Followers

Friday 22 November 2013

అయ్యప్ప మాల ప్రాముక్యత ఏమిటి?


మన పూజా విధానంలొ జపమాల గా ఉన్నత స్ధానాన్ని పొందిన కంఠాబరణాలు తులసి, రుద్రాక్ష, చందనం, స్పటికం, పగడాలు తామర పూసల మాలలు.

రుధ్రాక్షలు అనేవి అ పరమేశ్వరుడు ఐన శివుని అంశ వలన ఉద్బవించినవి గా మనకు ప్రతీక. అందువలన రుధ్రాక్షలు మాలలు అన్నింటి లొ శ్రేష్టమైనవి గా  చెప్పుకుంటాము. రుధ్రాక్షల వలన రుధ్రాక్షలు ధరించటం వలన మనకు చాలా మంచి పలితాలు అనగా భూత పిశాచ భాధలు తొలుగుతాయని అంతే కాక మనకు ఆరొగ్యనికి కూడా ఎంతొ మంచి పలితాలు అనగా  అధిక కొపాన్ని తగించి బి.పి ని కెంట్రొల్ చేస్తుంది ఏన్నొ ఆరొగ్య సమస్యలకు మంచి ఔషదం గా పని చేస్తుంది.

తులసి మాల విష్ణుమూర్తి కి ప్రతిక గా ఈ మాల దరించటం వలన శరీరం లొ వేడి ని తగిస్తుంది. చందన మల శరీరాని కి తాపనివారిని గా , స్పటిక మాల మలిన్యలను గ్రహిస్తుంది అని, పగడమాల వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందని, తామర పూసల మాల చర్మ వ్యాధుల ను దరి చేరనివదు అందుకే ఈ పరమ పవిత్రమైన ఈ మాల ల ను పూజా అభిషేకంలు చేసీ ఆ మాల ల యందు అ అయ్యప్ప స్వామి ని ఆవహింప చేసి వాటిని దరించి భక్తులు అందరు శుధ్ధి గా ధీక్ష తీసుకుంటారు.

Popular Posts