Followers

Friday 9 August 2013

పాదాల పగుళ్లు నివారణకు చిట్కాలు





ప్రతి రోజూ నిద్రపోయేందుకు  ముందుగా కాళ్లను శుభ్రం చేసి , పొడి గుడ్డతో తుడుచుకోవాలి పగుళ్లపై కొబ్బరి నూనెతో మృదువుగా మర్దనా చేసి , మందంగా ఉండే సాక్స్ లు ధరించాలి . ఉదయాన్నే పాత బ్రష్ తో పాదాలను రుద్ది , గొరువెచ్చటీ  నీటితో కడిగితే మురికి , మృతకణాలు మాయమవుతాయి . కొన్ని రోజులు ఇలా క్రమం తప్పకుండా చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి .
అరటిపండును  ముద్దగా చేసుకొని పగుళ్లపై  రాసి పది నిమిషాలు ఉంచి , తర్వాత నీటితో శుభ్రపరుచుకుంటే మడమలు మెత్తబడతాయి . గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలను ఉంచాలి .పది నిమిషాల తరువాత మామూలు నీటితో శుభ్రపరుచుకుంటే పగుళ్ల వల్ల ఉండే నొప్పి తగ్గుతుంది . ప్రతి రోజూ సాయంత్రం రోజ్ వాటర్ ను కాళ్ల పగుళ్ల పై రాసి మృదువుగా మర్దనా చేసినా ఫలితం ఉంటుంది .
నిమ్మరసం , వ్యాజ్ లైన్ వేసిన గోరువెచ్చని సబ్బు ద్రావణం లో పాదాలను పెట్టి ….తర్వాత పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్  రాయాలి . ఉదయం ఆవనూనెతో కాళ్లను మర్దనా చేసుకుంటే పగుళ్లు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి . కాళ్లు కోమలంగా , అందంగా ఉండాలంటే వీటన్నింటితో  పాటు పోషకాహారం తప్పని సరి . క్యాల్షియం , ఐరన్ , జింక్ , ఒమెగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభించే ఆహరం తీసుకోవడం మంచిది .
కప్పు వెనిగర్  లో కొద్దిగా  సబ్బు కలిపి ఈ మిశ్రమంలో పాదాలను ఓ పది నిమిషాల పాటు ఉంచాలి .
గిన్నె నీటిలో కొద్దిగా సోడా ఉప్పు వేసి ఓ అరగంట పాటు పాదాలు ఉంచాలి . ఇలా చేయడం వలన పాదాలు మృదువుగా ఉంటాయి .
గోరువెచ్చని కప్పు పాలల్లో పాదాలు ఉంచాలి . ఇది పాదాలకు సహజసిద్ధమైన మాయిశ్చ రైజర్ ను ఇవ్వడమే కాకుండా పాదాలను మృదువుగా ఉంచడానికి దోహదం చేస్తుంది .

Popular Posts