Followers

Wednesday 26 June 2013

శుచీంద్రం ఇది దత్తాత్రేయ క్షేత్రం. (అడుగడుగున గుడి)



తిరునల్వేలి
తమిళనాడులోని తిరునల్వేలికి 60 కి.మీ. దూరంలో సముద్రపు అంచున తిరుచందూర్‌ వుంది. ఇక్కడి సుబ్రహ్మన్యేశ్వర స్వామి అత్యంత సంపన్నుడు. తారకాసుర సంహారం తర్వాత అతని తమ్ముడు శూరపద్ముడు పారిపొతే కుమార స్వామి వెంబడిస్తే, వాడు మామిడి చెట్టుగా మారి పోయాడు. స్వామి, బల్లెంతో చెట్టు చీల్చి వాణ్ని చంపేశాడు. అప్పుడు ఆ చెట్టులో ఒక భాగం నెమలిగా, రెండో భాగం కోడిగా మారాయి. ఆ రెండిటిని కుమార స్వామి వాహనాలుగా చేసుకొన్నాడు. ఆయన ఆయుధం, ఆయనకు చిహ్నంగా పూజలందు కొంటోంది ఇక్కడ. ఇక్కడి శరవణ భవుడైన కుమార స్వామికి ఉదయం పది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు విభూతితో అభిషేకం రెండు సార్లు జరగటం విశేషం. సముద్రపు ఒడ్డున ఒక బావిలో తియ్యని నీరు లభించటం మరో గొప్ప విచిత్రం.

తంజావూరు
భారతీయ శిల్ప కళా వైభవానికి గొప్ప ఉదాహ రణ తంజావూరు. ఇక్కడి అతి ప్రాచీన సరస్వతీ మహల్‌ అనే పెద్ద గ్రంధాలయం వుంది. ప్రపంచ భాషల పుుస్తకాలన్నీ ఇక్కడ లభిస్తాయి. పురాతన గ్రంధాలన్నీ ఇక్కడే దొరుకుతాయి. పరిశోధకుల పాలిటి కల్ప వృక్షం ఈ గ్రంధాల యం. ఇక్కడి బృహదీశ్వరాలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. బృహత్‌ అంటే చాలా పెద్దది అని అర్ధం. బృహదీశ్వరలింగం నల్లరాతితో చేయబడి,16 అడుగుల ఎత్తు, 21 అడుగుల కైవారం కలిగి ఉంటుంది. ఆరు అడుగుల ఎత్తు పుునాది మీద నిర్మించిన గొప్ప ఆలయం. ఇక్కడి నంది పందోమ్మిదిన్నర, ఎనిమిదిన్నర, పన్నెండు అడుగుల కొలతలతో 25 టన్నుల బరువుం టుంది. లేపాక్షి తర్వాత పెద్ద నంది ఇదే. నంది వున్న చోటు నుంచి 50 గజాల దూరంలో ఆల యం వుండటం మరీ విశేషం. ఆలయం వంద గజాల పొడవు, యాభై గజాల వెడల్పు వున్న పెద్ద ఆలయం. విమానం ఎత్తు 216 అడుగులు తో 14 అంతస్తులతో ఎంతో అద్భుతంగా ఉం టుంది. చిట్ట చివరి శిఖరమే 20 అడుగుల ఎత్తు, 100 అడుగుల చుట్టు కొలత వున్న ఏకశి లగా. ఉంటుందంటే, యెంత పెద్ద ఆలయమో మనం ఇట్టే ఊహించవచ్చు.

Popular Posts