Followers

Friday 13 September 2013

ముఖానికి సౌందర్య పోషణ


  • మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుమానుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టిస్తే ఫలితం ఉంటుంది.
  • కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
  • ఒక కప్పు పుదీనా ఆకులను రెండు కప్పుల నీళ్లలో ఉడికించి చల్లారిన తరువాత ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం తెల్లబడుతుంది.
  • ముల్లంగి రసం, పెరుగు కలిపి ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి రెండుసార్లు ముఖానికి, చేతులకీ రాసుకుంటే ఎండ వల్ల వచ్చిన నలుపుదనం పోతుంది.
  • మిగిలిపండిన టమోటా రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు రాసుకుని 20 నిముషాల తరువాత కడిగేస్తే చర్మం మెరుస్తుంది.
  • పాలలో నానేసిన గులాబీరేకులను ముఖం మీద రుద్దుకుని కొద్దిసేపటి తర్వాత కడుక్కుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
  • బంగాళదుంప ముక్కతో తరచుగా ముఖాన్ని, ముఖ్యంగా కళ్ల కింది భాగంలో రాసుకుంటుండాలి. ఇలా రాసుకుని కొద్దిసేపటి తరువాత చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల కళ్ల కింది నల్లని వలయాలు మాయమై ముఖం మెరుపు లీనుతుంది.
  • కొద్దిపాటి ఆముదాన్ని తేనెలో కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మొటిమలు తగ్గే అవకాశం ఉంది.
  • పుచ్చకాయరసాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత చన్నీళ్ళతో కడుక్కుంటే చర్మం తాజాగా ఉంటుంది.
  • చక్రాల్లా తరిగిన కీరా ముక్కలతో ముఖమంతా రుద్దాలి. ఐదు నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ముఖంపై మురికి తొలగిపోయి చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
  • టమాటా గుజ్జును ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్‌లా పని చేస్తుంది.
  • రెండు చెంచాల బాదంపొడి, అరచెంచా నిమ్మరసం, రెండుచెంచాల తేనెను బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
  • రాత్రి పడుకునే ముందు తాజా నిమ్మరసాన్ని ముఖానికి మర్దన చేసి ఐదు నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయండి. నిమ్మ మంచి యాస్ట్రింజెంట్ గా... బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది.
  • ముఖంపై ముడతలు పోవాలంటే గిoజలు లేని ద్రాక్ష చక్కని పరిష్కారం. సగం కోసిన ద్రాక్ష ముక్కను ముఖానికి, మెడకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి.
  • అరటిపండు గుజ్జుకు సరిపడా తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, కురులకు పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే కొత్త మెరుపు వస్తుంది.
  • ఉప్పు, పంచదార సమపాళ్ళలో తీసుకోవాలి. ఈ రెండు కరిగేలా కొన్ని చుక్కల నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ సమస్యకు ఇది సులువైన పరిష్కారం.
  • ఉసిరిరసం, పొడితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముడతలు పడిన చర్మానికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఉసిరికాయను ఎండబెట్టి పొడి చేసి దాంట్లో పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.
  • ఆపిల్ గుజ్జు తీసుకొని తేనె లేదా పాలు కలిపితే అద్భుతమైన ఫేస్ మాస్క్ తయారవుతుంది.
  • అరటి గుజ్జు, తేనె లేదా పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. చర్మం నునుపు తేలుతుంది.
  • చర్మంపై ముడతలను పోగొట్టడానికి క్యారెట్ అద్భుతంగా పనిచేస్తుంది. క్యారెట్ గుజ్జులో బాదం ఆయిల్, తేనె కలిపి రాయాలి.
  • నిమ్మకాయ రసం చర్మంపై ముడతలను, తలలో చుండ్రును పోగొడుతుంది.
  • చాలా సౌందర్య చికిత్సల్లో ఉల్లిని వాడతారు. ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
  • ఆలు ఉడకబెట్టి గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయాలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం అందంగా తయారవుతుంది.
  • టేబుల్ స్పూన్ తేనెకు పావు చెంచా క్యారెట్ రసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో తీసేయాలి. దీనివల్ల ముడతలు పోవడంతో పాటు చర్మం మృదువుగా తయారవుతుంది.
  • ఎండకు ముఖ చర్మం కములుతుంది. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల టమాట రసం, నాలుగు టేబుల్ స్పూన్ల మజ్జిగ తీసుకుని రెండిటిని బాగా కలిపి కమిలిన ప్రాంతాల్లో రాయాలి. అరగంటాగి చల్లని నీటితో కడిగేస్తే మంచి ఫలితముంటుంది.
  • ఆలోవెరాకు చిటెకెడు గంధంపొడి కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల తాలూక మచ్చలు, ముడుతలు పోయి ముఖం నునుపుతేలుతుంది.
  • మెత్తగా పండిన అరటి పండు గుజ్జును ముఖానికి ప్యాక్ లా వేసుకుని అరాక చల్లని నీటితో కడిగేయండి. ముడతలకిది చక్కని పరిష్కారం.
  • ఎండలో బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు టమాటా రసం తాగితే వేడి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
  • చెంచా టమాటా రసం, చెంచా శనగ పిండి, అర చెంచా నిమ్మరసం తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ పై రాసుకున్నా చక్కని ఫలితం ఉంటుంది.
  • టమాటాకు కొద్దిగా నిమ్మ రసం కలిపి ముఖానికి రాసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది.
  • టమాటా రసానికి కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ జిడ్డు చర్మానికి చక్కటి పరిష్కారం.
  • ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి... తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని మొఖానికి పట్టిస్తే...మొటిమలు మటుమాయం.
  • వేసవి ఎండలో బయట తిరిగే వారు రోజూ రెండు మూడు సార్లు మంచి ఫేస్ వాష్ తో ముఖం కడుక్కుని వెంటనే మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి.
  • కాస్మటిక్ స్పాంజ్లు, మేకప్ బ్రష్ లను రెండు నెలలకోసారి మార్చాలి. లేకపోతే వాటి మీద బ్యాక్టీరియా తయారై చర్మానికి హాని చేస్తుంది. మేకప్ బ్రష్ లను కూడా నెలకోసారి మైల్డ్ షాంపూతో శుభ్రం చేయాలి. నీడపట్టునే తడి ఆరిపోయేదాకా ఉంచి ఆ తర్వాత వాడుకోండి.
  • రోజు రెండు, మూడు సార్లు ముఖాన్ని మంచి నీటితో కడగాలి. ముఖాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునేముందు తప్పకుండా మంచి ఔషధ గుణాలున్న సబ్బు నురగను సబ్బుతో మచ్చలపై మృదువుగా రాసి కడగాలి.
  • అప్పుడప్పుడు ఫేషియల్స్ చేయించుకోవాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గి చర్మం నునుపుతేలుతుంది.
  • ముఖాన మొటిమలుంటే ముందుగా రోజ్ వాటర్, కర్పూరం కలిపిన నీటితో కడగాలి. టమాటాని అడ్డంగా కోసి ఆ సగం చక్క తో ముఖమంతా రుద్దాలి. దాంతో జిడ్డుతగ్గుతుంది. ఇప్పుడు గంధం పొడిలో కొంచం కర్పూరం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే హాయిగా ఉంటుంది.
  • పొడిబారినట్లున్న చర్మానికి తేనె, ఆలివ్ నూనె, పసుపు, గంధంపొడి కలిపి రాసి ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి.
  • గంధం పొడి, పసుపు, పాలు కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మం మెరిసి పోతుంటుంది.
  • బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్ లా వేసుకోవచ్చు. బొప్పాయిలో ఉండే కొన్ని ఎంజైంలు చర్మంలో మృతకణాలను తొలగించి మీ చర్మానికి కొత్త కాంతి నిస్తాయి.
  • ముల్తాన మట్టికి కొంచెం పెరుగు కలిపి మాస్క్ వేసుకుంటే ముఖానికి సరికొత్త మెరుపు వస్తుంది.
  • సాధారణ చర్మతత్వం ఉంటే చెంచా ముల్తాన మట్టి, సరిపడా పెరుగు, కాస్త ద్రాక్ష గుజ్జు, రెండు చుక్కల రోజ్ వాటర్ బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని పదిహేను నిమిషాలాగి కడిగేయాలి.
  • జిడ్డుగా ఉంటే...చెంచా ముల్తాన మట్టి, సరిపడా పెరుగు, కొద్దిగా కీరాదోస లేదా క్యారెట్ గుజ్జు, రెండు చుక్కల నిమ్మ రసం...వీటన్నిటినీ కలిపి ముఖానికి పటించాలి. చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.
  • ఇంట్లోనే బ్లీచ్ తయారు చేసుకోవాలనుకునే వారు ఇలా ప్రయత్నిస్తే సరి... నిమ్మరసం, కమలా పండు రసం ఒక్కో చెంచాడు చొప్పున తీసుకోవాలి. టమాటా గుజ్జులో ఈ రసాలను కపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా వేసుకోవాలి.కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి.
  • చెంచాడు పాలపిండిలో తేనె కలిపి పేస్టులా చేసి దానిని మొహానికి రాసుకుని ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగి వేయాలి. దీని వల్ల ముఖం మీద మచ్చలు, ముడుతలు పోతాయి.
  • కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి.
  • క్యారెట్ ఉడికించిన నీళ్ళతో ముఖం కడుక్కుంటే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది.
  • ఫేస్ స్క్రబ్ సహాయంతో చర్మంపైన మృత కణాలను ఎప్పటికప్పుడు తొలిగించుకోవాలి. అయితే స్క్రబ్తో గట్టిగా వత్తకూడదు. దీని వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంది. ఒకవేళ చర్మం కందిపోయినట్లు అయితే వెంటనే స్క్రబ్ వాడటం ఆపేయాలి.

Popular Posts