Followers

Tuesday 30 April 2013

తల్లి , తండ్రి గొప్పతనం గురించి శాస్రాలలో ఏం చెప్పబడింది?



  • ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.
  • ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి.
  • ఒక్కసారి తల్లికి , తండ్రికి నమస్కరించిన , గోవును దానం చేసిన ఫలం వచ్చును.
  • సత్యం తల్లి......తండ్రి జ్ఞానము.
  • పదిమంది ఉపాధ్యాయుల కంటే  ఆచార్యుడు గొప్పవాడు. వంద మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే  ఆరు సార్లు భూప్రదక్షిణ  చేసిన ఫలము , వెయ్యి సార్లు కాశి యాత్ర చేసిన ఫలము , వంద సార్లు సముద్ర స్నానము చేసిన ఫలం దక్కుతాయి.
  • ఏ పుత్రుడు , ఏ పుత్రిక మాతృ దేవతను సుఖంగా ఉంచరో , సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసం కన్నా  హీనమని వేదం చెబుతోంది.
  • ఎంతటి  శాపానికైన నివృత్తి ఉంది.  కన్నతల్లి కంట నీరు  తెప్పించితే  దానికి లక్ష గోవులు దానిమిచ్చిన,  వేయికి పైగా అశ్వమేధ యాగాలు చేసిన పోదు.
  • తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని  అసహ్యించుకున్న  తప్పులేదు.  చెడు నడతతో   ఉన్న తల్లిని  నిరాదరించిన ఆది తప్పేనని ధర్మ శాస్రం చెప్తోంది.  తల్లిని మించిన దైవం లేదు. గాయత్రికి మించిన మంత్రం లేదు. 

Popular Posts