్టు చేయాలి అనుకున్నారు. ఆయన మూడు రూపాలలో ఉంటారు. 1. అంశ రూపంలో జీవుడిగా 2. గుణ రూపంలో ప్రకృతిలాగ 3. అవస్థ (సంకల్ప) రూపంలో కాలముగా కనపడతారు. తనను తానే ఈ ప్రపంచాన్ని (లేదా జీవాత్మనీ , ప్రకృతినీ) వికారం కలిగించాడు. ఒక తీరుగా ఉన్న దానిని ఇంకోలాగ చూపాడు. కనపడని దానిని కనపడేట్టుగా చేసాడు. అసత్తు గా ఉండేదాన్ని సత్తు గా చూపాడు

మహత్తత్త్వాద్వికుర్వాణాదహంతత్త్వం వ్యజాయత
కార్యకారణకర్త్రాత్మా భూతేన్ద్రియమనోమయః

ఈ మహత్ తత్వంలో కూడా పరమాత్మ వికారం కలిగింపచేస్తే అందులోంచి ఇంకో తత్వం పుట్టింది. అదే అహంకార తత్వం. పొయ్యిలో కట్టెలను మంట రావడానికి కదిలిస్తాము. అంటే ఇక్కడ కొత్తగా మంట కలిగించట్లేదు. అందులో దాగి ఉన్న మంటనే మనం ఆ కట్టెలోంచి తెప్పిస్తున్నాము. అలాగే  ప్రకృతిలో ఉన్న మహత్ తత్వాన్ని క్షోభింపచేసి కనపడేలా చేసాడు. ఈ అహంకారమే మూడు రకాలుగా ఉంటుంది. కార్యమని (శరీరము), కారణమని (ఇంద్రియ) కర్త(జీవుడు) అని, భూత ఇంద్రియ మనో మయములనీ అంటారు.

వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రిధా
అహంతత్త్వాద్వికుర్వాణాన్మనో వైకారికాదభూత్
వైకారికాశ్చ యే దేవా అర్థాభివ్యఞ్జనం యతః

అహంకారం సాత్వికా (అందులోంచి మనసు, ఇంద్రియాధిష్టాన దేవతలు), రాజస ( అందులోంచి జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియ) తామస (అందులోంచి  పంచభూతాలు). దీన్నే వైకారికము (సాత్వికాహంకారం) తైజసం (రాజసాహంకారం) తామసం అంటారు. ఏ వికారమూ లేని అహంకార తత్వంలో పరమాత్మ వికారం వచ్చేట్లు చేసాడు. కాబట్టే దానిని వైకారికం అంటారు.అదే సాత్వికాహంకారం. సాత్వికాహంకారం వలన మనసు ఆవిర్భవించింది. దీన్ని బట్టే ఆయా ఇంద్రియ అధిష్టాన దేవతలు పుట్టారు. అందుకే వారిని వైకారికులు అంటారు. ఈ దేవతల వలనా, మనసు వలనా మనకు విషయములు (అర్థములు) తెలియబడుతున్నాయి. శబ్దాది విషయాలను గ్రహించేవి ఇంద్రియాలైనా వాటికి మనో సంబంధం లేకపోతే అవి గ్రహించబడవు. అందుకే ఇది ప్రథానం.

తైజసానీన్ద్రియాణ్యేవ జ్ఞానకర్మమయాని చ
తామసో భూతసూక్ష్మాదిర్యతః ఖం లిఙ్గమాత్మనః

రాజసాహంకారం నుంచి జ్ఞ్యాన కర్మ ఇంద్రియాలు పుడుతున్నాయి. తామసాహంకారం నుంచి పంచ తన్మాత్రలు పుడతాయి. తన్మాత్ర అంటే సూక్ష్మావస్థ. వీటినే భూతాది (దేని నుంచి పంచభూతములు పుడతాయో) అంటాము. భగవానునికి ఏది ప్రమాణమో (ఏది చిహ్నమో) అది పుడుతుంది (శబ్దం) . అదే శబ్ద తన్మాత్రం

కాలమాయాంశయోగేన భగవద్వీక్షితం నభః
నభసోऽనుసృతం స్పర్శం వికుర్వన్నిర్మమేऽనిలమ్

దీని నుంచీ (శబ్ద తన్మాత్రం), ప్రకృతి నుండి, కాలము నుండి ఆకాశం పుట్టింది. ఈ ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర, దాని నుండి వాయువు. వాయువు నుండి రూప తన్మాత్ర. రూప తన్మాత్ర నుండి అగ్ని. అగ్ని నుండి రస తన్మాత్ర. దాని నుండి గంధ తన్మాత్ర. గంధ తన్మాత్ర నుండి భూమి పుడుతుంది.
పంచ్భూతములను గుర్తించడానికి వాటి గుణములే ప్రథాన కారణాలు. వీటినే విషయములూ ప్రమాణములూ గుణములూ అంటాము. ఈ గుణములు ద్రవ్యముకు ఉంటాయి. గుణము లేకుండా ఏ ద్రవ్యమూ (పృధ్వీ, అప్, తేజ...) ఉండదు
ఈ పంచభూతములకు ఆది తామసాహంకారం. ఈ తన్మాత్రే వికారం చెంది వాయువును సృష్టించినది.

అనిలోऽపి వికుర్వాణో నభసోరుబలాన్వితః
ససర్జ రూపతన్మాత్రం జ్యోతిర్లోకస్య లోచనమ్

ఈ వాయువు కూడా వికారం చెంది రూప తన్మాత్రం పుట్టింది.
ఆ రూప తన్మాత్ర నుండి వచ్చేది అగ్ని. సకల ప్రపంచానికి ఇది నేత్రం. ఆ అగ్ని వికారం చెంది దాని మీద పరమాత్మ దృష్టి పడినపుడు రస తన్మాత్ర ఏర్పడింది. దాని నుంచి కాల మాయ అంశ (సంకల్పం) తోటి జలం ఏర్పడింది

అనిలేనాన్వితం జ్యోతిర్వికుర్వత్పరవీక్షితమ్
ఆధత్తామ్భో రసమయం కాలమాయాంశయోగతః
జ్యోతిషామ్భోऽనుసంసృష్టం వికుర్వద్బ్రహ్మవీక్షితమ్
మహీం గన్ధగుణామాధాత్కాలమాయాంశయోగతః

అగ్ని జలముల యొక్క కలయికతో ఏర్పడి, పరమాత్మ సంకల్పంతో వికారం చెంది గంధ తన్మాత్ర ఏర్పడింది, దానినుంచి కాల మాయ అంశల వలన భూమి ఏర్పడింది.

భూతానాం నభఆదీనాం యద్యద్భవ్యావరావరమ్
తేషాం పరానుసంసర్గాద్యథా సఙ్ఖ్యం గుణాన్విదుః

దేని నుండి పుడుతున్నదో దాని గుణాన్ని కూడా తీసుకుని పుడుతున్నది. శబ్దం గుణం గా కలిగిన ఆకాశం నుండి స్పర్శ పుట్టిందంటే వాయువులో స్పర్శా, శబ్దమూ రెండూ ఉన్నాయి. దేని నుంచి ఏది వస్తోందో దానిలో ఉన్న గుణాలను కూడా తీసుకుని వస్తున్నది (తేషాం పరానుసంసర్గాద్). ప్రథానం సగ భాగం, మిగతా నాలుగు కలిసి సగభాగం ఉంటాయి. దీన్నే పంచీకరణం అంటారు.

ఏతే దేవాః కలా విష్ణోః కాలమాయాంశలిఙ్గినః
నానాత్వాత్స్వక్రియానీశాః ప్రోచుః ప్రాఞ్జలయో విభుమ్

వీటినే దేవతలూ అంటారు (ఇంద్రియాధిష్టాన దేవతలు) , ఇవన్నీ పరమాత్మ అంశలే. ఈ తత్వములు చాలా ఉండి, తమ పని తాము చేసుకోగల శక్తి లేనందున, ఈ దేవతలందరూ చేతులు జోడించి పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు.

దేవా ఊచుః
నమామ తే దేవ పదారవిన్దం ప్రపన్నతాపోపశమాతపత్రమ్
యన్మూలకేతా యతయోऽఞ్జసోరు సంసారదుఃఖం బహిరుత్క్షిపన్తి

దేవా! ఆశ్రయించినవారి తాపం తొలగించే నీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాము. ఏ పాదాన్ని ఆశ్రయించిన యతులు గొప్పదైన సంసార మహాదుఃఖాన్ని అవతల విసిరివేస్తున్నారు, నీ దయ వలన.

ధాతర్యదస్మిన్భవ ఈశ జీవాస్తాపత్రయేణాభిహతా న శర్మ
ఆత్మన్లభన్తే భగవంస్తవాఙ్ఘ్రి చ్ఛాయాం సవిద్యామత ఆశ్రయేమ

స్వామీ, ఈ సంసారములో పుట్టిన జీవులు ఆధ్యాత్మిక ఆఇభౌతిక ఆదిదైవిక తాపములతో కొట్టబడి సుఖమునూ శుభమునూ పొందలేకపోతున్నారు.. నీ సంకల్పం లేకుండా శుభాన్ని సుఖాన్ని పొందలేము కాబట్టి నీ పదాలను ఆశ్రయిస్తున్నాము

మార్గన్తి యత్తే ముఖపద్మనీడైశ్ఛన్దఃసుపర్ణైరృషయో వివిక్తే
యస్యాఘమర్షోదసరిద్వరాయాః పదం పదం తీర్థపదః ప్రపన్నాః

నీ పాదపద్మాల చాయనుండే ఋషులు కూడా సకల వేదార్థాలు వెతుకుతారు.
మన పాపాన్ని తొలగించేది గంగ. ఈ గంగ పరమాత్మ పాదం నుండి పుట్టింది. అందుకే నీ పాదానికి తీర్థపదం (పరిశుద్దమైన పాదం) అని పేరు

యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సమ్మృజ్యమానే హృదయేऽవధాయ
జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా వ్రజేమ తత్తేऽఙ్ఘ్రిసరోజపీఠమ్

అందుకు మనమందరమూ కలిసి శ్రద్ధతోటి, శాస్త్రజ్ఞ్యానంతో కూడిన భక్తితో ఈ విషయాన్ని హృదయంలో నిలుపుకుని, పరమాత్మ యందు జ్ఞ్యానమూ, వైరాగ్య బలముతో, ధీరత్వముతో (ఎన్ని కలిగినా వికారము కలగని స్థితి ధీరత్వం ) నీ పాద పద్మ పీఠమును ఇందుకే మేము ఆశ్రయిస్తున్నాము.

విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదామ్బుజం తే
వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్

సకల చరాచర సృష్టి స్థితి లయములను చేసే నీ పాదములను, ఏ పాదములను తలచుకుంటే మానవులకు అభయం కలుగుతుందో, అట్టి నీ పాదపద్మములను శరణు వేడుతున్నాము.

యత్సానుబన్ధేऽసతి దేహగేహే మమాహమిత్యూఢదురాగ్రహాణామ్
పుంసాం సుదూరం వసతోऽపి పుర్యాం భజేమ తత్తే భగవన్పదాబ్జమ్

శరీరంలో నేను అని, ఈ ఇల్లు నాది అని, పూర్వ సంస్కార వాసనలతో లేని శరీరం మీద లేని ఇంటి మీదా నేనూ నాదీ అనే భావన్ పాతుకుపోయి, అలాంటివారు ఎంతగా నీ దగ్గరకి రావాలనుకున్నా వారికీ నీకూ చాలా దూరము. శరీరములో ఉండే ఆత్మనే చూడని వారు ఆత్మలో ఉండే పరమాత్మను చూడజాలరు. అందుకే నీదగ్గరకి చేర్చే నీ పాదపద్మములను నిరంతర్మూ స్మరిస్తాము

తాన్వై హ్యసద్వృత్తిభిరక్షిభిర్యే పరాహృతాన్తర్మనసః పరేశ
అథో న పశ్యన్త్యురుగాయ నూనం యే తే పదన్యాసవిలాసలక్ష్యాః

మా ఇంద్రియములు అసత్వృత్తులు (మంచివాటి వెంట పడనివి),అవి ఎప్పుడు ఎదుటివారికే, శత్రువులకే సహాయం చేస్తాయి. ఇవి శత్రువులని ఆకర్షిస్తాయి. లోపల దాగి ఉన్న నిన్ను చూడలేకపోతున్నారు

పానేన తే దేవ కథాసుధాయాః ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం యథాఞ్జసాన్వీయురకుణ్ఠధిష్ణ్యమ్

పరమాత్మా! నీ పాద న్యాసం వలన ఏర్పడే శోభ, మహిమను దగ్గర్లో ఉండి కూడా చూడలేకపోతున్నారు. ఇక్కడే ఉండి నీ కథలని మాటి మాటికీ గానం చేస్తే , వింటూ ఉంటే, భక్తి పెరుగుతుంది, దాని వలన మనసు పరిశుద్దమవుతుంది. అలాంటి వారు వైరాగ్యసారమైన జ్ఞ్యానమునూ తత్వమునూ తెలుసుకుని నీ లోకాన్ని వైకుంఠాన్ని చేరుతారు

తథాపరే చాత్మసమాధియోగ బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠామ్
త్వామేవ ధీరాః పురుషం విశన్తి తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే
తత్తే వయం లోకసిసృక్షయాద్య త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ
సర్వే వియుక్తాః స్వవిహారతన్త్రం న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే

మరికొందరు సమాధితోటి తపస్సుతోటి యోగముతో ప్రకృతిని జయించి కష్టపడి నిన్ను చేరతారు. కానీ వారికి శ్రమ ఎక్కువ తప్ప ఫలితం అంతగా ఉండదు. మేమందరమూ లోకాలను సృష్టించాలన్న నీ కోరిక చేత సృష్టించబడ్డాము. అందర కలిసాం గానీ నీవనుకున్నటువంటి సృష్టి చేయడానికి సమర్ధులం కాము.

యావద్బలిం తేऽజ హరామ కాలే యథా వయం చాన్నమదామ యత్ర
యథోభయేషాం త ఇమే హి లోకా బలిం హరన్తోऽన్నమదన్త్యనూహాః

మాకు నీవు శక్తినిస్తే మేము సృష్టి చేస్తాము. అన్నమదామ - మేము అన్నం తింటాము. నీవు మాకిచ్చినదానితో మేమూ తింటామూ, నీకూ పెడతాము. బలిం తేऽజ హరామ - నీకూ అన్నం పెడతాము. నీవు మాకించ్చినదే కొంత నీకు పెట్టి మేము కొంత తింటాము. ఏ ఏ సమయంలో ఏ ఏ పూజ నీకు చేయాలో అది చేస్తాము. మాలాగే ఈ లోకం కూడా నీకు పూజా చేయాలీ, తామూ తినాలి. భగవంతునికి పూజ చేసిన తరువాతే పరమాత్మకు పెట్టి మనం తినాలి. ఎలాంటి విఘ్నం లేకుండా నిన్ను ఆరాధిస్తారు. నీవిచ్చిన అన్ని భోగాలూ అనుభవిస్తారు.

త్వం నః సురాణామసి సాన్వయానాం కూటస్థ ఆద్యః పురుషః పురాణః
త్వం దేవ శక్త్యాం గుణకర్మయోనౌ రేతస్త్వజాయాం కవిమాదధేऽజః

నీవు సకల చరాచర ప్రపంచానికి నీవే కూటస్థుడవు (మొట్టమొదటి వాడవు), ఎలాంటి వికారమూ చెందని వాడవు, (నాశము లేదు, తరగదు, వికారమూ చెందడు, పెరుగదు, మారదు - వీటిని కూటస్థం అంటారు)
నీవు ఈ ప్రకృతి యందు నీ శక్తిని నిక్షేపింప చేసావు. నీ రేతస్సు వలన మేమందరం ఆవిర్భవించాము. పుట్టిన మేము ఏమీ చేయలేము

తతో వయం మత్ప్రముఖా యదర్థే బభూవిమాత్మన్కరవామ కిం తే
త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా దేవ క్రియార్థే యదనుగ్రహాణామ్

నీవు ఈ ప్రకృతి యందు నీ శక్తిని నిక్షేపింప చేసావు. నీ రేతస్సు వలన మేమందరం ఆవిర్భవించాము. పుట్టిన మేము ఏమీ చేయలేము . నీ కళ్ళని మాకిస్తే మేము చూస్తాము, నీవనుకున్నదానిని చేస్తాము. జ్ఞ్యానమునూ శక్తినీ మాకు ప్రసాదించు. అని ఇద్రియాధిష్టాన దేవతలు పరమాత్మను స్తోత్రం చ్

Popular Posts