Followers

Thursday 27 June 2013

దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యం పెడితే..

ఎవరికైతే బాగా నీరసం, నిస్సత్తువ ఉంటుందో అటువంటి వారు నేరేడు పండును దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరం అయి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. నేరేడు పండును శ్రీ శనైశ్ఛర స్వామికినైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు నయం అవుతాయి. పూజ చేసిన తరువాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే రోగ బాధలు కలగవు. నేరేడు పండునుు శనైశ్చర స్వామికి ప్రియమైన నల్ల పువ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు ఉండవు. నేరేడు పండును దేవుని పేరిట పూజించి బిక్షగాళ్ళకు దానం చేస్తే దారిధ్ర్యం దరిచేరదు. భోజనంతోపాటు నేరేడు పండును వడ్డిస్తే మీకు ఎప్పుడూ మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడు పండును పుణ్య క్షేత్రాల్లో యోగ్య బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత లభిస్తుంది. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చు.  

Popular Posts