Followers

Wednesday 26 June 2013

కార్యోన్ముఖులు కావాలంటే గీతాధ్యయనమే మార్గం

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి. 

శ్రీమద్భగవద్గీత- ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
శ్లోకంఃయది మాం అప్రతీకారం
అశస్త్రం శస్తప్రాణయంః
ధార్తరాష్ట్రా రణే హన్యుః
తన్మే క్షేమతరం భవేత్‌
 
నిరాయుధుడనై, ప్రతీకారము చేయక వారిపై జాలితో నిలచిన నన్ను కౌరవులు బండగుండెతో ఆయుధాలతో నియమాన్ని అతిక్రమించి నన్ను వధించినా అది నాకు మరీ మంచిది. నాకు వీర స్వర్గం కలుగుతుంది. అది కూడా నాకు క్షేమమే కానీ వారికి అదే కలిగినచో ప్రయోజనం ఏమిటీ? నిరపరాధిని నన్ను చంపుట వలన వారు ఘోర నరకము నందెదరు. అది నాకు క్షేమతరము. ఆ విధంగానే కానిమ్ము. 
సంజయ ఉవాచ
శ్లోకంఃఏవ ముక్త్వా ర్జున స్సంఖ్యే
రథోపస్థ ఉపావిశత్‌
విసృజ్య సశరం చాపం
శోక సంవిగ్న మానసః 


సంజయుడు చెప్పుచున్నాడు ధర్మసంస్థాపన చేయదలచిన శ్రీకృష్ణునితోనే వీరధర్మము పాటించవలసిన అర్జునుడు దానిని విడిచిపెట్టాడు. అతని హృదయం శోకం తో చలించింది. కారుణ్యం నిండింది. చేతను న్న ధనుర్భాణాల్ని కింద పారవేసి, నిలువజాలక రధములోనే కూలబడిపోయాడు. అని ధృతరా ష్ర్టునికి సంజయుడు వివరించుచున్నాడు.

Popular Posts