Followers

Friday 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదిహేనవ అధ్యాయం

సూత ఉవాచ

ఏవం కృష్ణసఖః కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః

నానాశఙ్కాస్పదం రూపం కృష్ణవిశ్లేషకర్శితః

భ్రాత్రా రాజ్ఞ ఆవికల్పితః: ధర్మరాజు ఇన్ని రకాలుగా అడిగితే. కృష్ణవిశ్లేషకర్శితః : కృష్ణవియోగంతో చిక్కిపోయినవాడై ముఖము వాడిపోయింది

శోకేన శుష్యద్వదన హృత్సరోజో హతప్రభః

విభుం తమేవానుస్మరన్నాశక్నోత్ప్రతిభాషితుమ్

శుష్యత్ వదన :  కృష్ణవియోగంతో చిక్కిపోయినవాడై ముఖము వాడిపోయింది

హృత్సరోజో హతప్రభః హృదయపద్మం కూడా కంతిని తగ్గించుకుంది

విభుం తమేవానుస్మరన్నాశక్నోత్ప్రతిభాషితుమ్ - పరమాత్మనే స్మరిస్తూ మాటలు రాక నిలబడెను

కృచ్ఛ్రేణ సంస్తభ్య శుచః పాణినామృజ్య నేత్రయోః

పరోక్షేణ సమున్నద్ధ ప్రణయౌత్కణ్ఠ్యకాతరః

ఎంతో కష్టపడి దుఖాన్ని దిగమింగుకొని కనులు తుడుచుకొని

పరమాత్మ ఎదురుగా ఉన్నప్పుడు అతని మీద ఉన్న ఉత్సాహం చాటుగ ఉన్నప్పుడు ఎక్కువైంది. కాతర: దీనుడైపోయాడు

సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్

నృపమగ్రజమిత్యాహ బాష్పగద్గదయా గిరా

కృష్ణుణ్ణి తలచుకుంటే తలచుకోవాల్సింది సఖ్యం మైత్రీం సౌహృదం

ఈ  మూడితికీ తేడా ఉంది.సౌహృదం - హృదయాంతర్గంలో కూడా ఎదుటివాడిమేలు కోరడం. హృదయం కూడా 'సూ కావాలి. హృదయాంతర్గతం కూడా హితం కోరుకోవడము

మైత్రీం  - మిత్రత. తనవాడు అనుకున్నవాడి దోషాలని వివరించి సవరించే పని చెస్తే అది మైత్రీ

సఖ్యం  - ఖం అంటే ఇంద్రియాలు. స ఖ్యం అంటే సమానాన్ని. అంటే ఇంద్రియాలు సమానం. అంటే? అన్నిటిలో ఒకలా ఉండటం, పనిచేయడంలో, తినడంలో తిరగడంలో, అన్నిటిలో ఒకలా ఉండటం.

సారధ్యంలో సౌహృదాన్ని స్మరించాడు. యుధ్ధం జరిగిన 18 రోజులు కృష్ణుడు అర్జనునితోనే ఉన్నాడు. కృష్ణుని దృష్టి సాకే దూరంలోనే మిగతా నలుగురు పాండవులూ ఉన్నారు. ఒక వేళ కృష్ణుడు కూడా యుధ్ధం చేస్తే యుధ్ధం చేస్తూ పాండవుల యోగ క్షేమాన్ని కనిపెట్టడం కష్టమవుతుంది. సారధిగా ఉండి ఐదుగురినీ కాపాడాడు. ఒక సారి కర్ణుడి ప్రతాపం చూచి అర్జనుడే రథాన్ని వెనక్కి జరపమన్నాడు. అపుడు ధర్మరాజు ముందుకొచ్చి కర్ణున్ని అడ్డుకున్నాడు. ధర్మరాజులో తన శక్తిని నిక్షేపించాడు. ఒక సారి వీరిద్దరూ భయపడితే భీముడిలో నిక్షేపించాడు. అలాగే భగదత్తుడు వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురినీ కాపాడటానికి సహదేవున్ని పంపాడు. ఆయన శక్తిని సహదేవునిలో నిక్షేపించాడు

18 రోజుల యుధ్ధంలో సహదేవుడుకూడ ఒక రోజు మొత్తం కౌరవ సైన్యాన్ని ఆపాడు.

కృష్ణుడు వెంటలేనప్పుడు నలుగురు పాండవులు ఉండి కూడా అభిమన్యున్ని కాపాడలేకపోయారు

అలాగే రాయబారంలో ఆయన చూపిన మైత్రీ. ఇవన్నీ గుర్తుకుతెచ్చుకున్నాడు.

అర్జున ఉవాచ

వఞ్చితోऽహం మహారాజ హరిణా బన్ధురూపిణా

యేన మేऽపహృతం తేజో దేవవిస్మాపనం మహత్

ఓం నమో భగవతే వాసుదేవాయ

వఞ్చితోऽహం మహారాజ హరిణా బన్ధురూపిణా

యేన మేऽపహృతం తేజో దేవవిస్మాపనం మహత్

బంధువుగా ఉన్న శ్రీహరిచేత నేను మోసగింపబడ్డాను. ఇక్కడ మోసగించబడటం అంటే అనుఖొనిది జరగడం. అందరు కృష్ణుని యందు పరమాత్మ భావన కలిగి ఉన్నవారే.

ఎంతో కాలం నేను దేవతలను కూడా ఆశ్చర్యపరిచాను (దేవవిస్మాపనం ) నా తేజస్సుతో. అది అంతా నా తేజస్సు అని అనుకున్నాను. ఏ మహానుభావుని చేత దేవతలకి కూడా ఆశ్చర్యపరిచే నా పరాక్రమం అపహరించబడింది.

యస్య క్షణవియోగేన లోకో హ్యప్రియదర్శనః

ఉక్థేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యథా

ఏ ప్రాణి అయిన ఏది ఉంటే ప్రకాశిస్తున్నారో ఏది లేకపోతే అంతకు ముందు ప్రేమించినవారంతా భయపడతారో అది ప్రాణం

ఏ మహానుభావుని యొక్క క్షణ కాల వియోగంతో ప్రపంచమంతా శూన్యంగా కనపడుతుందో, ఎలాగంటే ప్రాణం లేని దేహం లాగ.ఒక క్షణకాల వియోగానికే లోకమంతా అప్రియంగా కనపడుంది.

ఆయన లేని మనం ప్రాణం లేని దేహంతో సమానం

యత్సంశ్రయాద్ద్రుపదగేహముపాగతానాం రాజ్ఞాం స్వయంవరముఖే స్మరదుర్మదానామ్

తేజో హృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః సజ్జీకృతేన ధనుషాధిగతా చ కృష్ణా

తను జీవితకాలం లో సాధించిన విజయాలని,

పాండవులు ఏమి ఏమి విజయాలు సాధించారో అవి అన్నీ చెబుతున్నాడు

ద్రౌపదీ స్వయం వరానికి అందరూ వచ్చారు. పాండవులు బ్రాహ్మణ వేషంతో ఉన్నారు. క్షత్రియులని చెప్పుకున్నవారందరు మత్స్య యంత్రాన్ని చేధించలేకపోయారు. అది అవమానం అని భావించి ద్రుపదుడు

"లక్ష్యన్ని కొట్టగలవారు, కొట్టినా చేసే పనిలో సౌహార్దం ఉండాలి తప్ప ద్వేషం ఉండకూడదు, చక్కని శాస్త్ర పాండిత్యం కలవారు అయి ఉండాలి. వేదాధ్యాయం చేసే బ్రాహ్మణులు కూడా రవొచ్చు" అని చెప్పగా అర్జనుడు వెళ్ళి కొట్టాడు. అది సహించలేని రాజులు మమ్మల్ని ఓడిస్తేనే నీవు గెలిచినట్లు అని అన్నారు, ద్రౌపది మీద కోరికతో. ఆ మదం తో వారు యుధ్ధానికి వస్తే

వారితేజస్సును నేను హరించాను. మత్స్యాన్ని కూడా కొట్టాను. (తేజో హృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః )

ద్రౌపతిని కూడా పొందాను.ఇది అంతా నా ప్రతిభ చేత కాదు (యత్సంశ్రయా - ఎవరి ఆశ్రయం వల్ల)

స్వయంవరానికి కబురు పంపింది కృష్ణుడే

యత్సన్నిధావహము ఖాణ్డవమగ్నయేऽదామిన్ద్రం చ సామరగణం తరసా విజిత్య

లబ్ధా సభా మయకృతాద్భుతశిల్పమాయా దిగ్భ్యోऽహరన్నృపతయో బలిమధ్వరే తే

ఖాండవ వన దహనం లో ఇంద్రుని మీదే గెలిచాను. వాహ్యాళికి వెళ్ళినట్లు బయలుదేరించి అర్జనునికి ఆయుధాలిప్పించి ఇంద్రునితో యుధ్ధం చేసి వర్షం రాకుండా చేసి ఖాండవ వనం దహింపజేసాడు.

దేవతల గణాంతో కూడిన ఇంద్రున్ని గెలిచి (ఇన్ద్రం చ సామరగణం), అదే సమయంలో మయుడు కాపాడబడితే మయుడు ఒక సభను తయారు చేసి ఇచ్చాడు. కుంతీ స్తోత్రంలో చెప్పబడినట్లు అర్జనునికి గాండీవాన్ని తనకి సుదర్శనాన్ని ధర్మరాజుకు మయసభ ఇప్పించి ఇంద్రున్ని అర్జనుడు జయించాడన్న కీర్తి చాటించి  - ఆ మయ సభ వలనే భారతంలో మిగతా ఘట్టాలన్ని జరిగాయి. పాండవులకు అవమానం జరిగితేనే గానీ వారి మనసు క్షోభించదు, ధర్మాత్ముల మనసు క్షోభిస్తేనే గాని అధర్మం అంతరించదు.

కృష్ణుడు మయసభను ఇప్పించడంలో సూక్షం , దుర్యొధనునికి ఆ మయసభను విడిదిగా ఇప్పించమని ధర్మరాజుకు చెప్పడం ఇదంతా ఆయన సంకల్పమే

ఆ మయ సభలోనే సామంత రాజులంతా నీకు ధనాన్ని అర్పించారు

యత్తేజసా నృపశిరోऽఙ్ఘ్రిమహన్మఖార్థమార్యోऽనుజస్తవ గజాయుతసత్త్వవీర్యః

తేనాహృతాః ప్రమథనాథమఖాయ భూపా యన్మోచితాస్తదనయన్బలిమధ్వరే తే

ఈ మహానుభావుడు రాజసూయం చేయించి నీ తమ్ముడు నా అన్నగారైన  భీముడు (గజాయుతసత్త్వవీర్యః) పదివేల ఏనుగుల బలం గల జరాసంధున్ని ఓడించాడు. రాజసూయం శివ మయం అయిన యాగం  (ప్రమథనాథమఖాయ). అయితే రాజసూయం ఎవరు చేసిన సకలదేవత అర్పణం చేసి చివరి ఆహుతి శివునికి ఇస్తారు. యజ్ఞ్య రక్షకుడు విష్ణువు కాబట్టి శంకరునికి ఆహుతి చేసి, కృష్ణునికి అగ్రపూజ చేసారు. దాని వల్ల ధర్మరాజుకు చక్రవర్తి హోదా వచ్చింది. ఈ కీర్తిని మాకు వచ్చేట్లు చేసిన కృష్ణుడు

పత్న్యాస్తవాధిమఖక్లృప్తమహాభిషేక శ్లాఘిష్ఠచారుకబరం కితవైః సభాయామ్
స్పృష్టం వికీర్య పదయోః పతితాశ్రుముఖ్యా యస్తత్స్త్రియోऽకృతహతేశవిముక్తకేశాః

ఆ రజసూయమైన తరువాత జరిగిన అవభృత స్నానంతో పవిత్రమైన గంగా జలంతో (మఖక్లృప్తమహాభిషేక ) తడిసిన నీ పట్టపురాని (పత్న్యాస్తవా) కొనియాడబడే కేశములను ( శ్లాఘిష్ఠచారుకబరం) అసూయతో నీ శత్రువులు స్పృశించారు (కితవైః స్పృష్టం  - కపటులతో స్పృశించబడింది) . వారు స్పృశిస్తే వారి భార్యలు కేశములు ముడివేయలేని స్థితికి వచ్చారు.

యో నో జుగోప వన ఏత్య దురన్తకృచ్ఛ్రాద్దుర్వాససోऽరిరచితాదయుతాగ్రభుగ్యః
శాకాన్నశిష్టముపయుజ్య యతస్త్రిలోకీం తృప్తామమంస్త సలిలే వినిమగ్నసఙ్ఘః

అరణ్యవాసంలో కూడా దుర్యోధనుడు వదలక దుర్వాసున్ని పదివేలమంది శిష్యులతో సహా భోజనానికి పాండవుల వద్దకు పంపాడు. అక్ష్యపాత్రను అప్పుడే కడిగి పెట్టడంవల్ల మరునాడు ఉదయంవరకూ దానిని వాడటం కుదరదు. అప్పుడు ద్రౌపతి ధర్మరాజు తక్షణ కర్త్వ్యమేమిటని మధనపడుతుంటే ధర్మరాజు సలహా మేరకు ద్రౌపది కృష్ణుణ్ణి పిలిస్తే, వెంటనే కృష్ణుడు ఆకలవుతుందంటూ వస్తాడు. ద్రౌపతిని అక్షపాత్ర తీసుకు రమ్మని అందులో మూడు మెతుకులని చూపిస్తాడు.
మనం చాలా జాగ్రత్తగా పనిచేసాము అనుకున్న దాంట్లొ లొసుగులు ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం.
ఇంటికి వచ్చిన అథిది కి భోజనం పెట్టడానికి కూడా ఆయన కృపే కావల్సి వచ్చింది
పదివేలమందితో కలిసి భోజనానికి వచ్చిన దుర్వాసునికి కూరగాయలతో కలిపి ఉన్న అన్నంతో (కృష్ణుడు అప్పుడు చెప్పాడు - నేనే అన్నమును కావలంటే ఆవిర్భవిస్తాను వద్దనుకుంటే అంతర్ధానమవుతాను)

యత్తేజసాథ భగవాన్యుధి శూలపాణిర్విస్మాపితః సగిరిజోऽస్త్రమదాన్నిజం మే
అన్యేऽపి చాహమమునైవ కలేవరేణ ప్రాప్తో మహేన్ద్రభవనే మహదాసనార్ధమ్

అరణ్యవాసంలో ఉన్నప్పుడు వ్యాస భగవానుడు వచ్చి - అరణ్య అజ్ఞ్యాత వాసాలు ముగిసాక వారు రాజ్యం ఇవ్వకపోతే నీవు యుధ్ధం చేసి రాజ్యం సంపాదించాలి. వారి పక్షంలో 21సార్లు భూమడలాన్ని ని:క్షత్రియం చేసిన బీష్ముడిని, దృఒణున్ని, కర్ణుణ్ణి, కృపున్ని, అశ్వధ్ధామ ఉన్నారు. వారు అస్త్రబలం దేహబలం కాకుండా దివ్యాస్త్రబలం ఉన్నవారు. తపసుతో ఎందరినో ప్రసన్నం చేసుకుని దివ్యాస్త్రాలని పొందారు. నీవు అర్జనుని పంపి శంకరుని గూర్చి తపసు చేయమను. అర్జనున్ని శంకరుడు - నన్ను కొట్టి నీ వరాహాన్ని తీసుకో అంటే, అర్జనుడి అమ్ములపొదిలో ఎన్నడూ లేనివిధంగా బాణములు ఐపోయాయి, అప్పుడు ధనస్సుతో శనకుర్నిమీదకు వచ్చినపుడు, సమయస్పూర్థి ఉన్నవాడివి నీవు గెలిచావులే అన్నాడు. అర్జనునికి పాశుపశాస్త్రం ఇచ్చాడు. శంకరున్నే ఓడించాడన్న పేరు పొందడానికి ఎవరు కాలం .
అది పొందిన తరువాతే అర్జనుడు ఇంద్రునికి సాయం చేసి ఇంద్రుని ఆహవానంతో ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, వెళ్ళి అర్థాసనాన్ని పొందాడు. (అందరూ శరీరం వదిలి వెళితే అర్జనుడు కృష్ణుని వల్ల శరీరంతోటే స్వర్గానికి వెళ్ళాడు)

తత్రైవ మే విహరతో భుజదణ్డయుగ్మం గాణ్డీవలక్షణమరాతివధాయ దేవాః
సేన్ద్రాః శ్రితా యదనుభావితమాజమీఢ తేనాహమద్య ముషితః పురుషేణ భూమ్నా

ఎవరి సంకల్పానుగ్రహం వలన పొందిన అస్త్రాది బలంతో ఉన్న నేను దేవతలకి సాయం చేసి వరములు పొందాను. అలాంటివాడు నన్ను మోసం చేసాడు (ముషితః )

యద్బాన్ధవః కురుబలాబ్ధిమనన్తపారమేకో రథేన తతరేऽహమతీర్యసత్త్వమ్
ప్రత్యాహృతం బహు ధనం చ మయా పరేషాం తేజాస్పదం మణిమయం చ హృతం శిరోభ్యః
ఇది ఉత్తరగోగ్రహణానికి సంబంధించినది
దాటడానికి సరిపొయే బలం లేని నేను ఇంత పెద్ద కౌరవ సమూహాన్ని రథంతోటే దాటాను (కృష్ణుని సారధ్యం వల్ల).
ఉత్తర గోగ్రహణంలో అందరినీ ఓడించి వారి శిరస్సులకి గల పుత్తలికలను తీసుకు వచ్చాను కృష్ణుని అనుగ్రహంతో
(మనకి ఉత్తరగోగ్రహణంలో కృష్ణుడు కనపడడు. ఉత్తరకుమారుడు సారధ్యం చేయడానికి వెళ్తూ తన గదిలో కృష్ణపరమాత్మను ధ్యానం చేసి అనుగ్రహం కోరగా కృష్ణుడు వచ్చి అభయమిస్తాడు)

యో భీష్మకర్ణగురుశల్యచమూష్వదభ్ర రాజన్యవర్యరథమణ్డలమణ్డితాసు
అగ్రేచరో మమ విభో రథయూథపానామాయుర్మనాంసి చ దృశా సహ ఓజ ఆర్చ్ఛత్

కురుక్షేత్ర సంగ్రామంలో నాకంటే ముందు నిలిచి (ఆయుర్మనాంసి చ దృశా) శత్రువుల ఆయువును మనసును బలమును కంటి చూపుతోటే తీసుకున్నాడు. రావణున్ని చంపడానికి రాముడు నిమిత్తుడయ్యాడు. అతని చావు సీతమ్మవలనే జరిగింది. అలాగే భారత యుధ్ధంలో అందరి ప్రాణములని మనసును బలమును గుంజుకున్నాడు. చచ్చినవారు మళ్ళి పుట్టకూడదని తాను చూచాడు, యుధ్ధం చేస్తున్న వాళ్ళు గెలవకూడదని, వారి మనసులో ధర్మభీతి కలగడానికి చూచాడు. వారి మనసు పరాక్రమం ఆయ్షు హరించాడు. దానికితోడు వారికి మళ్ళీ పుట్టుక లేకుండా చేసాడు. వారు మోక్షానికి వెళ్ళడంతో వారి కుటుంబాలు కూడా తరించాయి. భారతంలో కృష్ణుడు భగవంతుడని తెలియని వాడు లేడు దుర్యోధనునితో సహా,

యద్దోఃషు మా ప్రణిహితం గురుభీష్మకర్ణ నప్తృత్రిగర్తశల్యసైన్ధవబాహ్లికాద్యైః
అస్త్రాణ్యమోఘమహిమాని నిరూపితాని నోపస్పృశుర్నృహరిదాసమివాసురాణి

పరమాత్మ భక్తున్ని రాక్షసులు ముట్టనట్టుగా కురుక్షేత్రంలో మహావీరులు ప్రయోగించిన అస్త్రములు నన్ను ముట్టకుండా కాపాడాడు. వారు వేసిన అస్త్రాలన్ని రథంలో నిక్షిప్తం చేసాడు. యుధ్ధం పూర్తి అయ్యేవరకూ అవి అన్ని రథంలోనే ఉన్నాయి. అవి నన్ను స్పృశించలేదు, ఎలాగంటే, విష్ణుభక్తున్ని రాక్షసులు స్పృశించలేనట్లు

సౌత్యే వృతః కుమతినాత్మద ఈశ్వరో మే యత్పాదపద్మమభవాయ భజన్తి భవ్యాః
మాం శ్రాన్తవాహమరయో రథినో భువిష్ఠం న ప్రాహరన్యదనుభావనిరస్తచిత్తాః

భారతమంతా చదివిన వారు బీష్మ దృఓణ కర్ణ శల్య సౌత్విక పర్వాలు చదవాలి. ఉన్నదంతా యుధ్ధమే అయినా ఉన్న సత్యమంతా అక్కడే ఉంది. మనం ఈ సంసారంతో ఎవరితో యుధ్ధం చేస్తున్నమో తెలుస్తుంది. అర్జనుని గుఱ్ఱాలు అలసిపోయి ఇక లాగలేమని మొండికేసాయి. అప్పుడు కృష్ణుడు వాటికి విశ్రాంతి ఇచ్చాడు. మళ్ళి గుఱ్ఱాలని రథాలకి తగిలించే దాకా ఎదురుగా ఉన్న వీరులందరూ ఒక్క బాణంకూడా వెయ్యలేదు గుఱ్ఱాలను పక్కన పెట్టి కూర్చున్నా. పరమాత్మ చూపుతో వారి మనసు హరించబడింది
సౌత్యే వృతః కుమతినా - అంత పెద్ద మహానుభావున్ని సారధిగా ఉండమని అడిగాను దుష్టబుధ్ధితో
అలాంటి సమయంలో కూడా (ఈశ్వరో మే యత్పాదపద్మమభవాయ భజన్తి భవ్యాః) సంసారంలో ఎవరి కాళ్ళు పట్టుకుని తరిస్తున్నారో అలాంటి వాడి భుజాలను నా పాదములతో తాకే ఉద్యోగం అతనికి ఇచ్చాను. దాన్ని కూడా సంతోషంగా స్వీకరించాడు.
గుఱ్ఱములు అలసిపోయి రథం విప్పి భూమి మీద నించుంటే (మాం శ్రాన్తవాహమరయో రథినో భువిష్ఠం) శత్రురాజులంతా ఆ మహానుభావుని వల్ల మనసు ఎక్కడికో పోయింది (న ప్రాహరన్ యద్ అనుభావనిరస్తచిత్తాః)

నర్మాణ్యుదారరుచిరస్మితశోభితాని హే పార్థ హేऽర్జున సఖే కురునన్దనేతి
సఞ్జల్పితాని నరదేవ హృదిస్పృశాని స్మర్తుర్లుఠన్తి హృదయం మమ మాధవస్య

ఆయన ఎప్పుడు కలిసినా హాస్యాన్ని సూచించేవి అయిన నర్మ గర్బితంగా అందమైన ఆయన నవ్వుతో మనసును హరించే హే పార్థ హేऽర్జున సఖే కురునందనా అనే మాటలతో హృదయాన్ని స్పృశించే ఆనందింప్చేసే పరిహాస ఉక్తులు ఇప్పుడు తలుచుకుంటే నా హృదయం హరించుకు పోతోంది

శయ్యాసనాటనవికత్థనభోజనాదిష్వైక్యాద్వయస్య ఋతవానితి విప్రలబ్ధః
సఖ్యుః సఖేవ పితృవత్తనయస్య సర్వం సేహే మహాన్మహితయా కుమతేరఘం మే

ఒక పక్క అతన్ని పరమాత్మ అంటూ, ఇంకో పక్క మహానుభావుడు అంటూ, రక్షకుడూ అంటున్నాం. వ్యవహారంలో ఆయనెప్పుడు నేను భగవంతున్ని అని వివక్ష చూపలేదు
కలిసి పడుకున్నాం భుజించాము ఆటలాడాము, (వికత్థన - నేను అర్జనున్ని అని గర్వించినపుడు), కూర్చున్నప్పుడు, మిత్రమా అని మాట్లాడాడు, మాట్లాడి మోసగించాడు (విప్రలబ్ధః). ఎన్నో సార్లు నా గర్వాన్ని ప్రకటించాను, దాన్ని కూడా ఆమోదించాడు (ఋతవానితి) అమోదించి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయతించాడు - ఒక తండ్రి కొడుకు తప్పుని, మిత్రుడు మిత్రుని తప్పును ఏ విధంగా సహిస్తారో అలా నా అపరాధాలు సహించాడు.
మహాన్మహితయా కుమతేరఘం మే - నేను మహా పాపం చేసాను. నేను గోపాలక పశుపాలక యాదవా అని పిలిచాను. హీనంగా మాట్లాడాను హీనంగా చూచాను. ఇవన్ని తండ్రిలాగ భరించి మిత్రుడిలాగ సహించాడు.

సోऽహం నృపేన్ద్ర రహితః పురుషోత్తమేన సఖ్యా ప్రియేణ సుహృదా హృదయేన శూన్యః
అధ్వన్యురుక్రమపరిగ్రహమఙ్గ రక్షన్గోపైరసద్భిరబలేవ వినిర్జితోऽస్మి

ఇప్పుడు ఆ పురుషోత్తమునితో వియోగాన్ని పొందాను. మిత్రుడు లేడు ప్రియుడు లేడు సుహృత్తూ లేడు. అంతెందుకు నా హృదయమే లేదు. ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే ఆయాన నన్ను పిలిచి "ఒక్క నా భవనం తప్ప మిగతా అంతా సముద్రం ముంచి వేస్తుంది, వజ్రునికి పట్టభిషేకం చేయి, నా పరివారాన్ని నీవు వెంట తీసుకుని వెళ్ళు, నీవే వారికి రక్షకుడివి" అన్నాడు. ఆ స్త్రీ పరివారాన్ని తీసుకుని వెళ్తుంటే ఒక గొల్ల పిల్లవాడు చిన్న కట్టెతో నన్ను చాలా దూరం పారగొట్టాడు. గొల్ల పిల్లవాడితో ఓడిపోయాను. అప్పుడు గుర్తుకొచ్చింది ఈ గొల్లపిల్లవాడు లేడు అని. అప్పుడు జ్ఞ్యాపకం వచ్చింది నా తేజస్సు ఏమిటొ. ఇప్పుడు నా హృదయమే లేదు. దుర్మార్గులైన గోపబాలుని చేతిలో స్త్రీ వలే ఓడిపోయాను (అధ్వన్యురుక్రమపరిగ్రహమఙ్గ రక్షన్గోపైరసద్భిరబలేవ వినిర్జితోऽస్మి)

తద్వై ధనుస్త ఇషవః స రథో హయాస్తే సోऽహం రథీ నృపతయో యత ఆనమన్తి
సర్వం క్షణేన తదభూదసదీశరిక్తం భస్మన్హుతం కుహకరాద్ధమివోప్తమూష్యామ్

అదే ధనసు అదే గాండీవం పాశుపాశాస్త్రం, అదే బాణాలు అదే రథం అవే గుఋఋఆలు - నేనూ మారలేదు,ఎవరిని చూసి సకలలోక రాజు తల వచుతారో నేను మారలేదు. క్షణంలో అంతా లేనట్లుగా అయ్యింది ఎందువాలంటే కృష్ణుడు అక్కడ లేకపోవడం వల్ల (ఈశరిక్తం)
భస్మన్హుతం కుహకరాద్ధమివోప్తమూష్యామ్ - చవట నేలలో నాటిన విత్తనంలాగ. అదంతా రిక్తమయిపోయింది

రాజంస్త్వయానుపృష్టానాం సుహృదాం నః సుహృత్పురే
విప్రశాపవిమూఢానాం నిఘ్నతాం ముష్టిభిర్మిథః

నీవడిగిన వారందరు బ్రాహ్మణ శాపంతో ఒకరిని ఒకరు ముష్ఠిఘాతాలతో కొట్టుకున్నారు.

వారుణీం మదిరాం పీత్వా మదోన్మథితచేతసామ్
అజానతామివాన్యోన్యం చతుఃపఞ్చావశేషితాః

ఇంత పెద్ద యాదవ సైన్యం మద్యపానం చేసి ఆ మదంలో తన వారిని ఎదుటివారిని తేడా లేకుండా ఒకరినొకరు తెలియని వారిలా కొట్టుకున్నారు. నలుగురో అయిదుగురో మిగిలారు.(ఉద్దవుడు వజర్కుడు దారుకుడు...)

ప్రాయేణైతద్భగవత ఈశ్వరస్య విచేష్టితమ్
మిథో నిఘ్నన్తి భూతాని భావయన్తి చ యన్మిథః

ఎంత మద్యపానం చేసినా కొందరికైన బుధ్ధి పనిచెయలి కదా? అందరికీ లేకుండా పోయింది అంటే ఇది స్వామి సంకల్పం
ఆ పరమాతం సంకల్పంతోటే ఒకరినోకరు కొట్టుకుంటారు కలుసుకుంటారు.

జలౌకసాం జలే యద్వన్మహాన్తోऽదన్త్యణీయసః
దుర్బలాన్బలినో రాజన్మహాన్తో బలినో మిథః

నీళ్ళల్లోని చేపలు - చిన చేపలను పెద చేపలు తింటాయి. చేపలు భక్షింపబడినట్లుగా భక్షింపబడ్డారు

ఏవం బలిష్ఠైర్యదుభిర్మహద్భిరితరాన్విభుః
యదూన్యదుభిరన్యోన్యం భూభారాన్సఞ్జహార హ

ఇప్పుడు అనిపిస్తోంది అంత బాలాడ్యులైన యాదవులు అలాగే ఉంటే వారిని ఎవరు సమ్హరిస్తారు. కౌరవ బలానికి రెట్టింపు యాదవ బలం. స్వామి రక్షకుడు గా ఉండటం వలన వారిని ఎవరు నిర్మూలిస్తారు? ముల్లుని ముల్లుతో తీసి రెండు మూళ్ళనూ పారేసినట్లుగా.
అలాగే పరమాత్మ కూడా శరీరం దాల్చిన అధర్మాలను తీయడానికి వచ్చి ఆయన శరీరాన్ని కూడా చివరకు ఉపసమ్హరించుకున్న్నాడు

దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమాని చ
హరన్తి స్మరతశ్చిత్తం గోవిన్దాభిహితాని మే

ఆయా సమయాలలో సందర్భాలలో స్వామి అన్న మాటాలు ఇంకా జ్ఞ్యాపకం వస్తున్న్నాయి.

సూత ఉవాచ
ఏవం చిన్తయతో జిష్ణోః కృష్ణపాదసరోరుహమ్
సౌహార్దేనాతిగాఢేన శాన్తాసీద్విమలా మతిః

ఇలా పరిపైస్తూ ఆక్రోశిస్తూ బాధపడి ఆ పరమాత్మ కృపతోటే మనసు ప్రశాంతమయ్యింది. పరమాత్మ పాదాలను స్మరిస్తున్న అర్జనునికి మనసు శాంతించింది.

వాసుదేవాఙ్ఘ్ర్యనుధ్యాన పరిబృంహితరంహసా
భక్త్యా నిర్మథితాశేష కషాయధిషణోऽర్జునః

ఒక్కసారి తమ పుట్టుక నుంచీ ఇప్పటి వరకూ కృష్ణుడు చేసిన సహాయాలను ప్రేమను తలుచుకోవడం వల్ల ఆయన ధ్యానం వలన పెరిగిన భక్తితో బుధ్ధిలో ఉన్న అన్ని మురుకులూ కడిగివేయబడ్డాయి. పరమాత్మ పాదాలను స్మరించడంవలన బుధ్ధి నిర్మలం అయింది.

గీతం భగవతా జ్ఞానం యత్తత్సఙ్గ్రామమూర్ధని
కాలకర్మతమోరుద్ధం పునరధ్యగమత్ప్రభుః

పరమాత్మని గూర్చి ఇంతగా స్మరించుకుని బాధపడుతున్న అర్జనునికి యుధ్ధరంగంలో ఉపదేశించిన గానం చేసిన గీతా వాక్యం స్మరణకు వచ్చింది. ఇంత కాలం, కాలన్ని బట్టి కాలం వలన చేసిన కర్మలబట్టి దుఖాన్ని బట్టి అజ్ఞ్యానాన్ని బట్టి అణచివేయబడిన జ్ఞ్యానం స్పురణకి వచ్చింది.


విశోకో బ్రహ్మసమ్పత్త్యా సఞ్ఛిన్నద్వైతసంశయః
లీనప్రకృతినైర్గుణ్యాదలిఙ్గత్వాదసమ్భవః

బ్రహ్మసంపత్తితోటి దు:ఖాన్ని పోగొట్టుకున్నాడు. దాని వలన ద్వైత భావన పోయింది, (విశిష్ట)అద్వైతం గుర్తుకు వచ్చింది.
ప్ర్కృతిలో ఉన్న అన్ని గుణాలతో ఏర్పడిన ప్రపంచాన్ని మరచిపోవాలంటే ఆ గుణాలను ఎలా ప్రకృతిలో లీనం చేయాలో అలాగే అర్జనుడు కూడా దేహం మనసు బుధ్ధి చిత్తం అంత:కరణం అనే వాటిని పరమాత్మలో లీనం చేసాడు. నేను వేరు కృష్ణుడు వేరు అనే భావం అంతరించి , స్వరూప జ్ఞ్యానం కలిగింది

నిశమ్య భగవన్మార్గం సంస్థాం యదుకులస్య చ
స్వఃపథాయ మతిం చక్రే నిభృతాత్మా యుధిష్ఠిరః

పరమాత్మ వెళ్ళిన దారిని విన్న ధర్మరాజు నారదుని మాటలు గుర్తుచేసుకుని తాను కూడా బలయ్దేరడానికి సిద్దపడాడు.

పృథాప్యనుశ్రుత్య ధనఞ్జయోదితం నాశం యదూనాం భగవద్గతిం చ తామ్
ఏకాన్తభక్త్యా భగవత్యధోక్షజే నివేశితాత్మోపరరామ సంసృతేః

 కుంతి కూడా అర్జనుని మాటలు విని ఆ మహానుభావురాలు (ఏకాన్తభక్త్యా భగవత్యధోక్షజే ) అలాంటి పరమాత్మ మీద ఏకాంత భక్తితో యోగమార్గంలొ పరమాత్మలో ప్రవేశించింది
తల్లి ముందర పిల్లలను పంపడం మంచి కాదు కాబట్టి ముందు తల్లినే పంపారు.

యయాహరద్భువో భారం తాం తనుం విజహావజః
కణ్టకం కణ్టకేనేవ ద్వయం చాపీశితుః సమమ్

ఏ శరీరంతో భూభారాన్ని తగ్గించడానికి వచ్చాడో ఆ శరీరాన్ని ముల్లుని తీసిన తరువాత ఎలా ఐతే సహాయపడిన ముల్లుని కూడా పడేస్తామొ అలా

యథా మత్స్యాదిరూపాణి ధత్తే జహ్యాద్యథా నటః
భూభారః క్షపితో యేనజహౌ తచ్చ కలేవరమ్

నటుడు నాటకం వేసినపుడు, మత్స్య కూర్మ వరాహ అనే వేషం వేసిన తరువాత నాటంపూర్తి అయినాక ఆ వేషాన్ని వదిలిపెట్టినట్లు పరమాత్మ తెచ్చుకున్న రూపాన్ని దాని అవసరం తీరగానే వదిలిపెట్టాడు

యదా ముకున్దో భగవానిమాం మహీం జహౌ స్వతన్వా శ్రవణీయసత్కథః
తదాహరేవాప్రతిబుద్ధచేతసామభద్రహేతుః కలిరన్వవర్తత

ఎప్పుడైతే పరమాత్మ ఈ భూమి మీద తన దేహాన్ని విడిచిపెట్టాడొ, అదే అదనుగా కాచుకుని ఉన్న కలిపురుషుడు ఆ పూటే (ఒక పూట కూడా ఆగకుండా), వికసించని మనసులో అధర్మం కలిగించడానికి కారణమైన కలి అనుసరించాడు

యుధిష్ఠిరస్తత్పరిసర్పణం బుధః పురే చ రాష్ట్రే చ గృహే తథాత్మని
విభావ్య లోభానృతజిహ్మహింసనాద్యధర్మచక్రం గమనాయ పర్యధాత్

ధర్మ రాజు తన రాజ్యం లో కి కలి ప్రవేశించి సంచరించాడని జ్ఞ్యాని కాబట్టి తెలుస్కున్న అడు. తన పురంలో తన రాష్ట్రంలో తన ఇంటిలో చివరికి తనలో కూడా కలి ప్రవేశించాడని తెలుసుకొని. లోభం అబద్దం. కపటం, హింస (లోభానృతజిహ్మహింస) ఈ నాలుగు వచ్చాయని తెలుసుకున్నాడు. ఇంక ప్రస్థానం కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు (గమనాయ పర్యధాత్)

స్వరాట్పౌత్రం వినయినమాత్మనః సుసమం గుణైః
తోయనీవ్యాః పతిం భూమేరభ్యషిఞ్చద్గజాహ్వయే
మథురాయాం తథా వజ్రం శూరసేనపతిం తతః
ప్రాజాపత్యాం నిరూప్యేష్టిమగ్నీనపిబదీశ్వరః

తన మన్వడైన పరీక్షిత్తుని, తన గుణాలతో సమానమైన గుణాలు కలిగినవాడిని అభిషేకించి. మధురకు వజ్రున్ని (సాంబుని కుమారుడు) రాజు గా చేసి.
వెళ్ళేముందు ప్రాజాపత్య హోమం చేసి ఆ అగ్నిని తనలో ఆవాహన చేసుకున్నాడు.

విసృజ్య తత్ర తత్సర్వం దుకూలవలయాదికమ్
నిర్మమో నిరహఙ్కారః సఞ్ఛిన్నాశేషబన్ధనః

పట్టు వస్త్రాలు అన్నీ వదిలిపెట్టి, మమకారంలేకుండా (నిర్మమో ) అహంకారం లేకుండా అన్ని బంధనాలను తెంచుకుని.

వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తమ్
మృత్యావపానం సోత్సర్గం తం పఞ్చత్వే హ్యజోహవీత్
త్రిత్వే హుత్వా చ పఞ్చత్వం తచ్చైకత్వే ఞ్జుహోన్మునిః
సర్వమాత్మన్యజుహవీద్బ్రహ్మణ్యాత్మానమవ్యయే

వాచం జుహావ మనసి - వాక్కును మనసులో నియమించాడు. ఆ  మనసును ప్రాణంలో ఉంచాడు
ఆ ప్రాణమును అపానంలో . అపానమును ఉదానంలో, ఉదానం వ్యానంలో, , అలా పంచ ప్రాణములను మూటిలో (త్రిగుణాల్లో) ఉంచి (సత్వం రజసు తమసు - ప్రకృతి - ఆత్మ), సర్వాన్ని ఆత్మలో ఉంచి ఆ ఆత్మను పరమాత్మలో ఉంచాడు

చీరవాసా నిరాహారో బద్ధవాఙ్ముక్తమూర్ధజః
దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్తపిశాచవత్
అనవేక్షమాణో నిరగాదశృణ్వన్బధిరో యథా
ఉదీచీం ప్రవివేశాశాం గతపూర్వాం మహాత్మభిః
హృది బ్రహ్మ పరం ధ్యాయన్నావర్తేత యతో గతః

నార వస్త్రాలు కట్టుకుని వాక్కుని మానివేసి వెంట్రుకలు ముడివేసుకోకుండా జడుడిలాగ, ఉన్మత్తునిలాగ తల వంచుకుని దిక్కులు చూడకుండా నడుచుకుంటూ పోయాడు. దేవతలతో కూడా సేవింపబడిన వాడు ఇలా అయ్యాడు
దేన్ని కోరకుండా ఎవరు ఏమి మాట్లాడుతున్న వినకుండా చూడకుండా ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. పరమాత్మను మళ్ళీ ధ్యానిస్తూ ఎక్కడికిపోతే మాల్లీ రారో అక్కడికే వెళ్ళాడు

సర్వే తమనునిర్జగ్ముర్భ్రాతరః కృతనిశ్చయాః
కలినాధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టాః ప్రజా భువి

మిగతా వారు కూడా నిశ్చయంగా అతనిని అనుసరించాడు. కలి పురుషుడు ప్రజలని తాకడంతో వారు వెళ్ళిపోయారు

తే సాధుకృతసర్వార్థా జ్ఞాత్వాత్యన్తికమాత్మనః
మనసా ధారయామాసుర్వైకుణ్ఠచరణామ్బుజమ్

తద్ధ్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధధిషణాః పరే
తస్మిన్నారాయణపదే ఏకాన్తమతయో గతిమ్


అవాపుర్దురవాపాం తే అసద్భిర్విషయాత్మభిః
విధూతకల్మషా స్థానం విరజేనాత్మనైవ హి

అన్నీ మంచి పనులు చేసారు కాబట్టి, ఆత్మ తత్వం తెలిసినవారు కాబట్టి పరమాత్మను పాదపద్మాలను ధ్యానిస్తూ పరిశుద్దమైన భక్తితో బుధ్ధి సుద్దమైంది. ఆయన యందు ఏకాంత బుధ్ధితో విషయములను కోరే దుర్జనులు పొందరాని స్థానాన్ని వారు పొందారు


విదురోऽపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః
కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ

ఇది తెలుస్కుని ప్రభాస తీర్థంలో కృష్ణుని యందు మనసు లగ్నం చేసి తన ఇంటికి వెళ్ళాడు (యమ లోకం)

ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతామ్
వాసుదేవే భగవతి హ్యేకాన్తమతిరాప తమ్

భర్తల ఆ వైరాగ్యాన్ని చూచిన ద్రౌపతి కృష్ణుని యందు మనసు లగ్నం చేసి భగవంతునే పొందింది

యః శ్రద్ధయైతద్భగవత్ప్రియాణాం పాణ్డోః సుతానామితి సమ్ప్రయాణమ్
శృణోత్యలం స్వస్త్యయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిముపైతి సిద్ధిమ్

సకల శుభాలకు మూలం (స్వస్త్యయనం ) అయిన భగవత్ప్రియులైన పాండు పుత్రుల ఈ మోక్ష మార్గాన్ని శ్రద్దతో విన్నవారు పరమాత్మ యందు భక్తినీ సిధ్ధినీ పొందుతారు

                                                          సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

Popular Posts