Followers

Tuesday 15 October 2013

సకల కార్య సిద్దికి గణేశా పూజా విధానము- ఫలితములు



బాల గణేశుని శిరస్సు శివునిచే ఖండింపబడి, తిరిగి హస్తిముఖునిగా ప్రాణ ప్రతిస్ట్ట జరిగిన తరువాత ,ప్ర ప్రదమంగా తల్లి పార్వతి దేవి సిందూరాన్ని బొట్టుగా గణేశునకు పెట్టింది.ఆ కారణం చేత ఎవరైతే గణేశుని ప్రతి దినం సింధూరంతో పూజిస్తారో,వారి అడ్డంకులు అన్ని తొలగి విజయం కల్గుతుందని శ్రీ పార్వతి దేవి వరం ప్రసాదించింది.


ప్రతి నేల శుద్ధ చతుర్హి నాడు గణేశుని పూజించి,భాద్ర పద శుద్ధ చతుర్హ్హి అంటే వినాయక చవితి నాడు ఉద్వాసన చేసినచో లబించని సిద్దులంటే ఉండవు

 మార్గ శిర్ష శుద్ధ చతుర్ధిని " రమా చతుర్ధి " అంటారు. ఆ రోజున ఉపవసించి,విధి విధానంగా గరికలతో పూజించి,రాత్రి మొదట జామున కూడా పూజించ వలెను. గరికలు మూడు కణుపులు కలివిగా ఉండాలి. మట్టి, పగడం,జిల్లేడు వేరులతో ప్రతిమను చేయుట మంచిది. రాత్రి మొదటి జామున పూజాయైన పిదప, బాలచంద్రుని పూజించావలెను. తదుపరి విప్రులకు భోజనం పెట్టాలి.  రాత్రికి లవణ వర్జితమైన మదుర భోజనం తినాలి.ఈ  పూజా విధానం వలన సకల అడ్డంకులు తొలగి,అనుకొన్న సకల కార్యాలు  నెరవేరుతాయి.

Popular Posts