Followers

Saturday 2 November 2013

కార్తిక పురాణం -19వ రోజు (Karthika Puranam Day-19)


చతుర్మా స్య వ్రత ప్రభావ నిరూపణ

ఈ విధముగా నైమిశా రణ్య మందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్దుడను ఒక మహా యోగి " ఓ దీన బాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వి తీయుడవని, సూర్య చంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రా దులచే సర్వదా పూజింప బడు వాడవని, సర్వ౦తర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రు లచే సర్వదా పూజింప బడు వాడవని, నిత్యుదవని, నిరాకారుడ వని సర్వ జనుల చే స్తుతింప బడుచున్న ఓ మాధవా! నికివే మా హృదయ పూర్వక నమస్కారములు సకల ప్రాణి కోటికి ఆధార భూ తుడవగు ఓ నంద నందా! మా స్వాగతమును స్వి కరింపుము. నీ దర్శన బాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్ర ములైన వి. ఓ ద యామయా! మే మి సంసార బంద ము నుండి బైట పడలే కుంటి మి, మమ్ముద్ద రింపుము. మాన వు డెన్నిపురాణములు చ ది వినా, యెన్ని శాస్త్రములు విన్న నీ దివ్య దర్శనము బడ యజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధ రా! హృ షికే శా!నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి " జ్ఞాన సిద్దా! నీ సోత్ర వచనమునకు నే నెంత యు సంత సించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను. అంత జ్ఞాన సిద్దుడు " ప్రద్యు మ్నా! నేనీ సంసార సాగర ము నుండి విముక్తు డను కాలేక శ్లేష్మమున పడిన యీగ వలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యాన ముండుట నటుల అనుగ్ర హింపుము. మరే ది యు నాక క్కర లేదు " అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు " ఓ జ్ఞాన సిద్దుడా! నీ కోరిక ప్రకార మటులనే వరమిచ్చితిని. అది యునుగాక, మరొక వారము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోక మందు అనేక మంది దురాచారులై, బుద్ది హీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించు చున్నాను. అ వ్రతమును సర్వ జనులు ఆచరించవచ్చును. సావ ధానుడ వై ఆలకింపుము. నేను ఆషాడ శుద్ద దశ మిరోజున లక్ష్మి దేవి సహితముగా పాల సముద్ర మున శేషశ య్య పై పవ ళిo తును.

తిరిగి కార్తీక మాసమున శుద్ద ద్వాద శి వరకు చాతుర్మా స్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రితికరము. ఈ వ్రాత ముచేయు వారాలకు సకల పాపములు నశించి, నా సన్నీధ కి వత్తురు. ఈ చాతుర్మా స్యములందు వ్రతములు చెయనివారు నరకకూపమును బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్య మును తెలిసియుండి యు, వ్రతము చేయనివారికి బ్రహ్మ హత్యా ది పాత కములు గలుగును. వ్రత ము చేసిన వారి కి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు భాధ లుండవు. దినికి నియమిత ముగా ఆషాడ శుద్ద దశమి మొదలు శాక ములును, శ్రవణ శుద్ద దశమి మొదలు పప్పుది నుసులను విసర్జిoచవలయును. నా యందు భక్తీ గలవారిని పరీక్షించుటకై నే నిట్లు నిద్రవ్యజమున శ యనింతును. ఇప్పుడు నీ వోసంగి న స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్త శ్రద్ద లతో పరించిన వారు నా సన్నీధ కి ని శ్చయముగా వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధంచి శ్రీమహాలక్ష్మితో గూడి పాలా సముద్రమును కేగి శే షపానుపు మీద పవ్వ ళిoచెను. వశిష్టుడు జనక మహారాజుతో " రాజా! ఈ విధ ముగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్దా మొదలగు మునులకు చాతుర్యస్య వ్రత మహత్యమును ఉపదే శించెను. ఈ వ్రత్తంత మును అంగీర సుడు ధనలో భనకు తెలియచే సెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భే దముల లేదు, అన్ని జాతులవరును చేయవచ్చును. శ్రీ మన్నారయునని ఉపదేశము ప్రకారము ముని పుంగ వులందరూ యీ చాతుర్యా స్యవ్ర తా మాచరించి దంన్యులై వైకుంఠ మున కరిగిరి.

ఇట్లు స్కాంద పురాణ తర్గత వశిషి ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎకో న వింశో ధ్యాయము -

పందోమ్మి దో రోజు పారాయణము సమాప్తము.

Popular Posts