Followers

Monday 24 June 2013

ఐహికానుబంధాలే నిర్బంధాలు

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
krishnaశ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
శ్లోకంః న కాంక్షే విజయం కృష్ణా!
న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద !
కిం భోగై ర్జీవితేన వా 

శ్రీకృష్ణా నాకు బంధువధ వల్ల పొందే విజయం అవసరం లేదు. బంధువధతో పొందే రాజ్యమూ వద్దు. రాజ్యంలో ఉండే సుఖాలూ వద్దు. గో, గోప, గోపికలను రక్షించి రాజ్యం పొంది గోపాలుడవైతివే, నా బంధువులను చంపి పొందే రాజ్యంతో నాకేమి పని? సుఖములతో ఏమి పని? అసలీ జీవితముతో ఏమి పని?
శ్లోకంః ఆచార్యాః పితరః పుత్రాః
తథైవ చ పితామహాః
మాతులాః శ్వశురాః పౌత్రాః
స్యాలా స్సంబంధిన స్తథా 

ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఇక్కడ నిలచిన వారిలో గురువులు, తండ్రి సములు, పుత్ర సదృశులు, అట్లే తాతలు, మామలు, మేనమామలు, మనుమలు, బావమరుదులు ఇటొకరేమిటీ అన్ని విధముల బంధుత్వము కలవారూ ఉన్నారు.

Popular Posts