Followers

Saturday 2 November 2013

కార్తిక పురాణం -11వ రోజు (Karthika Puranam Day-11)


మ౦థరుడు - పురాణ మహిమ

ఓ జనక మహారాజా! యీ కార్తిక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనా నంతరం పురాణ పటణం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుం ట న్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.

పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించు చు, మద్య మా౦సాది పానీయాలు సేవించు చూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపరదన నాదికములను ఆచరములును పాటింపక దురాచారుడై మెలుగు చుండెను. అతని భార్య మహా సాధ్వి, గుణవంతురాలు, శాంత మంతురాలు, భర్త యెంత దుర్మార్గుడ యిననూ, పతనే దైవము గనెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతి వ్రతా ధర్మమును నిర్వర్తించు చుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంట వాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించు చెండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవు చుండ నతనిని భయ పెట్టి కొట్టి ధన మపహరిం చుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమిపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపో యినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభావి౦చుచు రక్తము గ్రక్కుచు భాద పడుచు౦డిరి.

మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తి నియై భర్తను తలచుకోని దు. ఖిoచుచు కలము గడు పుచు౦ డెను. కొనాళ్ళు కు ఆమె యిoటి కి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌర వముగా ఆహ్వానించి అర్ఘ్య పాధ్యదులచే పూజించి " స్వామి!నే ను దీ నురాలను, నాకు భర్త గాని, సంత తిగానిలేరు. నేను సదా హరి నమ స్మరణ చేయుచు జివించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె విన మమునకు, ఆచార మునకు ఆ ఋషి సంత సించి" అమ్మా! ఈది నము కార్తిక పౌర్ణ మి, చాల పవిత్ర మైన దినము. ఈ దినమును వృ థా గా పాడు చేసుకోను వద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువదురు. నేను చమురు తీసికొన వచ్చేదను. నివు ప్రమిదను, వత్తి ని తీసికొని రావాలమును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తో డనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమున నీ కు వెళ్లి శుబ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానె స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీ పారాధ న చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల " ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి మంతము పురాణమును వినెను. ఆనతి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమున కు మరణించెను. ఆమె పుణ్య త్ము రాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మేక్కించి వైకుంట మునకు దీ సికోనిపోయిరి. కానీ - ఆమెకు పాపతుడైన భర్త తో సహవాసము వలన కొంచము దో షముందుట చేత మార్గ మధ్యమున యమలో కమునకు దీ సికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో భాద పడుచున్న తన భర్త ను జూచి " ఓ విష్ణుదూత లారా! నా భర్తా మరి ముగ్గురును యీ నరక భాద పడుచునారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్ద రింపు "డ ని ప్రాధేయ పాదెమపడెను. అంత విష్ణుదూతలు " అమ్మా! నిభార్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంద్యాదులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడై ననూ అతడు కూడా ధ నాశ చే ప్రాణహితుని చంపి ధనముపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగు వ వాడు పూర్వము ద్రావిడ దేశమున బరహణుడే జన్మించినాను అనేక అత్యాచార ములు చేసి దాధ శి రోజున కూడా తేలలే పనము, మద్య మాంసభ కణచె సినాడుగాను పాపాతుడేనాడు. అందుకే యీ నలుగురు నరక భాదలు పడుచునారు. " అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాల విచారించి "ఓ పుణ్యాత్మురాల! నా భర్తతో పటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు" డ ని ప్రార్ధించగా , అందులకా దూతలు " అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణ మినాడు నివు వత్తి చేసిన ఫలమును ఆ విప్రునికి ధరపోసినచో వారికి మోక్షము ఫలము కిరాత కునకు, నని చెప్పుగా అందులకమె అట్లే ధార పోసేను. అ నలుగురు ను ఆమె కడ కువచి విమాన మెక్కి వైకుంట మునకు వేలిరి. కావున, ఓరాజా! కార్తిక మాసమున పురాణము వినుటవలన, దీ పము వెలిగించుట వలన అట్టి ఫలము కలిగెనో వింటి వా? అని వశిష్టుల వారు నుడి విరి.

ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి

ఏకాద శాద్యయము - పకొండవ రోజు పారాయణము సమాప్తము.

Popular Posts