Followers

Wednesday 23 October 2013

మనుషులెందుకు ధ్యానం చేయాలి ?



తిరిగి తిరిగి వచ్చి కాసేపు విశ్రాంతి తీసు కొంటామ్ .  
చదివి చదివి కూసేపు కునుకు తీస్తాం . 
భావ సంచలనం కలిగి నప్పుడు కాసేపటికి ఒక  స్థిమిత స్థితి కి వస్తాం . 
అందుకే శరీరం త్వరగా అలసి పోకుండా , ఎంత పనైనా అలవోకగా చేయ దానికి శరీర సామర్ధ్యాన్ని 
పెంచు కోవడానికి ఎన్నో వ్యాయామాలు నిరంతరం చేస్తాం . 
అలాగే మెదడు చురుకుగా ఉండ టానికి ఎన్నో రకాల మైండ్ గేమ్స్ ,పజిల్స్ సాధన చేస్తాం . 
భావ జాలాన్ని అలాగే మన భావాలను అదుపులో ఉంచడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తాం . 
రకరకాల శ్వాస పద్దతుల ద్వారా ప్రాణ శక్తిని అదుపులో ఉంచు కొంటాం . 
ఇదే విధం గా మన చైతన్యా న్ని అనగా అవగాహన తో కూడిన ఎరుకను విస్తరింప చేసుకొని ,మన చైతన్యం యొక్క నిజ స్థితి ని ఆవిష్కరిమ్చు కోవడానికి ధ్యానం అలవాటుగా చేసు కోవాలి . 

"control over the physical,emotional,mental,praanic bodies and then expansion of real consciousness through contemplation,meditation leading to liberation from wheel of 
karma".

అంతర వ్యక్తిత్వ వికాసానికి ,  జీవన వికాసానికి ,జీవితాన్ని ప్రశాంతం గా జీవించడానికి , అన్ని రకాల పరిస్థితులను ఒకే విధమైన మానసిక స్థితి తో స్వీకరించే సమ స్థితి అలవాటు చేయడానికి , మనలోని
 వాసనా గుణాలను సమూ లమ్ గా మార్చుకొని సత్వ నిర్మల స్థితిలో ఉండటానికి , శ్రద్ద , ఓరిమి ,క్షమ ,ప్రేమ తదితర సాత్విక గుణాలను పెంచు కోవడానికి ,జీవిత పరమావధి ఐన ముక్త స్థితి ని చేరు కోవడానికి ---
 ధ్యానం చేయాలి . 

ధ్యానం లో ఏం జరుగుతుంది?
జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్ని ,చిత్తం లో కలిగే  ఆలోచనలను  , జ్ఞాపకాలలో దాగిన
 సమాచారాన్ని , పాత అనుభవాలను   ---  మనస్సు అసలు పట్టించు కోదు . అంటే , మనస్సు (-బుద్ధి)
దేనినీ  బేరీజు వేయదు . మమేక మవ్వదు .  అనుభూతి చెందదు . (అహం లేదు).
పింగాణీ పెంకు పై ఏ దైనా రంగు వేసినా పీల్చు కోదు . కాబట్టి రంగు ఏమీ మారదు . అదే ఒక బ్లాట్టింగ్
పేపర్ ఐతే రంగు ని మొత్తం పీల్చు కొని రంగు మారుతుంది .
అలాగే మన మనస్సు కి  ఎన్ని రకాల సంఘటనలు - అవి సుఖం లేదా దుఖం -కలిగించినా  ఎలాంటి
అనుభూతి లేకుండా సాక్షి గా సమ స్థితి లో ఉండటం అలవాటు చేయాలి .

చైతన్యాన్ని , అనగా మన ధ్యాస ను ఇంతకూ ముందు మనం చెప్పుకొన్న శక్తి ప్రవాహ గొలుసు లో
ఎక్కడైన నిలిపి ధ్యానా న్ని సులభం చే సు కోవచ్చు .
(చైతన్యం  ---- విశ్వ శక్తి (కుండలినీ శక్తి ) ---- మనస్సు ---- ప్రాణ శక్తి ----దేహం ) .

ధ్యానానికి కావలసిన కనీస అర్హత ఏమిటి ?
ఒక్క మనిషికి మాత్రమే నిరంతర ఆలోచనా వృత్త సామర్ధ్యం  ఉంటుంది .
మనిషి కి మనస్సే ఒక వరమూ , అలాగే శాపమూ  !
ఆరోగ్య వంతమైన శరీరం అనగా  పంచ కోశ శుద్ది ఉండాలి .
అందుకే పతంజలి రుషి అష్టాంగా యోగం ద్వారా -
యమ ,నియమ ,ఆసనాల  ద్వారా- శరీర , మానస శుద్ది
ప్రాణ యామం ద్వారా - ప్రాణ శక్తి శుద్ది ,తద్వారా ప్రాణ శక్తి పై అదుపు -
ప్రత్యాహారం అనగా సాక్షిగా వైరాగ్య భావం తో అన్నింటినీ గమనించడం -(ఇది మంచి ఇది చెడు , ఇది సుఖం ,ఇది దుఖం అనే ద్వంద అనుభూతి లేకుండా )అలవాటు చేసు కోవాలి . - ఇంద్రియాలు , చిత్తము ,
జ్ఞాపకాల సంచి ,మానసం -వీటన్నింటి గురించి మనకు కలిగే జ్ఞానం తద్వారా  మనస్సు పై అదుపు .
ఎప్పుడైతే మనకు  శరీరం ,ప్రాణ శక్తి , మనస్సు పై అదుపు వచ్చిందో అప్పుడు -
ధారణ ,ధ్యానం తద్వారా సమాధి స్థితి ....

ధ్యానం కూ డ ఒక పని లాగే ఉంది . దాని  వలన ఎలాంటి ఆనందం కలగడం లేదు .
 మరి నేను ధ్యానాన్ని మాని వే య వచ్చా ?
ధ్యానం అంటే  ఓ మూల కాసేపు కూర్చుని  నామా న్నో , మంత్రా న్నో జపం చేయడం కాదు . దానిని
సంస్మరణ  లేదా జపం  లేదా ప్రార్ధన  అనవచ్చు .
అహాన్ని త్యాగం చేస్తూ , శూ న్యం పై గానీ , దైవ రూపం పై గానీ దృష్టి కేంద్రీక రించి చేసేది అసలైన
ధ్యానం . మిగతావ న్నీ కామ్య కర్మల నే చెప్పు కోవచ్చు .
కర్మ లెప్పుడూ ఆనందాన్ని ఇవ్వవు . ధ్యానాన్ని ఒక సకామ కర్మలాగా చేస్తే అలాగే ఉంటుంది .
అలాగని ధ్యానాన్ని మాన వద్దు . అసలేమీ చేకుండా ఉండటం కన్నా ఏదో ఒకరక మైన ప్రయత్నం చేస్తూ
ఉంటే అసలైన ధ్యానం మనకు కుదురుతుంది . కనీసం మానసిక ప్రసాంతత కలుగుతుంది . 

Popular Posts