Followers

Tuesday 25 June 2013

జగన్నాథ రథయాత్రలో ఆ మంత్రంతో విష్ణువును స్మరిస్తే..?


పూరీ జగన్నాధునికి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్రలో పాల్గొని- "త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్" అనే మంత్రాన్ని జపిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.

 రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 

ప్రతి సంవత్సరం జూలై నెలలో పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 21న ఆ స్వామికి, బలభద్రునికి, సుభద్రాదేవికి రథయాత్ర జరుగుతుంది.

 పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు విష్ణుమూర్తిని పై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.

Popular Posts