Followers

Saturday 2 November 2013

కార్తిక పురాణం -22వ రోజు (Karthika Puranam Day-22)


పురం జయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట, మరల అత్రి మహాముని అగస్త్యునిట్లు చెప్పదొడగెను

పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీ మన్నా రాయణుని షోడ శో పచారములతో పూజించి, శ్రీ హరిని గానము చేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయము కాగానే నదికి పోయి, స్నాన మాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణు భక్తుడ గు ఒక వృద్ద బ్రాహ్మణుడు- మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపెంచి రాజా! విచారింపకుము నువ్వు వెంటనే చెల్లా చెదురై యున్న ని సైన్యము కూడా దిసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రు రాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రు రాజుల సైన్యములు నిలువలె కపోయినవి. అదియును గాక, శ్రీ మన్నా రాయణుడు పురం జయుని విజయానికి అన్ని విధములా సహాయ పడెను. అంతయు శ్రీ మన్నా రాయణుని మహిమయే గదా! ఆ యుద్దములో కా౦ భో జాది భూపాలురు ఓడిపోయి " పురం జయా రక్షింపుము. రక్షింపు" మని కేకలు వేయుచు పారిపోయిరి. పురం జయుడు విజయము పొంది తన రాజ్యము తిరిగి సంపాదించెను. శ్రీ మన్నా రాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రు భయము కలుగు తుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా " శ్రీ హరి" అని ప్రార్ధించి త్రాగగా అమృత మైనది గదా! శ్రీ హరి కటాక్షము వలన సూర్య చంద్రులు వున్నంత వరకును దృవుడు చిరంజీవి యే గదా! హరి నామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. ఆ ధర్మము ధర్మముగా మారును. దైవను గ్రహము లేని వారికి ధర్మమే ఆ ధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మసమంతయు నది స్నాన మొనరించి దేవాలయంలో జ్యోతియిన్ వెలిగించి దీపారదానా చేసినచో సర్వ విపత్తులును పటా పంచలగును. అన్ని సౌఖ్యములు సమ కూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రత మాచరించు వారికి యే జాతి వారి కైనా పుణ్యము సమానమే బ్రాహ్మణా జన్మ మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్య మైనచో శూద్ర కులముతో సమన మగును. వేదా ద్యయన మొనరించి దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతా నుష్టన తత్పరుడైన వైష్ణ వోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ౦డును. సంసార సాగాల ముత్తరించుటకు దైవ భక్తి యే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణ నాతితము వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహా ఋషులు - మరెందరో రాజా ధి రాజులూ కూడా విష్ణు భక్తి చె ముక్తి నొందిరి. శ్రీ హరి భక్త వత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడు చుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచించ్చి యైనను మరి యొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించ వచ్చును. శ్రీ హరి -భక్తులు అన్యోన్య సంబందికులు అందు వలన లోక పోషకుడు, భక్త రక్షకుడైన అది నారాయణుడు తన భక్తులకు సదా సంపద ల నొసంగి కాపాడుచుండెను.

శ్రీ మన్నా రాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యనందుడు, విరజక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షి యంది డుకొని కాపాడు చున్న అది నారాయణుడు అటువంటి శ్రీ మహా విష్ణువునకు అతి ప్రియమైన కార్తిక మాస వ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీ మహా విష్ణువు లక్ష్మి సమేతుడై వెలయ గలడు. ఆ యిట్లు సిరి సంపదలతో కల కలలాడును. కార్తిక మాసములో శుచియై పురాణ ప టనము చేసినచో పితృ దేవతలు సంతసించెను. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ద్వా వి౦ శో ధ్యాయము- ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము

సీ|| ఎవ్వరి గరుణి ౦ ప నిచ్ఛ యించితి వాని యఖిల విత్తంబు నే సప హరింతు

సంసార గురు మద స్తబ్ధుడై యెవ్వడు దెగడి లోకము నున్న ధిక్కరించు

నత డెల్ల కలంబు నఖిల యో నుల యందు బుట్టుచు దుర్గతి బొందు బిద ప

విత్త వ యో రూప విద్య బలై శ్వర్య కర్మ జన్మ౦బుల గర్వ ముడిగి

గీ|| యేక విధమున విమలు డై యెవ్వడుండు వాడు నాకూర్చి రక్షింప వలయు వాడు స్తంభ లోకాభి మాన సంసార విభవ మత్తుడైన చెడ నొల్లడు మత్పరుండు

Popular Posts