Followers

Wednesday 23 October 2013

ధర్మదేవుడు శాపము నొందుట



ఒకప్పుడు అత్రి పుత్రుడైన దూర్వాసుడు ధర్మస్వరూపమును దర్శింపగోరి ధర్మదేవతను గూర్చి తపము చేసెను. పదివేలయేండ్లు గడచినవి. ధర్మదేవత (యముడు కాడు) ప్రత్యక్షము కాలేదు. దూర్వాసునికి కోపము వచ్చి ధర్మదేవుని శపించుటకు సిద్ధపడెను. అప్పుడాయన ప్రత్యక్షమై " నీవంటి కోపిష్టి వానికి తపస్సు ఫలించునా? అనగా దూర్వాసుడు "నీ వెవ్వడ" వాణి యడిగెను. ధర్ముడు "నేను ధర్మమూర్తి" ననెను. దూర్వాసుడు మహాక్రోధముతో "నా కోపమును నీ వర్పగాలవా? పదివేలేండ్లు గడచిన తరువాత ఇప్పుడు మేము కనబదితిమా? ఇన్నాళ్ళు మాకు ప్రత్యక్షము కాకుండా ఏమి చేయుచున్నావు? ఇప్పుడైననూ నా కోపమునకు జడిసి ప్రత్యక్షమైనట్లు కనబడుచున్నది.నీవు ఇంత దుర్మదాందుడవై బ్రహ్మణాపచారము ఒక రాజువై, ఒక చండాలుడవై పుట్టుము. " అని శపించి లేచిపోయెను. ఆ శాపమువలన విదురుడుగాను, పాండుకుమారులలో జ్యేష్టుడైన ధర్మరాజుగాను, కాటికాపరి తనము చేసిన హరిశ్చంద్రుడుగాను ధర్మమూర్తి జన్మించెను.   .........పద్మ పురాణము 

Popular Posts