Followers

Wednesday 23 October 2013

భగవద్గీత ప్రధమ అధ్యాయం లో అర్జున విషాదానికి కారణాలు ? అవి సభబా ? లేదా ?

అర్జునుని పరిస్థితి సామాన్య మానవుడికి కూడా రావచ్చు . అప్పుడు ఏం చేయాలి ?


అర్జునుడు జగ దేక వీరుడైనా , ధీ శక్తి యుతుడైనా , ఎన్నో యుద్దాలలో విజయుడై నా , అన్న గారి మాటకు ,ధర్మానికి , ఆర్తుల ప్రాణ రక్షణ కు కట్టు బడినా ,రుద్రుని మెప్పించినా , ద్రోణు నికి ప్రియ శిష్యుడుగా మె లిగినా , భీష్ముడికి ,కృష్ణునికి  , ద్రౌపదికి , ప్రియమైన వ్యక్తిగా  ఉన్నా , తన శారీరక , అస్త్ర బలాన్ని పెంచుకోవటానికి ఎంతో తపస్సు చేసి న శ్రద్దా సక్తుడుగా ఉన్నా ,ధర్మ  పోరాట మైన కురు క్షేత్ర యుద్దంలో ఎందుకు నీరస పడి నిర్వీరుడ య్యాడు  ?

కారణాలు :

1.ఎదురుగా ఉన్న అందరూ స్వ జనులే -బంధువులు , సోదర ,పితా ,తాత సమానులు . అలాగే 18 అక్షౌహిణ సేనా వాహిని లో  ముసలి వారు , స్త్రీలు  ,పిల్లలు తప్ప   భారత వర్షం లో ఉన్న జన పదాల జనమంతా ఉన్నారు ,. యుద్ద మంటే అంతా  సర్వ నాశ నమే . ఎవరు గెలిచినా పెద్దగా సాధించేది లేదు . గెలిచి ఎవరు ఎవరిని పరి పాలించాలి ?


2.ఇప్పటి వరకు చేసిన యుద్దాలు వేరు . ఈ భారత యుద్ధం వేరు .నేటి వరకు చేసిన తపస్సు ,పడ్డ కష్టాలు ,సంపాదించిన శస్త్ర అస్త్రాలు ,చేసిన ఖాండవ వన దహనం ,కిరాత రూ పంలో ఉన్న రుద్రుని తో చేసిన యుద్ధం ,ఘోష యాత్ర యుద్ధం ,ఉత్తర గోగ్రహణ యుద్ధం , రాజ సూ య కోసం చేసిన యుద్దాలు , అన్న మాట కు ,ధర్మానికి కట్టు పడి  చేసిన  పోరాటాలు ,తపస్సులు  - ఇవన్నీ  ఒక వీరునిగా ,యువ రాజుగా  ,సేనాధిపతిగా ,  వ్యక్తిగా చేసిన కార్యాలు . వాటిలో స్వార్ధమూ ఉంది . స్వధర్మమూ ఉంది . ప్రయోజనమూ ఉంది .ఎక్కువ ప్రజా నష్టం లేదు . కానీ మహా భారత యుద్దంలో అన్నింటి కంటే ఎక్కువ ప్రజా నష్టం ఉంది .అణు అ స్త్రాలు వాడ వలసి రావచ్చు. రాజ్యం కోసం ,చేసిన ప్రతినల కోసం ఇంత మంది జనాలను ,వారెంత అధర్మం చేయనీ -తన బంధు వర్గాలను , చంపి సాదించే రాజ్యం ఎందుకు ? ఎవరి కోసం ? ఇది పాపం కాదా? సైన్యం లోని అమాయక జనులే మి తప్పు  చేశారు ?


3.ధర్మ రాజు పర్య వేక్షణ ఎంతగా ఉన్నా అర్జునుడు కూడా కొన్ని అధర్మ పాప కర్మలు చేసాడు .

        తానొక్కడే మేటి విలు కాడు గా చరిత్రలో మిగిలి పోవాలని గురువుని కోరిక కోరి ,ఒక రకంగా  ఏక లవ్యుని          నిర్వీర్యున్ని చేసాడు .

        ఖాండవ వన దహనం చేసి ఎన్నో జీవ జాతులను ,పచ్చటి అడవిని బుగ్గి చేసాడు . ఆ మారణ కార్యం అర్జును ని మనస్సు ని ఎప్పుడూ తొ లుస్తానే ఉంది .

         తాపసిగా ఉన్నా ఒక్క వేట కోసం ,అహంకారంతో   కిరాత రూ పంలో ఉన్న శివుని తో నానా రకాలుగా యుద్ధం చేసి తాపసిక ధర్మానికి తూ ట్లు పొడిచాడు .

       ధర్మ రాజుని అవకాశ మున్నప్పుడ ల్లా దెప్పి పొడిచే వాడు .

       మేటి వీరుడి నని అహంకారం ,తానొక్కడే యుద్ధం చేసి శత్రువులను నిర్జిస్తానని బీరాలు పలికాడు .


ఇవన్నీ అర్జుని మనస్సులో సుళ్ళు తిరుగుతూ బుద్ది  వికలమై ఇంద్రియాలు నిస్తేజమై రధం దిగి నిస్త్రాణగా కూల బడ్డాడు .

ఈ  విధంగా అర్జునుడు గందరగోళ పడటం ,సబబా ,కాదా అని నిర్ణ యిమ్చేది ఆ నాటి దేశ  కాల మాన పరి స్థితులు , ధర్మ సూత్రమూ   , అతని  స్వధర్మం .


దేశ  సమాజ స్థితి : కౌరవ సామ్రాజ్యం దుర్యోధనుని ఏలుబడి లో క్షీణ దశ  కు చేరింది . అధర్మం పెచ్చు మీరి ప్రజలలో అరిషడ్వర్గాలు పేట్రేగి పోతున్నాయి .అనైతికత ,స్వార్ధం ,రాజ ధర్మంగా ఎప్పుడైతే మారిందో , ప్రజలు కుడా

యదా రాజా తదా ప్రజా .


కాల పరిస్థితి : ద్వాపర యుగ ధర్మం ఆడు గంటి కలిధర్మం ప్రవేసి స్తుంది .


అర్జునుని స్థితి : అతడు  రాజు .అధర్మాన్ని ,అన్యాయాన్ని అణచివేసి, ధర్మ స్థాపనే స్వ ధర్మం & రాజ ధర్మం గా ఉన్న మనిషి . .

తనకు ,తన కుటుంబానికి ,రాజ్యానికి ,సమాజానికి  కౌరవులు చేసింది అధర్మ అన్యాయా లు .


కాబట్టి , సమాజ పరంగా ,స్వధర్మ పరంగా ,రాజ ధర్మ పరంగా ఎలా చూచినా అర్జునుడు యుద్ధం చేసి ధర్మ స్థాపన చేయక తప్పదు .కర్మ ఫలం ఎలా ఉన్నా మనిషి తన ధర్మం తాను  చేయాలి . అనవసర మైన ,పనికి రాని  గుంజాటన మనిషికి ఉండ కూడదు . తాత్కాలిక వైరాగ్యం వలన అనర్ద మే . నిజమైన జ్ఞానం లేక పోవుట వలన , సత్యం తెలియక   పోవుట వలన మనిషి నానా రకాలుగా ఆలోచించి కర్మలను విడ నాడి పలాయన వాదిగా మిగిలి పోతాడు .

అందుకే యుద్ధం చేసి నీ ధర్మాన్ని నిర్వర్తించు . ఆ తర్వాత వచ్చేది  విజయమైనా ,వీర స్వర్గ మైనా   నీ కనవసరం .

ఇది నీ భాద్యత . దీని నుండి పారి పోవద్దు .

అంటే  ప్రతి మనిషి తన భాద్యతల నుండి పారిపోక తన స్వ ధర్మాన్ని ప్రతిఫలాపేక్ష  లేదా ఫలం ఎలా ఉంటుందో అనే చింత గానీ లేకుండా నిర్వర్తించాలి .

నీ మానసిక అంతరంగం శుష్క పాండిత్యం తో ,సందేహాలతో , గందర గోళంగా ఉంది . అనేక సందర్భాలలో ప్రతి మనిషి కి ఈ  పరిస్థితి వస్తుంది .

అప్పుడు మనం మనిషిగా  ఏమి చేయాలి ? ఎందుకు అలాగే  చేయాలి ? మనిషి ధర్మం ఏమిటి ? మనిషి గమ్యం ఏమిటి ? వీటన్నిటికి సమాధానం భగవద్గీత .

ఆత్మ  ఒక్కటే సత్యం ,అంటే  మార్పు లేనిది . మిగతా వన్నీ అంటే  ద్వందాలన్నీ  - సుఖ దుఖాలు ,కష్ట నష్టాలు , అసూయా ద్వేషాలు , పగ ప్రతీకారాలు , క్షమా  అసహనాలు -   కర్మ చక్ర భ్రమణం వలన మనకు కలిగేవి .


మనిషి నాలుగు ఆశ్రమ ధర్మాల లో  ,నాలుగు పురుషార్ధాలను   ధర్మంగా సాధించి , నాలుగు యోగ మార్గాలలో తన కనువైన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని జన్మ రాహిత్యం పొందాలని ఉపనిషద్ సారమైన గీతలో  శ్రీ కృష్ణుడు ఉపదేశిం చాడు .

మనిషికున్న పంచ కోశాలు ,జన్మ కర్మ పరంపర ,పంచ భూతాల  ,సూక్ష్మ & కారణ శరీర వివరణ

భగవంతుని శక్తి , సత చిత్  ఆనందం ,లీల  వివరణ

మనిషి ఎలా మాయ ,ద్వందాలతో ,అహంతో అల్లాడి పోతాడు ---------- ఇవన్నీ గీతలో ఉపదేశా సారంగా చెప్పారు .

తత్ వం అసి  -తత్వమసి .

అహం బ్రహ్మం అసి  - అహం బ్రహ్మస్మి

Popular Posts